Telugu Bhāṣā Saurabhālu

మన మహనీయుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

మన మహనీయుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు.

సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ సరసచతురం.

రేడియోకు “ఆకాశవాణి” అన్నపేరు పెట్టింది శర్మగారే. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు. ‘నిగమశర్మ అక్క’, ‘నాచన సోముని నవీన గుణములు’, ‘తిక్కన తీర్చిన సీతమ్మ’, ‘రాయలనాటి రసికత’ అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించారు. ‘పెద్దన పెద్దతనము’ అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు.

ప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహు భాషా కోవిదుడు, దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన తొలి భారత ప్రధాని, గొప్ప సంస్కరణ అభిలాషి కీ.శే. పి.వి.నరసింహారావు. గొప్ప పండితుడు. వేయిపడగల్ని హిందీలోకి అనువదించాడు.

0 responses to “మన మహనీయుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ”

Go to top