By | November 26, 2021

విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి.


పిల్లలకు వినయ విధేయతలు ఎందుకు నేర్పాలి? క్రమశిక్షణను ఎందుకు అలవాటు చేయాలి?


మొక్కగా ఉన్నప్పుడే వంగని మొక్క, అది పెరిగి చెట్టుగా మారాకా మాత్రం వంగుతుందా? ఒక మొక్క వలె వ్యక్తి బాల్యం సుకుమారంగా ఉంటుంది. వారి మనసు చాలా సున్నితంగా ఉండవచ్చును. అటువంటి చిన్నప్పుడే వారికి వినయవిధేయతలు అలవాటు కాకపోతే, వారు పెద్దయ్యాకా కూడా వారు అలాగే వినయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రమశిక్షణారాహిత్యంగా ఉండడం చేత వారికి జీవితంలో అవకాశాలు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వినయపరులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. వ్యక్తి జీవితంలో తనకున్న పరిస్థితులలో కుటుంబంలో కానీ, పని చేసే కార్యాలయంలో కానీ, పని చేయించుకునే కార్యాలయంలో కానీ సత్ప్రవర్తన చేతనే అవి వృద్దిలోకి తీసుకుని రాగలరు. వ్యక్తి ఉత్తమ స్థితికి క్రమశిక్షణతో కలిగిన ప్రవర్తన ఎంతో సహాయపడుతుంది కావునా పిల్లలగా ఉన్నప్పుడే, వారికి క్రమశిక్షణ నేర్పించాలని చెబుతారు.


ఇంకా సృజనాత్మకత, తెలివి, అవగాహన ఏర్పరచుకునే వయస్పు కాబట్టి, ఆ వయస్సులో ఎటువంటి విషయాలలో శ్రద్ద చూపితే, ఆ విషయాలు మనసులో బలంగా నాటుకుంటాయి. ఇక చదువు విషయంలో బాలబాలికలు చూపే శ్రద్ద వలన,  కాబట్టి క్రమశిక్షణ అనేది వ్యక్తికి విద్యార్ధి దశ నుండి చాలా అవసరం అని అంటారు.


ఎలా చెబితే, పిల్లలకు క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నిస్తారు?


పిల్లలకు సులభంగా అనుకరిస్తూ ఉంటారు. అంటే తాము గమనించింది, చేయడానికి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంట్లోవారు ప్రవర్తించే ప్రవర్తనను, పిల్లలు గమనిస్తూ, అదేవిధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల ముందు పెద్దవారు క్రమశిక్షణతో ప్రవర్తించడం చాలా మేలైన విషయంగా చెప్పబడుతుంది. క్రమశిక్షణతో ఉండమని చెప్పడం కన్నా, క్రమశిక్షణతో వారి ముందు ప్రవర్తించడమే సరైన మార్గముగా చెబుతారు.


విద్యాలయాలలో కేవలం పిల్లలకు క్రమశిక్షణ గురించి బోధించడమే కాదు. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన అందరూ ప్రదర్శించినప్పుడే, విద్యార్ధులకు వ్యవస్థ అంటే క్రమశిక్షణ ప్రధానం అనే ఆలోచన బలపడుతుంది. లేకపోతే విద్యార్ధి దశ నుండే, క్రమశిక్షణ కేవలం మాటలకే పరిమితం, అది ఒక వ్యాసరచన చేసి, మార్కులు సంపాదించుకోవడానికే అనే అభిప్రాయం బలపడే అవకాశం ఉంటుంది. కావునా పిల్లలకు క్రమశిక్షణతో కూడిన బోధనతో బాటు, క్రమశిక్షణతో వ్యవహరించడం చాలా చాలా ప్రధానం.


అలాగే కుటుంబంలోనూ కూడా పెద్దవారు, చిన్నవారి ముందు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనతో ఉండడం చేత, మరింత మంచి ఫలితం పొందవచ్చును. క్రమశిక్షణ అంటే ఏమిటి?


క్రమమైన పద్దతిని అనుసరించడమే క్రమశిక్షణ అంటారు. ప్రతి పనికి, ఆ పనిని పూర్తి చేయడానికి ఒక క్రమము ఉంటుంది. అలాంటి క్రమమును గురించి తెలుసుకునే, అదే పద్దతిలో నడుచుకోవడం క్రమశిక్షణ అంటారు. ఉదాహరణకు మనం స్వీకరించే ఆహారం.


ఒక పనిని క్రమపద్దతిలో చేయకపోతే?


మనం తీసుకునే ఆహారం ముందుగా వండుతారు. అది ఏ క్రమములో ఉంటుంది? మనం రోజు తినే ఆహారంలో ప్రధానంగా అన్నం ఉంటుంది. దానికి అనుషంగికంగా కూరలు ఉంటాయి. అన్నమును ఒక క్రమములోనే వండుతారు.



  1. శుభ్రపరిచిన పాత్ర

  2. నిర్ణీత పరిమాణంలో బియ్యం

  3. బియ్యమును నీటితో శుభ్రపరుచుట

  4. కడిగిన బియ్యమును, శుభ్రపరిచిన పాత్రలో వేయడం, తగినంత నీరును పోయడం

  5. గ్యాస్ స్టౌవ్ వెలిగించడం

  6. కడిగిన బియ్యము, తగినంత నీరు కలిగిన శుభ్రపరిచిన పాత్రను గ్యాస్ స్టౌవ్ పై ఉంచడం.

  7. బియ్యము అన్నముగా మారేవరకు ఉడికించడం.

  8. ఉడికించిన అన్నమును ఆహారముగా తీసుకుంటారు. (ఏదైనా క్రమపద్దతిలో వండిన కూరతో కానీ పచ్చడితో కానీ స్వీకరించడం)


ఇప్పుడు చూడండి… పై పద్దతిలో ముందుగా ఏదైనా పనిని చేస్తే ఎలా ఉంటుంది? 1 వ పాయింట్ అంటే, శుభ్రం చేయకుండానే ఒక పాత్రంలో బియ్యమును పోసి, అందులో బియ్యం వేసి, నీరు పోసి స్టౌవ్ పైన పెట్టేసి, ఆ పాత్రలో బియ్యమును ఉడిస్తున్నాం… ఇప్పుడు ఇందలో స్కిప్ చేయబడినవి ఏమిటి?


పాత్ర శుభ్రం చేయలేదు. బియ్యమును కూడా శుభ్రం చేయలేదు.


శుభ్రం చేయని పాత్రను అన్నం వండడానికి ఉపయోగించాము కాబట్టి, గ్యాస్ స్టౌవ్ పై అన్నం ఉడుకుతున్న పాత్రను శుభ్రం చేయాలంటే, అందులో వేసిన బియ్యం వృధా అవుతాయి. కాలం వృధా అవుతుంది. గ్యాస్ వృధా అవుతుంది. ఇంకా శరీరానికి హాని చేసే క్రిములు మనం తీసుకునే ఆహారంలో ఉండవచ్చును….


క్రమశిక్షణ లేని పనితనం సరైన ఫలితం?


ఇలాగే ఏదైనా ఒక పనిని క్రమ పద్దతిలో చేయకపోతే, ఆ పని ఫలితం సరైన సమయంలో పొందలేరు. ఇంకా అతి విలువైనా కాలం కూడా హరించుకుపోతుంది. అన్నం వండుకోవడం సక్రమంగా చేయకపోతే, మరలా వండుకునే అవకాశం ఉంటుంది. అదే అనేకమంది నడిచే ఒక బ్రిడ్జ్ కడితే, ఆ బ్రిడ్జ్ పరిస్థితి, అక్కడ నడిచే మనుషులు పరిస్థితి ఏమిటి? అలాగే ఒక వ్యక్తికి ఆపరేషన్ జరిగితే?… అంటే కొన్ని కొన్ని పనులు మరలా చేసుకునే అవకాశం ఉంటుందేమో కానీ కొన్ని పనులకు ఒక్కసారే అవకాశం, రెండవ అవకాశం ఉండదు. దాని యొక్క నష్టం భరించాల్సి ఉంటుంది. అప్పుడే సాధనలో ఉండే దోషాలు బయటపడతాయి.


ఇలా ఒక క్రమపద్దతిలో చేసే పనులు గురించి, విద్యలో భాగంగా నేర్చుకుంటూ ఉంటాము. అవి అనేక పుస్తకాలలో కూడా లభిస్తూ ఉంటాయి. కానీ క్రమశిక్షణ మాత్రం ఎదుగుతున్న వయస్సులోనే, ప్రవర్తిస్తూ అలవాటు చేసుకునే క్రియ కాబట్టి… అది చూసి నేర్చుకునే వయస్సులోనే అలవాటు కాబట్టి క్రమశిక్షణ విషయంలో పిల్లలు, పెద్దలు కూడా క్రమశిక్షణతో నడుచుకోవడం ప్రధానం అని సూచిస్తారు.


అన్నం వండుకోవడానికి మొదటగా కడిగిన పాత్ర ఎలాగో, విద్యను పూర్తి స్తాయిలో అభ్యసించడానికి విద్యార్ధికి ప్రాధమిక దశలో క్రమశిక్షణ చాలా ప్రధానం అంటారు. ప్రాదమిక దశలో కేవలం విషయాలు పరిచయం అవుతాయి. కళాశాల విద్యలోనే లోతైన విశ్లేషణ, మరియు పరిశోధనాత్మక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కావునా క్రమపద్దతిలో తెలుసుకోవడం అనే ప్రక్రియలో క్రమశిక్షణ పిల్లలకు అవసరం అంటారు.


ఏ వ్యవస్థ అయినా ముందుగా ఒక నియమావళి ఉంటుంది.


ఏదైనా ఒక వ్యవస్థ మనుగడ సాగిస్తుందంటే, ఆ వ్యవస్థలో పాటించే నియమ నిబంధనలు క్రమశిక్షణతో ఆచరించే వ్యక్తుల వలననే అంటారు. ఒక వ్యవస్థలోని వ్యక్తులంతా ఒక్కమాటపై నిలబడితే, ఆ వ్యవస్థపై అంటే సమాజంలో అందరికీ నమ్మకం ఉంటుంది. అలా ఒక వ్యవస్థలో అంతా ఒక్కమాటపై నిలబడే తత్వం క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తులకే సాధ్యం అంటారు. ఒక వ్యవస్థ స్థాయిని పెంచేది, దించేది కూడా ఆ వ్యవస్థలో భాగస్వాములైన వ్యక్తులే కారణం అవుతారు. కాబట్టి వ్యవస్థాగత అభివృద్దికి వ్యక్తి క్రమశిక్షణ చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది… కావునా విద్యార్ధులకు విద్యార్ధి దశలోనే క్రమశిక్షణ చాలా అవసరం అంటారు. ఎందుకంటే నేటి విద్యార్ధులే రేపటి వ్యవస్థలో భాగస్వాములు కాగలరు కాబట్టి…

ఇలా రంగం ఏదైనా సరే ఆయా రంగాలలో ఉండే వ్యక్తుల క్రమశిక్షణ చేతనే రంగం అభివృద్దిని పొందుతుంది… సమాజంలో వివిధ రంగాలు, వివిధ వ్యవస్థలు, సంస్థలు భాగమై ఉంటే, సజావుగా సాగుతున్నంతకాలం సమాజంలో వ్యక్తుల జీవన విధానం కూడా మెరుగ్గా ఉంటుంది. అంటే సమాజంలో వ్యవస్థలు సరిగ్గా పనిచేయడానికి కారణం వ్యక్తి క్రమశిక్షణతో కూడిన పని కారణం అవుతుంది కాబట్టి విద్యార్ధి దశ నుండే క్రమశిక్షణ అలవరచుకోవాలని అంటారు.

విద్యార్థులు క్రమశిక్షణ​ విద్యార్ధి దశ నుండే ప్రారంభించాలి

మొక్కై ఒంగనప్పుడు మానై ఒంగునా అనే నానుడి ప్రసిద్ది… అంటే మొక్కగా ఉండనప్పుడు ఒంగనది రానిది అది పెరిగి పెద్దదయ్యాక ఒంగుతుందా…. అలాగే విద్యార్ధి దశలో క్రమశిక్షణ అలవాటు అవ్వకపోతే, వ్యక్తిగా ఎదిగాక క్రమశిక్షణ అలవాటు అవుతుందా? చిన్నప్పుడు లేని క్రమశిక్షణ పెద్దయ్యాక ఉండదనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది.

విద్యార్ధి దశ అంటే నేర్చుకునే దశ… అనుకరించే దశ. చూసి పట్టుకునే దశ. విని సాధన చేసే దశ. కాబట్టి విద్యార్ధి దశలోనే విద్యార్థులు క్రమశిక్షణ​ను అలవాటు చేసుకోవాలి.

సమయానికి తగిన పనులు చేయడం.

ఏ సమయంలో ఏ పనులు చేయాలో, అటువంటి పనులు చేయడం

పెద్దలు మాటలు ఆలకించి, మంచిని సాధన చేయడం.

క్రమశిక్షణతో కూడిన సాధన మంచి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణ​ చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు