Tag Archives: శ్రీకృష్ణుడు

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ కి ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది.

కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, కృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”.

దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు వరాలు కోరుతాడు. పరమశివుడు నీ తల్లి తప్ప నిన్ను ఎవరూ వధించలేరని చెప్పి అంతర్ధానం అవుతాడు.

కన్నతల్లి కొడుకుపై కత్తి దూయటం అసాద్యం కాబట్టి, తనకు మరణం లేదని భావించిన నరకుడు, తన బలంతో రెచ్చిపోతాడు. దేవేంద్రుని పదవిని ఆక్రమిస్తాడు. ఇంకా దేవమాత అయిన అదితి దగ్గర నుండి చెవి కుండళాలు చేజిక్కుంచుకుంటాడు. సాధుజనులను భాదిస్తూ, తాను ఆనందిస్తూ ఉంటాడు. కృష్ణభక్తులను బాధిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రజలకు భూలోకంలోనే నరకలోకయాతనలను చూపిస్తాడు.

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

ద్వారకలో శ్రీకృష్ణు(ఎన్టీ.రామారావు)ని ఆశ్రయంలో ఉన్న నాగదత్తుడి(గుమ్మడి) కూతురు అయిన వసుమతి(ఎస్.వరలక్ష్మి)ని నరకుడు వంచించి తన భార్యగా చేసుకుంటాడు. నారదుడు(కాంతారావు) వలన నరకుడి వంచన సత్యభామ(సావిత్రి), శ్రీకృష్ణులకు తెలుస్తుంది. నరకుడిని భర్తగా అంగీకరించిన వసుమతిని, నాగదత్తుడు నరకుని వధించమని చెబుతాడు. దానికి వసుమతి భర్తే నాదైవమని, నేను నా భర్తను చంపలేనని తేల్చి చెప్పడంతో నాగదత్తుడు నిష్ర్కమిస్తాడు. కానీ తానే నరకుని చంపబోయి, నరకునికి చిక్కి చెరసాల పాలవుతాడు. దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ.

అజేయ బలపరాక్రమాలు కలిగిన నరకుడు తన బలగంతో సాధువులను యజ్ఙయాగాదులలోని అవిస్సులను నరకుడికే అర్పించాలంటూ, వారిని హింసిస్తూ ఉంటాడు. నరకుడి చావు తన చేతిలో లేకపోవడంతో శ్రీకృష్ణుడు నారదునితో నరకునికి హితవు చెప్పిస్తాడు. నారదుని హితవుని నరకుడు లెక్కపెట్టడు. ఇంకా రెచ్చిపోయి సాధు జనులను హింసించడం పెంచుతాడు, వారు చేస్తున్న యజ్ఙయాగాదులను ద్వంసం చేయిస్తూ ఉంటాడు.

నారదుడి సలహామేరకు వసుమతి తన కొడుకుని, చెరసాలలో ఉన్న తన తండ్రి నాగదత్తుడి దగ్గరకు తీసుకువెళుతంది. ఈ విషయం గమనించిన నరకుడు తన కొడుకుని వసుమతి దగ్గర నుండి తీసుకుని, వసుమతిని కూడా చెరసాలలో పెడతాడు. ఇంకా నరకుడు శ్రీకృష్ణుని వేషంలో వచ్చి లోకంలో ఉన్న పడచులను అపహరించుకుపోతాడు. ఈ విషయం సత్యభామకు తెలిసి, శ్రీకృష్ణుని నిలదీస్తుంది. కానీ కృష్ణుని మాటలచేత ఆపని కృష్ణుడు చేయలేదని గ్రహిస్తుంది. అయితే ఆపని నరకుడే చేసాడని, నారదునిచేత తెలుసుకున్న సత్యభామ, ఆ నరకుడిని అంతం చేస్తానని నారదుడుకి మాట ఇస్తుంది.

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

నరకుడు నాగదత్తుడి కనుగుడ్లు పీకించేస్తాడు. సాధుజనులను హింసించడం కొనసాగిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ సభకు నాగదత్తుడు, అదితి కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో నరకుని ఆకృత్యాలను మొరపెట్టుకుంటారు. దానితో శ్రీకృష్ణపరమాత్మ, సత్యభామతో కలిసి నరకునితో యుద్ధానికి వెళతాడు. భూదేవి పుత్రుడైన నరకుడు, భూదేవి అవతారం అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరక బాధలనుండి విముక్తి పొందిన ప్రజలు దీపాలు వెలిగించి, దీపావళి పండుగ చేసుకుంటారు.

సాక్షాత్తు భూదేవి బిడ్డడు, పరమశివుని వరాలు కానీ వ్యగ్రతతో పీడిత బుద్దితో ప్రజలను నరకయాతన పెట్టిన ఘనుడు నరకుడు. అందుకే భగవానుడు కన్నతల్లి చేతుతోనే మరణించేలా చేస్తాడు. లోకపీడితంగా మారితే, ప్రకృతిలోని మాతృస్వభావం చూస్తూ ఊరుకోదు. అలాగే నరకుని ఆకృత్యాలు విన్న సత్యభామ అతనిపై యుద్ధం చేస్తుంది. లోకాన్ని రక్షిస్తుంది. అలనాటి పాత సినిమాలలో ఈ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ పౌరాణిక సినిమా…

దీపావళి సినిమా చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది.

అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా. రేవతి-బలరాముల ఆడబిడ్డ శశిరేఖని, సుభద్ర-అర్జునుల మగబిడ్డ అభిమన్యునికి ఇచ్చి వివాహాం చేయాలని, వారి బాల్యంలోనే పెద్దలు మాటలు ఇచ్చిపుచ్చుకుంటారు. అటుపై సుభద్ర అభిమన్యుని తీసుకుని తన మెట్టింటికి బయలుదేరుతుంది.

శ్రీకృష్ణుడు పాండవులు రాజసూయ యాగం నుండి ద్వారకకు తిరిగి వస్తూ, ధర్మరాజు ఇచ్చిన బహుమతులను తీసుకుని వస్తాడు. వాటిని బలరాముడికి, శశిరేఖకు బహూకరిస్తాడు. బలరామునికి ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”దానిపై నిలబడిన ఎవరైనా సరే, వారి మనసులోని కుఠిలం స్వయంగా వెల్లడి చేసేస్తారు.” ఇంకా శశిరేఖకు ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”ఆ పెట్టెని తెరిచి చూస్తే మనసులో ఏది ఎక్కువ ఇష్టంగా ఉంటే ఆ వస్తువు కానీ లేక ఆ వ్యక్తికాని కనబడతారు” దానిని తెరిచి చూసిన శశిరేఖకు తన బావ అభిమన్యుడు కనబడతాడు.

నిండు సభలో ద్రౌపదికి అవమానం

శ్రీకృష్ణుడు వేరొక చోట ఉండగానే, పాండవులకు జగిరిన అన్యాయం తెలుసుకుంటాడు. అప్పుడు నిండుసభలో ద్రౌపదిపై జరిగిన ఆకృత్యం కూడా స్వామికి తెలయబడడం, ఆమెకు శ్రీకృష్ణ భగవానుడు తనమహిమచేత నిరంతర వస్త్రం ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు పరధ్యానంలోకి వెళ్లడం గమనించిన బలరాముడు, శ్రీకృష్ణుడిని ఏమయ్యిందని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు, తనవారితో పాండవులకు జరిగిన అన్యాయం గురించి, కౌరవులు వడిగట్టిన దారుణాలను వివరిస్తాడు. వెంటనే బలరాముడు ”నేను ధర్యోధనుడిని హెచ్చరించి, పాండవులు రాజ్యాన్ని పాండవులకు తిరిగి వచ్చేలా చేస్తానని” ద్వారక నుండి హస్తినాపురానికి బయలుదేరతాడు.

హస్తినాపురంలో ధర్యోధనుడుకి బలరాముడు వస్తున్నాడనే సమాచారంతో దిగులు చెందుతుంటే, అతని మేనమామ శకుని ”ఎందుకు..దిగులు, బలరాముడుని స్థుతి చేయడం ద్వారా అతనిని ఇట్టే ప్రసన్నం చేసుకోవచ్చును, కావునా బలరాముడికి బ్రహ్మరధం పట్టేవిధంగా ” ఆహ్వానం పలకమని చెబుతూ ఇంకా ”మన లక్ష్మణ కుమారునికి, బలరాముని కూతురు శశిరేఖను ఇచ్చ వివాహం చేయమని అడుగు, ఈ వివాహం జరిగితే భవిష్యత్తులో యాదవ వంశంవారు అంతా మనవైపే ఉండవలసి ఉంటుంది” అని బోధ చేస్తాడు. శకుని సలహాతో ధర్యోధనాధులు సంతోషిస్తారు. మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ.

బలరామునికి ధర్యోధనుడు సకల మర్యాదలు చేసి, ఆసనం వేసి పాదసేవ చేస్తూ ఉంటు అన్ని విషయాలు తమకు అనకూలంగా ఏకరువు పెడతారు. పాండవులు తప్పు చేసినట్టుగా, పాండవులపై ఆరోపణలు చేస్తూ బలరాముడికి ధుర్యోధనాదులు మాటలు ఎక్కిస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణ కుమారుడుకు, శశిరేఖను ఇచ్చి వివాహం చేయవలసినదిగా వరం కోరతాడు, ధర్యోధనుడు. అప్పటికే ధర్యోధనుడు కపట మర్యాదలకు సంతోషించిన బలరాముడు, ధర్యోధనుడు కోరికకు అంగీకారం తెలుపుతాడు. అక్కడి నుండి బలరాముడు, ధర్యోధనుడు ఇచ్చిన అనేక కానుకలను స్వీకరించి తిరిగి ద్వారకకు వస్తాడు.

పాండవులు వనవసానికి వెళ్ళే పమయం

పాండవుల వనవాసానికి వెళ్లే సమయంలో సుభద్ర తన వీరకుమారుడు అభిమన్యునితో కలసి, శ్రీకృష్ణుడి నివాసానికి చేరుతుంది. అయితే ధర్యోధనుడికి ఇచ్చన మాటకు లోబడిన, రేవతి-బలరాములు శశిరేఖను, అభిమన్యునితో కలవకుండా కట్టడి చేస్తారు. శశిరేఖా-లక్ష్మణ కుమారుల వివాహం నిశ్చయం చేస్తారు. సుభద్ర బలరాముడిని తనకు ఇచ్చిన మాట గురించి అడిగినా, రేవతి, బలరాముల మనసు మారదు. దాంతో సుభద్ర అభిమన్యుని తీసుకుని, పాండవుల దగ్గరకు బయలుదేరుతుంది.

అయితే అడవిలో భీమసేనుడి కుమారుడు అయిన ఘటోత్కచుడు ఉన్న చోటికే అభిమన్యుడు చేరుకుంటుండగా, ఘటోత్కచుడు-అభిమన్యుడికి యుద్దం జరుగుతుంది. చివరికి సుభద్ర ప్రతిజ్ఙ చేయబోతూ తనవారి పేరు చెప్పడంతో…వెంటనే ఘటోత్కచుడు సుభద్ర కాళ్లపై పడి శరణు వేడుకుంటాడు. తను ఎవరో చెబతాడు. సుభద్ర, అభిమన్యులు ఘటోత్కచుని ఆహ్వానం మేరకు, వారి నివాసానికి చేరతారు. శశిరేఖా పరిణయం గురించి వివరం తెలుసుకున్న ఘటోత్కచుడు, ద్వారకలో శ్రీకృష్ణుడిని కలుసుకుంటాడు. అక్కడి ఇరువురి మాయా పధకంలో భాగంగా అసలు శశిరేఖని అభిమన్యుని దగ్గరకు చేర్చి, ఘటోత్కచుడు శశిరేఖ వేషంలో లక్ష్మణ కుమారునితో వివాహ ప్రక్రియలో పాల్గొంటాడు. ఇక అక్కడి సినిమాలో తిరిగే మలుపులు మనసుని మరింత రంజింప చేస్తాయి. శ్రీకృష్ణుడి పర్యవేక్షణలో ఘటోత్కచుని మాయాప్రభంజనం ధుర్యోధనాదులను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందీ…వివరణ కన్నా వీక్షణ బాగుంటుంది. మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు  శ్రీకృష్ణావతారం చిత్రంలో నటించారు.

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ కధ

దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం, ఋషులు, దేవతలు, భూమాత మొరపెట్టుకుంటే శిష్ట రక్షణార్ధం దుష్టులను నిర్జించడానికి అవతరిస్తానని మాట ఇచ్చిన శ్రీమహావిష్ణువు. సాధుజనులకు ధర్మపరాయణులకు రక్షకుడు అయినా శ్రీమహావిష్ణువు అవతారం కృష్ణావతారం.

కంసుడు తన చెల్లెలికి దేవకికి వసుదేవుడుని ఇచ్చి వివాహం చేసి అంగరంగ వైభంగా రధసారధిగా బావగారిని చెల్లెల్ని అత్తవారింటికి సాగనంపుతుంటే ఆకాశవాణి హెచ్చరిక చేస్తుంది, నీ చెల్లెలి కడుపున పుట్టబోయే ఎనిమిదవ బాలుడు చేతిలో మరణం ఉంటుంది అని. అందుకు వెంటనే చెల్లెలిపై కత్తి దూసిన కంసుడుని వసుదేవుడు వారించి, నీ చెల్లెలి వలన నీకు ఆపద లేదు కదా నీ చెల్లెలి సంతానం వలననే కదా, ఆమెకు సంతానం కలగగానే నీకు అప్పజెప్పుతానని చెప్పడంతో ఆలోచనచేసిన కంసుడు ఆ ప్రయత్నం విరమిస్తాడు. అయితే అంతవరకూ దేవకీ-వసుదేవులను తన ఇంటే ఉంచుతాడు. కారణాంతరాల వలన తన భద్రత కోసం ఏడుగురు పిల్లల్ని చంపుతాడు కంసుడు. దేవకీ వసుదేవులను కారాగారంలో బందించి ఉంచుతాడు. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

అష్టమ గర్భంతో ఉన్న దేవకీ కారాగారంలో భర్త వసుదేవులతో కలిసి ఉంటుంది. శ్రావణ మాసం అష్టమి తిథి రాత్రి సమయంలో చీకటిలో శ్రీమహావిష్ణువు దేవకీ అష్టమ గర్భవాసం చేసి కారాగారంలో జన్మిస్తాడు. వెంటనే శ్రీమహావిష్ణువుగా దేవకీవసుదేవులకు కనిపించి తనని గోకులంలో వదిలి అక్కడి యోగమాయ శిశువుగా ఉంది, ఆ శిశువుని ఇక్కడకు తెచ్చి పెట్టమని చెప్ప అంతర్ధానం అవుతారు. వసుదేవుడు బిడ్డని చేతుల్లోకి తీసుకోగానే కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపాలదారులు మాయానిద్రలోకి జారుతారు. వసుదేవుడు తన బిడ్డని ఎత్తుకుని గోకులంవైపు వెళ్తుంటే, యమునా నది రెండుగా చీలి దారి ఇస్తుంది. గోకులంలో ఆ బాలుడుని వదిలి, అక్కడి యోగమాయా శిశువుని తీసుకుని కారాగారం దగ్గరికి వచ్చేస్తాడు, వసుదేవుడు.

శ్రీకృష్ణ జననంతోనే లీలలు ప్రదర్శించే భగవానుడు – శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ

వసుదేవుడు కారాగారంలోకి రాగానే అక్కడ కమ్మిన యోగమాయ తొలగి స్థితి యదాస్థితిలోకి వస్తుంది. పసిపాప ఏడుపు వినగానే కాపలాదారు వెళ్లి కంసుడుకి చెప్పగానే, కంసుడు కారాగారంలో వచ్చి ఆ పసిపాపను చంపబోతాడు. కానీ కంసుడు ప్రయత్నం విఫలమై ఆ పాపా ఆకాశంలో శక్తిగా మారి నాతొబాటు పుట్టిన బిడ్డ క్షేమంగా ఉన్నాడు. అన్యాయంగా పసిబిడ్డలను చంపిన నీకు ఆ బాలుడి చేతిలోనే మరణం ఉంటుంది అని చెప్పి అంతర్ధానం అవుతుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

కృష్ణుడు నంద గోకులంలో బాల్యం నుండే లీలలు ప్రదర్శిస్తూ పెరుగుతాడు. పాలు త్రాగే వయసులోనే దుష్టబుద్ది కలిగిన పోతన అనే రాక్షసిని సంహరిస్తాడు. అలాగే శకటాసురుడిని కాలుతో తన్ని సంహరిస్తాడు. ప్రజలు నీరుత్రాగే కొలనులో విషం చిమ్ముతూ ఉండే కాళియ సర్పంపై నృత్యం చేసి, ఆ సర్పాన్ని కొలను నుండి వెల్లగొడతాడు. తన అల్లరితో అమ్మని ఆబాలగోపాలాన్ని అలరిస్తూ నందగోకులాన్ని ఆనందంలో ,ముంచెత్తుతాడు. కంసుడుని సంహరించి తన కన్నతల్లిదండ్రులతో కలిసి ద్వారకలో ఉంటాడు.

రుక్మిణికళ్యాణం, సత్యభామ, జాంబవతిలతో వివాహం

బాలకృష్ణుడు పెరిగి పెద్దవాడైన కృష్ణుడు విదర్భరాకుమారిగా ఉన్న శ్రీమహాలక్ష్మి అవతారం అయిన రుక్ముణిని వివాహమాడతాడు.
అయితే అనుకోకుండా శ్రీకృష్ణుడు పాలలో చంద్రుడిని దర్శిస్తాడు. అది వినాయకచవితి కావడం వలన ఆరోజు గణపతిని పూజించకుండా చంద్రదర్శనం చేసినవారికి నీలాపనిందలు ఉంటాయి, అని చంద్రుడికి అమ్మవారి శాపానుగ్రహం ఉంటుంది. వెంటనే జరిగిన పొరపాటుని గ్రహించిన శ్రీకృష్ణుడు వినాయక పూజ చేసిన అక్షతలను నెత్తిమీద వేసుకుని, విఘ్నేశ్వరుడుని ప్రార్ధన చేస్తాడు. ఇక తత్ఫలితం శ్రీకృష్ణుడికి సత్రాజిత్ రూపంలో నీలాపనింద వస్తుంది. సూర్యభగవానుడిని ప్రార్ధించి శమంతకమణిని పొందిన సాత్రజితు దేదిప్యామానంగా వెలుగాతాడు. శమంతకమణిని తనకు ఇవ్వవలసినదిగా అడిగిన కృష్ణుడి మాటను మన్నించడు సత్రాజిత్. అయితే సత్రాజిత్ సహోదరుడు అయిన ప్రసేనుడు మణిని ధరించి అడవికి వెళతాడు. అయితే మణిని ధరించి అడవికి వెళ్ళిన సోదరుడు ఎంతకీ రాకపోయేసరికి, తన సహోదరుడిని సంహరించి ఆ మణిని శ్రీకృష్ణుడే కాజేసాడని సత్రాజిత్ శ్రీకృష్ణుడిని నిందమోపుతాడు. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

నిందలపాలు అయిన శ్రీకృష్ణుడు మణిని ధరించి అడవికి వెళ్ళిన ప్రసేనుడుని వెతుకుతూ అడవికి బయలుదేరతాడు. వినాయకుడి అనుగ్రహం వలన శ్రీకృష్ణుడుకి దారిలో సింహ చంపిన ప్రసేనుడి శవం, సింహం జాడలతో బాటపట్టిన కృష్ణుడుకి మరణించిన సింహం కనబడి, ఆ దారిలో బల్లూకం జాడలు కనబడతాయి. ఆ జాడలు వెంటబడిన శ్రీకృష్ణుడు జాంబవంతుడి గృహకి చేరతాడు. అక్కడ జాంబవంతుడితో శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తాడు. రామావతారంలో రాముడితో యుద్ధం చేయాలనే కోరికను కోరిన జాంబవంతుడు, కృష్ణావతారంలో కృష్ణుడుతో తలబడతాడు. అయితే పోరాటంలో ఓడిన జాంబవంతుడుకి విషయం అవగతం అయ్యేలా శ్రీకృష్ణుడు చేస్తాడు. కృష్ణావతారంలో శ్రీరాముడు అని గ్రహించి తనకుమార్తె జాంబవతిని, శమంతక మణిని ఇచ్చి వివాహం చేస్తాడు.

శమంతకమణిని సత్రాజిత్ కి శ్రీకృష్ణుడు ఇచ్చేస్తాడు. అయితే సత్రాజిత్ తన తప్పుని తెలుసుకుని, శమంతక మణిని తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణుడుకి ఇచ్చి వివాహం చేస్తాడు. వినాయక చవితి రోజున చంద్ర దర్శనం చేసినందుకు నీలాపనిందలు కలిగితే, విఘ్నేశ్వరుడు అనుగ్రహం వలన శమంతకమణి తో బాటు ఇద్దరు భార్యామణులు లభిస్తారు. ఈ పౌరాణిక గాధకి ఫలశ్రుతిని కూడా పండితులు చెబుతారు, అంతలా ప్రసిద్ది పొందిన ఈ గాధ ప్రతి వర్షమున వినాయక చతుర్ధి రోజున పూజలో చెప్పుకోవడం కూడా మన భారతీయ సంస్కృతిగా అనాది నుండి వస్తుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

రాజసూయ యాగంలో శిశుపాలుని నూరో తప్పు

పాండవులు రాజసూయ యాగం చేస్తూ, ఆ యాగా ధర్మకర్తగా అగ్రపూజకు శ్రీకృష్ణుడుని ధర్మరాజు భీష్మాచార్యుల సూచనతో ఆహ్వానిస్తాడు. నిండుసభలో అగ్రపూజ అందుకోబుతున్న శ్రీకృష్ణుడిని అందుకు అర్హుడు కాదు అని శిశుపాలుడు అడ్డుపడి, శ్రీకృష్ణుడిని నానా దుర్భాషలాడుతాడు. శతతప్పుల వరకు వేచి చూస్తాను నూరవ తప్పు చేయగానే శిశుపాలుడిని సంహరిస్తానని శిశుపాలుడి తల్లికి మాట ఇచ్చిన శ్రీకృష్ణభగవానుడు, ఈ సభలో వందో తప్పు చేసిన శిశుపాలుడిని తన చక్రాయుధంతో సంహరిస్తాడు. ధర్మరాజు తన పూజని నిర్విఘ్నంగా ముగిస్తాడు.

బాల్యస్నేహితుడు అయిన కుచేలుడు కడు పేదరికంతో ఉండి, శ్రీకృష్ణ దర్శనార్ధం ద్వారకకు వస్తాడు. వచ్చిన చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణుడు కోసం అటుకుల మూట తీసుకువస్తాడు. సభలో శ్రీకృష్ణుడుచేత సేవలు పొందుతున్న కుచేలుడు తెచ్చిన అటుకులు ఇవ్వడానికి మొహమాటపడితే, శ్రీకృష్ణ భగవానుడు ఆ అటుకులను అభిమానంతో ఆరగిస్తున్నా కొలది కుచేలుడుకి దరిద్రం పోయి, అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.
మాయాజూదంలో ఓడిన పాండవ ధర్మపత్నిని నిండుసభలో ఘోర అవమాన ప్రయత్నంలో భాగంగా దుస్శాసునుడు ద్రౌపది వస్త్రపాహరణ దుశ్చర్యకు పాల్పడతాడు. ఆపదలో ద్రౌపది ప్రార్ధనని ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు, ద్రౌపదికి చీరలిచ్చి ఆమెకు రక్షణ కల్పిస్తాడు. కురుపాండవుల మధ్యలో యుద్ధం అనివార్యమైన స్థితిలో ధర్మరాజువైపు నిలబడి, ధర్మరాజు వైపు రాయభారిగా సుయోధనుడికి హితవు చెప్పినా వినని పరిస్థితులలో యుద్దానికి దారితీస్తుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

కురుక్షేత్రం అధర్మం ధర్మం మధ్య యుద్దం

కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో అద్బుతమైన ఘట్టం అక్కడే దుష్ట శిక్షణ శిష్ట రక్షణతో జరగడానికి ముందు లోకానికి అవసరమైన జ్ఞానాన్ని అర్జున విషాదయోగం ద్వారా భోదించాడు. భావంతుడి నోట భక్తుడికి చేసిన గీతపోదేశం భగవద్గీతగా జగద్విఖ్యాతి చెందింది. యుద్ధం రాజధర్మం కనుక నీవు రాజ్యాన్ని పాలించే రాజువి కాబట్టి నీ కర్తవ్యం ధర్మ రక్షణ చేయడం, అటువంటి ధర్మరక్షణలో తనకుమాలిన ధర్మంతో ఉంటావో నీకర్తవ్యమెరిగి ధర్మరక్షణ చేయుదువో నిర్ణయించుకో, ఫలితం నాకర్పించు, నీ పని నీవు చేయి అని తేల్చి చెబుతాడు. మోహం తొలగిన అర్జునుడు యుద్ధం ప్రారంభిస్తాడు.

యుద్దంలో భీష్మ పితామహ యుద్దానికి నిలబడలేకపోయిన అర్జునుడి ముందు శిఖండిని రప్పించే సూచనా, ద్రోణాచార్యులతో అస్త్ర సన్యాసం చేయించడానికి ధర్మరాజుతో అశ్వత్దామా అనే ఏనుగు మరణవార్తని, అశ్వత్దామా మరణించాడు అని గట్టిగా వినబడేలాగా ఏనుగు అని మెల్లగా చెప్పించిన శ్రీకృష్ణ భగవానుడు దృతరాష్ట్రుడి కుటిల బుద్దిని కనిపెట్టి, అతని భారి నుండి భీముడిని కాపాడి, గాంధారి చేత శాపానుగ్రహం పొందుతాడు. యదువంశంలో వారిలో వారే కలహించుకుని యదువంశం నశిస్తుందని. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna.

గాంధారి, మునుల శాపం వలన యదుయోధుల కలహం, వంశ క్షయం.

మునుల శాప ఫలితంగా యదువంశంలో ముసలం పుడుతుంది, ఆ ముసలం అరగదీసి సముద్రంలో కలిపేస్తారు యదుయోధులు. అయితే కొన్నాళ్ళకు సముద్రపు ఒడ్డులోనే మద్యం సేవించి ఒకరితో ఒకరు కలహించుకొని యదుయోధులు మరణిస్తారు. బలరాముడు సముద్రంలోకి వెళ్తాడు. ఒక కిరాతుడు అటుగా వస్తూ ఉంటే ముసలం ముక్క దొరుకుతుంది. ఆ ముక్కని బాణానికి పెట్టి జింక అనుకుని పొదలలో పడుకుని ఉన్న శ్రీకృష్ణ భగవానుని బొటనవేలుని కొడతాడు. తప్పు తెలుసుకున్న ఆ కిరాతుడు వచ్చి శ్రీకృష్ణ భగవానుడి కాళ్ళ మీదపడి జింక అనుకుని మీపాదానికి గురిపెట్టి కొట్టానని చెబుతాడు.

అందుకు శ్రీకృష్ణుడు మానవుడుగా పుట్టిన ప్రతిజీవి ఎదో ఒక సమయంలో చేసిన కర్మలకు ఫలితం అనుభవించాలి. త్రేతాయుగంలో నేనేరాముడుని నీవు వాలివి, నే నిన్ను సుగ్రీవుడు కోసం చెట్టుచాటు నుండి బాణంతో కొట్టాను. ఆ కర్మఫలితం ఇప్పుడు నీద్వారానే నాకు తీరిపోయింది. అని చెప్పి, అవతారం చాలిస్తాడు, శ్రీకృష్ణభగవానుడు.

మనసు, బుద్ది ప్రధానంగా సాగే సంసారంలో బుద్ది బలం యొక్క గొప్పతనం ధర్మాన్ని పట్టుకుంటే ధర్మంద్వారా ధర్మాన్ని పట్టుకున్నవారికి భగవానుడు రక్షణ చేస్తాడు, అని నిరూపిస్తూనే భగవానుడు అయినా మనిషిగా అవతరిస్తే కర్మశేషం అనుభవించాల్సిందే అనే సందేశం ఈచిత్రంలో కనబడుతుంది. రామావతారంలో జాంబవంతుడుకి ఇచ్చిన మాట, ధర్మంవైపు నిలిచిన సుగ్రీవునికి సహాయం చేయడానికి, జాతిధర్మం ప్రకారం వాలిని చెట్టుచాటు నుండి కొట్టిన ఫలితం కారణంగా, కృష్ణావతారంలో అదే వాలి కిరాతుడుగా పుట్టి బాణంతో పొదలమాటున నిద్రిస్తున్న కృష్ణుడు పాదంపై బాణప్రయోగం చేస్తాడు. అసలు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుట్టడం కూడా అంతకుముందు జన్మలలో వారికి భగవానుడు ఇచ్చిన వరమే. అలాగే యశోద దగ్గర పరమాత్మ పాలు త్రాగడానికి కూడా గత జన్మల్లో ఆమె చేసుకున్న పుణ్యఫలమే అని పండితులు చెబుతూ ఉంటారు.
కృష్ణావతారం గాధలు లీలలతో నిండి ఉంటే ఆ లీలలు ఏవయసు వారికి ఆ వయసుకు తగ్గట్టుగా మంచిని సూచిస్తూ ఉంటుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?