గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి సద్గురువులకు ఆలవాలం మన భారతదేశం. మన భారతీయ గురువులు దార్శినికత ఎంతో గొప్పదిగా పండితులు చెబుతూ ఉంటారు. వారు భవిష్యత్తును తమ మనో నేత్రంతో దర్శించి, భారతీయులకు అవసరమైన భక్తితత్వం, ఆత్మతత్వం, యోగ విజ్ఙానం వంటివి అందించారని చెబుతారు.

బ్రహ్మమును తెలియగోరువారికి బ్రహ్మము తెలిసిన వారి మార్గదర్శకము తప్పనిసరిగా చెబుతారు. పరబ్రహ్మ కాల స్వరూపంగా ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తాడో తెలియదు. కాలస్వరూపుడు కాలంలో కలిగజేసే కష్టకాలం పరీక్షా కాలంగా చెబుతారు. అటువంటి పరీక్షాకాలం గట్టెక్కాలంటే, సరైన గురువు అనుగ్రహం వలన సాధ్యమంటారు. గురువు అనుగ్రహం ఉంటే ఈశ్వరానుగ్రహం కలిగినట్టేనని పండితులు అంటారు.

గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ లో గురువిజ్ఙాన సర్వస్వము తెలుగు ఉచిత పుస్తకము ఆన్ లైన్లో లభిస్తుంది. ఇందులో శ్రీకృష్ణం వందే జగద్గురుమ్, శ్రీ దక్షిణామూర్తి స్త్రోత్రమ్, శ్రీశంకరాచార్య కృత గుర్వష్టకమ్, శ్రీ గురు పాదుకాప్త్రోత్రమ్ తదితర గురుస్త్రోత్రాలతో బాటు వాటి భావములను తెలియజేస్తూ ఈ తెలుగుబుక్ ఉంటుంది. గురువిజ్ఙానమునకు సంబంధించిన స్త్రోత్రములు ఎక్కువగా ఈబుక్ లో ఉంటాయి. గురువిజ్ఙాన సర్వస్వము తెలుగు ఫ్రీ పిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

విశ్వామిత్ర మహర్షి అంటే కోపం గుర్తుకు వస్తుంది అంటారు, కానీ అంతే స్థాయిలో పట్టుదల కూడా ఎక్కువే, తనపై తనకు ఉండే అచంచలమైన విశ్వాసముతో బ్రహ్మ, మహేశ్వరులను మెప్పించగలిగాడు. అనేక సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. వశిష్ఠ మహర్షిపై కోపంతో, తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారిన మహారాజు చరిత్ర అమూల్యమైనదిగా చెబుతారు. ఈ మహర్షి సత్యహరిశ్చంద్ర మహారాజుని ముప్పుతిప్పలు పెట్టి, సత్యహరిశ్చంద్రుడి కీర్తిని ఆచంద్రతార్కమునకు విస్తరింపజేశాడు. ఇంకా శ్రీరామలక్ష్మణులకు గురువు అయ్యాడు. విశ్వామిత్ర మహర్షి గురించి తెలియజేసే తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

మరిన్ని గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

యోగుల జీవితాలలో జరిగే అద్భుతాలు భగవంతునిపై నమ్మకం, భగవంతుని స్వరూపంపై ఒక అవగాహన ఏర్పడుతుందని అంటారు. అటువంటి యోగుల జీవిత చరిత్రలను చదవడం మనసుకు మేలు కలుగును అంటారు. అటువంటి యోగులలో పరమహంస యోగానంద్ గారి ఆత్మకధ తెలుగు ఉచిత పుస్తకం ఆన్ లైనో ఉచితంగా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ఈ తెలుగు ఫ్రీబుక్ మీరు ఫ్రీగా పిడిఎఫ్ ఫార్మట్లో రీడ్ చేయవచ్చును.

కంచికామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవునిగా అందరూ కీర్తిస్తారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారితో నీలంరాజు వెంకటశేషయ్య గారు తనకున్న అనుభవాలతో, తన మిత్రుల అనుభవాలతో ఆయనే రచించిన తెలుగు ఫ్రీబుక్ నడిచే దేవుడు. ఈ పుస్తకంలో నీలంరాజు వెంకటశేషయ్యగారు పరమచార్యులను దర్శించుకున్న సందర్భం నుండి ప్ర్రారంభం అవుతుంది. నడిచే దేవుడు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి గురించి తెలియజేసే నడిచే దేవుడు తెలుగు ఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

మనిషికున్న నాలుగు రుణములలో ఋషి రుణం కూడా ఒక్కటిగా పండితులు చెబుతారు. ఋషి ఋణం తీరాలంటే మహర్షులు రచించిన వాజ్ఙ్మయం చదవడమేనని చెబుతారు. ముఖ్యంగా వేదవ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణములను, మహాభారత, భాగవతాది గ్రంధపఠనము చేయాలని చెబుతూ ఉంటారు. ఇంకా మనకు అగస్త్య మహర్షి, అత్రి మహర్షి, అష్టావక్ర మహర్షి, ఋష్యశృంగ మహర్షి, కపిల మహర్షి, గౌతమ మహర్షి, చ్యవన మహర్షి, జమదగ్ని మహర్షి, దధీచి మహర్షి, దత్తాత్రేయ మహర్షి, దుర్వాసో మహర్షి మొదలైన మహర్షుల గురించి పెద్దలు చెబుతూ ఉంటారు లేదా శాస్త్రములలో వీరి చరితములు ఉంటాయి. ఈ మహర్షుల జన్మ కధలు, జీవితంలో ముఖ్య ఘట్టాలు తదితర విషయాలతో కూడిన మహర్షుల చరిత్ర తెలుగు పుస్తకం ఉచితంగా ఆన్ లైన్లో లభిస్తుంది. మహర్షుల చరిత్ర తెలుగు ఫ్రీ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి వంశపారంపర్య గురువు. శ్రీరాముని మరొక గురువు అయిన విశ్వామిత్రుని జీవితాన్ని ప్రభావితం చేసిన బ్రహ్మశ్రీ వశిష్ఠుడు. ఈయన శాప ప్రభావం చేతనే శంతన కుమారుడు భీష్ముడుగా మారాడు. ఈయన అనుగ్రహం లోకంలో మంచిని పెంచే విధంగానే ఉంటుంది. విశ్వామిత్రుడుకు కోపం కలిగినా అది భక్తి వైపే దారితీసింది. భీష్ముడికి శాపం ఇచ్చినా, భీష్ముడి వలననే అనేక ధర్మాలు మరియు విష్ణు సహస్రనామం చెప్పబడ్డాయి. ఇంతటి శాంత మూర్తి, తపశ్శాలి అయిన వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకోవడం అమూల్యమైన విషయం. వశిష్ఠ మహర్షి గురించి తెలియజేసే తెలుగు ఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మన గురువులలో అనేకమంది అనేక ధర్మములను వారి రచనల ద్వారా తెలియజేస్తే, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఙానం ఇచ్చారు. ఇప్పటికీ ఈ గురువుగారు చెప్పిన విషయాలెన్నో జరిగినట్టుగా దుష్టాంతాలు కనబడ్డాయి. గుర్రాలకు బదులు నడిచే వాహానాలు వస్తాయని చెప్పినట్టు, కరెంటు దీపాలు గురించి చెప్పినట్టుగా మరిన్నే విషయాలు కాలజ్ఙానంలో కనబడతాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఙానం విన్నవారికి విపరీతాలు కూడా పెద్దగా ఆశ్చర్యపరచవు అంటారు. ఈయన గురించిన చరిత్రను తదితర విషయాలను చదవడానికి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర తెలుగు పుస్తకం ఆన్ లైన్లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ ఫ్రీతెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

ఇంకొన్ని గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు | చూడ చూడ రుచుల జాడవేరు | పురుషులందు పుణ్య పురుషులు వేరయా | విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఉప్పు కర్పూరం ఒకే రంగులో ఉంటాయి, కానీ రుచులు వేరు, అలాగే పురుషులలో పుణ్యాత్ములు వేరుగా ఉంటారు. ఈ పద్యం తెలియని తెలుగు విద్యార్ధి ఉండడు. ఈ పద్యం అంతగా తెలుగువారికి పరిచయం. ఈయన పద్యాలు చాలా పెద్ద పెద్ద భావనలు కలిగి ఉంటాయి. నీతితో కూడి ఉంటాయి. వేమన రచించిన వేమన పద్యాలు వేమన శతకంగా చెబుతారు. ఈ యోగి ద్వారా చెప్పిన పద్యాలు లోక ప్రసిద్ది చెందినవి. ఐదువేల వేమన తెలుగు పద్యాలు కలిగిన తెలుగు పుస్తకం ఉచితంగా లభిస్తుంది. వేమనపద్యాలు5000 తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీదత్త గురుచరిత్ర చదవడం వలన అనేక శుభాలు కలుగుతాయని అంటారు. శ్రీదత్త అనుగ్రహం ఉంటే, ఇష్టాకామ్యాలు నెరవేరతాయని చెబుతారు. గురుదత్త అనుగ్రహం కోసం శ్రీదత్తగురుచరిత్ర పారాయణం నియమనిష్ఠలతో చేయమంటారు. శ్లోకములు వాటికి తాత్పర్యములు కలిగి శ్రీదత్త గురుచరిత్ర తెలుగు పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఈ తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గురు పారాయణ గ్రంధాలలో శ్రీగురుచరిత్ర విశేషంగా చెబుతారు. నియమనిష్ఠలతో పారాయణం చేయడం వలన సత్ఫలితాలను సాధించవచ్చని చెబుతారు. 52 అధ్యాయాలు కలిగిన శ్రీగురుచరిత్ర తెలుగు పుస్తకం ఒక వారం రోజులపాటు లేక రెండు వారాలపాటు లేక మూడువారాలపాటు నిత్య పారాయాణం చేయవచ్చు అంటారు. ఈ పుస్తకంలోనే మీకు ఏరోజు ఏ అధ్యాయం నుండి ఏ అధ్యాయం వరకు చదవాలో, ఆహార నియమాల గురించి సూచించబడింది. శ్రీగురుచరిత్ర తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షిర్డీ సాయిబాబ గురుస్వరూపంగా భక్తులను అనుగ్రహిస్తున్న దైవస్వరూపుడు. శతాబ్ధం ముందు సాయిబాబ మహిమలను చూసినవారు ఎక్కువగా ఉంటారు. ఆత్మతత్వం గురించి షిర్డీ సాయిబాబ చూపిన లీలలు, మహాత్యములు అసామాన్యంగా ఉంటాయి. గురు స్వరూపం అనగానే ప్రత్యక్షంగా షిర్డి సాయిబాబ స్వరూపం మనకు కనబడుతుంది. షిర్డీసాయిబాబ చరిత్రను తెలియజేసే సచ్చరిత్ర తెలుగుపుస్తకం ఉచితంగా లభిస్తుంది.  షిరిడి సాయిబాబా సచ్చరిత్రము తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగులో గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశములకు తెలియజేసిన మహానుభావుడు మన వివేకానందస్వామి. మన భారతీయ సంస్కృతి గురించి విదేశియులు గొప్పగా మాట్లాడుకునే లాగా మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనుడు స్వామి వివేకానంద. విదేశాల్లో వివేకానందస్వామి చేసిన తొలి ప్రసంగం ఇప్పటికీ అత్యుత్తమంగానే విదేశియులు భావిస్తారు. రామకృష్ణ పరమహంస ప్రియశిష్యుడు అయిన వివేకానందుడు అసలు పేరు నరేంద్రుడు. భగవంతుడిని చూడాలనే తలంపుతో భగవంతుడిని చూపించేవారి కోసం ఎదురు చూస్తున్న నరేంద్రుడికి రామకృష్ణ పరమహంస దగ్గర సమాధానం లభిస్తుంది. స్వామి వివేకానంద చరిత్ర తెలుగుపుస్తకం ఉచితంగా లభిస్తుంది.  వివేకానంద జీవిత చరిత్ర తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మహాభారతంలో పాండవులకు గురువు అయిన ద్రోణాచార్యులు వారు, విద్య నేర్పడంలో ఆచార్యులుగానే వ్యవహరించారు అని అంటారు. ఆవేశగుణం ఉన్న కొడుకుకు బ్రహ్మాస్త్రం గురించి పూర్తిగా వివరించకుండా, శిష్యుడైన అర్జునిడికి ఆ విషయం సవివరంగా నేర్పించాడు. కేవలం తనను చంపడానికే పుట్టిన వ్యక్తి విలువిద్యను నేర్పించాడు. ఒక కుక్క విషయంలో విచక్షణారహితంగా ప్రవర్తించిన ఏకలవ్యుడికి అసాధరణ విద్య ప్రమాదకరమని, ఏకలవ్యుడి బ్రొటనవేలును గురుదక్షిణగా స్వీకరించాడు. ఇలా ద్రోణాచార్యులు విద్యను నేర్పించడంలో పాత్రతనెరిగి ప్రవర్తించారని పండితులు చెబుతారు. ద్రోణాచార్యుల గురించిన తెలుగుఫ్రీబుక్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

జగద్గురు శ్రీఆది శంకరాచార్య భారతదేశం అంతా నడిచి అవైదిక వాదనలను త్రోసిపుచ్చిన అపర శంకరుని అవతారం. ఈయన దయతో సనాతన ధర్మం మరలా పునరుజ్జీవం పొందిందని పెద్దలు చెబుతారు. ఆది శంకరాచార్యులు రచించిన పలు దేవతా స్త్రోత్రాలు మహిమాన్వితమైనవి. ముఖ్యంగా కనకధారా స్త్రోత్రం, భజగోవిందం, అష్టపది తదితర స్త్రోత్రాలు భగవంతుని ప్రార్ధించడంలో గొప్ప స్త్రోత్రాలుగా చెప్పబడతాయి. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల గురించి తెలియజేసే తెలుగుపుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఈ ఫ్రీపిడిఎఫ్ తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఎందరో గురువులు భారతదేశంలో వేదమును విస్తరింపచేయడంలో, సామాన్యులకు స్త్రోత్రాల రూపంలోనూ, మంచి మాటల రూపంలోనూ అందుబాటులోకి రావాడానికి కృషి చేశారు. ఇది మన భారతీయుల అదృష్టంగానే భావిస్తారు. అలాంటి గురువులు అందించిన శాస్త్రమును తెలుసుకోవడంతో బాటు, ఆయా గురువుల గురించి కూడా తెలుసుకోవడం మేలని పండితులు చెబుతారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్