By | April 28, 2021

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో మన దేశం భారత దేశం గురించి వ్రాయండి…

పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి…. అంటూ సాగే తెలుగు సినిమా పాటలో భారతదేశపు మహనీయుల గురించి కీర్తించబడింది.

మనదేశం భారతదేశం అనేక మంది మహానుభావులను అందించిన దేశం. అందరు విశ్వమును సమభావముతో చుసిన మహానుభావులే కావడం విశేషం.

స్వామి వివేకానందా, రామ కృష్ణ పరమహంస, గాంధీ తదితర మహనీయులు ప్రపంచం చేత కీర్తింపబడ్డారు. ఆ మహానుభావులు మన భారతదేశపు గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేశారు.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము…. అను భారతీయ తెలుగు జాతీయ గీతాన్నిరాయప్రోలు సుబ్బా రావు గారు రచించారు. దేశమంటే ఏకాదటిపై నడిచే ప్రజా వ్యవస్థ అని తెలియజేసే మేలుకొలుపు గీతాలు మనకు లభిస్తాయి.

ఇంకా దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు. అంటూ సాగే పాటలు మన మనసులో ఆలోచన సృష్టిస్తాయి.

ఇంతమంది మహనీయులు దేశం గురించి అంతగా ఆలోచన చేసి, తపనతో పాటలు రచించారు… అంటే, వారి వారి మనసులలో దేశమంటే ఎంత ప్రీతి? దేశమంటే ఎంత భక్తి భావం ఉందో తెలియవస్తుంది. మనదేశం ఇటువంటి సాహితి వేత్తలను అందించింది.

ఎక్కడైనా ఏదో ఒక విధానం ఉంటుంది. ఏదో ఒక విధానం వలన కొందరు ఇమడలేకపోవచ్చు. ఇంకా జీవన పరమార్ధం విషయంలో అయితే ఆయా దేశాలలో ఏదో ఒక వీధి విధానం మాత్రమే అనుమతి ఉంటుంది.

కానీ మన దేశం మన మాతృదేశం అయిన భారతదేశంలో జీవనపరమార్ధం విషయంలో అనేక మతాలు ఉన్నాయి. నచ్చిన మతాచారం అందుకుని జీవనగమ్యం వైపు వెళ్లడానికి అందరికీ హక్కులు రాజ్యాంగం ఇచ్చింది. ఈ మతస్వేచ్ఛ రాజ్యాంగంలో మరే ఏ దేశంలోనూ లేదని అంటారు.

ఆచారవంతమైన విధానంలోనే ఇంత స్వేచ్ఛను భారతీయ పౌరలకు లభిస్తుంటే, మిగిలిన విషయాలలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎలా ఉంటుందో… ఆలోచన చేయవచ్చు. మనదేశం వ్యక్తిగత స్వేచ్ఛకు ఆలవాలం.

ఎవరో ఒక గొప్పవాడు, డబ్బున్నవాడు దేశంలో స్వేచ్ఛగా జీవించడం ఎక్కడైనా ఉంటుంది. కానీ ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛగా జీవించగలగడమే నిజమైన ప్రజస్వామ్యం అయితే, అది మనదేశంలోనే ఉంది.

సామాన్యుడు నుండి అసామాన్యుడు వరకు స్వేచ్చను అందించే మనదేశం మన భారత దేశం… శాంతికి మూలాధారం లాంటిది.

ఏదో దేశంవారు మరొక దేశంపై క్రూరంగా దాడి చేయడం, వారు ప్రతీకార చర్యలకు పాల్పడడం ఎక్కువగా జరుగుతుంది. మనదేశంపైన కూడా అప్పుడప్పుడు జరుగుతుంది.

కానీ భయబ్రాంతులకు గురయ్యే అవకాశం మన దేశం భారత దేశంలో తక్కువ. మన దేశం భారత దేశం శాంతిని కోరుకునే దేశం. అందులో నాయకత్వ లక్షణాలు మన దేశం భారత దేశానికి ప్రతినిద్యం వహించే వారిలో పుష్కలంగా కనబడతాయి.

ఈ అంశంలో స్వామి వివేకానందా వంటివారు నిరూపించారు. శాంతిగా ఉన్నచోట మానవ మనుగడ ప్రశాంతతో ఉంటుంది. అంతకుమించిన గొప్ప సమాజం ఏముంటుంది?

మన దేశం భారత దేశంలో శాంతికి ఆలవాలం ఎలా?

ఏనాటి నుండో ఉన్న మన భారతీయ సాంప్రదాయంలో స్త్రీలు శాంతితో ఉన్నారు. వారి వలన గొప్ప గొప్ప సామాజిక, తత్వవేత్తలు మన దేశం భారత దేశంలో జన్మించారు. వారి వలన దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయం గురించి తర్వాతి తరాలకు తెలియబడుతూ వచ్చింది.

అందుకు సాక్ష్యంగా అనేక దేవాలయాలు, వాటి వాటి స్థల పురాణములు ఉంటాయి. ఎందరో భక్తులు దైవాన్ని తెలుసుకున్నట్టుగా పురాణాలు చెబుతాయి.

యోగులు శాంతితో సామాజిక సంక్షేమం కోరుతూ, ధర్మ ప్రచారం చేయడం, ప్రజలను శాంతివైపు నడిపించే విధానం గురించి విస్తృత ప్రచారం చేసి ఉండడం మరొక ప్రధాన కారణం… మన దేశం భారత దేశం శాంతికి మూలం.

మన దేశం భారత దేశంలో సాహితి వేత్తలు, సామాజిక వేత్తలు, తత్త్వ వేత్తలు వలన సామాజిక సమస్యలపై అవగాహన సమాజంలో ఏర్పడుతూ ఉంది. తత్వవేత్తల వలన వ్యక్తిలో చిత్తశుద్దిపై ఆలోచన ఉంటుంది… ఈ ఈ విధానాలు మనిషిలో శాంతి అనే అంశం ఉంటూ ఉంటుంది.

ఎన్నో పర్యాటక ప్రాంతాలు, ఎన్నో చరిత్రాత్మ ప్రాంతాలు, ఎన్నో పురాణ కట్టడాలు, ఎంతో మంది యోధులు, సాధువులు, యోగులు మన దేశం భారత దేశంలో జన్మించారు.

నిత్య శాంతి కోసం తపించే నాయకత్వం మన దేశం భారత దేశంలో ఎప్పుడూ ఉంటుంది. ఆ నాయకత్వం అంగీకరించే ప్రజలు సమాజం శాంతితో ఉండడానికి పునాదిగా ఉంటుంది.

విశ్వశాంతి అంటే అది భారతదేశం వలననే సాధ్యమనే భావం ప్రపంచం అంతటా ఉండడం, మన దేశం భారత దేశం యొక్క కీర్తి తెలియబడుతుంది.

ఇంతటి మన దేశం భారత దేశంలో పాలన కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో ఏ రాష్ట్రనికి, ఆ రాష్ట్రమే పరిపాలన కొనసాగించే అధికారం ఉంది. ఇవి కాక కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.

మన దేశం భారత దేశంలో గల రాష్ట్రాలు తెలుగులో

ఆంధ్రప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్
అస్సాం
బీహార్
చత్తీస్ గఢ్
గోవా
గుజరాత్
హర్యానా
హిమాచల్ ప్రదేశ్
జార్ఖండ్
కర్ణాటక
కేరళ
మధ్యప్రదేశ్
మహారాష్ట్ర
మణిపూర్
మేఘాలయ
మిజోరాం
నాగాలాండ్
ఒడిషా
పంజాబ్
రాజస్థాన్
సిక్కిం
తమిళనాడు
తెలంగాణ
త్రిపుర
ఉత్తరప్రదేశ్
ఉత్తరాఖండ్
పశ్చిమబెంగాల్

కేంద్రపాలిత ప్రాంతాలు మన దేశం భారత దేశంలో

అండమాన్ నికోబార్ దీవులు
చండీగడ్
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ
జమ్మూ కాశ్మీర్
లడఖ్
లక్షద్వీప్
ఢిల్లీ
పాండిచ్చేరి

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు