Tag Archives: Telugu Bhakti Chitralu

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద తెలుగు బాలభక్తుడి సినిమా. తన్మయమైన భక్తితో దైవాన్ని రప్పించిన భక్తిరసకరమైన చలనచిత్రం. భక్తుడు పరమాత్మ తత్వంతో తన్మయత్వం చెందుతూ ఉంటే, ఆ భక్తికి భక్తులు, భగవంతుడు పరవసిస్తే, మరి చిన్నారి బాలుడు పరబ్రహ్మంతో తన్మయుడై హరిభక్తిని చాటుతుంటే, శ్రీహరి ఉగ్రనారసింహ అవతారం ఎత్తించిన భక్తిరసభరిత తెలుగు మూవీ.

అమ్మకడుపులోనే భగవతత్వం గురించి తెలియబడడం వలన, చిన్ననాటి నుండే నారాయణ మంత్రంతో మనసుని నింపేసుకున్నబాలుడి భక్తి తత్పరత చాల భక్తిభావాన్ని పెంచుతుంది.

భక్తప్రహ్లాద తెలుగు భక్తి మూవీలో భగవంతుడిగా హరనాథ్ నటిస్తే, బాల భక్తుడిగా రోజారమణి చాల చక్కగా నటించారు. చిన్నారి భక్తుడి తండ్రి హిరణ్యకశిపుడుగా ఎస్వి రంగారావు (SV Rangarao) నటిస్తే, హిరణ్యకశిపుడు భార్య లీలావతిగా అంజలిదేవి నటించారు. చిన్నారి భక్తుడికి  గురువులుగా రేలంగి నరసింహారావు, పద్మనాభంలు నటించారు. నారదుడుగా బాల మురళి కృష్ణ నటించారు.

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద సాంకేతిక వర్గం

Banner/బ్యానర్: AVM Productions/ఏవిఎం ప్రొడక్షన్స్
Direction/దర్శకత్వం:Ch Narayana murthy సిహెచ్. నారాయణమూర్తి
Actor Actress/నటినటులు: SV Rangarao/ఎస్వి రంగారావు, Balamurali Krishna/బాల మురళి కృష్ణ, Relangi/రేలంగి, Padmanabham/పద్మనాభం, Haranath/హరనాథ్, dhoolipala/ధూళిపాళ, Ramana Reddy/రమణారెడ్డి, Nagaiah/నాగయ్య. AnjaliDevi / అంజలీదేవి, Jayanti/జయంతి, Baby Rojaramani/బేబీ రోజారమణి, L Vijayalakshmi/ఎల్ విజయలక్ష్మి, Geetanjali/గీతాంజలి, Vanisri/వాణిశ్రీ, Nirmala/నిర్మల తదితరుల్ Bhakta Prahlada/భక్తప్రహ్లాద చిత్రంలో నటించారు.
Story/కధ: DV Narasaraju/నరసరాజు
Sangitam/సంగీతం: S Rajeswara Rao/ఎస్ రాజేశ్వరరావు

జయ విజయులకు మునుల నుండి శాపం భక్తప్రహ్లాద మూవీలో

వైకుంఠములో ద్వారాపాలకులుగా జయవిజయులు వైకుంఠద్వారం దగ్గర నిలబడి ఉంటారు. సనకసనంద మహర్షులు వైకుంఠములోనికి ప్రవేశించబోతే, వారిని జయవిజయులు అడ్డుకుంటారు.

మహర్షులు తమకు శ్రీమహావిష్ణువు దర్శనం అత్యవసరం అన్నా అడ్డుకుంటారు, శ్రీహరి లక్ష్మీసమేతులై ఏకాంతంగా ఉన్నారని లోనికి ఎవరిని అనుమతించం అని అడ్డుకుంటారు. శ్రీహరి భక్తవత్సలుడు భక్తులకు, శ్రీహరికి ఎవరూ అడ్డుకాకూడదు మీరు అడ్డుతోలగమని చెప్పినా జయవిజయులు సనకసనంద మహర్షులను అడ్డుకుంటారు.

కోపగించిన మహర్షులు రాక్షసులై భూలోకంలో జన్మించమని జయవిజయులకు శాపానుగ్రహం ఇస్తారు. జగన్నాటక సూత్రదారి వచ్చి జరిగిన విషయం గ్రహించి, జయవిజయులు చేసింది తప్పు దానికి మీరు శిక్ష అనుభవించాలంటే, జయవిజయులు శ్రీహరిని ప్రార్ధిస్తారు.

అప్పుడు శ్రీమహావిష్ణువు జయవిజయులు శాపఫలం అనుభవించాక, వారు తిరిగి వైకుంఠము వచ్చేలా అనుమతి ఇవ్వవలసినదిగా తాపసులను కోరితే, బదులుగా సనకసనంద మహర్షులు దానికి మేమంతవారము నీవెట్లా అనుగ్రహించిన మాకు సమ్మతమే అని చెబుతారు.

నాకు విరోధులుగా మూడు జన్మలు ఎత్తి తరువాత వైకుంఠము చేరతారా ? నాకు భక్తులుగా ఏడు జన్మలు ధరించిన తరువాత వైకుంఠము చేరతారా ? అని జయవిజయులకు శ్రీహరి చెబితే. బదులుగా జయవిజయులు స్వామి నీకు దూరంగా ఏడు జన్మల కాలం మేము ఉండలేము, విరోధులుగా మూడు జన్మలకాలం తరువాత వైకుంఠప్రాప్తిని అనుగ్రహించమని వేడుకుంటారు. అలా జయవిజయులు మూడు జన్మలు శ్రీహరికి శత్రువులుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

మొదటి జన్మలో దితి కడుపునా హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా రెండవ జన్మములో రావణ, కుంభకర్ణులుగా మూడవ జన్మములో శిశుపాల, దంతవర్తులుగా భూలోకములో జన్మించి, నన్ను విరోధించినా, నిరంతరం నాపై ధ్యాసనే కలిగి ఉండి, తదుపరి వైకుంఠము చేరగలరని శ్రీహరి సెలవిస్తారు.

హిరణ్యాక్షమరణం, హిరణ్యకశిపుడు తపస్సు, ప్రహ్లాద జననం

తరువాయి సన్నివేశంలో కశ్యప ప్రజాపతి సంద్యాసమయంలో తన ఆశ్రమంనందు ధ్యాననిమగ్నుడై ఉండగా, అయన భార్య అయిన దితి అక్కడికి వస్తుంది. వసంతకాలం ప్రకృతి ప్రభావరిత్యా ఆమె కామప్రభావానికి లోనై కశ్యపప్రజాపతి చెంతచేరుతుంది, విరహభావంతో.

కశ్యప ప్రజాపతి ఆమెను వారించగా ఆమె తిరస్కార వైఖిరికి ఆమె కోరికను తీర్చుతారు. తత్ఫలితంగా అనతికాలంలో ఆ దంపతులకు ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. వారికీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు నామకరణం చేసిన కశ్యప ప్రజాపతి, వారు రాక్షసులై లోకకంటకులుగా శ్రీహరి విరోధులు అవుతారని చెబుతారు. దానికి దితి దుఃఖిస్తే, నీ మనుమడు మాత్రం శ్రీహరి భాక్తాగ్రేసుడై కీర్తిని సముపర్జిస్తాడని ఆమెను ఊరడిస్తారు.

దైత్యుడైన హిరణ్యాక్షుడు ప్రజలను పీడిస్తూ, సాదుజనులను హింసిస్తూ, భూమాతను కూడా హిరణ్యాక్షుడు హింసిస్తూ, భూమిని రక్షించడానికి శ్రీహరి ఆదివరాహఅవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి, శిష్టరక్షణ చేస్తారు.

విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఇదంతా శ్రీహరి వలననే జరిగింది, అందుకు శ్రీహరిపై విరోధం ఇంకా పెంచుకుంటాడు. ఎలాగైనా శ్రీహరిని ఓడించాలని శ్రీహరిపై యుద్దానికి సంసిద్ధుడు అవుతుంటే, గురువు బోధనచేత యుద్దకాంక్ష పక్కనపెట్టి, తపస్సు చేయడానికి బయలుదేరతాడు.

బ్రహ్మదేవుడి గురించి ఘోరతపము ప్రారంభిస్తాడు, బ్రహ్మ ప్రత్యక్ష్యం అయ్యేదాకా కఠోర తపము చేస్తే, బ్రహ్మగారు హిరణ్యకశిపుడు తపస్సునకు మెచ్చి, వచ్చి వరం కోరుకో అంటారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏడేడు పదునాలుగు లోకాలలో గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, అస్త్ర, శస్త్రాలతో, దిక్కులలో, పగలు, రాత్రి, ఇంటా, బయటా, పైన, క్రింద, జంతువులు, మనుషులు, దేవతలు, కిన్నెర, కింపుర్శ, గంధర్వులు, అన్ని వస్తువుల ద్వారా మరణం లేని వరం అడిగితే, బ్రహ్మగారు అనుగ్రహిస్తారు.

హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం తపము చేస్తున్న సమయంలో గర్భిణిగా ఉన్న లీలావతిని ఇంద్రుడు చెరపట్టి తీసుకువెళుతుంటే, నారద మహర్షి అడ్డుపడి, ఆమెగర్భంలో ఉన్నది రాక్షస జాతి బాలుడే అయినా మహాభక్తుడు కాగలడు, కావునా ఆమెను విడిచిపెట్టమని వారిస్తాడు. తదుపరి లీలావతిని నారదమహర్షి తన ఆశ్రమంలోకి తీసుకువెళతారు.

ఆ ఆశ్రమంలో గర్భిణిగా ఉన్న లీలావతితో నారద మహర్షి బ్రహ్మజ్ఞానం భోదిస్తుంటే, ఆమె నిదురిస్తుంటే, ఆమె గర్భంలో ఉన్నఆ నెలల బాలుడు ఆ జ్ఞానసారాన్ని గ్రహిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకు లీలావతి ప్రసవిస్తే, సుపుత్రుడిగా తపస్సు పూర్తిచేసుకుని వచ్చిన హిరణ్యకశిపుడుకి పరిచయం చేస్తారు. లీలావతి మరియు నారదులు. ఆ బాలుడికి ప్రహ్లాదుడిగా నామం నారద మహర్షే సూచిస్తారు.

వరగర్వం వలన హిరణ్యకశిపుడు ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతుంది. సర్వసాదులను హింసిస్తూ, ప్రజలందరినీ నన్నే దేవుడుగా కొలవవలసినదిగా ఆజ్ఞలు జారి చేస్తాడు. ఇంద్రుడిని జయించి, స్వర్గాన్ని ఆక్రమించి ముల్లోకాలకు ప్రభువుగా ప్రకటించుకుంటాడు. సాధువులు, మునులు శ్రీహరిని వేడుకొనగా అందుకు శ్రీహరి హిరణ్యకశిపుడు సుపుత్రుడు నాకు మహాభక్తుడై ఉంటాడు, అందువల్లే హిరణ్యకశిపుడు అంతం కూడా అవుతుంది అని చెబుతారు.

భక్తప్రహ్లాద హరిభక్తి నివారణ ప్రయత్నం చేసే హిరణ్యకశిపుడు

నారాయణనామం పలుకుతుంటే ఎంతమధురంగా ఉంటుందో పలికేవారికీ తెలుస్తుంది అంటారు, కానీ ఈ మూవీలో నారాయణనామం గొప్పతనం కనబడుతుంది. నారాయణనామం యొక్క రుచి ప్రహ్లాద త్రాగినట్టుగా ఈ మూవీ కల్పిస్తుంది. నారాయణనామజపం వలన మరణ భయంపొందని దృఢమైన మనస్సుని పొందిన బాలుడు భక్తి భావన ముగ్ధమనోహరంగా కనిపిస్తుంది, ఈ భక్తప్రహ్లాద మూవీలో. నారాయణమంత్రం తల్లి కడుపులో ఉండగానే నారద మహర్షిచే బోధించబడుతుంది.

మదిలో భక్తిభావనలు పెంపొందించుకోవడానికి భక్తప్రహ్లాద చిత్రం ఒక చక్కటి అవకాశంగా ఉంటుంది. భక్తి ధ్యాసలో భవభందాలా భయం లేదని చాటి చెప్పే చిత్రం, చూస్తున్నవారిలో కూడా నారాయణ నామంపై మమకారం పెంచుతుంది. భక్తుడి భక్తి తత్పరతతో రాతిస్థంభం నుండి కూడా భగవంతుని రప్పించవచ్చని చాటి చెప్పే తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద .

అధర్మ కర్మవలననే ప్రజాపతి సంతానం ద్రుష్టబుద్దితో పుడితే, ధర్మపరివర్తనతో లీలావతి వలన ద్రుష్ట రాక్షసుడికి సుపుత్ర సంతానం కలిగింది. అంతటా హరినామం నిషేదిస్తే, నిషేదించిన ఇంటే హరినామ కీర్తన జరగటం జగన్నాటక సూత్రదారి మాయ ఎంతగొప్పదో అర్ధం అవుతుంది.

నారదుల ఆశ్రమం నుండి ఇంటికి వచ్చిన బాలుడు ఎప్పుడు శ్రీహరి ధ్యాసలోనే ఉండి, ధ్యానం చేస్తూ ఉంటాడు. ముల్లోకాలు జయించిన హిరణ్యకశిపుడుకి కంటిమీద కునుకు లేకుండా చేసేది, తన సుపుత్రుడు భక్త ప్రహ్లాద ప్రవర్తన. రాక్షస బుద్దులు రాకుండా ప్రసన్నంగా ఉండడం దానవాగ్రేసురుడుకి అసలు నచ్చదు. అలా ఉన్న ఆ బాల ప్రహ్లాదుడిని గురుకులంలో విద్యాబుద్దులకోసం చండామార్కుల ఆశ్రమంకు పంపుతారు.

గురుకులంలో ప్రహ్లాదుడి హరిభక్తి కీర్తనలు

గురుకులంలో చేరిన ప్రహ్లాదుడు గురువుల దగ్గర అన్ని విద్యలు, వేదపాటాలు నేర్చుకుంటాడు, కానీ హరిభక్తిని మరువడు. వేదవిద్యలు ఇట్టే పట్టిన ప్రతిభను చూసి ముచ్చటపడి, ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు వద్దకు తీసుకువెళతారు.

హిరణ్యకశపుడు పుత్రుడిని తనతొడపై కూర్చొనబెట్టుకుని, ప్రహ్లాదుడుని నీవు నేర్చుకున్న విద్యలలో సారం ఏమిటో చెప్పమని అడిగితే, తండ్రి తొడపై కూర్చోని ప్రహ్లాదుడు వేదసారమైన పరమాత్మ తత్వాన్ని శ్రీహరిపై పొగుడుతూ పద్యం చెబుతాడు. శ

్రీహరి మాట తనపుత్రుని నోట విన్న హిరణ్యకశిపుడుకి కోపం వస్తుంది. హరిభక్తి మనకు తగదని చెప్పినా, హరి భక్తితత్పరుడైన బాలుడు దృఢమైన మనసుతో శ్రీమహావిష్ణువునే స్తుతిస్తాడు.

తనపుత్రుడికి రాక్షసజాతికి అవసరమైన శాస్త్రవిద్యలు సరిగా బోధించమని మరలా గురుకులానికి ప్రహ్లాదుడిని పంపిస్తారు. తిరిగి గురుకులం చేరిన ప్రహ్లాదుడు, అక్కడి ఉన్నవారందరికీ హరిభక్తి భోదిస్తూ ఉంటాడు.

అది చూసిన చండామార్కులవారు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపునికి అప్పజెప్పి, ప్రహ్లాదుడిని మార్చడం మావల్ల కాదు అని చెబుతారు. హరిభక్తి మానతవా లేదా అని కఠినంగా అడిగినా ప్రహ్లాదుడు హరిభక్తి మానలేను అంటాడు. ఇక ప్రహ్లాదుడిని చంపమని, భటులకు అజ్ఞా ఇస్తాడు, హిరణ్యకశిపుడు.

ఏనుగుతో తొక్కించినా, ఎత్తైన కొండలపై నుండి తోసివేసినా, పాములతో కరిపించినా ఎలా ప్రయత్నించిన శ్రీహరి అనుగ్రహంతో బ్రతికే ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలకు మరణం దరిచేరని ప్రహ్లాదుడిని చూసి, హిరణ్యకశిపుడు తన పుత్రుడిని నిలదీస్తాడు.

నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో చూపించు అని, ప్రహ్లాదుడి భక్తికి పరవశిస్తూ ఉండే, శ్రీమహావిష్ణువు, ప్రహ్లాదుడు చూపించిన రాతికట్టడమైన స్థంభం నుండి పై సగ భాగం సింహంగా, క్రింద భాగం నరుడుగా కలిగి నృసింహస్వామిగా  ఉద్భవించి, పగలు, రాత్రి కానీ సంద్యా సమయంలో ఇంటా బయటా కానీ గడపపై ప్రాణం లేని గోళ్ళతో హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. చివరగా భక్తప్రహ్లాద (BhaktaPrahlada) స్త్రోత్రంతో తృప్తిపడి, ప్రహ్లాదునికి వరాలు ఇస్తాడు.

ఇందుకలడని అందుకలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే కలడు శ్రీహరి అని పడే ప్రహ్లాద పద్యం చక్కగా ఉంటుంది.

భక్తిమార్గం సులభమార్గం అని అదే చివరివరకు తోడు అని భక్త ప్రహ్లాదుడి చరితను చెబుతారు. ఈ భక్తి మూవీ అదే చూపుతుంది.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

వినాయక విజయం తెలుగు భక్తి మూవీ

వినాయక విజయం విజయవంతమైన తెలుగు భక్తి మూవీ. ఆదిదంపతుల ముద్దుబిడ్డ అయిన వినాయకుడి యొక్క పౌరాణిక సినిమా కధ.

కొత్తగా ఏ పని ప్రారంభించాలన్న వినాయకుడి అనుగ్రహం అవసరం, అటువంటి వినాయక విజయం తెలుసుకుంటే, విఘ్నాలు జయించి విజయంవైపు వెళ్ళడమే అవుతుంది.

ఇక ఈ తెలుగు మూవీ విజయవంతమైన భక్తి మూవీ అయిన వినాయక విజయంలో వినాయకుడు (Vinayaka) పుట్టుకకు కారణాలు చూపుతుంది.

కారణజన్ముడు అయిన ఉమాపుత్రుడిగా వినాయకుడి పుట్టుక, వినాయకుడి శిరస్సు మార్చడం. వినాయకునికి(Vinayaka) దేవతల ఆశీస్సులు అందించడం.

వినాయకుని(Vinayaka) విఘ్నాదిపత్యం, చివరగా మూషికునిపై విజయంతో కద కంచికి మనం ఇంటికి అన్నట్లు సాగుతుంది.

వినాయక విజయం తెలుగు మూవీ సాంకేతిక వర్గం.

బ్యానర్: జగన్మాత ఆర్ట్స్
మూవీపేరు: వినాయక విజయం
పాత్రలు:
బాలవినాయకుడు: బేబీ లక్ష్మీసుధ
వినాయకుడు: ఎంజివి మదన్ గోపాల్
శివుడు: కృష్ణంరాజు
పార్వతి: వాణిశ్రీ
విష్ణువు: రామకృష్ణ

వినాయకుడి పుట్టుక కారణాలు ఒక రాక్షసుని వరం అని అంటారు. మూషిక రాక్షసుని వరం ఈ విధంగా ఉంటుంది.

అయోనిజుడు, అకుంటిత దీక్షాపరుడు, బ్రహ్మచర్య దీక్ష, జితేంద్రియుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు, గుణశ్రేష్టుడు, సురశ్రేష్టుడు, సర్వశక్తిసంపన్నుడు అయిన మహావీరుడు అయి బ్రహ్మ సృష్టిలో పుట్టకుండా ఉన్న వ్యక్తి చేత అంతం అయ్యే అవకాశం మూషిక రాక్షసుడికి మరణం సంభవించాలి.

ఆ కారణం లోక కళ్యాణం (Vinayaka Vijayam) అయింది. మన అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడు (Vinayaka)వచ్చాడు.

వినాయక విజయం భక్తి మూవీ కధ ప్రారంభం

కైలాసంలో ఆదిదంపతులు లక్ష్మినారాయణులు, బ్రహ్మాది దేవతలతో కొలువుదీరిన సభతో మూవీ ప్రారంభం అవుతుంది. ఆ యొక్క సభలో దేవతలందరూ త్రిపుసారుల సంహారం అయ్యింది.

కానీ మరలా వారి వారసులు మూషికుడు వలన మరియు గజాసురుడు వలన భవిష్యత్తులో ఇంద్రాది దేవతలకు ఇబ్బందులు కలగవచ్చు అని సందేహం నారద మునీంద్రులు వెలిబుచ్చుతారు.

అందుకు ప్రతిగా శ్రీమహావిష్ణువు ఆదిదంపతులైన పార్వతిపరమేశ్వరులు ఇరువురు కలసి కైలాసంలో ఉండగా లోకాలలో ఎవరికీ ఏ ఇబ్బంది రాబోదని వెల్లడి చేస్తారు.

మరొక సన్నివేశంలో మూషికుడు, గజాసురుడు సభలో కొలువు తీరి ఉండగా నారద మహాముని వేంచేస్తారు. ఉచితాసినులు అయిన నారద మునీంద్రులు వారికి కైలాస సభ ప్రస్తావన తెచ్చి, హరిహరుల సహకారంతో రాక్షస జాతిని అంతమొందించాలని దేవతల ప్రయత్నం అని చెబుతారు.

దానికి మేము అంతకముందే దేవతలను అంతం చేస్తాం అని బదులు ఇస్తాడు మూషికుడు అయితే ఇంతకుముందు చాలామంది రాక్షసులు పలికి ఫలితం సాధించాలేకపోయరని ప్రతిగా బదులు పలుకుతారు నారద మునీంద్రులు.

శక్తితో శివుడు కలిసి ఉన్నన్నాళ్ళు ఎవరికీ అపాయం రాదని చెబితే, వారిని భక్తితో వేరు చేస్తానని గజాసురుడు పలుకుతాడు. ఇంద్రుడిని జయించి స్వర్గాన్ని జయిస్తానని మూషికుడు పలుకుతాడు.

మూషికుడు భార్య ప్రియంవద మాత్రం చాల ప్రాతివత్యం కలిగి, జగన్మాతను ఆరాధిస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు తన పతి యోగక్షేమాలు కోరుతూ పూజలు చేస్తూ ఉంటుంది.

ఇక మూషికుడికి ఇతరుల మనస్సును కొంతసేపు మాయచేసి తానూ అనుకున్న మాయ వారిపై ప్రయోగించకలడు. ఈ విద్యను పూజామందిరంలో ఉన్న తన భార్యపై ప్రయోగించి చూపుతాడు.

మరొక సన్నివేశంలో గజాసురుడు శివుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు, అత్యంత భక్తి శ్రద్దలతో శివుడిని అర్చిస్తూ ఉంటాడు.

దేవేంద్రుడు దుర్వాస మహర్షి చేత శపించబడడం, వినాయక విజయం తెలుగు భక్తి మూవీ.

తరువాతి సన్నివేశంలో ఇంద్రసభకు దూర్వాస మహర్షి వేంచేస్తారు, అప్పుడు దేవేంద్రుడు ఆ మునీంద్రుడుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారు.

సంతసించిన ముని తన తపఃప్రభావమైన ఒక మాలను ఇంద్రుడికి ఇస్తాడు. అప్పుడే మూషికుడు కూడా అక్కడ జరుగుతున్న సన్నివేశం చూస్తాడు. ఇంద్రుడిపై మూషికుడు తన విద్యను ప్రదర్శించి, మహామునిపై దుర్భాషలాడేవిధంగా ప్రేరేపిస్తాడు.

దాంతో ఇంద్రుడితో అహంకారపూరితమైన మాటలు మాట్లాడతాడు. దూర్వాస ముని ఆగ్రహానికి కారణం అయ్యేలా చేస్తాడు. ఇంద్రుడి ప్రవర్తన కారణంగా కోపగించిన ముని దేవేంద్రుడు పదవి కోల్పోయి రాక్షసులచే పీడీంపబడతావని శపించి అక్కడ నుండి నిష్క్రమిస్తారు.

మాయ తొలగగానే నేనెందుకు ఇలా ప్రవర్తించానని దేవేంద్రుడు చింతిస్తుంటాడు. అందుకు అక్కడకు వచ్చిన నారద మహర్షి, నీవు మూషికుని మాయప్రభావం వలన అలా ప్రవర్తించావని చెబుతాడు. అతని దుర్బుద్ధితో నీమీద ఈ ప్రయోగం చేసాడని వివరిస్తారు.

నారదుడు ఆ తరువాతి సన్నివేశంలో పార్వతి మాత వద్దకు వెళతాడు. శివుని గురించి గజాసురుడు చేస్తున్న భక్తిపూర్వకమైన తపస్సు సంగతి చెబుతాడు. అందులో అంతర్యం కూడా పార్వతి మాతకు వివరిస్తాడు.

పరమేశ్వరా అంటే పరిగెత్తుకెళ్ళి మరీ వరాలిచ్చే శివుడితో జాగ్రత్త అని చెబుతారు. అయితే పరమశివుడు మాయలు చేయని మహాదేవుడు, భక్తులు కోరికలు నెరవేర్చే భాక్తపరాదినుడు అని అంటుంది పార్వతి మాత.

ఈలోపు పరమేశ్వరులు అక్కడికి వేంచయగానే నారద మహర్షి నిష్క్రమిస్తారు. పార్వతి మాత మహాదేవుని గజాసురుడు సంగతి అడిగితే, భక్తులు కోరిక నెరవేర్చడమే నా కర్తవ్యం అని బదులిస్తే, తర్వాతి సన్నివేశం గజాసురుని తపఃప్రాంతంలోకి.

తపస్సు చేస్తున్న గజాసురుడు ఎంతకీ, శివుని అనుగ్రహం కలగలేదని, నీ కరుణలేని ఈ జన్మ నాకొద్దని తనతలని తానే నరుక్కోబోతాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమైతే, అప్పుడు గజాసురుడు శివుని చూసి స్త్రోత్రం చేస్తాడు.

ముక్కంటి, గౌరీమనోహరా, గంగాధరా కరుణించితివా అని శివుని కాళ్ళపై పడతాడు. అప్పుడు శివుడు నీ భక్తికి మెచ్చా, వరం కోరుకో అంటాడు. గజాసురుడు నీవు నా గర్భంలో కొలువు అయి ఉండాలి అంటాడు, అప్పుడు పరమశివుడు, ఈ కోరిక వలన విపరీత పరిణామాలు వస్తాయని వారించినా, వాటికి నేనుసిద్దం నీ నా గర్భంలో కొలువు కమ్మని వేడుకుంటాడు, గజాసురుడు.

శివుడు గజాసురుడి గర్భంలోకి శివలింగంగా వెళతాడు. ఇక మూశికుడి ఆగడాలు మొదలవుతాయి. మూషికుడు ఇంద్రుడిని ఓడించి, స్వర్గాన్ని ఆక్రమించి, తానూ ముల్లోకాలకు ప్రభువుగా ప్రకటించుకుంటాడు.

తల్లిచేతిలో పుట్టిన వినాయకుడు (Vinayaka), తండ్రి చేతితో మరలా బ్రతకడం

ఇంద్రాది దేవతలు, మునీంద్రులు బ్రహ్మలోకం వెళ్లి, బ్రహ్మదేవులకు మూషికుని గూర్చి మొరపెట్టుకుంటారు. భ్రాహ్మగారు మూషికుడు వరసంపన్నుడు అంటాడు. ఇంకా అతను అంతం అవ్వాలంటే, అయోనిజుడు, అకుంటిత దీక్షాపరుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు, జితేంద్రీయుడు, గుణశ్రేష్టుడు, సురశ్రేష్టుడు సర్వశక్తి సముపార్జుతుడు మరియు నా సృష్టిలో జన్మించనివాడు అయి ఉండాలి.

అని చెప్పి, ఆ జగజ్జనని శరణు వేడండి అని చెబితే, దేవతలు పార్వతి మాతను కలిసి ఈ విషయం మొరపెట్టుకుంటారు. అప్పుడు పార్వతిమాత పరమశివులు లేరు, శివుడు లేకుండా నేనేమి చేయలేనని చెబితే, దేవతలు శ్రీమహావిష్ణువుని ప్రార్ధిస్తారు.

ప్రత్యక్షమైన ఉపేంద్రుడు పార్వతిమాతలో మోసాన్ని మోసంతో జయించాలి, మేము శివుడిని ఆ గజాసురుని గర్భం నుండి బయటికి తీసుకువస్తాం అయితే, మా ప్రయత్నానికి తోడుగా నీవు కూడా శివుడు వచ్చేవరకు భగ్నం కలగకుండా శివదీక్ష చేయమని అంతర్ధానం అవుతాడు.

అభ్యంగన స్నానం చేయబోతు పార్వతిమాత దేవతలు చెప్పిన సుగుణాలు కలిగిన కుమారుని ఆలోచన చేస్తూ, తన చేతిలో ఉన్న పసుపుముద్దతో బాలుడి బొమ్మను చేస్తుంది. ఆ బొమ్మ బాలుడుకి జగన్మాత ప్రాణం పోస్తే, బాలుడికి(Vinayakudiki) పార్వతి మాత తన శక్తి ఆయుధం ఇచ్చి, నేను శివదీక్ష చేస్తున్నాను కావున, ఎవరు మందిరప్రవేశం చేయకుండా కావలి కాయమని చెప్పి, పార్వతి మాత శివదీక్షలో ఉంటుంది.

గజాసురుడు సభలో కొలువై ఉండగా, విష్ణువు, బ్రహ్మాదిదేవతలు మారువేషంలో వచ్చి ఎద్దులతో నృత్యప్రదర్శన చేసి, అతడిని మెప్పిస్తారు. అప్పుడు గజాసురుడు మీకు కావాల్సినది కోరుకోమంటాడు.

బదులుగా బ్రహ్మ, విష్ణువులు నీ గర్భంలో ఉన్న శివుడుని ఇచ్చేయమని చెబుతారు. గజాసురుడు దేవతలతో శివుడిని మీరే మెప్పించి తీసుకువెళ్ళండి అని బదులుఇస్తాడు. బ్రహ్మవిష్ణువుల స్త్రోత్రానికి శివుడు గజాసురుని గర్భం చీల్చుకొని బయటకి వస్తే, పరమశివుని చూసి గజాసురుడు ఎప్పుడూ నిన్ను చూస్తూ నీ చెంత ఉండే వరం ఇవమని కోరతాడు, శివుడు అనుగ్రహిస్తాడు.

కైలాస ప్రవేశం చేయబోయిన పరమశివుని పార్వతి పుత్రుడు(Vinayakudu) అడ్డగిస్తాడు. శివుడు వారించి చూసిన ఎదురించే బాలుని(Vinayakuni) శిరస్సు ఖండించి, శిరస్సుని ముక్కంటితో దగ్ధం చేస్తాడు. పుత్రుడి ఆర్తనాదంతో బయటకు వచ్చిన పార్వతిమాత విచారిస్తుంది.

అప్పుడు బ్రహ్మవిష్ణువులు ఆ బాలుడుని మేము పునర్జీవుడిని చేస్తాం, కానీ శిరస్సు ఏది పెట్టాలని అంటారు. పరమశివుడు, నంది-బృంగిలను పిలిచి, ఎవరు ఉత్తరదిక్కుకి తలపెట్టుకుని పడుకుంటే, వారి తలను తీసుకురమ్మని చెబుతారు.

శివుని ఆజ్ఞతో బయలుదేరిన వారికి ఉత్తరదిక్కుగా తలపెట్టుకుని నిద్రిస్తున్నఏనుగు మాత్రమే కనిపిస్తుంది. ఉత్తరదిక్కుగా తలపెట్టుకుని పడుకోవడం అంటే దక్షిణ యమస్థానాన్ని చూడడం అని అనుకుని, ఆ ఏనుగు తలని తీసుకుని కైలసానికి వెళతారు.

పార్వతి మాత అంత అందమైన బాలుడికి (Vinayakudiki) ఈ ఏనుగు తలా అని భాదపడితే, నారదుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నీ బిడ్డడు కారణ జన్ముడు అతను ద్విజన్ముడు, ద్విముఖుడు కావాలి కాబట్టి అంగీకరించమని అడుగుతారు.

అలాగే నీ బిడ్డడికి సర్వదేవతా శక్తులు వస్తాయని చెబుతారు. పార్వతి మాత అంగీకారం తరవాత ఏనుగు తలని ఆ బాలుడి(Vinayakudi) కి అతికిస్తారు. ఆ బాలుడు గజముఖుడై గజాననుడుగా మారతాడు.

గజాననుడు విఘ్నాదిపతిగా మూషికుడిని ఓడించి వినాయక విజయం పొందడం (Vinayaka Vijayam).

తరువాయి శాస్త్రోక్తంగా ఆ బాలుడికి బ్రహ్మోపదేశం చేసి తపస్సుకి పంపిస్తారు, పార్వతి పరమేశ్వరులు. తపస్సు విజయవంతంగా పూర్తిచేసుకుని వచ్చిన గజాననుడికి నారద మహర్షి కుమారస్వామిని తమ్మునిగా పరిచయం చేస్తారు. తపస్సు పూర్తిచేసుకుని జితేంద్రీయుడైన పుత్రుని చూసి, గణాధిపతిని చేయదలస్తే,  గణాధిపత్యానికి కుమారస్వామి పోటిపడితే, ఇద్దరికీ ఒక పరీక్షను పార్వతి పరమేశ్వరులు పెడతారు.

ఎవరైతే, ముమ్మారు విశ్వప్రదక్షణ చేస్తారో, వారికీ గణాధిపత్యం ఇవ్వడం జరుగుతుంది అని చెబుతారు. వెంటనే కుమారస్వామి పోటిలో విజయం సాధించడానికి తనవాహనం అయినా నెమలిపై బయలుదేరితే, గజాననుడు ఆలోచన చేసి, తల్లిదండ్రుల వలననే విశ్వం ఉంటే, విశ్వకారకులైన తల్లిదండ్రుల పాదపూజ చేసి ముమ్మారు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే, కుమారస్వామి వెళ్ళిన ప్రతిచోట గజాననుడు ఎదురువస్తూ కనబడతాడు.

ప్రదక్షిణ పూర్తిచేసి వచ్చిన కుమారస్వామి గజాననుడి గెలుపు అంగీకరించి, గణాదిపత్యం అన్నగారికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆవిధంగా గజాననుడు పార్వతి పరమేశ్వరుల పాదపూజ ద్వారా గణముల అన్నింటికీ అధిపతి అయ్యి, విఘ్నేశ్వరుడుగా పిలవబడతాడు.

మూషికుడు గర్విష్టి అయ్యి బందించిన ఇద్దరి దేవతా జంట కోరిక మేరకు వినాయకుడు వారికి మేలు చేయదలచి, మూషికుడుని యుద్దంలో ఓడిస్తాడు, అప్పుడు మూషికుని భార్య ప్రియంవద భక్తికి మెచ్చిన పార్వతిమాత మూషికుని రక్షిస్తే, జగన్మాత మూషికుని గతజన్మ దేవతలకు వివరించి, మూషికుని వినాయకుడిని శరణువేడమంటే, మూషికుడు వినాయకుడిని శరణువేడి వినాయకుడి పాదాల వద్ద ఎలుకగా ఉంటాడు. అతని భార్య వినాయకునికి చత్రమై భర్త చెంతనే ఉంటుంది. వినాయకుడుకి జగన్మాతకి అభేదంగా చెబుతూ వినాయక విజయం విజయవంతం అవుతుంది.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

తెలుగు చిన్న పిల్లల పేర్లు మొబైల్ యాప్ .