-
ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత
ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశమునకు నిజమైన స్వాతంత్ర్యం అని గాంధిగారు అన్నారు అంటే, ఆడువారు అందరూ కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తారని కాదు, ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని అందరూ గుర్తెరిగి ప్రవర్తించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. కానీ దిశపై జరిగిన దారుణాలు, అంతకుముందు మహిళలపై జరిగిన దారుణాలు సామాజిక బాధ్యతను కొందరు పూర్తిగా విస్మరించారు అనిపిస్తుంది. అసలు వారికి వారి పెద్దలు కానీ స్నేహితులు కానీ అటువంటి ధర్మం గురించి బోధించి…
-
మందమతి మామూలోడు కాదు కధ
మందమతి మామూలోడు కాదు, కధలోకి? మందమతి మామూలోడు కాదు కధ. కొన్ని పల్లెటూళ్ళను కలుపుతూ, పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఒక గ్రామీణ రహదారిపై, పల్లెటూళ్ళను దాటుకుంటూ, ఒక బస్ ఆ రోడ్ పై వెళ్తుంది… అలా ఆ బస్ ఒక పల్లెటూరిలోకి వెళ్తుంది… బస్ డోర్ ప్రక్క సీటులో కూర్చున్న వ్యక్తి, ఆ ఊరి చివర ఉన్న గ్రామం పేరు రాసి ఉన్న బోర్డ్ ను చూసి చదువుతూ, తన ప్రక్కనే ఉన్నవ్యక్తితో అంటున్నాడు……
-
మ్యాజిక్ డోర్స్ తెలుగులో మాయా తలుపులు
మ్యాజిక్ డోర్స్ తెలుగులో మాయా తలుపులు హాయ్ నేను మీకు షార్ట్స్ స్టొరీ అందించాలి అనుకుంటున్నాను. చిన్న చిన్న భాగాలుగా నేను కధ రాస్తాను, ఇంకా తెలుగురీడ్స్ యూట్యూబ్ చానెల్ లో వినండి. మీరు చదువుతూ ఉండండి. దయచేసి మీకు నచ్చితే, లైక్ చేయండి… కధను మరింత బాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ లైక్ మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది… ఇక కధలోకి వెళితే… అనగనగా ఒక ఊరు, ఒక ఊరు అంటే మరీ పల్లెటూరు కాదు, ఒక…
-
చీమలు మాంసాహారుల కోవలోకి వస్తాయా?
చీమలు మాంసాహారుల కోవలోకి వస్తాయా? లేక శాకాహారుల కోవలోకి వస్తాయా? మీరు గమనించారా? ఏదైనా తీపి పదార్ధం క్రింద పడితే, వెంటనే చీమలు చేరతాయి. బెల్లం, పంచదార, మిఠాయిలు, జీడిపప్పు… తదితర తీపి పదార్ధాలను చీమలు తింటాయి. ఇంకా కొన్ని రకాల చీమలు అయితే మొక్కల ఆకులను, పండ్లను తింటూ ఉంటాయి. కొన్ని రకాల చీమలు చిన్న పురుగులను, కీటకాలను తింటూ ఉంటాయి. కొన్ని చీమలు విత్తనాలు వంటి వాటిని కూడా తింటాయి. ఈ విధంగా చుస్తే,…
-
కిటుకు అంటే ఏమిటి?
కిటుకు అంటే ఏమిటి? “ఆ పనిని సులువుగా ఎలా చేసారు? అలా ఆ కష్టమైన పనిని సులభంగా చేయడంలో గల కిటుకు ఏమిటి చెప్పండి” అంటూ కొందరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే ‘కిటుకు’ అంటే టిప్ అని అంటారు. సులభంగా పనిని చేయడానికి, లేదా ఆలోచన చేయడానికి మనిషికి ఉపయోగపడే మర్మము (టిప్) ని కిటుకు అంటారు. జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్ జంతుజాలము…
-
జంతుజాలము అంటే ఏమిటి?
జంతుజాలము అంటే ఏమిటి? కాలములో గాని ప్రదేశములో గాని నివసించే జంతువుల గుంపుని చెబుతూ జంతుజాలము అంటారు. తెలుగురీడ్స్,telugureadscom,తెలుగు పదాలు అర్ధాలు పర్యాయ పదాలు, జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్ అంకణము అంటే అర్ధం ఏమిటి? పునః పునః అంటే అర్ధం ఏమిటి? కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు అంబారి అంటే అర్ధం ఏమిటి? అంబుజం అంటే…
-
అంబుజం అంటే ఏమిటి?
అంబుజం అంటే ఏమిటి? దీనికి పర్యాయ పదాలు రాయండి. తెలుగు భాషలో అంబుజం అంటే మన మాట్లాడే అందరికి తెలిసిన భాషలో ఎక్కువగా తామర పువ్వు అంటారు. తామర కు పర్యాయ పదాలు కమలం, పంకజం, నలిని, అంబుజం, అరవిందము, ఇందీవరము, ఉదజము, కంజము అని పిలుస్తారు. బ్రహ్మను అంబుజగర్భుడు అంటారు. సముద్రమును అంభోది అంటారు. మేఘమును అంభోదము అంటారు. తామర తీగను అంభోజిని అంటారు. అంబుజం అంటే ఏమిటి?,తెలుగురీడ్స్,telugureadscom,తెలుగు పదాలు అర్ధాలు పర్యాయ పదాలు, జీవితంలో…
-
అంబారి అంటే అర్ధం ఏమిటి?
అంబారి అంటే అర్ధం ఏమిటి? తెలుగు భాషలో వివిధ పదాలు వాటి అర్ధాలు వాడుక భాషలో అంబారి అంటే ఏనుగు మీద మనిషి కూర్చునే విధంగా ఏర్పాటు చేసే పీఠం. జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్ అంకణము అంటే అర్ధం ఏమిటి? పునః పునః అంటే అర్ధం ఏమిటి? కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు
-
అంత్రము అనగా ఏమిటి?
అంత్రము అనగా ఏమిటి? తెలుగు వాడుక భాషలో కడుపులో పిలిచే ప్రేగును తెలుగు గ్రాంధిక భాషలో అంత్రము అంటారు. జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్ అంకణము అంటే అర్ధం ఏమిటి? పునః పునః అంటే అర్ధం ఏమిటి?
-
పునః పునః అంటే అర్ధం ఏమిటి?
పునః పునః అంటే అర్ధం ఏమిటి? మరల మరలా అని అర్ధం వస్తుంది. తిరిగి చెప్పడం, తిరిగి పదే పదే చెప్పడం లేదా చేయడం, ఒక మాటనే పలుమార్లు చెప్పడం చేసిన పనిని మరలా చేయడం ఇలా రీపీట్ చేయడాన్ని చెబుతూ పునః పునః అంటారు. ఒక్కసారి పునః అంటే మరలా చేయమని లేదా మరలా ప్రారంభించడం, మరల చేసే క్రియను చెప్పడానికి పునః అంటారు. అంకణము అంటే అర్ధం ఏమిటి?
-
అంకణము అంటే అర్ధం ఏమిటి?
అంకణము అంటే అర్ధం ఏమిటి? అంకణము అంటే స్క్వేర్ లో రెండు బుజముల మధ్య దూరం. ఒక చదరపు చోటు అంటే నాలుగు వైపులా ఉన్న చోటులో రెండు దూలముల మధ్య దూరం. అంకనము అంటే చిహ్నము అంటారు. అంటే గుర్తు వేయుటను అంకనము అంటారు. అంకనము మరియు అంకణము రెండు పలకడానికి ఒకే విధంగా ఉన్నా అర్ధాలు వేరు వస్తాయి. Time brings the best opportunities 10వ తరగతిలో లక్ష్యం లేకుండా?
-
Makara Sankranti Subhakankshalu 2025
-
Time brings the best opportunities
Time brings the best opportunities for a life, when you find it, you will have a successful career. జీవితంలో కాలం మంచి అవకాశాలను అందిస్తుంది. ఎవరైతే ఆ అవకాశాలను కొనుగొంటారో? వారు జీవితంలో విజయవంతం అవుతారు. మన ఉన్న స్థితి నుండి ఇంకా మంచి స్థితికి ఎదగాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరే ఆలోచనను ఆచరించి విజయవంతం అవుతారు. కానీ కాలం అందరికీ అవకాశాలను ఏదో ఒక రూపంలో…
-
Happy New Year 2025 Wishes
Happy New Year 2025 Wishes Telugulo తెలుగులో హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ సరదాగా సాగిన ఈ 2024 ప్రయాణం, 2025 అంతకుమించి సంతోషంగా సాగాలని ఆశిస్తూ… విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అప్పటికీ – ఇప్పటికి మన మద్య మైత్రి బంధం అలాగే ఉంది. ఎప్పటికీ మన మైత్రి ఉంటుంది. ఇలాగే ప్రతి న్యూఇయర్ హ్యాపీగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ… మిత్రమా నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2025. హ్యాపీ ఎండింగ్…
-
10వ తరగతిలో లక్ష్యం లేకుండా?
10వ తరగతిలో లక్ష్యం లేకుండా ఉంటే, వారి చదువు ఎలా ఉండవచ్చు. చెప్పలేం. లక్ష్యం లేకపోతే, విద్యార్థి ఏదో ఒక పనిని చేయడం వరకే పరిమితం అవుతాడు. కానీ దానికి సరైన ఫలితాలు రాకపోవచ్చును. మంచి ఫలితం వచ్చినా, లక్ష్యంతో పనిచేసి సాధించిన ఫలితమే సంతృప్తినిస్తుంది. ఉదాహరణ:ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా వ్యక్తి బస్సు ఎక్కితే ఎలా ఉంటుందో, ఊహించండి. ఖర్చులు వృధా అవుతాయి. అలాగే లక్ష్యం లేకుండా చదివితే, కాలం వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది.…
-
అందం అద్దంలో మాత్రమే, గుణం మనసులోకి
అందం అద్దంలో మాత్రమే, గుణం మనసులోకి చేరి, స్థిరపడుతుంది. అందం బయటికి అద్దంలో చూసినప్పుడే కనపడుతుంది, అంటే అది తాత్కాలికం. శరీర సౌందర్యం, రూపం కాలక్రమేణా మారిపోయే ప్రకృతి లక్షణాలు. కానీ గుణం మన ఆచరణలో, మన మాటల్లో, మన పనుల్లోకనిపించే శాశ్వత ముద్ర. అది మన వ్యక్తిత్వం, ధైర్యం, నిజాయితీ, దయ వంటి అంశాల ద్వారా ప్రజల మనసుల్లో చిరకాలం నిలుస్తుంది. అందుకే గుణం అస్తమించదు, మరుపుకురాదు. మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు స్వాతంత్ర్య పోరాటం క్లాసులో…
-
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? జీవితంలో విజయం సాధించాలని, ప్రతివారూ కోరుకుంటారు. కానీ, అందుకు కేవలం ఆలోచనలు మాత్రమే ఉండటం సరిపోదు. లక్ష్యం సాధించడానికి కృషి చేయడానికి, ఆ కృషిలో పట్టుదల ఉండేలా ఉండటానికి అవసరమైనది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది మన లక్ష్యాలను, మన వ్యక్తిగత అభివృద్ధిని సాధించడానికి ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. క్రమశిక్షణ అంటే ఏమిటి? క్రమశిక్షణ అనేది మన ఆలోచనలు, కార్యాలను నిర్దేశిత పద్ధతిలో చేయడం, అడ్డంకులను అధిగమించడం. ఒక నిర్దిష్ట విధానంలో…
-
రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్
హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్లో ప్రశాంతమైన వాతావరణం ఇంకా ఉదయం కాలేదు. తేలికపాటి గాలి ఆకులను ఊపుతూ, కిలకిలారావాలు చేసే పక్షుల రాగంతో గాలి నిండిపోయింది. ఈ పార్కులో మార్నింగ్ వాక్ చేయడానికి ఇష్టపడేవారిలో ఒక వ్యక్తి ఇప్పుడు వాక్ చేస్తున్నారు. ఆయన పేరు రవికాంత్, ప్రతి రోజూ ఆయన ఈ పార్కులోనే వాకింగ్ చేస్తారు. అయితే ఈ రోజు ఆరు విచిత్రమైన వ్యక్తులు అతనితో పాటు షికారు చేశారు, వారి ఉనికిని మిగిలిన వారు గమనించలేరు. రవికాంత్…
-
ఐకమత్యమే మహాబలం కలసిగట్టుగా ఉంటే
శీర్షిక: సంఘంలో ఐకమత్యమే మహాబలం కలసిగట్టుగా ఉంటే బలం, విడి విడిగా ఉంటే, సంఘం బలహీనతగా మారుతుంది. అలాగే ఒక ఊరు కూడా… పచ్చని పొలాలతో, నదీ ప్రవాహంలో ప్రక్కనే ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామం పేరు మనపల్లెగూడెం. ఆ గ్రామంలో వివిధ వర్గాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. గ్రామస్తులు, వారి వారి ఆచారాలు, మతాలు మరియు భాషలలో విభిన్నమైనప్పటికీ, ఆ ఊరితో కలసిపోయారు. ఊరిలో కొత్తవారు / ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని…
-
స్వాతంత్ర్య పోరాటం క్లాసులో చర్చ
శీర్షిక: “స్వాతంత్ర్య పోరాటం: ఒక వర్గ చర్చ” స్వాతంత్ర్య పోరాటం క్లాసులో చర్చ ఒక పాఠశాలలో బుధవారం ఉదయం వేళలో, 8వ తరగతి విద్యార్థులు ఉత్సాహంతో సందడిగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హిస్టరీ క్లాస్ ప్రత్యేకంగా ఉంటుంది. వారి ఉపాధ్యాయుడు, శ్రీ రామకృష్ణ శాస్త్రి చాలా చక్కగా చరిత్ర గురించి పిల్లలకు వివరించి చెబుతారు. అయితే ఈరోజు సబ్జెక్టు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంపై పాఠం, ప్రతి భారతీయుడి హృదయానికి దగ్గరగా ఉండే అంశం. మిస్టర్ రామకృష్ణ శాస్త్రి…
-
నిత్య నూతనోత్తేజం సాహాసానికి ఊపిరి
నిత్య నూతనోత్తేజం సాహాసానికి ఊపిరి పోస్తుంది. ఈ కధలో నిత్య కధానాయిక, ఆమె చేసిన సాహసం ఏమిటి? ఈ కధలో… ఒకానొక కాలంలో, పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో, నిత్య అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె చాల దయగలది, ఆసక్తిగలది మరియు ఎల్లప్పుడూ ఉత్తేజకరమైన సాహసాలను కలిగి ఉండాలని కలలు కనేది. ఒకరోజు మధ్యాహ్మ వేళలో, ఊరి అంచున ఆడుకుంటూ ఉండగా, ఆమె ఇంతకు ముందెన్నడూ గమనించని దారి ఆమెకు కనిపించింది.…
-
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్. సరిపోదా శనివారం సినిమాలో హీరోకు కోపం వస్తుంది. ఆ హీరోకు కోపం వస్తే, ఆ సమస్య అతనిదే, బాదితులు అతనికి స్నేహితులు… రాజకీయాలలో పవన్ కు కోపం వస్తుంది. పవన్ కు కోపమొచ్చి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తే, అది ప్రజలలో చర్చనీయాంశంగా మారిపోతుంది. మీడియాలో సంచలనంగా మారుతుంది. జీరోతో ఎవరైనా ఒక పనిని ప్రారంభిస్తారా? అంటే డౌటే. కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి, ఆ పార్టీలో ఒక్క ఎంఎల్ఏ కూడా…
-
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు?
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు కూటమిలో నెం-2 స్థానంలో ఉన్నారు. అయినా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు? అనే ప్రశ్న ఎందుకంటే? ఆయన అధికారంలో ఉండి, తాజా తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో కీలక కామెంట్స్ చేయడంతో పాటు, ఈ వ్యవహారం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశం లేతనెత్తారు. హిందూ ధర్మం అనగానే అది రాష్ట్ర పరిధిని కూడా దాటి ఉంటుంది. ఇంకా ఆయన తెలుగుతో బాటు, హిందీ,…
-
పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా
స్కూలులో పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా, ఇష్టపడి సంతోషంతో క్లాసులో కూర్చుంటే, క్లాసులో చెప్పే సబ్జెక్టు విషయాలు తలకెక్కుతాయి. సబ్జెక్టు బుక్స్ ఒక్కొక్కటి 100 / 150 పేజీలకు పైగా ఉంటాయి. ఆ సబ్జెక్టు బుక్స్ చదివిన విద్యార్ధి ఇచ్చే పరీక్షా పత్రం రెండు లేదా మూడు పేజీలు ఉంటే, దానికి జవాబు పది నుండి ఇరవై పేజీల వరకు ఉండవచ్చును. అంటే ఒక సబ్జెక్టు బుక్ పేజీలలో కేవలం 10 నుండి పదిహేను శాతం మాత్రమే…
-
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ వరుసగా రెండుమార్లు ఒకే పార్టీ పాలించింది అలాగే తెలంగాణలో కూడా కానీ విభజన తర్వాత ఏపిలో మాత్రం అందుకు విభిన్నం. ముందుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాజకీయ మలుపులు గురించి క్లుప్తంగా… కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎక్కువ కాలం ఒకే ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఒకే విధంగా ఉండదు. ఇంకా అధికార పక్షం చేసే తప్పులు కూడా కలిసి ప్రజాతీర్పు మారుతుంది అంటారు. ఆ…
-
విద్యార్ధులకు విద్యా వినాయకుడు గణాధిపతి
విద్యార్ధులకు విద్యా వినాయకుడు గణాధిపతి. మనకు వినాయకుడు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటాడు, ముఖ్యంగా పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాడు. ఆ వినాయకుడిని ఆరాధిస్తూ జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయక చవితి. దీనినే ఇంకా గణేష్ చతుర్ది, వినాయక చతుర్ధి అని కూడా అంటారు. విద్యా బుద్దులు ప్రసాదించే దైవంగా భక్తులు నమ్ముతారు. ఎవరైనా ఏకాగ్రత సాధన చేయాలంటే, సులభంగా దృష్టిని కేంద్రికరించడానికి అనువైన ప్రతిమ వినాయకుడి ప్రతిమ. దేశమంతా జరుపుకునే పండుగలలో ప్రధానమైనది. మన పురాణల…
-
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం, ఆయన వలన ప్రయోజనాలు ఏమిటి? ఏమిటీ ప్రశ్న? రాజకీయాలలో పవన్ పవర్ పుల్ పాలిటిక్స్ చూశాకా… రాజకీయాలలో పవన్ కళ్యాణ్ విజయం సాదించాకా కూడా ఈ ప్రశ్న ఎందుకు అంటారా? అయితే ఈ తెలుగురీడ్స్ పోస్టులో ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉండడం చేత సమాజానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం, ఆయన పరాజయాలు తర్వాత పవన్ కళ్యాణ్ వలన కూటమి అద్భుతమైన విజయం…
-
స్వీయ సమీక్ష ఎందుకు అవసరం?
స్వీయ సమీక్ష ఎందుకు అవసరం? వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి స్వీయ సమీక్ష అవసరం అంటారు. అది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది ఎందుకు అవసరమో ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. మనం మనగురించి ఆలోచించడం స్వీయ సమీక్ష అయితే, అది ఎందుకు అవసరం? స్వీయ సమీక్ష ఎలా ఉపయోగపడుతుంది? మనలో బలాలు ఉంటాయి. బలహీనతలు ఉంటాయి. బలాన్ని చూసుకుని, బలహీనతను పట్టించుకోకుండా ముందుకు కొనసాగినప్పుడు, భవిష్యత్తు భారంగా మారుతుంది. అదే మన బలం ఏమిటి? మన…
-
స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం
స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. ఈ ఆగష్టు 15, 2024 వ తేదీన దేశమంతా సంతోషంగా 77వ స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకోబుతున్నాము. మనకు 1947 ఆగష్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇది 1947లో బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలికిన ఒక ముఖ్యమైన రోజు. బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటిష్ వారితో పోరాటం చేశారు.…
-
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! మనకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. చాలా అంశాలపై కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటి అమలు చేయము. మనకు వచ్చిన ఆలోచనే ఇతరులు చేసి చూపించినప్పుడు మాత్రం, అయ్యో అది మనకొచ్చిన ఆలోచనే కదా! నేను చేయలేకపోయాను అనే భావన పొందుతాము. ఒక కొత్త ఆలోచన చేయడం మంచిదే, అది ఉపయోగపడేది అయితే, దానిని ఆచరించి చూడడం వలన ప్రయోజనం ఉంటుంది. కానీ కేవలం…
-
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? సున్నితంగా వ్యవహరించవలసిన సమస్య అంటారు. ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉంటారు. తమ ముందు ఉన్నవారు చేస్తునది తాము చేయాలనుకుంటారు. కాబట్టి పిల్లలకు చెప్పడం కన్నా ఆదర్శంతంగా నడుచుకోవడమే చాలా చాలా ప్రధానం. అంతేకానీ మనం చేస్తున్న తప్పులు వారికి తెలుస్తుంటే, వారికి చెప్పడం అసాధ్యమే. అనుకరించడం అనేది పిల్లలలో ఉండే ప్రధాన గుణం. అలా అనుకరించే గుణం లేకపోతే పిల్లలు ఎలా ఎదుగుతారు? కావునా పిల్లలకు మనం ఏం…
-
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? వ్యక్తి జీవితంలో పాఠశాల ఒక గుడి వంటిది. ఎందుకంటే వ్యక్తి జీవితంలో సాధించిన అభివృద్దికి పునాది పడేది, పాఠశాలలోనే. ఒక వ్యక్తి సమాజంలో గొప్ప పారిశ్రామికవేత్త అయితే, అందుకు అతనికి పునాదులు పడేది పాఠశాలలోనే. మరొక వ్యక్తి మంచి వైద్యుడిగా పేరు సంపాదిస్తే, అందుకు అతనికి పునాది పాఠశాలలోనే. ఇంకొకరు ఒక ఐఏఎస్ అధికారి అయితే, అందుకు పాఠశాల విద్య, అందులో క్రమశిక్షణ అతనికి పునాది… కావునా…
-
వేచి ఉండడాన్ని నిర్వచించండి
వేచి ఉండడాన్ని నిర్వచించండి అంటే ఇంగ్లీషులో అర్ధం వెయిట్ చేయండి అంటారు. ఏదైనా భావోద్వేగం ప్రదర్శించే సమయంలో కానీ, ఏదైనా వింటున్నప్పుడు భావావేశం పొందుతున్నప్పుడు కానీ ఓపిక పట్టండి అనే భావం వచ్చే విధంగా వేచి ఉండండి అంటారు. ఇంకా మరొకరి కోసం వేరు ప్రదేశానికి వెళ్లినప్పుడు కూడా వెయిట్ చేయండి అని చెప్పడానికి వేచి ఉండండి అంటారు. ఇంకా బంధాలలో కూడా ఈ మాటను ఎక్కువగా వాడుతారు. మా పిల్లవాడు మార్పులేదు లేక మా బంధువులో…
-
పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా?
పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా? ఈరోజు పవన్ కళ్యాణ్ కర్నాటక ముఖ్యమంత్రితో భేటీ అయ్యాకా, ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ అడవుల గురించిన మాటలు చర్చానీయంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న మంత్రి శాఖల్లో అటవీ శాఖ కూడా ఒక్కటి. అయితే మీడియాతో మాట్లాడుతూ ఆయన ”40 సంవత్సరాల క్రిందట సినిమాలలో హీరో అడవులను రక్షించే పాత్రలను పోషిస్తూ ఉంటే, ప్రస్తుతం సినిమా హీరో అడవులను నరికి,…
-
సన్మాన పత్రం ఇన్ తెలుగు
సన్మాన పత్రం ఇన్ తెలుగు. పదవీ విరమణ సమయంలో లభించే సన్మాన పత్రం వ్యక్తి జీవితంలో అత్యంత గౌరవమైన పత్రం. ఒక రంగంలో ఒక వ్యక్తి తన కర్తవ్య నిర్వహణలో అంకిత భావంతో చేసిన పనికి, అభించే గౌరవ పత్రం. ఈ పత్రంలో అతని పనితీరు, అతను సాధించని విజయాలు, పాటించిన ప్రమాణాలకు గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యక్తికి సన్మాన పత్రం వ్రాయడానికి… ప్రభుత్వ / ప్రవేటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్న నేపధ్యంలో…
-
దానం గురించి దానం గొప్పతనం
దానం గురించి దానం గొప్పతనం. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు… తదితరుల గురించి చెబుతూ దానగుణం గురించి పుస్తకాలలో గొప్పగా చెప్పబడుతుంది. ఎందుకు దానగుణం గురించి తెలుసుకోవాలి. సమాజంలో ఉన్నవారు, లేనివారు రెండురకాల ప్రజలు ఉంటారు. లేనివారికి, ఉన్నవారు చేసే దానం వలన లేనివారి ఆనందానికి ఉన్నవారు కారణం అవుతారు. అయితే ఇది దానం చేయాలని ఎక్కడా రూల్ ఉండదు. అది వ్యక్తి యొక్క బుద్దిని బట్టి ఉంటుంది. కనుక విద్యార్ధి దశలోనే దానం గొప్పతనం…
-
వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి?
వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి? కొందరు పెట్టి పుట్టారు అంటారు. అటువంటివారు అనుభవించడమే జీవితం అన్నట్టుగా, వారి జీవితం సాగిపోతుంది. కానీ కొందరు తప్పించి, అందరం బ్రతకడం కోసం, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. మన సమాజంలో మనకు ఒక గుర్తింపు వస్తుంది. చదువును బట్టి కొలువు, కొలువును బట్టి సంఘంలో హోదా…. ఇంకా ఆస్తిపాస్తులు, కుటుంబ ప్రస్థానం బట్టి సమాజంలో గుర్తింపు ఉంటుంది. పుట్టుకతోనో, అధికారంతోనో, ధనంతోనో వచ్చే గుర్తింపు, సమాజంలో లభించే గౌరవ,…
-
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? బహుశా కర్తవ్యం గురించి తెలుసుకోవడం అంటే, జీవిత లక్ష్యం గురిపెట్టినట్టేనని అంటారు. అలాంటి జీవితంలో కర్తవ్యం గురించి బోధించేవారు ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు తమ కర్తవ్యం తాము నిర్వర్తించడం ద్వారా, వారు పిల్లలకు కర్తవ్యపూర్వకమైన ప్రవర్తన తల్లిదండ్రులలో కనబడుతుంది. కులవృత్తి గల కుటుంబం అయితే, తండ్రి కర్తవ్యం కుమారుడు కూడా నిర్వర్తిస్తాడు. విద్యను అభ్యసించడంలో గురవు దగ్గర విద్యార్ధి కర్తవ్యతా నిష్టను తెలుసుకుంటాడు. గురువు వద్ద శిక్షణలో ప్రధానంగా శిష్యునికి కర్తవ్యం…
-
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? మహాభారతంలో ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించేవారిలో అర్జునుడు కూడా ఒకడు. అలా అందరిలో ఒక్కడిగా కాకుండా, అందరి దృష్టిని దాటి గురువు దృష్టిలో పడ్డాడు. కేవలం సాధన చేయడం, నేర్చుకోవాలనే తపన కనబరచడం, గురువు అంటే వినయంతో ఉండడం… శ్రద్దతో వినడం, ఏకాగ్రతతో సాధన చేయడం…. అర్జునుడిని మంచి విద్యార్ధిగా నిలబెట్టాయి. అందుకే విద్యను అభ్యసించడంలో అర్జునుడు ఆదర్శం అంటారు. ద్రోణాచార్యులు ఒక చెట్టుపై ఉన్న పక్షిని చూడమని కౌరవ,…
-
మహా భారతంలో ధర్మరాజు గురించి
మహా భారతంలో ధర్మరాజు గురించి, మన భారతంలో ధర్మరాజు పాండవులలో జ్యేష్ఠుడు. ధర్మమార్గం విడవకుండా ప్రవర్తించిన మహనీయుడు. అందరికీ ఆయుధాలు ఉంటే, ధర్మరాజుకు ధర్మమే ప్రధాన ఆయుధం. ముల్లోకాల్లోనూ ఎదురులేని అర్జునుడు కూడా ధర్మరాజు మాట జవదాటడు. మన మహా భారతంలో ధర్మరాజుని గురించి తెలుసుకుంటే, ధర్మం గొప్పతనం తెలుస్తుంది. ఎందుకు ధర్మరాజు గొప్పవాడు? ఎందుకంటే, ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు అంటారు. కానీ ధర్మముని ఆచరించి ధర్మరాజుగా ప్రసిద్దికెక్కాడు. అతను అజాత శత్రువు. ప్రజల మనసెరిగి…
-
సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం
సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం ఏవిధంగా ఉంటుంది? ఇది ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉండడం వలన పిల్లలపై కూడా ప్రభావం చూపగలదు. కావునా సినిమాల్లో అశ్లీలతను తొలగించాలి. ఎందుకంటే, సినిమాలు ప్రత్యేకంగా చూడరు. అందరూ కలిసి చూస్తారు. ఇంకా కుటుంబసమేతంగా సినిమాలు చూస్తారు. కనుక సినిమాలు నిర్మించేవారు తమ సినిమాల్లో అశ్లీలత లేకుండా చూడాలి. ఆకట్టుకోవడానికి అర్ధరహితంగా హీరోయిన్ అంగాంగములను శృంగారంగా చూపించడం వలన సినిమాకు కలెక్షన్లు రావచ్చును…
-
రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి?
రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి? రాజకీయాలలో మార్పులు అనివార్యం. ఎందుకంటే సమాజంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని అంటున్నారు. కానీ ఏళ్లతరబడి పరిష్కారం కాని విషయాలు అలాగే కొనసాగుతున్నాయని అంటారు. సమాజంలో మార్పును తీసుకురాగల రంగం రాజకీయ రంగం కనుక రాజకీయాలలో మార్పులు అవసరం అంటారు. ఎటువంటి మార్పు రాజకీయాలలో అవసరం అని నీవు భావిస్తావు? రాజకీయాలలో మార్పు మంచి పరిణామంగా భావించాలి. అలా భావించలేని భావజాలం రాజకీయాలలో పాతుకుపోయినప్పుడు, నేను ఖచ్చితంగా రాజకీయాలలో మార్పును…
-
రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం
పరిచయం – రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం రాజకీయాల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఎల్లప్పుడూ సమాజానికి నూతనోత్తేజాన్ని అందిస్తుంది. యువశక్తి రాజకీయాలలో చురుకుగా పాల్గొనగలుగుతారు. ఇది చైతన్యవంతమైన మరియు ప్రగతిశీల సమాజాలకు మూలస్తంభంగా ఉంది. అనేక ఉద్యమాల నుండి నేటి వాతావరణ సమ్మెల వరకు, విద్యార్థులు సమస్యలపై పోరాటపటిమను చూపుతూ, సమాజంపై చైతన్యవంతమైన ప్రభావం కనబరుస్తున్నారు. ఇంకా సామాజిక సమస్యలపై అవగాహనతో, అవసరమైనప్పుడు తమ యువగళం వినిపిస్తున్నారు. వ్యాసం రాజకీయాలలో విద్యార్థుల ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను, వారు ఎదుర్కొనే…
-
దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు
దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు మరియు లక్ష్యాలను సాధించడానికి ఒక సంస్థ లేదా వ్యక్తికి మార్గనిర్దేశం చేసే వ్యూహాత్మక రూపకల్పన. దీర్ఘకాలిక ప్రణాళికలు వలన ఉపయోగాలు ఉంటాయి. స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని, వాటిని సాధించడానికి తగిన సమయం లభిస్తుంది. ఆర్ధిక వనరులు, మానవ వనరులు మరియు బౌతిక వనరులు వినియోగించుకుని వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి దిశను నిర్ధేశిస్తాయి. భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులు గుర్తించడంలో, ఆయా పరిస్థితులకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించడంలో సాయపడతాయి. దీర్ఘకాలిక…
-
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? మహా భారతం ఇతిహాసం అంటే గతంలో జరిగినది… దానిని గ్రంధస్తం చేశారు. కాబట్టి జరిగిపోయినది. కానీ పంచమవేదంగా మహాభారతాన్ని చెబుతారు. అందులో నుండి ధర్మ సూక్ష్మములు తెలుసుకోవచ్చును అని పెద్దలు చెబుతారు. మహాభారతం గొప్పగ్రంధం అందులోని కొందరి జీవితాలను పరిశీలిస్తే, జీవితంలో ఎలా ఉండకూడదో? ఎలా ఉండాలి? వంటి కొన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని అంటారు. అలా కర్ణుడి గురించి పరిశీలిస్తే…. పాండవులకు తల్లి అయిన కుంతీదేవి, వివాహమునకు ముందే…
-
నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది?
నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది? నేరస్థులు పాలకులైతే పాలనా యంత్రాంగం భ్రష్టు పట్టిపోతుంది. వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ప్రధానంగా కార్యాచరణ ముందుకు సాగదు. అడ్డగోలు నిర్ణయాలు అమలవుతాయి. నిబంధనలు పాటించకపోవడం పరిపాటిగా మారుతుంది. ముఖ్యంగా మంచి – చెడుల గుర్తింపు మారిపోతుంది. చెడు మంచిగానూ, మంచి చెడుగానూ ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. అందరూ తాత్కాలిక సౌఖ్యం కోసమే వెంపర్లాడడం మొదలవుతుంది. మంచి మాటను పెడచెవిన పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. అందువలన ఆ ప్రాంతపు పరిస్థితులలో…
-
ఏపీకి ఏం కావాలి? అంటే
ఏపీకి ఏం కావాలి? అంటే, అభివృద్ది కావాలి. పేదలకు సంక్షేమం అందాలి. పరిశ్రమలు పెరగాలి. వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ది చెందాలి. గ్రామాలలో సౌకర్యాలు కావాలి. రోడ్లు బాగుపడాలి. వ్యవసాయానికి సమృద్దిగా నీరు కావాలి. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు కావాలి. అందరికీ శుభ్రమైన త్రాగు నీరు కావాలి…… ఏపీకి ఏం కావాలి? అంటే…. అవసరం అయిన అన్ని ఏపీకి కావాలి. 2014 విభజనలో రాష్ట్రం లోటు బడ్జెట్ తో స్తార్ట్ అయ్యింది. 2019 చివరకు ఏపీకి అప్పులు…
-
పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం
పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం, అవి విని పిల్లలు విలువలపై ఆసక్తిని పెంపొందించుకోగలరు. ముఖ్యంగా తల్లి చెప్పే నీతి కథలు పిల్లలపై మంచి ప్రభావం చూపుతాయి అంటారు. నీతి కథలు సామాజిక బాధ్యతను, సామాజిక భావనలు అర్ధం చేసుకోవడంలో పిల్లలకు సాయపడతాయి. సమాజంలో బ్రతకడానికి, సామాజిక అవగాహన అవసరమే కదా! పిల్లలపై నీతి కథల ప్రభావం? పిల్లలు నిద్రపోవడానికి మారాం చేస్తే, అమ్మ పాట పాడి నిద్రపుచ్చుతుంది. ఇంకా వయస్సు పెరిగే కొద్ది పిల్లలకు అమ్మ…
-
ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?
ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా? తెలుగు వార్తల్లో వాస్తవం ఎంత? ఒక వ్యక్తి పై గానీ, సామాజిక అంశం గురించి గానీ వస్తున్న వార్త, నిజమేనా? లేదా పుకారా? ఆ వార్తలో వాస్తవం ఎంత? సోషల్ మీడియా వాడకం పెరిగాకా, వార్తలో ఉన్న వాస్తవికత చూడడం కన్నా, ప్రచారానికి పెద్ద పీఠ పడుతుంది. రెండు పార్టీ ప్రధాన పార్టీలు ఒక ప్రాంతంలో అధికార, ప్రతిపక్ష పార్టీలుగా ఉంటాయి. ఆయా పార్టీల వారికీ కూడా వార్తలో వాస్తవం ఉందో…
-
Telugu Basic Words English Meaning
Telugu Basic Words English Meaning కొన్ని తెలుగు ప్రాధమిక పదాలు… నేను (Nēnu) – I నాకు (Naku) – For me నువ్వు (Nuvvu) – You (informal) మీరు (Mīru) – You (formal) అతను (Atanu) – He ఆమె (Āme) – She అది (Adi) – It వాళ్లు (Vāḷḷu) – They ఇది (Idi) – This అది (Adi) – That ఎవరు (Evaru) –…
-
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు? చాలా చాలమందికి తెలిసిన సమాధానమే. కానీ ఈ ప్రశ్న ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? పాఠ్యపుస్తకాలలో వచ్చే ప్రశ్న అవుతుంది. ముఖ్యమంత్రి హోదా, దాని గుర్తింపు వేరే లెవెల్ అయితే ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు కొత్తగా ఏమిటీ ప్రాధన్యత? గతంలో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వారు కొందరికి గుర్తు ఉండకపోవచ్చును. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రం చాలా ఫేమస్…. 2024 ఎన్నికల ముందు, ఎన్నికల…
-
అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?
అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది? వాన వస్తుందంటే? ఫరవాలేదు కానీ తుఫాన్ వస్తుందంటే? ఫరవాలేదు అనుకోము, జాగ్రత్తలు తీసుకుంటాము. ఒకరు అబద్దం నమ్మి మోసపోతే, అతనిని మరొకరు మోసం చేసే అవకాశం ఉండవచ్చును, కానీ ఒక ప్రాంతంలో అనేకమంది మోసపోతే, వారిని మరలా మోసం చేయడం అసాధ్యమే అంటారు. అంటే అబద్దం చెప్పి ఒకరిని కొన్ని సార్లు మోసం చేయగలరేమో, అది వ్యక్తి తెలివిపై ఆధారపడి ఉంటుంది. కానీ చాలామందిని రెండవసారి మోసం చేయడం అరుదు.…
-
అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?
అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి? అంటే పేదరికం, నిరుద్యోగం, వ్యవస్థలలో లోపాలు, రుణభారం వంటివి ప్రధానంగా చెప్పబడతాయి. కారణాలు ఏవైనా అభివృద్ది సాధిస్తే, అది ఆదర్శంగా అనిపిస్తుంది. అభివృద్ది చెందనిదిగా ముద్రపడుతుంది. వ్యక్తిగా అభివృద్ధి సాధిస్తే, ఆ వ్యక్తి కుటుంబంలో అతను ఆదర్శం. నాయకునిగా అభివృద్ది సాధిస్తే, ఆ ప్రాంతంలో అతను ఆదర్శప్రాయం. ఒక సంస్థ అభివృద్ది సాధిస్తే, ఆ సంస్థ, ఆ సంస్థలో పనిచేసేవారు, అక్కడ ఉన్న సంస్థలకు, ఇతర ఉద్యోగులకు వారు ఆదర్శం. అభివృద్ది…
-
నేటి నీ కృషి రేపటికి నీకు
నేటి నీ కృషి రేపటికి నీకు అక్కరకు వస్తుంది. ఈ రోజు పని ఈరోజే చేసేస్తే, రేపు ఇంకొక పనిని పూర్తి చేయవచ్చును. అలా కాకుండా నేటి పనిని రేపటికి వాయిదా వేస్తే, నేటి పనిని రేపు పూర్తి చేయలేకపోతే, నేడు, రేపు కూడా కాలం వృధా అవుతుంది. కాబట్టి నేటి నీ కృషి రేపటికి భరోసా అవుతుంది. అలాగే నేటి నీ పరిశీలన రేపటికి అవకాశంగా మారవచ్చును. నేడు వస్తున్న వార్తలపై నీ పరిశీలన ఉంటే,…
-
అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి
అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి పట్టించుకోకుండా ఉంటే, అది మరలా మనకే చేటు చేస్తుంది. వాస్తవాలు గ్రహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పెద్దలు అంటారు. దేని గురించి అసత్య ప్రచారాలు? వాస్తవాలు ఏమిటి? ఒక్కొక్కసారి అబద్దం ఎక్కువగా ప్రచారం అవుతుంది. అది యాదృచ్ఛికం అయితే, కావాలని అబద్దాలు ప్రచారం చేయడం అసత్యాన్ని సత్యంగా చూపించడం లేదా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా జరిగితే, ఆ సమాజంలో ప్రజలు అసత్య ప్రచారాలు, అందులోని వాస్తవికతను గ్రహించాలి అంటారు. లేకపోతే…
-
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ నాకు ఇష్టమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి దట్టమైన అడవిలో పొగమంచుతో కూడిన ఉదయం యొక్క నిర్మలమైన అందం. మహోన్నతమైన చెట్ల మందపాటి పందిరి గుండా తెల్లవారుజాము యొక్క మొదటి కాంతి, అది తాకిన ప్రతిదానిపై మృదువైన, అత్యద్భుతమైన మెరుపును ప్రసరింపజేయడాన్ని ఊహించండి. గాలి చల్లగా మరియు తాజాగా ఉంటుంది, నాచు మరియు తడి ఆకుల మట్టి సువాసనతో నిండి ఉంటుంది. ఒక మృదువైన పొగమంచు భూమికి దిగువకు వేలాడుతూ, దాదాపు…
-
చెట్టునే పండిన మామిడి పండు
మంచి ఒక చెట్టునే పండిన మామిడి పండు ఐతే, చెట్టున ముగ్గిన మామిడిపండు రుచియే… రుచి! మంచి మనసు ఉన్నవారే… ఉన్నవారు! చెట్టునే పండిన మామిడి పండు ఆత్మీయులకే అందిస్తే, మంచివ్యక్తికి మేలు జరగాలని మనసారా ప్రార్దిస్తాం…! మేలు కోసమో? మంచి అనిపించుకోవడం కోసమో? మంచితనం కలిగి ఉండడం కాదు వారికి సహజంగానే మంచి మనసు ఉంటుంది. మామిడిపండు రుచులలో చెట్టునపండిన పండు రుచి, దానిని ఆరగించినవారికే తెలియును… అలాగే మంచి వారితో స్నేహం చేసినప్పుడే మంచివలన కలిగే విలువ తెలియబడుతుంది. ఏ మామిడికాయకు ఉండదు చెట్టునే ముగ్గాలని, కానీ గాలికో, రాయికొ రాలిపోతాయి లేక చిక్కానికి చిక్కుతాయ్! ఎవరికి ఉండదు మంచి అనిపించుకోవాలని, కానీ కష్టానికో, అవసరానికో పరిస్థితులు పరాభవించవచ్చు కానీ మనిషిలో మంచి మరుగున పడదు…. అవకాశం వస్తే ఆకాశమంతా మంచితనం పంచె హృదయం మనిషిలోనే ఉంటది. కానీ కష్టంలో ఇష్టంగా మంచివైపు మక్కువతో ఉంటూ, చెట్టున ముగ్గిన పండువలె అందరిచేత మన్నన పొందే కొందరు చాలామందికి ఆదర్శం అయితే, అటువంటి వారిని లోకం ఆదరిస్తుంది. రసాలు వేరైనా చిన్నరసం రుచి మేలు, చెట్టునే పండిన ఆ పండు రుచియే రుచి… గుణాలు ఏవైనా మంచి మనసు చెడు గుణాలకు దూరంగా ఉంటుంది… మరొకరికి ఆదర్శంగా ఉంటుంది… ఆచరించమని చెప్పే ఆదర్శం మామిడికాయ అయితే ఆచరిస్తూ ఆదర్శంగా నిలవడం అంటే చెట్టునే పండిన మామిడి పండు వంటిది… భలే మామిడి పండు భాగు భాగు మా మంచి మనిషి… మేలైన మనిషి!
-
కొన్ని తెలుగు పదాలు అర్ధములు
పురోహితుడు – పురమునకు హితుడు పురోహితుడు… పురము యొక్క హితము కొరకు పూజలు చేయువారు… కలిమి: అంటే కలిగి ఉండుట… ఆస్థిపరులు, ధనవంతులుగా చెప్పబడుతుంది. శోధన: వెతుకుట అను అర్ధము వస్తుంది. సెర్చ్ చేయడం లేదా శోదించడం తనిఖీ: శోదించడం… చెకింగ్ చేయడానికి తనిఖీ అంటారు. వెంబడించడం: అంటే వెంటపడడం… వెంటాడుట తతంగం: తంతువు తారతమ్యం: తేడాలు లేదా బేధాలు తనువు: శరీరము… కాయము… మనువు: వివాహము, పెండ్లి
-
అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా?
అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా? ఎందుకు రామాయణ భారత భాగవతం వంటి పుస్తకాలు చదవాలి అంటారు. చదివే అవకాశం ఉన్నవారు తప్పక చదవాలా? అంటే మన భారతీయ సాంప్రదాయంలో పూర్వకాలపు రోజులలో ఎవరి పని వారికి ఉంటే, చదువుకున్నవారు జ్ఞానం గురించి చెప్పేవారని అంటారు. ఇక ఆ కాలంలో పనుల చేసి అలసిన ప్రజలు రామాయణ భారతాలు వింటూ ఉండడం ఒక అలవాటుగా ఉండేది అంటుంటారు.. ఆకాలంలో అలా ఉంటే, ఆనాడు అక్షరజ్ఞానం ఉన్నవారు తక్కువగా…
-
సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని
సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని కలిగి ఉంటే, అలా సమస్యకు పరిష్కారం ఆలోచించేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. సమస్య కలిగిన వారు పరిష్కారం సూచించగలిగేవారి మధ్య ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సమాజంలో సమస్యలకు కొదువ ఉండదు. సమస్య లేని జీవితం ఉండదు. కాబట్టి పరిష్కారం చుట్టూ సమస్య ఉన్నవారి ఆలోచన ఉంటుంది. డాక్టర్ చుట్టూ రోగి తిరిగినట్టుగా, పరిష్కారం చుట్టూ సమస్య తిరుగుతూ ఉంటుంది. సానుకూలంగా ఆలోచించగలిగే తత్వంలోనే పరిష్కారపు ఆలోచనలు తడతాయని అంటారు. ఒక విద్యార్ధి సానుకూల దృక్పధంతో వైద్యశాస్త్రమును సావధానంగా పరిశీలించి, పరిశోధించి సాధన చేస్తే, మంచి డాక్టర్ కాగాలగినట్టుగా సమస్యలను సానుకూల దృక్పదంతో అలోచించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని అంటారు. చదువులలో సారం గ్రహించి, సమాజంపై పరిశీలన చేసి, గ్రూప్ పరిక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించినవారు గొప్ప అధికారిగా మారినట్టు, సమాజంలో సమస్యలపై అవగాహన ఏర్పరచుకుని, ఆ సామజిక సమస్యలపై తన చుట్టూ ఉన్నవారికి అగవగాహన కల్పిస్తూ, ప్రజలకు మంచి భవష్యత్తు కోసం, ప్రజలను తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడే విధంగా ప్రోత్సహించగలిగేవారు నాయకులుగా ఎదగగలరు. ఏదైనా పరిష్కార ధోరణితో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఉండేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. చాణక్య నీతి ఇప్పటికీ ప్రసిద్ది… వాటిని అనుసరించి ఆలోచన చేయడం ద్వారా పరిష్కార ధోరణి అలవాటు అవుతుంది అంటారు. ఆలోచన ఊహగా ఉంటే, ఆచరణ ఫలితం ఇస్తూ ఉంటుంది. ప్రతి ఆలోచన ఆచరణ సాద్యం కాకపోవచ్చు.…
-
తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, సాధించలేనిది ఏముంటుంది?
సాహిత్యం గురించి చదువుతూ చదువుతూ అది అలవాటుగా మారి చదివి చదివి అది ఒక తపస్సు అయితే, అలా చదివినవారు మరొక పుస్తకం సృష్టించే స్థాయికి చేరగలరు… లేదా ఒక విషయాన్ని విపులంగా అర్ధవంతంగా పదిమందికి వివరించి ప్రసంగించగలరు. చదవడం ఒక తపస్సు అయితే, అలా తపస్సు చేసినవారు గురువుగా మారగలరు. ఒక విషయంలో తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, ఆ విషయం ఆ వ్యక్తి చేత సాధించబడుతుంది. సమాజంపై ప్రభావం చూపించే అనేక వస్తువుల…
-
నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం
నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం! విద్యాలయంలో విద్యను బోధించే ఉపాధ్యాయుడి ప్రభావం ప్రతి వ్యక్తిపై బాల్యంలోనే పడుతుంది. ఉపాధ్యాయుడు ఏమి విద్యార్ధులకు బోధిస్తాడో, విద్యార్ధులు దానిని మనసులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంతకన్న ముందు ప్రతి వ్యక్తికి అప్యాయతను, అమృతమైన ప్రేమను పంచే అమ్మ తొలి గురువుగా ఉంటుంది. తర్వాత తండ్రి ఆదర్శవంతంగా గురువుగా ఉంటాడు. ఇది ఇప్పటి నుండి ఉంది కాదు. పురాణాలలో కూడా మనకు ఋషుల సంప్రదాయం గమనిస్తే కనబడుతుంది. వ్యాసుడు, పరాశరుడు, శక్తి,…
-
కంగనా కంగుమనిపించే కామెట్ 1947లో స్వాతంత్ర్యం కాదు భిక్ష అని…
కంగనా కంగుమనిపించే కామెట్ 1947లో స్వాతంత్ర్యం కాదు భిక్ష అని… ఈ క్రింది లింకును క్లిక్ చేసి, న్యూస్ పేపరులో వచ్చిన న్యూస్ ఆర్టికల్ చదవండి… అందులో కంగనా రనౌత్ స్టేట్ మెంట్ మరియు ప్రతి కామెంట్స్ వ్రాయబడి ఉంది. కంగనా కంగుమనిపించే కామెంట్ 1947లో వచ్చింది. కానీ ఇప్పుడు ఎవరు ఏమి కామెంట్ చేసిన మన పూర్వికులంతా కలసి సాధించిన విజయంగా 1947 ఆగష్టు పదిహేను నుండి స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకుంటున్నాము. తర్వాతి కాలంలో పరిపాలన…
-
పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి?
పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి? ఆస్తులు కాదు విలువలు అని ఉపరాష్ఠ్రపతి వెంకయ్యనాయుడుగారు అంటారు. నెల్లూరు వెంకటాచలంలో జరిగిన మీటింగులో వెంకయ్యనాయుడు గారు కేవలం ఆస్తులే కాదు సేవాదృక్పధం పిల్లలకు వారసత్వంగా అందించాలని అన్నారు.
-
దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం
దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం. ఒకేసారి రెండు భావనలు అంటే అద వ్యతిరేక భావనగా భావింపడుతుంది. అయితే కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ఆలోచన వివిధ కోణాలలో ఉండాలని అంటారు. నిజాన్ని అబద్దం అల్లుకుని ఉంటే, అబద్దమునకు ఆర్భాటం ఎక్కువ కాబట్టి కళ్ళకు ముందుగా అబద్దమే కనిపించవచ్చును. చెవులకు ముందుగా అబద్దమే వినబడవచ్చును. పదే పదే అబద్దమే చూడడం లేదా వినడం వలన మననోటి నుండి కూడా అబద్దమే బహిర్గతం అవుతుంది. సహజంగా నిజమంటే…
-
మన మహనీయుడు పొట్టి శ్రీరాములు
మన మహనీయుడు పొట్టి శ్రీరాములు. కనిగిరి ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుటుంబం వ్యాపారరీత్యా మద్రాసులో స్థిరపడింది. ఆయన బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజా సేవ చేసేవారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. ఆరునెలలు జైలు శిక్ష అనుభవించారు. అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయన మరణించడంతో ఆంధ్రదేశం ఆందోళనలతో అట్టుడికింది. అప్పుడు కేంద్రం ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించింది. కర్నూలు…
-
పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు
పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రతి బడిలో ప్రార్థనా సమావేశంలో ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ వినిపిస్తుంది. దానిని రాసిన సుబ్బారావుగారు ఆంధ్రుడే. పిల్లల్లో దేశభక్తిని కలిగించడానికి ఆయన రాసిన ఈ ప్రతిజ్ఞ అన్ని పాఠ్య గ్రంథాల్లో ఉంటుంది. నల్గొండ జిల్లాలో జన్మించిన ఆయన అనేక పుస్తకాలు రచించారు. కావ్య నాటకాలు రాశారు.
-
శ్రీ శ్రీ మన మహనీయుడు
శ్రీ శ్రీ మన మహనీయుడు ఆధునికతకు విరాట్రూపం శ్రీశ్రీ. ఇంటిపేరు, ఒంటి పేరుల్ని క్లుప్తీకరించి అణువుల్లా పేర్చుకోవటంతో పేట్రేగిన ఆధునికత ఆపై కవిత్వమై పేలింది.‘తెలుగు సాహిత్యం’పై శ్రీశ్రీదే అసలైన ‘ముద్ర’. తెలుగు కలాల్లో జడపదార్థాలూ, చైతన్య పదార్థాలూ సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్కముక్కలో చోదకశక్తి. మరో ప్రపంచం కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగు రేకలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంతశక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. ప్రాచీన కవులూ, ప్రబంధ కవులూ శబ్ద…
-
మన మహనీయుడు శంకరంబాడి సుందరాచారి
మన మహనీయుడు శంకరంబాడి సుందరాచారి నిరాడంబరంగా కనిపిస్తూ తెలుగు జీవనం గురించి అనర్గళంగా ఉపన్యసించే గొప్ప వక్త ‘సుందరాచారి. ఆయన రచించిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అనేది మన రాష్ట్ర గేయంగా స్వీకరించారు. చిత్తూరు జిల్లాలో జన్మించిన ఆయన అనేక గ్రంథాలు రాశారు. తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహం ఉంది. ఇటువంటి గొప్పవారి చరిత్రలు తెలుసుకోవాలి. వారిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని దిద్దుకోవాలి.
-
మన మహనీయుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
మన మహనీయుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు. సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ…
-
మన మహనీయుడు గుఱ్ఱం జాషువా
మన మహనీయుడు గుఱ్ఱం జాషువా ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. ఈనాడు సంఘసంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు. తెలుగు ప్రజల కవి. భాషా చంధస్సులో భావ కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన…
-
మన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు
మన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు…
-
దామోదరం సంజీవయ్య మన మహనీయుడు
దామోదరం సంజీవయ్య మన మహనీయుడు దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన…
-
మన మహనీయుడు గురజాడ
సాహిత్య విమర్శకుడుగా గురజాడ‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది… నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో…
-
భోగరాజు పట్టాభి సీతారామయ్య మన మహనీయుడు
భోగరాజు పట్టాభి సీతారామయ్య మన మహనీయుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. డాక్టర్గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్ను స్థాపించారాయన. 1906లో…
-
మాడపాటి హనుమంతరావు మన మహనీయుడు
ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు : తెలుగు గడ్డను నైజాం పాలకులు ఏలుబడి కొనసాగుతున్న రోజుల్లో పారతంత్య్రంలో మగ్గిపోతున్న తెలుగుజాతిని మేల్కొలిపి వారిలో జాగృతి కలిగించి, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుల్లో ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ప్రథమ స్థానం వహిస్తారు. నిజాం పాలనలో ఉర్దూ, గోండు భాషలు తప్ప తెలుగు భాషకు తెలంగాణాలో గౌరవంలేని రోజుల్లో ‘మేం ఆంధ్రులం’ అని చెప్పగలిగిన ధైర్యశాలిగా మాడపాటి హనుమంతరావు కీర్తించబడ్డారు.
-
మన మహనీయుడు త్యాగరాజు శాస్త్రీయ సంగీత చక్రవర్తి
మన మహనీయుడు త్యాగరాజు శాస్త్రీయ సంగీత చక్రవర్తి శాస్త్రీయ సంగీత రారాజు త్యాగరాజు త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. సంగీతం అంటే కొంచెం తెలుసున్న వారెవరైనా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక…
-
మన మహనీయుడు గరిమెళ్ళ సత్యనారాయణ
“మాకొద్దీ తెల్ల దొరతనం” అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి… “దండాలు దండాలు భారత మాత” అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. అలాగే ” దండాలు దండాలు భారత మాత ‘ అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి…
-
ఎల్.వి.ప్రసాద్ మన మహనీయుడు
మన మహనీయుడు ఎల్.వి.ప్రసాద్ ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎల్.వి. ప్రసాద్ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు. హిందీ, తమిళ, తెలుగు,…
-
మన మహనీయుడు ఘంటసాల
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు (1922, డిసెంబర్ 4 – 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడం, మళయాళం, సింహళం, చివరకు హిందీలో కూడా పాడారు.
-
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఏమిటి?
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఏమిటి? ఎవరు గెలుస్తారు? ఎవరు ఓటమి పాలవుతారు? దేశంలో లోక్ సభ ఎలక్షన్స్ తో బాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా ఇంకా ఎలక్షన్స్ జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడే రావు, కానీ అంచనాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరు గెలిచేది? కూటమా? వైసిపినా? 2024లో కేంద్రంలో ప్రధాని మోడీ అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు…
-
సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం ఏమిటి?
సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం ఏమిటి? లైంగిక విద్య(సెక్స్ ఎడ్యుకేషన్) స్త్రీ మరియు పురుష కలయిక గురించి మరియు ఇద్దరి మద్య ఉండే ఆకర్షణ గురించి అవగాహన తీసుకురావచ్చును. పునరత్పత్తి గురించి సెక్స విజ్ఙానం తెలియజేస్తుంది. ఈ జ్ఞానం వారి లైంగిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా ప్రజలను అవగాహన ఏర్పరస్తుంది. సహజంగానే యవ్వనంలోకి వచ్చిన యువతీ, యువకుల మనసులలో అనేక సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే వారి వారి శరీరములో అంగముల మార్పు…
-
సామాజిక విశ్లేషకుల మాటలు సమాజంపై
సామాజిక విశ్లేషకుల మాటలు సమాజంపై, ప్రభావం చూపితే, వారు మాటలు వ్యక్తి మెప్పు కోసం కాకుండా, సామాజిక శ్రేయస్సు కోసం మాట్లాడాలని అంటారు. జనం మెచ్చిన నాయకుడి మాట జనం మదిలోకి బలంగా వెళుతుంది. కావునా జనం మెచ్చిన నాయకులు లేదా సామాజిక విశ్లేషకుల మాటలపై ప్రజలకు గురి ఉంటుంది. అందుకే జనం మెచ్చిన నాయకుడి ఆలోచన ప్రధానంగా సామాజిక శ్రేయస్సుపై దృష్టి ఉంటే, సామాజిక విశ్లేషకుల ఆలోచన ప్రస్తుత విధానాలు భవిష్యత్తులో సమాజంపై ఎటువంటి ప్రభావం…
-
సనాతన ధర్మం తెలుగు బుక్
సనాతన ధర్మం తెలుగు బుక్. భారతదేశంలో సంస్కృతిని సనాతన ధర్మం ఆధారంగానే ఆచారం నడిచిందని పెద్దలు అంటూ ఉంటారు. పెద్దల మాటలలో సనాతనం అంటే పురాతనం, అతి ప్రాచీనం, అనాదిగా ఉన్నది. ఎప్పటి నుండో ఉన్నది అని అంటూ ఉంటారు. కుటుంబ సంప్రదాయం కుటుంబ పెద్దల ద్వారా తర తరాల నుండి ఆచారం కొనసాగుతూ ఉంది అంటారు. ప్రప్రధమంగా ఋషుల చేత తెలియబడిని ఈ సనాతన ధర్మం భారత దేశ కుటుంబ సంప్రదాయంలో మిళితమై ఉంది. అటువంటి…
-
ధర్మ సందేహాలు సమాధానాలు బుక్ pdf
ధర్మ సందేహాలు సమాధానాలు బుక్ pdf తెలుగులో ధర్మ సందేహాలు తెలుగుబుక్ పిడిఎఫ్ రూపంలో ఆన్ లైన్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును. ఉచితంగా లభించే ఈ బుక్ మనకు ఉండే సందేహాలకు సమాధానాలు అందించవచ్చును. ధర్మము మనిషి ఆచరిండం వలన అతని జీవితములో తాను చేరవలసిన గమ్యమును తాను చేరడమే కాకుండా, తనను అనుసరించేవారికి కూడా ధర్మముపై ఆసక్తిని పెంపొందించగలరు. కావునా ధర్మమును గురించి అనేక పుస్తకాలు మనకు అందిస్తూ వచ్చారు. మనిషి జీవితానికి ధర్మమే…
-
మను స్మృతి తెలుగు బుక్
మను స్మృతి తెలుగు బుక్, కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరయుగంలో శంఖలిఖితస్మృతి, కలియుగంలో పరాశరస్మృతి ప్రామాణికంగా పరిగణించబడ్డాయని అంటారు. మనిషి జీవిత పరమార్ధమును సాధించడానికి, మనిషికి కాలస్వరూపుడు ఇచ్చినది ధర్మమే… ధర్మమునే శాస్త్రరూపంలో ఋషులు తెలియజేయడం జరిగింది. మన భారతీయ సనాతన ధర్మములో ధర్మమే మూలం. రాముడు రాశీభూతమైన ధర్మముగా చెప్పబడతాడు. అటువంటి ధర్మములో స్మృతులు మనకు ప్రమాణంగా చెబుతారు. ధర్మముగురించి తెలుసుకోవాలంటే, ఉన్న స్మృతులలో మనుస్మృతి ప్రాచీనమైనదిగా చెబుతారు. కానీ కాలక్రమంలో పరాశరస్మృతి ప్రస్తుతం…
-
రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు
రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు రాముడు సీతారాముడు మన సీతారాముడు దశరధుడి పెద్ద కుమారుడు లక్ష్మణ, భరత, శతృఘ్నులకు అన్నగారు, ఆంజనేయుడి ఆరాధ్యదైవం మన సీతారాముడు. దశరధ రాముడు, జానకి రాముడు అంటూ పాటలు పాడినా, కధలు చెప్పుకున్నా, రాముణి గుణాలు గురించి విన్నా అది మనసుకు బలం అవుతుంది. ఎందుకంటే రాముడు అంటే ధర్మం. రాముడు అంటే రాశిభూతమైన ధర్మము. ధర్మము పూర్తిగా జీర్ణమైన సీతారాముడు, ఆదర్శప్రాయుడు. జయ జయ రామ జానకి రామ, దశరధ…
-
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగం
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, 1891 నుండి 1956 వరకు జీవించిన ప్రముఖ భారతీయ న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు సంఘ సంస్కర్త. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ భారతదేశ రాజ్యంగముని రచించినవారిలో ముఖ్యులు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించారు. సామాజిక న్యాయం కోసం నిబంధనలను చేర్చేలా రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో గణనీయమైన కృషి చేశారు. అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఎదిగారు. 1950లో అమల్లోకి వచ్చిన…
-
అహంకారం అంటే ఏమిటి
అహంకారం అంటే ఏమిటి? తనపై తనకు విశ్వాసం కలిగి ఉంటే, ఆత్మవిశ్వాసం అంటారు. ఇది అందరికీ ఉండవలసిన అవసరమైన గుణం. తనంతటివాడు లేడనుకోవడం గర్వం. ఇది ఎప్పటికైనా భంగపడే గుణం అంటారు. ఇంకా అన్నింటికి అంగీకరించకుండా తనకు తెలిసినది, తనవలననే అవుతుంది. అన్నింటిని నేనే చేస్తాను అనే బలమైన భావనను అహంకారంగా అంటూ ఉంటారు. అంటే అహంకారులకు అంతగా స్నేహితులు కూడా ఉండరు. శత్రువుతు ఎక్కువగానే ఉంటారు. కాబట్టి అహంకారం ఉండకూడదని అంటారు. అహం అంటే గుర్తింపు,…
-
నీ అక్షరం మీద పేర్లు
నీ అక్షరం మీద పేర్లు, nee akshara meeda Telugu perlu, ni aksharam meeda Telugu perlu నీతో తెలుగు పేర్లు, ని, నీతో అమ్మాయి పేర్లు నిశ్చల, నిరుక్త, నిశ్చిత, నివిత, నిత్యశ్రీ, నీలమణిశ్రీ, నీరజ, నీల, నీలిమారాణి, నీలిమాదేవి, నీలాదేవి, నీలజాక్షి, నీలమణి, నీలవేణి, నీరజాక్షి, నీలిమా నీతా, నీతా కుమారి, నీరజశ్రీ, నిహారిక, నీరజారాణి, నీతిక, నీతు, నీతుచంద్రిక, నిధిత, నిధిశ్రీ, నీలశ్రీ, నీలలోహిత, నివేదిత, నీరజాదేవి, నిరుపమ, నీలకంఠ, నీతాశ్రీ,…
-
సిద్ధం మీనింగ్ ఇన్ ఇంగ్లీషు
సిద్ధం మీనింగ్ ఇన్ ఇంగ్లీషు, siddham meaning in english, siddham మీనింగ్ ఇన్ తెలుగు, సిద్ధం అంటే ఏమిటి? సిద్ధం గురించి తెలియజేయండి. కొన్ని తెలుగు పదాలు ఇంగ్లీషులో చెబితే, తెలుగులో అర్ధం అవుతూ ఉంటాయి. అంటే మనకు తెలుగుతో పాటు ఇంగ్లీషు పదాలు కూడా వాడుకలో అలవాటు అయిపోయాయి. సిద్ధం అంటే ఇంగ్లీషులో ప్రిపేర్ అని అర్ధం. యుద్ధానికి సిద్ధపడ్డారు అంటారు. ప్రత్యర్ధులు తలపడే సమయానికి ముందు చేసే ప్రక్రియని సిద్ధం అంటారు. లేదా…
-
ఛాయాచిత్రం meaning in Telugu
ఛాయాచిత్రం meaning in Telugu ఛాయ అంటే నీడ, చిత్రం అంటే ఫోటో లేదా ఇమేజ్… ఛాయాచిత్రం షాడో ఇమేజ్ అని అర్ధం. నీడ యొక్క ఫోటో అంటారు. ఇది గ్రీకు ఫోటోగ్రఫిలో కాంతితో గీయడం అంటారు. కాంతిని గుర్తించు ఉపరితలం ఛాయాచిత్రం అంటారు. నెగటివ్ ను ఛాయాచిత్రం అంటారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు? ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి. ప్రణాళిక అంటే…
-
పురోగతి meaning in telugu
పురోగతి meaning in telugu, Purogathi meaning in english, పురోగతి meaning in english, progress meaning in telugu, పురోగమనం అంటే అర్ధం, పురోగమనంతో అభివృద్ది చెందిన ప్రాంతము లేదా పురోగమనంతో అభివృద్ది సాధించిన వ్యక్తి, అంటే ఉన్న స్థితి నుండి జారిపోకుండా తిరిగి పుంజుకుని మరలా తన స్థానాన్ని దాటి అభివృద్ది చెందడం లేదా సాధించడాన్ని పురోగతి పదంతో సంభోదిస్తూ ఉంటారు. గమనంలో పతనం అవుతున్న దశను తిరోగమనం అంటారు. దీనికి వ్యతిరేకం…
-
ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు
2024 ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికలలో మూడు పార్టీల పొత్తులో భాగంగా తొలి బహిరంగ సభలో ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్…. ఏపి రాష్ట్ర రాజకీయాలలో 2024 ఎన్నికలలో పొత్తు పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి తరపున తొలి సభ చిలకలూరిపేటలో ప్రజాగళం సభ ప్రారంభం అయ్యింది. పల్నాడులో పొత్తు పార్టీల ప్రజాగళం సభలో మూడు పార్టీల నుండి ప్రముఖుల హాజరు అయ్యారు. అశేష జనాభా…
-
నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి?
నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి? నేను ఎవరికి ఓటు వేయాలి? ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి? రాజకీయ కారణాలతో ఎవరికి ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలి? ఎవరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలలో ప్రధానంగా ప్రచారం చేస్తున్న అంశాలు ఏమిటి? ఆ ప్రచారంలో వాస్తవాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నికల వేళలో పరిశీలించారా? ఐదేళ్లకు ఒక్కమారు ఎన్నికలు జరుగుతాయి. అలా జరిగిన ఎన్నకలలో గెలిచిన రాజకీయ పార్టీ, ఐదేళ్ల కాలం పాటు ప్రజలను…
-
భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము
భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము. భారత స్వాతంత్ర్యం వచ్చాక, దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ప్రజల తీర్పును గౌరవించిన అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అదుకు తగినట్టుగా తమ వంతు పాత్రను పోషించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఓటరు విభిన్నంగా తీర్పులు చెప్పిన సందర్భములు కూడా ఉన్నాయి. కేంద్రంలో అధికారం అందించిన పార్టీకి, ప్రాంతీయంగా ఓటమి తప్పలేదు. అలా ఓటరు ఏవిధంగా తమ తీర్పును చెప్పినా భారతదేశంలో రాజకీయ…
-
ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?
ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి? ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేదా? ఇదే ప్రధానాంశంగా ఉంటుందని అంటారు. సాదారణంగా ప్రజలు ఒక రాజకీయ పార్టీని చూసి ఓట్లేసేది, తమ ప్రాంతము లేదా తమ సామాజిక వర్గము అభివృద్ది చెందుతుందని ఆశించి ఓటు వేస్తారు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన అభివృద్దే, ఎన్నికల వేళలో ప్రజలపై ప్రభావం చూపే అంశంగా మారుతుంది. అధికార పార్టీ పాలన చేత…
-
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర, సమాజాన్ని శాసించేగలిగే స్థాయిలో రాజకీయ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే, దేశంలో లేదా రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా, సదరు రాజకీయ పార్టీ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ విధానలే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సమాజంపై ప్రభావం చూపుతాయి. ప్రజలలో చైతన్యం తేవడానికి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రభావం చూపగలదు. అలాగే ప్రతపక్షంలో ఉన్న ఇతర చిన్న…
-
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు? సమాజంలో జరుగుతున్న విశేషాలను, సమాజంలో జరుగుతున్న పరిణామాలను, సమాజంలోని అధికార, ప్రతిపక్ష నేతల నిర్ణయాలను, సమాజంలో వస్తున్న మీడియా వార్తలను నిశితంగా పరిశీలిస్తూ, సామాజిక శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తూ, తమ అభిప్రాయాలను సమాజంలోని ప్రజలకు తెలియజేయడానికి ఉత్సాహం చూపించే వారిని సామాజిక విశ్లేషకుడు అంటారు. వీరు ఎక్కువగా మీడియాలో వస్తున్న సమాచారాన్ని పరిశీలించి, తమ అభిప్రాయలను తెలియజేస్తూ ఉంటారు. వీరు ఏ పార్టీని సమర్ధించడం ఉండదు. వీరు ప్రజల కోసం…
-
ఓటు హక్కు వజ్రాయుధం ఎలా?
ఓటు హక్కు వజ్రాయుధం ఎలా? ఓటు దేశ ప్రజలకు దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సర్వ స్వతంత్రంగా ఓటరుకు నచ్చిన నాయకుడికి ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంది. కాబట్టి ఓటు వ్యక్తి వజ్రాయుధం వంటిది. నీవు ఓటేస్తే, నాయకుడుకి అధికారం ఉంటుంది. అధికారం కోసం ఓటరు వద్దకు నాయకుడు వచ్చి మాట్లాడుతారు. అప్పుడు నీవు ఆశించే ప్రయోజనం సామాజిక ప్రయోజనం అయి ఉంటే, అది నీ ప్రాంతపు అభివృద్ది తోడ్పడుతుంది. ఓటరు కష్టములు తీర్చుతామని ఎన్నికల…