By | April 25, 2021

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం. అవగాహన కోసం వ్యాసం. ఆరోగ్యం కోసం ఎప్పుడూ వైద్యుని సలహాలే పాటించాలి.

ఇది భారతదేశంలో ప్రాచీన వైద్య విధానం. ఆధునిక వైధ్యం అందుబాటులో రాని కాలంలో ఆయుర్వేద వైద్యమే ఆధారంగా ఉండేది.

దేశంలో పల్లె ప్రాంతాలు, వ్యవసాయ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండి, ఆయుర్వేద వైధ్యం అందుబాటులో ఉండేది. మూలికలు ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో వాడతారు.

శరీరంలో అనారోగ్య సమస్యలను దోషాలుగా చెబుతారు. దోషాలకు విరుగుడుగా మూలికలతో చేసిన ఆయుర్వేద మందులు వాడటం పరిపాటి.

ఇంకా నాటువైద్యం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉండటం కూడా ఉండేది. ఆయుర్వేద మూలికలను చూర్ణంగా తయారు చేసి నాటు వైద్య్లులు వివిధ శారీరక రుగ్మతలకు మందులుగా ఇస్తూ ఉండేవారని అంటారు.

నాటు వైద్యంలో ఔషద మొక్కల నుండి ఆకులు సేకరించి, వాటి రసం ద్వారా కూడా శరీర గాయాలకు పూయడం ఉంటుంది.

ఇంట్లో పూజలు అందుకునే తులసి మొక్క ఔషధ గుణాలతో కుడి ఉంటుందని అంటారు.

ఇప్పటికీ దేశంలో కొన్ని చోట్ల నాటు వైద్యం అందుబాటులో ఉంటుంది.

ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ప్రధానంగా మూడు దోషాలకు మందులు తయారు చేస్తారు. అవి వాతం, పిత్తం మరియు ఖఫం దోషాలుగా చెబుతారు.

ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో పరిష్కారాలు శారీరక రుగ్మతలను దూరం చేస్తాయని అంటారు.

ఇంగ్లిష్ మందులు అందుబాటులోకి వచ్చాక, ఆయుర్వేద వైద్యం నుండి ఆధునిక వైద్య పద్దతులకు ప్రజలు అలవాటు పడ్డారు. నాటు వైద్యం కన్నా ఆర్‌ఎం‌పి డాక్టర్ వద్ద చికిత్స పొందడానికి ప్రజలు అలవాటు పడ్డారు.

కాలం మారుతున్న కొలది వైద్య విధానం పూర్తి ఆధునిక పద్దతులలోకి మారింది. ఆధునిక పద్దతులలో వివిధ పరీక్షల ద్వారా రోగి శారీరక సమస్యలను కనుగొని, రోగానికి మందులు వేయడం బాగా అభివృద్ది చెందింది. ఈ విధానంలో శస్త్రచికిత్సలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

ఎన్ని ఆధునిక పద్దతులు వచ్చినా, ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముకుని జీవించేవారు ఉన్నారని అంటారు. ఇంకా దీర్ఘ కాలిక అనారోగ్యం ఉన్నవారు ఆయుర్వేద వైద్య విధానం వైపు చూడడం జరుగుతుంది.

అనారోగ్యం – ఆందోళన – నమ్మకం – వైద్యం

అనారోగ్యంతో ఉన్నవారు ఆందోళనకు గురి అయితే, మనసు పొందే భయం వలన రోగం మరింత ముదురుతుందని అంటారు. రోగి ఏ విధానంలో వైద్యం పొందినా ముందుగా వారి మనసులో ఆందోళన అధికమవ్వకుండా చూసుకోవాలని పెద్దలంటారు.

ఎక్కువమందికి చికిత్స చేసిన వైద్యులకు, అనేక రోగాలపై అవగాహన ఎక్కువగా ఉంటుంది. అనుభవజ్నులు అయిన వైద్యులకడకు వెళ్ళడం, వారి వైద్యంపై నమ్మకం ఉంచి, చికిత్స పొందడం ప్రధానమని పెద్దలు అంటారు.

శరీరం మనసుతో పెనవేసుకుని ఉంటుంది. రోగ నివారణకు మందులతోబాటు మనసుకు ప్రభావం చూపుతుందని అంటారు. కనుక మనసులో అపనమ్మకం వదిలి సరైన వైద్య విధానం వైపు వెళ్ళడం ద్వారా రోగం త్వరగా నయం చేసుకోవచ్చని అంటారు.

ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పద్దతులలో రోగ నిర్ధారణ చేసుకోవడం సులభం. ఖర్చుతో కూడుకున్న విధానం అయినా రోగ నిర్ధారణ అవ్వడం వలన రోగం నయం చేసుకోవడానికి మార్గం త్వరగా ఏర్పడుతుందని అంటారు. కావున ముందుగా రోగ నిర్ధారణ చేసుకోవడం ఆపై అనుభవజ్నులైన వైద్యుడిని కలవడం ప్రధానం అంటారు.

ఆయుర్వేదం అయిన ఆధునిక పద్దతి అయినా నమ్మకంలో సరైన వైద్యులను సంప్రదిస్తే, అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.

ప్రాచీనమైన ఆయుర్వేదం పూర్వులు ఎక్కువగా ఆధారపడి జీవిస్తే, ఇప్పుడు ఆధునికమైన వైద్యముపై మనము ఆధారపడి జీవిస్తున్నాము.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు