భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది.

భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది. భక్తీ, ముక్తికి భగవద్గిత మనసుకు ఔషధం వంటిది అని అంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

మహాభారతములో భీష్మ పర్వములో ప్రారంభం అయ్యే భగవద్గీత ఒక ప్రత్యేక గ్రంధంగా ప్రసిద్ది చెందింది.

భగవద్గీత ఉపనిషత్తుల సారమని అది జీవితానికి దిశా నిర్దేశం చేయగలదని అంటారు. భక్తీ భావనతో గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు ప్రోత్సాహకంగా ఉంటుంది. భగవద్గీత చదువుతూ, చిత్తశుద్దితో జీవించడం పాపహరణకు ఒక మార్గమని పెద్దలు చెబుతారు.

మనిషి జీవనంలో యోగం ఉంటుంది. మనిషి జీవించే క్రమంలో కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు ఉంటాయి.

భగవానుడు అర్జునునిడికి బోధించిన భగవద్గీతలో ఆత్మ తత్వము, జీవన కర్తవ్యము – కర్మ, జ్ఞానము, భక్తి, యోగ సాధన, భగవత్తత్వము, శ్రద్ధ, గుణ విభాగము తదితర విషయాలు ప్రస్తావించబడతాయి.

అనేక మంది మహానుభావులు భగవద్గీతను రీడ్ చేయడం ఒక అలవాటుగా పెట్టుకుంటారు. ఎక్కువ మంది భగవద్గీతను జ్ఞానం కొరకు చదువుతూ ఉంటారు.

స్వాతంత్ర్య ఉద్యమం దేశమంతా వ్యాప్తి చెంది, దేశాన్ని ఒక తాటిపై నిలబెట్టిన మహాత్మా గాంధి కూడా భగవద్గీత పారాయణం చేసినట్టు ఆయన రచనలే చెబుతాయి.

వ్యక్తిలో స్ఫూర్తిని రగిలించే శక్తి భగవద్గీత పఠనం వలన వస్తుందని అంటారు

“నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.”

— మహాత్మా గాంధీ

జ్ఞానం అందించే భగవద్గీతలో విభాగాలు ఉంటాయి. అవి ఈ క్రింది యోగములుగా చెబుతారు.

అర్జునవిషాద యోగము
సాంఖ్య యోగము
కర్మ యోగము
జ్ఞాన యోగము
కర్మసన్యాస యోగ:
ఆత్మసంయమ యోగము
జ్ఞానవిజ్ఞాన యోగము
అక్షరపరబ్రహ్మ యోగము
రాజవిద్యారాజగుహ్య యోగము
విభూతి యోగము
విశ్వరూప సందర్శన యోగము
భక్తి యోగము
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
గుణత్రయవిభాగ యోగము
పురుషోత్తమప్రాప్తి యోగము
దైవాసురసంపద్విభాగ యోగము
శ్రద్దాత్రయవిభాగ యోగము
మోక్షసన్యాస యోగము 

ఎరుకలో ఉన్నవాడికి పొంచి ఉన్న ప్రమాదంపై అవగాహన ఉంటుంది. పాములు పట్టేవానికి పాముల గురించి బాగుగా ఎరుకలో ఉంటుంది. కావున అతను పామంటే భయపడడు. అలాగే జీవన పరమార్ధం ఎరుకలో ఉన్న వ్యక్తికి, బాధించే విషయాలు ఉండవని అంటారు.

భగవద్గీత వలన విషయ వాసనలు నశించి, విషయములకు ఆలవాలమైన మనసు గురించి మనసే ఆలోచన చేయడమే ఒక అద్బుతమని అంటారు.

మనసు అనేది మననము వలన దుఃఖము, సుఖము తెచ్చుకుంటుంది అంటారు. సుఖదుఃఖాలు మనసుపై ప్రభావం చూపుతూ ఉంటాయి. సుఖంగా ఉంటే సంతోషం, దుఃఖంగా ఉంటే విచారం…

విషయాల వలన విచారం ఎక్కువయ్యే మనసుకు భక్తిభావన ఒక ఆలంబనగా ఉంటుందని అంటారు. భక్తితో ఆలోచన చేసే మనసు శాంతిగా శోచించడం అలవాటు చేసుకోగలుగుతుందని అంటారు.

భక్తి భావన భగవద్గీత రీడ్ చేయడం ద్వారా కూడా పెంపొందించుకోవచ్చు. భక్తితో మెదిలే మనసులో వ్యగ్రత కన్నాశాంతస్వభావం పెరుగుతుంది.

మనసులో భక్తి భావనలు పెంచుకునే ప్రక్రియలో భగవానుడు బోదించిన భగవద్గీతను చదువుకోవడం మంచి అలవాటుగా చెబుతారు.

భగవద్గీతకు సంబంధించిన వివిధ పుస్తకాలు ఆన్ లైన్లో రీడ్ చేయడానికి లేదా మీ ఫోనులో పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయడానికి ఈ క్రింది బట్టన్ పై క్లిక్ చేయండి.

భక్తి భావనలు

తెలుగురీడ్స్

భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు.