By | July 10, 2024

పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు

భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రతి బడిలో ప్రార్థనా సమావేశంలో ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ వినిపిస్తుంది. దానిని రాసిన సుబ్బారావుగారు ఆంధ్రుడే. పిల్లల్లో దేశభక్తిని కలిగించడానికి ఆయన రాసిన ఈ ప్రతిజ్ఞ అన్ని పాఠ్య గ్రంథాల్లో ఉంటుంది. నల్గొండ జిల్లాలో జన్మించిన ఆయన అనేక పుస్తకాలు రచించారు. కావ్య నాటకాలు రాశారు.