Tag Archives: విశ్వామిత్ర మహర్షి

గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి.

నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి సద్గురువులకు ఆలవాలం మన భారతదేశం. మన భారతీయ గురువులు దార్శినికత ఎంతో గొప్పదిగా పండితులు చెబుతూ ఉంటారు. వారు భవిష్యత్తును తమ మనో నేత్రంతో దర్శించి, భారతీయులకు అవసరమైన భక్తితత్వం, ఆత్మతత్వం, యోగ విజ్ఙానం వంటివి అందించారని చెబుతారు.

బ్రహ్మమును తెలియగోరువారికి బ్రహ్మము తెలిసిన వారి మార్గదర్శకము తప్పనిసరిగా చెబుతారు. పరబ్రహ్మ కాల స్వరూపంగా ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తాడో తెలియదు. కాలస్వరూపుడు కాలంలో కలిగజేసే కష్టకాలం పరీక్షా కాలంగా చెబుతారు. అటువంటి పరీక్షాకాలం గట్టెక్కాలంటే, సరైన గురువు అనుగ్రహం వలన సాధ్యమంటారు. గురువు అనుగ్రహం ఉంటే ఈశ్వరానుగ్రహం కలిగినట్టేనని పండితులు అంటారు.

గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ లో గురువిజ్ఙాన సర్వస్వము తెలుగు ఉచిత పుస్తకము ఆన్ లైన్లో లభిస్తుంది. ఇందులో శ్రీకృష్ణం వందే జగద్గురుమ్, శ్రీ దక్షిణామూర్తి స్త్రోత్రమ్, శ్రీశంకరాచార్య కృత గుర్వష్టకమ్, శ్రీ గురు పాదుకాప్త్రోత్రమ్ తదితర గురుస్త్రోత్రాలతో బాటు వాటి భావములను తెలియజేస్తూ ఈ తెలుగుబుక్ ఉంటుంది. గురువిజ్ఙానమునకు సంబంధించిన స్త్రోత్రములు ఎక్కువగా ఈబుక్ లో ఉంటాయి. గురువిజ్ఙాన సర్వస్వము తెలుగు ఫ్రీ పిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

విశ్వామిత్ర మహర్షి అంటే కోపం గుర్తుకు వస్తుంది అంటారు, కానీ అంతే స్థాయిలో పట్టుదల కూడా ఎక్కువే, తనపై తనకు ఉండే అచంచలమైన విశ్వాసముతో బ్రహ్మ, మహేశ్వరులను మెప్పించగలిగాడు. అనేక సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. వశిష్ఠ మహర్షిపై కోపంతో, తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారిన మహారాజు చరిత్ర అమూల్యమైనదిగా చెబుతారు. ఈ మహర్షి సత్యహరిశ్చంద్ర మహారాజుని ముప్పుతిప్పలు పెట్టి, సత్యహరిశ్చంద్రుడి కీర్తిని ఆచంద్రతార్కమునకు విస్తరింపజేశాడు. ఇంకా శ్రీరామలక్ష్మణులకు గురువు అయ్యాడు. విశ్వామిత్ర మహర్షి గురించి తెలియజేసే తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

మరిన్ని గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

యోగుల జీవితాలలో జరిగే అద్భుతాలు భగవంతునిపై నమ్మకం, భగవంతుని స్వరూపంపై ఒక అవగాహన ఏర్పడుతుందని అంటారు. అటువంటి యోగుల జీవిత చరిత్రలను చదవడం మనసుకు మేలు కలుగును అంటారు. అటువంటి యోగులలో పరమహంస యోగానంద్ గారి ఆత్మకధ తెలుగు ఉచిత పుస్తకం ఆన్ లైనో ఉచితంగా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ఈ తెలుగు ఫ్రీబుక్ మీరు ఫ్రీగా పిడిఎఫ్ ఫార్మట్లో రీడ్ చేయవచ్చును.

కంచికామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవునిగా అందరూ కీర్తిస్తారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారితో నీలంరాజు వెంకటశేషయ్య గారు తనకున్న అనుభవాలతో, తన మిత్రుల అనుభవాలతో ఆయనే రచించిన తెలుగు ఫ్రీబుక్ నడిచే దేవుడు. ఈ పుస్తకంలో నీలంరాజు వెంకటశేషయ్యగారు పరమచార్యులను దర్శించుకున్న సందర్భం నుండి ప్ర్రారంభం అవుతుంది. నడిచే దేవుడు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి గురించి తెలియజేసే నడిచే దేవుడు తెలుగు ఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

మనిషికున్న నాలుగు రుణములలో ఋషి రుణం కూడా ఒక్కటిగా పండితులు చెబుతారు. ఋషి ఋణం తీరాలంటే మహర్షులు రచించిన వాజ్ఙ్మయం చదవడమేనని చెబుతారు. ముఖ్యంగా వేదవ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణములను, మహాభారత, భాగవతాది గ్రంధపఠనము చేయాలని చెబుతూ ఉంటారు. ఇంకా మనకు అగస్త్య మహర్షి, అత్రి మహర్షి, అష్టావక్ర మహర్షి, ఋష్యశృంగ మహర్షి, కపిల మహర్షి, గౌతమ మహర్షి, చ్యవన మహర్షి, జమదగ్ని మహర్షి, దధీచి మహర్షి, దత్తాత్రేయ మహర్షి, దుర్వాసో మహర్షి మొదలైన మహర్షుల గురించి పెద్దలు చెబుతూ ఉంటారు లేదా శాస్త్రములలో వీరి చరితములు ఉంటాయి. ఈ మహర్షుల జన్మ కధలు, జీవితంలో ముఖ్య ఘట్టాలు తదితర విషయాలతో కూడిన మహర్షుల చరిత్ర తెలుగు పుస్తకం ఉచితంగా ఆన్ లైన్లో లభిస్తుంది. మహర్షుల చరిత్ర తెలుగు ఫ్రీ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Sriramuni guruvu Vishwamitra

వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి వంశపారంపర్య గురువు. శ్రీరాముని మరొక గురువు అయిన విశ్వామిత్రుని జీవితాన్ని ప్రభావితం చేసిన బ్రహ్మశ్రీ వశిష్ఠుడు. ఈయన శాప ప్రభావం చేతనే శంతన కుమారుడు భీష్ముడుగా మారాడు. ఈయన అనుగ్రహం లోకంలో మంచిని పెంచే విధంగానే ఉంటుంది. విశ్వామిత్రుడుకు కోపం కలిగినా అది భక్తి వైపే దారితీసింది. భీష్ముడికి శాపం ఇచ్చినా, భీష్ముడి వలననే అనేక ధర్మాలు మరియు విష్ణు సహస్రనామం చెప్పబడ్డాయి. ఇంతటి శాంత మూర్తి, తపశ్శాలి అయిన వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకోవడం అమూల్యమైన విషయం. వశిష్ఠ మహర్షి గురించి తెలియజేసే తెలుగు ఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మన గురువులలో అనేకమంది అనేక ధర్మములను వారి రచనల ద్వారా తెలియజేస్తే, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఙానం ఇచ్చారు. ఇప్పటికీ ఈ గురువుగారు చెప్పిన విషయాలెన్నో జరిగినట్టుగా దుష్టాంతాలు కనబడ్డాయి. గుర్రాలకు బదులు నడిచే వాహానాలు వస్తాయని చెప్పినట్టు, కరెంటు దీపాలు గురించి చెప్పినట్టుగా మరిన్నే విషయాలు కాలజ్ఙానంలో కనబడతాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఙానం విన్నవారికి విపరీతాలు కూడా పెద్దగా ఆశ్చర్యపరచవు అంటారు. ఈయన గురించిన చరిత్రను తదితర విషయాలను చదవడానికి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర తెలుగు పుస్తకం ఆన్ లైన్లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ ఫ్రీతెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

ఇంకొన్ని గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు | చూడ చూడ రుచుల జాడవేరు | పురుషులందు పుణ్య పురుషులు వేరయా | విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఉప్పు కర్పూరం ఒకే రంగులో ఉంటాయి, కానీ రుచులు వేరు, అలాగే పురుషులలో పుణ్యాత్ములు వేరుగా ఉంటారు. ఈ పద్యం తెలియని తెలుగు విద్యార్ధి ఉండడు. ఈ పద్యం అంతగా తెలుగువారికి పరిచయం. ఈయన పద్యాలు చాలా పెద్ద పెద్ద భావనలు కలిగి ఉంటాయి. నీతితో కూడి ఉంటాయి. వేమన రచించిన వేమన పద్యాలు వేమన శతకంగా చెబుతారు. ఈ యోగి ద్వారా చెప్పిన పద్యాలు లోక ప్రసిద్ది చెందినవి. ఐదువేల వేమన తెలుగు పద్యాలు కలిగిన తెలుగు పుస్తకం ఉచితంగా లభిస్తుంది. వేమనపద్యాలు5000 తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీదత్త గురుచరిత్ర చదవడం వలన అనేక శుభాలు కలుగుతాయని అంటారు. శ్రీదత్త అనుగ్రహం ఉంటే, ఇష్టాకామ్యాలు నెరవేరతాయని చెబుతారు. గురుదత్త అనుగ్రహం కోసం శ్రీదత్తగురుచరిత్ర పారాయణం నియమనిష్ఠలతో చేయమంటారు. శ్లోకములు వాటికి తాత్పర్యములు కలిగి శ్రీదత్త గురుచరిత్ర తెలుగు పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఈ తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గురు పారాయణ గ్రంధాలలో శ్రీగురుచరిత్ర విశేషంగా చెబుతారు. నియమనిష్ఠలతో పారాయణం చేయడం వలన సత్ఫలితాలను సాధించవచ్చని చెబుతారు. 52 అధ్యాయాలు కలిగిన శ్రీగురుచరిత్ర తెలుగు పుస్తకం ఒక వారం రోజులపాటు లేక రెండు వారాలపాటు లేక మూడువారాలపాటు నిత్య పారాయాణం చేయవచ్చు అంటారు. ఈ పుస్తకంలోనే మీకు ఏరోజు ఏ అధ్యాయం నుండి ఏ అధ్యాయం వరకు చదవాలో, ఆహార నియమాల గురించి సూచించబడింది. శ్రీగురుచరిత్ర తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షిర్డీ సాయిబాబ గురుస్వరూపంగా భక్తులను అనుగ్రహిస్తున్న దైవస్వరూపుడు. శతాబ్ధం ముందు సాయిబాబ మహిమలను చూసినవారు ఎక్కువగా ఉంటారు. ఆత్మతత్వం గురించి షిర్డీ సాయిబాబ చూపిన లీలలు, మహాత్యములు అసామాన్యంగా ఉంటాయి. గురు స్వరూపం అనగానే ప్రత్యక్షంగా షిర్డి సాయిబాబ స్వరూపం మనకు కనబడుతుంది. షిర్డీసాయిబాబ చరిత్రను తెలియజేసే సచ్చరిత్ర తెలుగుపుస్తకం ఉచితంగా లభిస్తుంది.  షిరిడి సాయిబాబా సచ్చరిత్రము తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగులో గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశములకు తెలియజేసిన మహానుభావుడు మన వివేకానందస్వామి. మన భారతీయ సంస్కృతి గురించి విదేశియులు గొప్పగా మాట్లాడుకునే లాగా మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనుడు స్వామి వివేకానంద. విదేశాల్లో వివేకానందస్వామి చేసిన తొలి ప్రసంగం ఇప్పటికీ అత్యుత్తమంగానే విదేశియులు భావిస్తారు. రామకృష్ణ పరమహంస ప్రియశిష్యుడు అయిన వివేకానందుడు అసలు పేరు నరేంద్రుడు. భగవంతుడిని చూడాలనే తలంపుతో భగవంతుడిని చూపించేవారి కోసం ఎదురు చూస్తున్న నరేంద్రుడికి రామకృష్ణ పరమహంస దగ్గర సమాధానం లభిస్తుంది. స్వామి వివేకానంద చరిత్ర తెలుగుపుస్తకం ఉచితంగా లభిస్తుంది.  వివేకానంద జీవిత చరిత్ర తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మహాభారతంలో పాండవులకు గురువు అయిన ద్రోణాచార్యులు వారు, విద్య నేర్పడంలో ఆచార్యులుగానే వ్యవహరించారు అని అంటారు. ఆవేశగుణం ఉన్న కొడుకుకు బ్రహ్మాస్త్రం గురించి పూర్తిగా వివరించకుండా, శిష్యుడైన అర్జునిడికి ఆ విషయం సవివరంగా నేర్పించాడు. కేవలం తనను చంపడానికే పుట్టిన వ్యక్తి విలువిద్యను నేర్పించాడు. ఒక కుక్క విషయంలో విచక్షణారహితంగా ప్రవర్తించిన ఏకలవ్యుడికి అసాధరణ విద్య ప్రమాదకరమని, ఏకలవ్యుడి బ్రొటనవేలును గురుదక్షిణగా స్వీకరించాడు. ఇలా ద్రోణాచార్యులు విద్యను నేర్పించడంలో పాత్రతనెరిగి ప్రవర్తించారని పండితులు చెబుతారు. ద్రోణాచార్యుల గురించిన తెలుగుఫ్రీబుక్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

జగద్గురు శ్రీఆది శంకరాచార్య భారతదేశం అంతా నడిచి అవైదిక వాదనలను త్రోసిపుచ్చిన అపర శంకరుని అవతారం. ఈయన దయతో సనాతన ధర్మం మరలా పునరుజ్జీవం పొందిందని పెద్దలు చెబుతారు. ఆది శంకరాచార్యులు రచించిన పలు దేవతా స్త్రోత్రాలు మహిమాన్వితమైనవి. ముఖ్యంగా కనకధారా స్త్రోత్రం, భజగోవిందం, అష్టపది తదితర స్త్రోత్రాలు భగవంతుని ప్రార్ధించడంలో గొప్ప స్త్రోత్రాలుగా చెప్పబడతాయి. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల గురించి తెలియజేసే తెలుగుపుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఈ ఫ్రీపిడిఎఫ్ తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఎందరో గురువులు భారతదేశంలో వేదమును విస్తరింపచేయడంలో, సామాన్యులకు స్త్రోత్రాల రూపంలోనూ, మంచి మాటల రూపంలోనూ అందుబాటులోకి రావాడానికి కృషి చేశారు. ఇది మన భారతీయుల అదృష్టంగానే భావిస్తారు. అలాంటి గురువులు అందించిన శాస్త్రమును తెలుసుకోవడంతో బాటు, ఆయా గురువుల గురించి కూడా తెలుసుకోవడం మేలని పండితులు చెబుతారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

మన పురాణాలలో ఉన్న కధలలోంచి ఎక్కువగా రాముని గురించి, కృష్ణుని గురించి ఇంకా శివుని గురించి ఒకే కధను ఇతర హీరోలతో మరలా తీయడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక మానవుని కధను మూడుసార్లు తీయడం కూడా ఉంది. పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ.

స్టార్ ఫిలిం కార్పోరేషన్ నిర్మాణంలో టి.ఏ. రామన్ దర్శకత్వంలో హరిశ్చంద్ర తెలుగు చిత్రం 1930 దశకంలోనే వచ్చింది. ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి, పి కన్నాంబ, బందర్ నాయుడు, పులిపాటి వెంకటేశ్వర్లు, మాస్టర్ భీమారావు, ఆకుల నరసింహారావు, జె. రామకృష్ణారావు తదితరులు నటించారు.

ఇంకా రాజ్యం పిక్చర్స్ సమర్పణలో హరిశ్చంద్ర పేరుతోనే మరలా ఈ చిత్రం తెరకెక్కించగా, ఇందులో ఎస్వీ. రంగారావు, లక్ష్మిరాజ్యం, రేలంగి, గుమ్మడి, సూరిబాబు, రఘురామయ్య, ఏ.వి. సుబ్బారావు, గౌరిపతిశాస్త్రి తదితరులు నటించారు.

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ కధ

తర్వాత సత్యహరిశ్చంద్ర గాధ53 ఏళ్ల క్రిందట వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, ఎస్ వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల, రమణారెడ్డి, రాజనాల, రాజశ్రీ, మీనాకుమారి, రేలంగి, గిరిజ తదితరులు నటించారు. సత్యహరిశ్చంద్ర చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించగా ప్రముఖ దర్శకులు కె.వి. రెడ్డి నిర్మాణదర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ సత్యహరిశ్చంద్ర గాధని చిత్రంగా సంస్థ నిర్మించింది.

సత్యహరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాధనుండి తెలుగు తెరపై కె.వి. రెడ్డిగారు నందమూరి తారక రామారావుగారిని సత్యహరిశ్చంద్రగా చూపించారు. ప్రముఖ గాయని అయిన ఎస్ వరలక్ష్మిగారిని సత్యహరిశ్చంద్ర భార్యగా చంద్రమతిగా చూపించారు. తెలుగుతెర తొలి కధానాయకుడు అయిన నాగయ్యగారిని వశిష్ఠ మహర్షి పాత్రలో చూపించారు. ప్రముఖ నటుడు ముక్కామలగారిని మహర్షి విశ్వామిత్రుడుగా చూపిస్తూ, విశ్వామిత్ర ప్రధాన శిష్యుడు నక్షత్రకుడు పాత్రలో రమణారెడ్డి గారిని చూపించారు. కాశి పట్టణవాసిగా కాలకౌశికుడు పాత్రలో రేలంగి నరసింహారావుగారిని చూపిస్తూ, కాల కౌశికుడుకి గయ్యాళి భార్యగా గిరిజని చూపించారు. మిక్కిలినేని గారిని ఇంద్రుడుగా చూపిస్తూ పార్వతిపరమేశ్వరులుగా సబితాదేవి-ప్రభాకర్ రెడ్డిగార్లని చూపించారు. ఇంకా వివిధ పాత్రల్లో ఎల్ విజయలక్ష్మి, రాజబాబు, రాజనాల, రాజశ్రీ, వాణిశ్రీ, మీనాకుమారి, మోహన, చదలవాడ, బాలకృష్ణ మొదలైనవారు SatyaHarisChandra Movie నటించారు. ‘NTR Satya Harishchandra Full Story Telugu Movie’

ఇంద్రసభలో వశిష్ఠుడు-విశ్వామిత్రుల సంవాదం – సత్య హరిశ్చంద్ర గ్రేట్ మూవీ

ఆడినమాట తప్పని హరిశ్చంద్ర మహారాజు సూర్య వంశస్తుడుగా పరమశివ భక్తుడు. రాజసూయ యాగము చేసి యజ్నఫలాన్ని పొందిన హరిశ్చంద్ర మహారాజు ఆ యజ్నఫల మహిమ రాజ్యంలో ప్రజలందరికి కలగాలని రాజసభలో యజ్న ఫల దర్శన భాగ్యం అయోధ్య ప్రజలకు కల్పిస్తారు. పిమ్మట యజ్న ఫలం గొప్పతనం రాజర్షి దాత అయిన హరిశ్చంద్ర మహారాజు గురించి రాజవంశగురువు వశిష్ఠ మహర్షి సభకు తెలియజేస్తారు. అదే సభలో ఒక యోగి వచ్చి మహారాజు దగ్గర మాట ఆ యజ్నఫలాన్ని అర్ధిస్తారు. అంతటి మహిమ కలిగిన యజ్నఫలాన్ని ఆ యోగికి దానం చేసేస్తారు, హరిశ్చంద్ర మహారాజు. (అయితే ఆ నిష్కామయోగిగా వచ్చింది పరమశివుడే, యజ్నఫలాన్ని పట్టుకుని ఆ యోగి, హరిశ్చంద్ర మహారాజు పూజామందిరంలోకి వెళ్లి అంతర్ధానం అవుతారు. అక్కడ వాక్కులుగా  హరిశ్చంద్రుడు యొక్క సత్యనిష్ఠని పరీక్ష చేయదలచానని పరమశివుడు పార్వతిమాతతో పలకడం వినబడుతుంది.)

ఇంద్ర సభలో మహర్షులతో సమావేశమై ఉన్న దేవేంద్రుడు, సభలో మహర్షులతో అందరిని పేద, ధనిక బేదాలు లేకుండా అందరిని తరింపజేసే వ్రతం ఏదైనా సెలవియ్యండి అని అనగా…. విశ్వామిత్ర మహర్షి అందరికి తగిన ఏకైక వ్రతం ఏది లేదు అర్హతను బట్టి వారి వారి తాహతు బట్టి మాత్రమే వ్రతాలు వుంటాయి అని చెబితే, మహర్షి వశిష్టులు మాత్రం అందరూ ఆచరించి తరించగలిగే వ్రతం సత్యవ్రతం ఒక్కటే అని బదులు చెబుతారు. సత్యవ్రతం ఆచరింప అసాద్యం అని అందులోను మానవమాత్రులు ఆచరించడం అనేది కుదరదు. వారి జీవన విధానం రిత్యా మానవులు సత్యవ్రతం అసాద్యం అని మహర్షి విశ్వామిత్రులువారు చెబుతూ వశిష్ఠ మహర్షి ప్రతిపాదనని తోసిపుచ్చుతారు. వశిష్ఠ – విశ్వామిత్ర వాదనల పిదప దేవేంద్రులువారు అలాంటి సత్యవ్రతం చేసేవారు ఎవరైనా ఉంటే చెప్పమని వశిష్ఠమహర్షిని అడుగుతారు.

అందుకు వశిష్ఠ మహర్షి సూర్య వంశస్తుడు త్రిశంకువు కుమారుడు అయిన సత్యహరిశ్చంద్ర మహారాజు గురించి చెబుతారు. ఆ మాటకు కూడా విశ్వామిత్ర మహర్షి ఇంకో వాదనను తీసుకువస్తారు. ఈ వశిష్ఠ మహర్షి హరిశ్చంద్ర వంశానికి గురువు కావున వశిష్టులు హరిశ్చంద్ర మహారాజు గురించి గొప్పగా చెబుతున్నారు అని అంటారు. ఇక ఇంద్ర సభలో దేవతలు, మహర్షుల సమక్షంలో విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్ర మహారాజు సత్యనిష్టతని పరిక్షిస్తానని అందులో హరిశ్చంద్ర మహారాజు కచ్చితంగా అసత్యమాడేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. అందుకు వశిష్ఠ మహర్షి ఒకవేళ సత్యహరిశ్చంద్రుడు అబద్దమాడితే నేను ఆచార బ్రష్టుడినై బ్రతుకుతాను అని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే విశ్వామిత్ర మహర్షి సత్యహరిశ్చంద్ర మహారాజుతో అసత్యవాక్కు పలికించలేకపోతే తన తపశక్తిలో సగభాగం సత్యహరిశ్చంద్ర మహారాజుకి ధారపోస్తానని, సహస్ర వర్షములు సకల చక్రవర్తిగా పరిపాలన చేస్తాడని, అంతేకాకుండా చిరకాలం 14 మన్వంతరముల వరకు దేవేంద్ర సింహాసనంలో సగభాగం కలిగి ఉండేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

విశ్వామిత్ర మహర్షి పరీక్షలో భాగంగా రాజ్యదానం చేసేసిన సత్య హరిశ్చంద్ర మహారాజు

స్వర్గం నుండి బూలోకం వచ్చిన విశ్వామిత్ర మహర్షి తన ప్రధాన శిష్యుడు నక్షత్రకుడుతో కలిసి అయోధ్యకు హరిశ్చంద్ర రాజసభకు వస్తారు. ఒక ఎత్తైన మదపుటేనుగుపై ఒక పహిల్వాన్ ఎక్కి అతను విసిరిన రత్నం ఎంత పైకి వెళితే అంత ధనరాశి కావాలి అంటారు. సాదారణంగా ఒకమహారాజు అంతధనము ఇవ్వడమంటే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడమే అవుతుంది. హరిశ్చంద్రుడుని అంత ధనము అడిగితే, రాజు సంకోచించి మాట వెనుకకు తీసుకుంటాడెమో అని ఆలోచన చేసిన మహర్షి అంత మొత్తం ధనమును హరిశ్చంద్ర మహారాజుని కోరతారు. అడిగిన వెంటనే అంతధనము మీదే పట్టుకుని వెళ్ళండి అని అన్న హరిశ్చంద్ర మహారాజు మాటకు విశ్వామిత్ర మహర్షి ఆ ధనమును అవసరమైనప్పుడు తీసుకుంటాను నీవద్దనే ఉండని అని చెప్పి, రాజ సభనుండి నిష్క్రమిస్తారు.

విశ్వామిత్రవెనువెంటనే తన మాయ సృష్టిద్వారా క్రూరమృగాలను సృష్టించి అడవులలో స్వేచ్చగా వదిలేస్తారు, ఆ మృగాలు అడవి నుండి ఊళ్లపైకి వచ్చి పడతాయి. ప్రజలు మొర ఆలకించిన హరిశ్చంద్ర మహారాజు క్రూర మృగాల వేటకు అడవికి వెళ్లి, వాటిని వేటడతారు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి ఇద్దరు స్త్రీలను సృష్టించి అడవిలో ఉన్న హరిశ్చంద్ర మహారాజు వద్దకి పంపిస్తాడు. ఆ స్త్రీలు హరిశ్చంద్ర మహారాజు ముందు ఆడి పాడి, మహారాజుని పెండ్లి చేసుకోవలసినదిగా కోరతారు. వారిని వారించిన వినని స్త్రీలను మహారాజు తన సైన్యం ద్వారా అడ్డుకుంటారు. వారు మరలా విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వచ్చి మొరపెట్టుకుంటారు.

మహర్షి ఆగ్రహంలో ఉండగా అక్కడికి హరిశ్చంద్ర మహారాజు వస్తారు. వచ్చి జరిగిన విషయం వివరిస్తారు. అయితే వరించిన తన కుమార్తెలను పెండ్లి చేసుకోవలసిందే అని చెబుతారు. (వివాహమహోత్సవంలో అందరిముందు అగ్ని సాక్షిగా చేసే మంత్రపూర్వక ప్రతిజ్ఞ ఉంటుంది. ఇప్పుడు హరిశ్చంద్ర మహారాజు కోరి వచ్చారు కదా అని ఆ స్త్రీలను వరిస్తే అసత్య దోషమే వస్తుంది.). అయితే ఇప్పుడు ఇప్పటికే అగ్నిసాక్షిగా సంతానం కోసమే వివాహమాడిన ధర్మపత్ని ఉండగా, ఈ స్త్రీలను వివాహమాడడం అధర్మమని హరిశ్చంద్ర మహారాజు చెబితే, అందుకు బదులుగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, తపోధనుల మాట వినడమే రాజధర్మం అని చెబుతారు. రాజర్షి అయిన హరిశ్చంద్రుడు అటువంటి ధర్మం కలిగిన ఈ రాచరికం నాకు వద్దు అని రాజ్యదాననికే సిద్ధపడతారు. నిండు రాజసభలో సకల రాజ్యాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రకు ధారపోసి కట్టుబట్టలతో తన భార్య, కుమారుడుతో కలిసి రాజ్యాన్ని వదిలి అడవికి బయలుదేరతారు, సత్య హరిశ్చంద్రుడు. రాజ్యాన్ని వీడుతున్న రాజుని చూసి ప్రజలు విలపిస్తూ హరిశ్చంద్రుడుకి వీడ్కోలు పలుకుతారు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

హరిశ్చంద్రుడు రాజభోగాలను త్యజించి, తన భార్యాపిల్లలతో అడవులలోకి

మొదటగా విశ్వామిత్ర మహర్షికి దానం చేసిన సొమ్ము హరిశ్చంద్ర మహారాజు వద్ద ఉంటుంది, అయితే సకల రాజ్యం దానంగా ఇచ్చిన మహారాజు విశ్వామిత్రుడికి ముందుగా ఇచ్చిన దానం ఋణంగానే ఉంటుంది. రాజ్యం నుండి బయటకు వచ్చిన హరిశ్చంద్రుడిని విశ్వామిత్ర మహర్షి తనకు దానంగా ఇచ్చిన సొమ్ము నీవద్దనే ఉంది, కావునా అది నీకు రుణమే ఆ ఋణం తీర్చుకో అని చెబుతారు. అందుకు హరిశ్చంద్రుడు నెలరోజులు గడువు కోరతారు. అయితే ఆ రుణనిమిత్తం అయోధ్య రాజ్యంలో కానీ, అయోధ్య సామంత రాజ్యాలలో కానీ సంపాదన చేయకూడదని విశ్వామిత్ర మహర్షి అజ్నపిస్తారు హరిశ్చంద్రుడిని.

అడవుల బారిన పడిన హరిశ్చంద్రుడిని అతని భార్య పిల్లలు అనుసరిస్తారు, అలాగే రుణ వసూలు కోసం నక్షత్రకుడు హరిశ్చంద్రుడుని అనుసరిస్తారు. అయితే అడవులలో కూడా నక్షత్రకుడు ప్రవర్తనకు తోడూ, వశిష్టుడుగా మారువేషంలో ఒక రాక్షసుడు వచ్చి, విశ్వామిత్ర మహర్షి మోసం నాకు తెలుసు నేను అతన్ని అంతం చేస్తాని, నీవు నీ రాజ్యాన్ని దక్కించుకో అని చెబుతాడు. దానికి సత్యహరిశ్చంద్రుడు దానం చేసిన రాజ్యాన్ని నేను పొందగోరను, అని బదులు చెబుతాడు. తరువాత దావాగ్ని దహించుకుంటూ అడవినలువైపులా నుండి హరిశ్చంద్రుడివైపు వస్తూ ఉంటుంది.

అలా వస్తున్న అగ్నిదేవుడు నక్షత్రకుడుతో మీ నిజమైన పేర్లు మీవి కావు అని చెప్పినా మీకు ప్రమాదం ఉండదని చెపుతాడు. ఆ విషయం హరిశ్చంద్రుడుకి చెప్పి, తానూ బ్రహ్మర్షి విశ్వామిత్రుని శిష్యుడుని కాదు నాపేరు నక్షత్రకుడు కాదు అని చెప్పి, అగ్నిలోకి వెళ్లి, క్షేమంగా వచ్చేస్తాడు. అలా వెళ్లి వచ్చి హరిశ్చంద్రుడుని, అతని భార్య చంద్రమతిదేవిని కూడా ఆ పని చేయమంటాడు. పేర్లు తమవి కావు అని అనడమంటే అసత్యమే అవుతుంది. ఆ పని నేనుచేయననే చెబుతారు(కేవలమ పేరు తనది కాదు తాత్కాలికంగా నేను నేను కాదు అని చెప్పినా అసత్యదోషమే అవుతుంది అని భావించిన హరిశ్చంద్రుడు, వారి భార్య పిల్లలు). తరువాత చంద్రమతి దేవి ప్రార్ధనతో అగ్నిదేవుడు శాంతించి వెనుతిరుగుతాడు.

కాశీ పట్టణంలో భార్యా విక్రయం

ఇక అక్కడి నుండి బయలుదేరిన వారు కాశి పట్టణం చేరుకుంటారు. కాశి పట్టణంలో శ్రీమంతుల కొరకు దాసిలను విక్రయించే స్థలం ఉంటుంది. ఋణం చెల్లించవలసిన గడువు నేటితో తీరిపోతుంది అని అన్న నక్షత్రకుడు మాటలతో, హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి దేవి, తనను విక్రయించి ఆ ఋషి ఋణం గడువులోపు తీర్చేయండి అని సలహా హరిశ్చంద్రుడుకి సలహా ఇస్తుంది. అందుకు హరిశ్చంద్రుడు తన భార్యని దాసీగా అమ్మలేను, నేనే దాసిగా అమ్ముడయ్యి, ఆ ఋణం తీర్చేస్తాను అని చెబుతాడు. అయితే అమ్మకంలో రుణానికి సరిపడా సొమ్ములు రాకపోతే, నీవు ఋణగ్రస్తుడుగానే మిగిలిపోతావు అని నక్షత్రకుడి మాటలకూ, హరిశ్చంద్రుడు అచేతనావస్థలో ఉంటారు. అప్పుడు చంద్రమతి దేవి తననే విక్రయించి, ఆ ఋణం తీర్చేయమని హరిశ్చంద్ర మహారాజుకి చెబుతుంది. గత్యంతరం లేని హరిశ్చంద్రుడు తన భార్యని దాసీగా అమ్మడానకి కాశి పట్టణంలో అయిష్టంగా సిద్దపడతాడు.

కాల కౌశికుడు కాశిపట్టణంలో గయ్యాళి భార్య భాదలకు లోనవుతూ తద్దినాలకు వెళుతూ ఉంటాడు. అలాంటి కాలకౌశికుడుకి తోడుగా జడబట్టు ఉంటూ ఉంటాడు. తద్దిన భోజనానికి వెళ్ళిన కాల కౌశికుడు వేషంలో పరమశివుడే వచ్చి కాశిపట్టణ దాసీ విక్రయ స్థలానికి వచ్చి చంద్రమతి దేవిని కాలకౌశికుడుకి దాసిగా నక్షత్రకుడు అడిగిన రుణసొమ్మును చెల్లించి, చంద్రమతి దేవిని కాల కౌశికుడు ఇంటికి చేరుస్తాడు. దాసిగా అమ్ముడైన చంద్రమతిదేవితోనే వారి కుమారుడు లోహితాస్వుడు వెళతాడు. విశ్వామిత్ర మహర్షి ఋణం తీర్చుకున్న సత్యహరిశ్చంద్రుడుకి ఇంకో ఆపద్ధర్మ ఋణం వచ్చి పడుతుంది. ఇన్నాళ్ళు హరిశ్చంద్రుడు వెనుక తిరిగిన నక్షత్రకుడుకి బత్యం బకాయి పడతాడు, హరిశ్చంద్రుడు.

నక్షత్రకుడి జీతం చెల్లించడానికి తనని అమ్మకానికి పెట్టమని హరిశ్చంద్రుడు నక్షత్రకుడుని కోరతాడు, అప్పుడు నక్షత్రకుడు కాశిపట్టణంలో సత్యహరిశ్చంద్రుడుని ఒక కాటికాపరి వీరబాహుకి అమ్మి వచ్చిన సొమ్ముతో వెనుతిరుగుతాడు. బానిసగా అమ్ముడుపోయిన హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేస్తూ ఉంటాడు. కాటికాపరి వీరబాహు చెప్పినట్టు, శవదహనానికి తగిన ధాన్యము, ధనము తీసుకుని ఆ పని చేస్తూ ఉంటారు, సత్యహరిశ్చంద్ర రాజర్షి.

కాటిదాకా వెళ్లిన విశ్వామిత్ర పరీక్ష

బానిసగా కాలకౌశికుడు ఇంట్లో పనిచేస్తున్న చంద్రమతి, లోహితాస్వులను, గయ్యాళి కాలకౌశికుడు భార్య భాదలు పెడుతూ ఉంటుంది. అందులో భాగంగా లోహితాస్వుడుని దర్బలకోసం కాలకౌశికుడు శిష్యులతో అడవికి పంపుతుంది, కాలకౌశికుడు భార్య, అక్కడ అడవిలో మాయసర్పం కాటుతో లోహితాస్వుడు మరణిస్తాడు. విషయం తెలిసిన చంద్రమతి దేవి లోహితాస్వుడు దగ్గరికి వెళ్లి విలపించి, కుమారుడి శవాన్ని పట్టుకుని కాటికి వెళుతుంది. కాని అక్కడ కాటికాపరి అయిన హరిశ్చంద్రుడు, శవదహన సొమ్ము చెల్లించనదే శవాన్ని కాల్చడానికి వీలులేదని అడ్డుకుంటాడు. భర్తని గుర్తుపట్టిన చంద్రమతిదేవి భర్త అసత్యదోషమేర్పడకుండా ఉండడానికి శవాదహన రుసుం తన యజమాని దగ్గర నుండి తీసుకువస్తానని మరలా కాలకౌశికుడు ఇంటికి బయలుదేరుతుంది.

అయితే విశ్వామిత్ర సృష్టిలో భాగంగా మాయ దొంగ, కాశి రాజు యొక్క కుమారుడుని చంద్రమతి వేషంలో ఎత్తుకొచ్చి అడవిలో వదిలి వెళ్ళిపోతారు. కాలకౌశికుడు ఇంటికి వెళ్తున్న చంద్రమతి దేవికి దారిలో పసిబిడ్డ ఏడుపు వినిపించి, ఆ పసిబిడ్డదగ్గరకి వెళుతుంది, అప్పటికే ఆ బిడ్డడు మరణించి ఉంటాడు. మాయదొంగని వెంబడించిన కాశి రాజు సైనికులు చంద్రమతిదేవిని బంధించి, కాశి రాజుదగ్గర నిలబెడతారు. బిడ్డ ఆమెవలననే మరణించింది అని భావించిన కాశి రాజు చంద్రమతిదేవికి మరణదండన విధిస్తాడు. ఆ మరణదండనను అమలు చేయవలసినదిగా వీరబాహుకి అప్పజేపితే, ఆపనిని వీరబాహు హరిశ్చంద్రుడుకి అప్పజేప్పుతాడు.

కాటికాపరి వృత్తిరిత్యా హరిశ్చంద్రుడు తనభార్యని చంద్రమతిని వీరబాహు ఆదేశానుసారం హతం చేయడానికి సిద్దపడతాడు. అయితే విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి వారించిన వినకుండా భార్య శిరస్సుని హరిశ్చంద్రుడు ఖండించబోతాడు. విశ్వామిత్రుడు ఓటమిని అంగీకరించినా చంద్రమతి శిరస్సుని ఖండించాబోయిన ఖడ్గం పూలమాలగా చంద్రమతిదేవి మెడలో ప్రత్యక్ష్యం అవుతుంది. పరమశివుడు, ప్రత్యక్షమై సత్యహరిశ్చంద్రుడు కుమారుడిని, కాశిరాజు కుమారుడుని బ్రతికిస్తాడు. బ్రహ్మశ్రీ విశ్వామిత్రుల వారు తన ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటారు. సత్యహరిశ్చంద్ర మహారాజు పరమశివ ప్రార్ధనతో సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ ముగుస్తుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా

శ్రీరాముడు రాశిభూతమైన ధర్మము అంటారు. ధర్మము పూర్తి మానవుడుగా మారి, చక్రవర్తి అయితే ఆయనే శ్రీరామచంద్రమూర్తి అంటారు. సీతమ్మ తల్లి రామయ్యను అనుసరించిన మహాసాద్వి. సీతారాముల గురించిన సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ గురించి…

బ్యానర్ : లక్ష్మి ఎంటర్ ప్రైజెస్
చిత్ర తారాగణం : శోబన్ బాబు, ఎస్వి రంగారావు, చంద్రకళ తదితరులు
సంగీతం : కేవి మహదేవన్
నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
దర్శకత్వం: బాపు

తెలుగు భక్తి మూవీలో శోభన్ బాబు శ్రీరామచంద్రమూర్తిగా నటించారు. రామచంద్రమూర్తి భార్య సీత పాత్రలో చంద్రకళ నటించారు. శ్రీరామాయణంలో అసురుడు అయిన రావణాసురుడు పాత్రలో ఎస్వీ రంగారావు నటించారు. సంపూర్ణ రామాయణం తెలుగు భక్తి మూవీకి బాపు దర్శకత్వం వహించారు.

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ

అలనాటి పాత తెలుగు సినిమాలు మంచి సందేశం కలిగి ఉంటే, భక్తి సినిమాలు అంటే పరమధర్మమునే తెలియజేస్తాయని అంటారు. భక్తి మూవీస్ వాచ్ చేయడం వలన భగవానుడిపై భక్తిని పెంచుకోవడానికి మనసుకు మంచి ఆలంబనం అవుతుంది.

పుస్తకం చదువుతూ ఉంటే ఒక ఊహాశక్తి మనసులో మెదులుతుంది. సినిమా చూస్తుంటే, చూస్తున్న మూవీ సీన్స్ మనసులో కదలాడుతూ ఉంటాయి. మంచి సీన్స్ మనసులో ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటారు.

శ్రీమహావిష్ణువు తదితర దేవతల అవతార సన్నివేశం సంపూర్ణ రామాయణం భక్తి .

వైకుంఠములో లక్ష్మినారాయణులు ఆదిశేషుని కొలువుతీరి ఉండగా దేవతలు అంతా వచ్చి రావణ రాక్షస అకృత్యాలపై మొరపెట్టుకుంటారు. ద్రుష్ట శిక్షణ చేయడానికి నేను నరుడిగా అవతరిస్తాను. మీరు మీ మీ అంశలతో వానరాలుగా అవతరించండి, అని శ్రీమహావిష్ణువు వెల్లడి చేస్తారు.

ఎందుకంటే రావణుడు మనుషులపై చులకన భావంతో మనుషులు, వానరులు తప్పించి మిగిలిన వారితో మరణం లేని వరం కలిగి ఉంటాడు. వేరొక సన్నివేశంలో రావణాసురుడు వేదవతిని వేదిస్తుంటే, ప్రతిగా వేదవతి నేను మరో జన్మలో నీ మరణానికీ కారణం కాగలనని రావణుడిని శపించి ఆత్మాహుతి చేసుకుంటుంది.

దేవతలు వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు మొదలైనవారు అవతరిస్తే, శ్రీమహావిష్ణువు రామునిగా, రాముని తమ్ములుగా శంఖు, చక్ర, గదలు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా దశరద మహారాజుకి జన్మిస్తారు.

తనఇంట రావణుడు శివ పూజ చేస్తుండగా, పూజ పుష్పం నుండి ఒక బాలిక ఉద్బవిస్తుంది. ఆ శిశువుని రావణాసురుడు పారవేయమని చెబుతాడు. అలా రావణాసురుని ఇంట ఉద్బవించిన శిశువు పొలం దున్నుతున్న జనక మహారాజుకి దొరుకుతుంది.

అలా జనకమహారాజుకి దొరికిన బాలికకు సీత అను పేరు పెడతారు. సీత జగదేక ప్రసిద్ది పొందుతుంది అని జనకమహారాజు గురువులు శతానందులు సెలవిస్తారు.

అయోధ్యలో రామయ్య కౌసల్య – దశరదుల వద్ద అల్లారుముద్దుగా పెరిగి, గురువుల దగ్గర విద్యాభ్యాసం పూర్తీచేసుకుంటాడు.  జనకమహారాజు స్వగృహంలో పెరుగుతున్న సీతమ్మ ఒకరోజు అటాడుకుంటూ ఉండగా బంతి ఒక ధనుస్సు ఉన్న బాక్స్ క్రిందకు వెళుతుంది.

అప్పుడు సీతమ్మ తల్లి a పెట్టెని ఇట్టే జరిపి ఆ పెట్టే కింద ఉన్న బంతిని తీసుకుని మరలా ఆటలోకి వెళుతుంది. అది గమనించిన జనక మహారాజు, వారి గురుదేవులు ఆశ్చర్యచకితులు అవుతారు. వేలమంది తోస్తేకాని జరగని ఆ ధనుస్సు కలిగిని పెట్టెని, ఇట్టే జరిపిన సీతమ్మతల్లికి స్వయంవరంలో ఎవరైతే శివదనుస్సుని ఎక్కుపెడతారో వారికే ఇచ్చి వివాహం జరిపిస్తానని అంటారు.

రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట కానలకు వెళ్ళడం, శ్రీరామాయణం తెలుగు భక్తి మూవీ

ఒకరోజు సభలో దశరధ మహారాజు గురువు వసిష్ఠ మహర్షితో కొలువు దీరి ఉండగా, అక్కడకు విశ్వామిత్ర మహర్షి కూడా వస్తారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాకకు కారణం వివరిస్తూ, రామ చంద్రుని తనతో అడవులకు పంపమని దశరధుని విశ్వామిత్ర మహర్షి అడుగుతారు.

దానికి దశరధ మహారాజు సంశయిస్తే, అప్పుడు వసిష్ఠ మహర్షి నచ్చచెప్పడంతో దశరధ మహారాజు రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి వెనుక పంపడానికి అంగీకరిస్తే, అక్కడికి వచ్చిన రామలక్ష్మణులు తండ్రి అజ్ఞాపాలన మేర విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

విశ్వామిత్రుని వెనుకు రామలక్ష్మణుల నడక సాగుతుండగా తాటక రాక్షసి కనిపిస్తుంది, ఆ రాక్షసి వారి ముగ్గురిపై రాళ్ళతో దాడి చేస్తుంటే, విశ్వామిత్ర మహర్షి అజ్ఞా మేరకు, రాముడు తాటకిని సంహరిస్తాడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు కొన్ని శక్తి అస్త్రశస్త్రాలను ఉపదేశిస్తారు.

విశ్వామిత్ర మహర్షి మరియు ఇతర మునులు జరుపుతున్న యజ్ఞం భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సుబహువు రాక్షసుడుని రాముడు అంతమొందించి, మారీచుడుని రామ బాణంతో కొన్ని యోజనాల దూరంలో పడేటట్టు చేస్తాడు. యాగం సంపూర్తి అవుతుంది.

నారద మహర్షి కూడా అక్కడకు వచ్చి రామచంద్రుడిని దర్శించుకుని, విశ్వామిత్ర మహర్షితో సీతాస్వయంవరం గురించి వివరిస్తారు. అదేవిధంగా ఆ విషయం రావణుడి చెవికి చేరవేస్తాడు. రావణుడు సీతాస్వయంవారానికి బయలుదేరితే, రామలక్ష్మణులు ఇద్దరూ గురువు విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

దారిలో అహల్యకు శాపవిమోచనం కావించి, రామలక్ష్మణ మహర్షులు జనకమహారాజు సభకి చేరుతారు. స్వయంవరానికి విచ్చేసిన మహావీరులందరు ప్రయత్నించి విఫలమైతే, రావణాసురుడుకి కూడా గర్వభంగం అవుతుంది. ఇక గురువు విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదంతో రామచంద్రులు శివధనుస్సు ఎక్కుపెట్టగానే, ధనుస్సు విరుగుతుంది.

సీతారాముల వివాహం అంగరంగవైభవంగా ఇరువురి బంధుమిత్ర సపరివారం మద్య జరుగుతుంది. శివధనుస్సుని విరిచింది ఎవరు అంటూ వచ్చి, అంతకు వేయిరెట్లు అధిక శక్తి కలిగిన హరివిల్లుని కూడా ఎక్కుపట్టమని పరశురాముడు చెబితే, ఆ హరివిల్లుని కూడా ఎక్కుబెట్టిన రాముడు, పరశురాముడుకి శ్రీమహావిష్ణువుగా దర్శనం అయ్యి అక్కడ నుండి నిష్క్రమిస్తారు.

శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తంలో సీతారామలక్ష్మణులు అడవులకు

తరువాతి సన్నివేశంలో భరత, శత్రుఘ్నుడు ఇద్దరు వారి మావగారి గృహానికి వెళతారు. మరొక సందర్భంలో  దశరధ మహారాజు తన సభలో పెద్దలు, ప్రజలు, గురువుగార్ల సమక్షంలో నేను వృద్దుడిని అవుతున్న కారణంగా శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తానని అనగానే అందరు హర్షిస్తారు.

శ్రీరాముడు కేవలం నా పెద్దకుమారుడు కావడం మాత్రమే కాకుండా శ్రీరామునికి చాలా మంచి గుణాలు ఉన్నాయని అందుకే పట్టాభిషేకం చేస్తానని అంటే సభ మరొకసరి సంఘీభావం తెలియజేస్తే, అక్కడికి వేంచేసిన శ్రీరామునికి పట్టాభిషేక విషయం వివరించి, రేపటి పట్టాభిసేకనికి సంసిద్దుడివి కమ్మని చెబుతాడు.

మరుసటి రోజు అయోధ్య అంతా సంబరాలు జరుపుకుంటూ ఉంటే, కైకేయి మందిరానికి వచ్చిన మందర నూరిపోసిన వాక్కుల వలన కైకేయి మనసు చెదిరి, దశరధ మహారాజుని వరాలు అడగడంతో శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి, అదే సమయానికి సీతారామ లక్ష్మణులు అడవులకి బయలుదేరవలసి వస్తుంది.

అంతా ఈశ్వరేచ్చ అని భావించి, సీతారామలక్ష్మణులు అడవులకి వెళతారు, అలా రధంలో బయలుదేరిన రాముని ఎడబాటు భరించలేని దశరధ మహారాజు మరణిస్తారు. తదుపరి వచ్చిన భరతుడు విషయం గ్రహించి తల్లిని మందలించి అన్నగారి వద్దకు అడవులకి బయలుదేరతాడు.

అడవిలో సీతారామలక్ష్మణులు నార దుస్తులు ధరించి ముని ఆశ్రమంలో ఉండగా, భరతుడు సపరివార సైన్యంతో రావడం చూసి లక్ష్మణుడు భారతునిపై సందేహం వెలిబుచ్చుతాడు. కానీ భరతుడు అన్నగారు అయిన శ్రీరామచంద్రుడినే రాజ్యం స్వీకరించాలని, తనతల్లి చేసిన తప్పుకు తానూ ఈ శిక్ష భరించలేనని అంటాడు.

అలాగే కైకేయి తదితర వారంతా శ్రీరాముని అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేయవలసినదిగా కోరితే, శ్రీరాముడు తాను తండ్రికి మాటకు మచ్చ రానివ్వను అంటూ రాజ్యభారం ప్రస్తుతం భరతుడే నిర్వహించవలసినదిగా చెబుతారు. శ్రీరామ పాదుకలు తీసుకుని భరతుడు ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి పాలిస్తానని, గడువు ముగిసే సమయానికి నీవు రాకపోతే, నేను ప్రాయోపవేశం చేస్తానని చెప్పి అయోధ్యకు వెనుతిరుగుతాడు.

రావణుడు సీతాపహరణం చేయడం… సంపూర్ణ రామాయణ తెలుగు భక్తి మూవీ

మరొక సన్నివేశంలో రామలక్ష్మణులను చూసిన శూర్పణఖ మోహితురాలై వారి వెంటబడితే, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కొస్తే, ఆమె రావణ సభకి వెళ్లి మొరపెట్టుకుంటుంది. అంతేకాకుండా సీత అందచందాలు పొగిడేసరికి, రావణుడిలో దుర్బుద్ధి పెరిగి సీతాపహరణకు పధకం వేస్తాడు.

పధకం ప్రకారం మారీచుడు బంగారు లేడి వేషంలో సీతారామలక్ష్మణుల ఆశ్రమం ఆవరణలో తిరుగుతూ ఉంటుంది. ఆ బంగారులేడిని చూసిన సీతమ్మ ఆ లేడిని తనకు తెచ్చి ఇవ్వవలసినదిగా రాముని కోరితే, రాముడు బంగారులేడి వెనుక వేట బాణాలతో బయలుదేరతారు. కొంచెంసేపటికి రాముని ఆర్తనాదం విన్న సీతమ్మ లక్ష్మణుడిని కూడా రాముని బాట పట్టిస్తుంది.

ఇక మారువేషంలో వచ్చిన రావణాసురుడు సీతను అపహరిస్తాడు. ఆకాశమార్గంలో సీతమ్మని తీసుకునిపోతున్న రావణుడిపై జటాయువు పోరాటం చేసి రెక్కలు పోగొట్టుకుంటాడు.

తిరిగి వచ్చిన రాముని దుఃఖానికి హద్దు ఉండదు. లక్ష్మణ ఓదార్పుతో తేరుకుని శ్రీరామలక్ష్మణులు సీతమ్మని వెతుక్కుంటూ బయలుదేరతారు. మధ్యలో కనిపించిన శబరి ఆతిద్యం స్వీకరించాక, శబరి మాటల ప్రకారం వారిరువురు ఋష్యమూక పర్వతం చేరుకుంటారు.

వాలితో ఉన్న తగువు కారణంగా రాజ్యానికి దూరంగా నివసిస్తున్న సుగ్రీవుడు ఆ పర్వతంవైపు వస్తున్న శ్రీరామలక్ష్మణులను చూసి, తనమంత్రి అయిన హనుమతో వాళ్ళెవరో వివరాలు తెలియగోరతాడు.

అప్పుడు ఆ అంజనిపుత్రుడు శ్రీరామలక్ష్మణుల వద్దకు కామరుపంలో వెళతాడు. కానీ కామరుపంలో ఉన్న హనుమని శ్రీరామచంద్రుడు గుర్తించగా, లక్ష్మణుడు తమ వివరాలు చెప్పగా మళ్ళి రాముడు హనుమ సంభోదిస్తే, హనుమ తన నిజ స్వరూపంతో స్వామిని ఋష్యమూక పర్వతంపైకి తీసుకువెళతాడు.

ఋష్యమూక పర్వతంపై శ్రీరామసుగ్రీవుల స్నేహం కుదురుతుంది. సీత గురించి చెబితే, హనుమ సీతమ్మవారి నగలు తెచ్చి రామునికి ఇస్తాడు. నగలు సీతమ్మవే అని గుర్తించి మరల శ్రీరాముడు దుఃఖిస్తాడు. తరువాత సుగ్రీవుడు తన కధని శ్రీరామునికి చెపుతాడు.

అధర్మంగా సుగ్రీవుని రాజ్యబహిష్కరించి, సుగ్రీవుని భార్య అయిన రుమని వాలి అనుభవించడం విన్న శ్రీరామచంద్రమూర్తి వాలిని చంపడానికే నిశ్చయిస్తాడు. వాలి సుగ్రీవుల ద్వంద్వ యుద్దంలో పూలమాల లేని వాలిని శ్రీరాముడు చెట్టు చాటునుండి బాణంతో కొడతాడు. రామబాణం తగిలిన వాలి రాముని చూసి ఇదేమి ధర్మం చెట్టు చాటునుండి బాణప్రయోగం ఏమిటి ? అని అడిగితే.

దానికి రాముడు వ్యన్యమృగాలను చెట్టు చాటునుండి కొట్టడం ధర్మమే, అందులోను నీవు అధర్మం వైపు ఉన్నావు కాబట్టి ఈ విధంగా శిక్షించాను అని చెబుతాడు. అంగదుడుని సుగ్రీవునికి అప్పగించి వాలి మరణిస్తాడు.

సీతాన్వేషణకు హనుమ, జాంబవంత, అంగద తదితర వానరులు బయలుదేరడం…

సుగ్రీవ పట్టాభిషేకం తరువాయి సుగ్రీవుడు రాజ్యభోగాలలో ఉండి, సీతాన్వేషణ విషయం రాముని విషయం మరుస్తాడు. లక్ష్మణస్వామి ఆగ్రహించి సుగ్రీవుని వద్దకు వస్తే, తార మాటలతో చల్లబడ్డ లక్ష్మణస్వామితో సుగ్రీవుడు క్షమాపణ వేడుకుని, రాముని వద్దకు చేరి, సీతాన్వేషణకు వానరాలను నలుదిశలకు పంపుతాడు.

హనుమతో కూడిన అంగద, జాంబవంతుడు మొదలైన వానరులు దక్షిణంవైపు వెళతారు. అయితే హనుమ రాముని నుండి గుర్తుగా ఉంగరం పొంది ఉంటాడు. అలా దక్షిణదిక్కులో ఉన్న సముద్రం దాటే విషయమై వానరులు అందరూ తర్జనబర్జన పడి, చివరికి హనుమనే వేడుకుని, ఆంజనేయస్వామి శక్తిని వేనోళ్ళ పొగుడుతారు.

ఇతరులు గుర్తుచేస్తేకానీ తనశక్తిని గుర్తించలేని మునిశాపం నుండి విముక్తుడై సీతాన్వేషణకు రామబాణంలా సముద్రం దాటుతాడు, హనుమ.

హనుమ లంకలో కావలి కాస్తున్న లంకిణిని ఓడించి, లంకలో ప్రవేశిస్తాడు. అప్పటికి లంకలో రావణుడు సీతమ్మకి రెండూ మసాల గడువు విదించి వెళతాడు. దుఃఖితరాలుగా సీతమ్మ కూర్చుని ఉన్న చెట్టుపై ఉన్న హనుమ రామకధ వినిపించి, అయిన రాక్షస మాయేమో అని శంకించిన సీతమ్మకి రామచంద్రుని ముద్రికను సీతమ్మకి చూపుతాడు.

తనబుజాలపై కూర్చోతల్లి రాముని చెంతకు చేర్చుతాను అని హనుమ పలికితే, సీతమ్మ రాముడే తనభార్యని అయిన నన్ను యుద్దంలో రావణుడిపై గెలిచి తీసుకువెళ్లాలని చెప్పి, తన చూడామణిని హనుమకి ఇచ్చి పంపుతుంది.

వెనుకకు వెళ్తూ హనుమ వనమంతా చెట్ల కొమ్మలు విరిచి కొంతమంది రాక్షసులను నిర్జిస్తాడు. ఇక రావణుడు కొడుకు బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి, పట్టుబడతాడు, హనుమ. సభలో ఆంజనేయస్వామి తన శక్తిని చూపి రామచంద్రుని శరణువేడుకో అని హితవు చెప్పగా, దానికి బదులుగా రావణుడు ఆంజనేయస్వామితోకకి నిప్పంటించమని చెబుతాడు.

ఎవరు అంటించిన నిప్పు వారినే తగలబెట్టినట్టు, ఆంజనేయ స్వామి తనతోకతో లంకలో కొన్ని భవంతులను కాల్చి మరీ రాముని చెంతకు వెళతాడు.

రామరావణ యుద్ధం – శ్రీరామ పట్టాభిషేకం సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ

సీతమ్మ ఇచ్చిన చూడామణి చూసి రామలక్ష్మణులు, సుగ్రీవాది వానరులతో కలిసి యుద్దానికి బయలుదేరతాడు. సముద్రుడు సహకారంతో సముద్రంపై వారధి ఏర్పరచుకుని రామలక్ష్మణులు యుద్ద సైన్యం అంతా లంక చేరతారు.

యుద్ధం మొదలై అనేకమంది వానర యోధులు యుద్ద విన్యాసాలు, లక్ష్మణస్వామి యుద్దనైపుణ్యం, రామరావణుల సంగ్రామంలో రావణుడు మరణిస్తాడు. రావణమరణానంతరం విభీషణుడికి పట్టాభిషేకం చేసి, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, సుగ్రీవుడు మొదలైనవారితో అయోధ్య చేరతారు. అయోధ్యలో శ్రీరామపట్టాభిషేకం జరిగాక, రామచంద్రమూర్తి పరిపాలనలో అయోధ్య ధర్మపదంలో నడుస్తుంది.

శ్రీరామపట్టాభిషేకంతో సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ ముగుస్తుంది.

రామాయణం రాముని చరితము, హనుమాన్, సుందరకాండ వినడం అంటే అది అదృష్టం అయితే, గురువుగారు చాగంటి కోటేశ్వర రావు గారి నోట పలికిన అమృతపలుకులు వినడం మరీ అదృష్టమే.

తెలుగురీడ్స్.కామ్

అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు తెలుగు బాయ్స్ నేమ్స్, తెలుగు గర్ల్ నేమ్స్ తెలుగురీడ్స్ మొబైల్ యాప్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి మీ ఆండ్రాయిడ్ ఫోనులో…. ఈ క్రింది బటన్ టచ్ చేయండి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?