By | April 18, 2021

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో! భూమి, గాలి, నీరు ఉన్న చోట మొక్కలు, చెట్లు, జంతువులు ఉంటే, దానిని సహజ పర్యావరణం అంటారు. ప్రకృతి నియమాల ప్రకారం అనేక జీవజాతులు ప్రకృతిలో నివసిస్తాయి.

అటువంటి పర్యావరణంలో మనిషి కూడా ఒక భాగస్వామి. బుద్ది కుశలత, తెలివి కలిగిన మానవుడు ప్రకృతిని తనకు సౌకర్యంగా మార్చుకునే శక్తిని కలిగి ఉంటాడు.

అలాంటి మనిషి కొన్ని ప్రాంతాలలో మనిషి ఏర్పచుకునే నివాసాలలో ప్రకృతి మార్పుకు గురి అవుతుంది. అటువంటి మనిషి చుట్టూ పర్యావరణం తన సహత్వానికి బిన్నంగా మారుతుంది. కొన్ని చోట్ల పకృతికి హాని జరిగే విధంగా చర్యలు ఉంటే, పర్యావరణం దెబ్బ తింటుంది. ఇది మనిషి ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది.

సహజమైన నీరు స్వచ్చంగా ఉంటూ, మనిషికి ఉపయోగపడుతుంది. స్వచ్చమైన గాలి మనిషిని ఆహ్లాదపరుస్తుంది. కానీ ప్రకృతి సహజత్వాన్ని దెబ్బతీయడం వలన ప్రకృతి వనరులు కూడా సహజత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. దాని వలన మనిషికే నష్టం వాటిల్లనుంది. సహజ వనరుల శక్తి మనిషికి అందె అవకాశం తగ్గుతూ ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ గురించి పాటు పడవలసిన అవసరం ప్రతి ఒక్కరి సామాజిక బాద్యత.

ప్రకృతిలో సహజంగా లభించే వనరులు వలన సృష్టిలో అనేక జీవరాశులు బ్రతుకుతూ ఉన్నాయి. చెట్లు వదిలే గాలి మనిషికి ప్రాణవాయువు అయితే, చెట్లు వలన మనిషి ఎంతో ప్రయోజనం పొందుతున్నాడు.

పర్యావరణంలో చెట్లు చేసే పని, అవి బ్రతికినంతకాలం కొనసాగుతుంది. చెట్లు ఎక్కువగా ఉన్న చోట గాలి స్వచ్చంగా ఉంటూ, గాలి కాలుష్యం తక్కువగా ఉంటుంది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా

అందుకే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే, ప్రకృతిలో సహజంగా పెరిగిన ఎన్నో చెట్లను మనిషి తనకోసం తొలగిస్తున్నారు. అందువలన మనిషి మరలా అటువంటి చెట్లు తయారుకావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా వాతావరణం అనుకూలంగా లేకపోతే నాటిన ప్రతి మొక్క చెట్టుగా మరే అవకాశం తక్కువ. కాబట్టి వీలైనన్ని మొక్కలు పెంచడానికి ప్రతివారు కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణలో చెట్లు చాలా కీలకమైనవి.

సమాజంలో పర్యావరణ పరిరక్షణ అంటూ అనేక నినాదాలు సంవత్సరాలుగా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలు జరుగుతున్నాయి. అంటే మనిషి వలన ప్రకృతికి జరుగుతున్న నష్టం ఏమిటో? పెద్దలు గుర్తించారు. కాబట్టే పర్యావరణ పరిరక్షణ నినాదాలు వచ్చాయి. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఏర్పడింది.

అంతగా పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను సమాజంలో పెద్దలు గుర్తించారు. కానీ నరుకుతున్న చెట్లు, ఒక్కరోజులో పెరిగినవి కావు. ఏళ్ల నాటి నుండి మొక్కలుగా పెరిగి, పెరిగి చెట్లుగా ఎదిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. అటువంటి చెట్లు తొలగించే సమయానికి ఒక చెట్టుకు కనీసం పది మొక్కలు నాటి, వాటిని పెంచే ప్రయత్నం చేస్తే, అటువంటి చెట్లు భవిష్యత్తులో మానవ మనుగడకు అవసరమైనన్ని తయారుకాగలవు… కావున మొక్కలు పెంచడానికి ఎవరికి మినహాయింపు లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

మనిషి మనుగడకు గాలి అవసరం. అలాగే నీరు అవసరం. నేడు చెట్లు తక్కువగా ఉండడం వలన పర్యావరణ సమతుల్యత తగ్గి వానలు సరైన సమయానికి రావడం లేదనే వాదన బలంగా ఉంది.

వానలు సమృద్దిగా కురిస్తే, నీరు పుష్కలంగా ఉంటుంది. తగినంత నీరు ఉంటే, తగినంత పంటలు పండుతాయి. తగినంత పంటలు పండితే, తగినంత ఆహార పదార్ధాలు లభిస్తాయి. శ్రమజీవులకు ఆహారం అందుతుంది. నేటి సమాజం శ్రామిక జీవులపైనా, రైతులపైనా ఆధారపడి ఉంది.

నీటి దుర్వినియోగం కూడా పర్యావరణ పరిరక్షణకు చేటు చేస్తుంది.

గత కాలంలో నీరు భూమిపై మాత్రమే ప్రవహించేది. అందువలన నీరు అయితే భూములోకి ఇంకేదీ. లేకపోతే ఎండలకు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘంగా మరి మరలా భూమిపైకి వర్షించేది. ఇలా ఒక సహజమైన క్రమం జరుగుతూ ఉండేది. కానీ నేటి రోజులలో నీరు ప్రవహించేది గొట్టాలలో…

వివిధ రకాల గొట్టాల ద్వారా వివిధ విధాలుగా నీటి మళ్లింపు జరుగుతుంది. అందుకోసం ఆకాశం నుండి కురిసే వానలు చాలక భూమిలో నీటిని పైకి తీసుకురావడం కూడా జరుగుతుంది. అందువలన నీటి దుర్వినియోగం అయితే, భూమిలోపల నీరు తగ్గుతుంది. దానితో భూమిలోపల సమతుల్యత లోపిస్తుంది.

నీటి వాడకం జాగ్రత్తగా జరిగితే, భూమి నుండి వెలికి తీసే నీటి శాతం తగ్గుతుంది. ప్రకృతి సహజంగా నీరు వానరూపంలో కురవడానికి అనేక చెట్లను తయారుచేసుకోవలసిన అవసరం నేటి మానవాళిపై ఉంది.

వివిధ పరిశ్రమల నుండి నిషిద్ద జలాలు వెలువడితే, వాటి వలన కూడా పర్యావరణకు ప్రమాదము.

నేటి మొక్కలే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి వృక్షాలుగా మారాలి.

నేటి మొక్కలే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి వృక్షాలుగా మారాలి అంటే, పర్యావరణ పరిరక్షణలో విధ్యార్ధులు పాత్రతను తీసుకోవాలి. విధ్యార్ధులు పర్యావరణ పరిరక్షణ గురించి, మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి, తెలియని వారికి తెలియజేస్తూ ఉండాలి.

భవనాల నిర్మాణం కొరకు, రోడ్ల నిర్మాణం కొరకు చెట్లను తొలగించడం కోసం పాటుపడే వారికన్నా, మొక్కలు నాటి, వాటిని పెంచడానికి పాటు పడేవారి శాతం తక్కువ.

కాబట్టి నేడు నాటిన మొక్కలలో ఏదో ఒక్కటి అతి పెద్ద వృక్షంగా మారగలదు. ఆక్సిజన్ అందించగలదు. ఎండ నుండి రక్షణ కల్పించగలదు. కావున మొక్కలు నాటడం, వాటిని చెట్లుగా ఎదిగేవరకు కృషి చేయడం గురించి ఉదృతమైన ప్రచారం ఒక ఉద్యమం లాగా జరగాల్సిన ఆవశ్యకతను నేటి ప్రకృతి సమస్యలు తెలియజేస్తున్నాయి.

పర్యావరణ పరిరక్షణలో చెట్లు, జంతువులు, గాలి నీరు అనేక విధాలుగా పాలు పంచుకుంటాయి. వాటిని సహజంగా ఉండేలాగా కృషి చేయవలసిన బాద్యత, ప్రకృతిని వినియోగించుకుంటూ, ప్రకృతిని ఆధారంగా జీవించే ప్రతి మనిషిపైన ఉంటుంది.


మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు