శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు  శ్రీకృష్ణావతారం చిత్రంలో నటించారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ కధ

దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం, ఋషులు, దేవతలు, భూమాత మొరపెట్టుకుంటే శిష్ట రక్షణార్ధం దుష్టులను నిర్జించడానికి అవతరిస్తానని మాట ఇచ్చిన శ్రీమహావిష్ణువు. సాధుజనులకు ధర్మపరాయణులకు రక్షకుడు అయినా శ్రీమహావిష్ణువు అవతారం కృష్ణావతారం.

కంసుడు తన చెల్లెలికి దేవకికి వసుదేవుడుని ఇచ్చి వివాహం చేసి అంగరంగ వైభంగా రధసారధిగా బావగారిని చెల్లెల్ని అత్తవారింటికి సాగనంపుతుంటే ఆకాశవాణి హెచ్చరిక చేస్తుంది, నీ చెల్లెలి కడుపున పుట్టబోయే ఎనిమిదవ బాలుడు చేతిలో మరణం ఉంటుంది అని. అందుకు వెంటనే చెల్లెలిపై కత్తి దూసిన కంసుడుని వసుదేవుడు వారించి, నీ చెల్లెలి వలన నీకు ఆపద లేదు కదా నీ చెల్లెలి సంతానం వలననే కదా, ఆమెకు సంతానం కలగగానే నీకు అప్పజెప్పుతానని చెప్పడంతో ఆలోచనచేసిన కంసుడు ఆ ప్రయత్నం విరమిస్తాడు. అయితే అంతవరకూ దేవకీ-వసుదేవులను తన ఇంటే ఉంచుతాడు. కారణాంతరాల వలన తన భద్రత కోసం ఏడుగురు పిల్లల్ని చంపుతాడు కంసుడు. దేవకీ వసుదేవులను కారాగారంలో బందించి ఉంచుతాడు. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

అష్టమ గర్భంతో ఉన్న దేవకీ కారాగారంలో భర్త వసుదేవులతో కలిసి ఉంటుంది. శ్రావణ మాసం అష్టమి తిథి రాత్రి సమయంలో చీకటిలో శ్రీమహావిష్ణువు దేవకీ అష్టమ గర్భవాసం చేసి కారాగారంలో జన్మిస్తాడు. వెంటనే శ్రీమహావిష్ణువుగా దేవకీవసుదేవులకు కనిపించి తనని గోకులంలో వదిలి అక్కడి యోగమాయ శిశువుగా ఉంది, ఆ శిశువుని ఇక్కడకు తెచ్చి పెట్టమని చెప్ప అంతర్ధానం అవుతారు. వసుదేవుడు బిడ్డని చేతుల్లోకి తీసుకోగానే కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపాలదారులు మాయానిద్రలోకి జారుతారు. వసుదేవుడు తన బిడ్డని ఎత్తుకుని గోకులంవైపు వెళ్తుంటే, యమునా నది రెండుగా చీలి దారి ఇస్తుంది. గోకులంలో ఆ బాలుడుని వదిలి, అక్కడి యోగమాయా శిశువుని తీసుకుని కారాగారం దగ్గరికి వచ్చేస్తాడు, వసుదేవుడు.

శ్రీకృష్ణ జననంతోనే లీలలు ప్రదర్శించే భగవానుడు – శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ

వసుదేవుడు కారాగారంలోకి రాగానే అక్కడ కమ్మిన యోగమాయ తొలగి స్థితి యదాస్థితిలోకి వస్తుంది. పసిపాప ఏడుపు వినగానే కాపలాదారు వెళ్లి కంసుడుకి చెప్పగానే, కంసుడు కారాగారంలో వచ్చి ఆ పసిపాపను చంపబోతాడు. కానీ కంసుడు ప్రయత్నం విఫలమై ఆ పాపా ఆకాశంలో శక్తిగా మారి నాతొబాటు పుట్టిన బిడ్డ క్షేమంగా ఉన్నాడు. అన్యాయంగా పసిబిడ్డలను చంపిన నీకు ఆ బాలుడి చేతిలోనే మరణం ఉంటుంది అని చెప్పి అంతర్ధానం అవుతుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

కృష్ణుడు నంద గోకులంలో బాల్యం నుండే లీలలు ప్రదర్శిస్తూ పెరుగుతాడు. పాలు త్రాగే వయసులోనే దుష్టబుద్ది కలిగిన పోతన అనే రాక్షసిని సంహరిస్తాడు. అలాగే శకటాసురుడిని కాలుతో తన్ని సంహరిస్తాడు. ప్రజలు నీరుత్రాగే కొలనులో విషం చిమ్ముతూ ఉండే కాళియ సర్పంపై నృత్యం చేసి, ఆ సర్పాన్ని కొలను నుండి వెల్లగొడతాడు. తన అల్లరితో అమ్మని ఆబాలగోపాలాన్ని అలరిస్తూ నందగోకులాన్ని ఆనందంలో ,ముంచెత్తుతాడు. కంసుడుని సంహరించి తన కన్నతల్లిదండ్రులతో కలిసి ద్వారకలో ఉంటాడు.

రుక్మిణికళ్యాణం, సత్యభామ, జాంబవతిలతో వివాహం

బాలకృష్ణుడు పెరిగి పెద్దవాడైన కృష్ణుడు విదర్భరాకుమారిగా ఉన్న శ్రీమహాలక్ష్మి అవతారం అయిన రుక్ముణిని వివాహమాడతాడు.
అయితే అనుకోకుండా శ్రీకృష్ణుడు పాలలో చంద్రుడిని దర్శిస్తాడు. అది వినాయకచవితి కావడం వలన ఆరోజు గణపతిని పూజించకుండా చంద్రదర్శనం చేసినవారికి నీలాపనిందలు ఉంటాయి, అని చంద్రుడికి అమ్మవారి శాపానుగ్రహం ఉంటుంది. వెంటనే జరిగిన పొరపాటుని గ్రహించిన శ్రీకృష్ణుడు వినాయక పూజ చేసిన అక్షతలను నెత్తిమీద వేసుకుని, విఘ్నేశ్వరుడుని ప్రార్ధన చేస్తాడు. ఇక తత్ఫలితం శ్రీకృష్ణుడికి సత్రాజిత్ రూపంలో నీలాపనింద వస్తుంది. సూర్యభగవానుడిని ప్రార్ధించి శమంతకమణిని పొందిన సాత్రజితు దేదిప్యామానంగా వెలుగాతాడు. శమంతకమణిని తనకు ఇవ్వవలసినదిగా అడిగిన కృష్ణుడి మాటను మన్నించడు సత్రాజిత్. అయితే సత్రాజిత్ సహోదరుడు అయిన ప్రసేనుడు మణిని ధరించి అడవికి వెళతాడు. అయితే మణిని ధరించి అడవికి వెళ్ళిన సోదరుడు ఎంతకీ రాకపోయేసరికి, తన సహోదరుడిని సంహరించి ఆ మణిని శ్రీకృష్ణుడే కాజేసాడని సత్రాజిత్ శ్రీకృష్ణుడిని నిందమోపుతాడు. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

నిందలపాలు అయిన శ్రీకృష్ణుడు మణిని ధరించి అడవికి వెళ్ళిన ప్రసేనుడుని వెతుకుతూ అడవికి బయలుదేరతాడు. వినాయకుడి అనుగ్రహం వలన శ్రీకృష్ణుడుకి దారిలో సింహ చంపిన ప్రసేనుడి శవం, సింహం జాడలతో బాటపట్టిన కృష్ణుడుకి మరణించిన సింహం కనబడి, ఆ దారిలో బల్లూకం జాడలు కనబడతాయి. ఆ జాడలు వెంటబడిన శ్రీకృష్ణుడు జాంబవంతుడి గృహకి చేరతాడు. అక్కడ జాంబవంతుడితో శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తాడు. రామావతారంలో రాముడితో యుద్ధం చేయాలనే కోరికను కోరిన జాంబవంతుడు, కృష్ణావతారంలో కృష్ణుడుతో తలబడతాడు. అయితే పోరాటంలో ఓడిన జాంబవంతుడుకి విషయం అవగతం అయ్యేలా శ్రీకృష్ణుడు చేస్తాడు. కృష్ణావతారంలో శ్రీరాముడు అని గ్రహించి తనకుమార్తె జాంబవతిని, శమంతక మణిని ఇచ్చి వివాహం చేస్తాడు.

శమంతకమణిని సత్రాజిత్ కి శ్రీకృష్ణుడు ఇచ్చేస్తాడు. అయితే సత్రాజిత్ తన తప్పుని తెలుసుకుని, శమంతక మణిని తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణుడుకి ఇచ్చి వివాహం చేస్తాడు. వినాయక చవితి రోజున చంద్ర దర్శనం చేసినందుకు నీలాపనిందలు కలిగితే, విఘ్నేశ్వరుడు అనుగ్రహం వలన శమంతకమణి తో బాటు ఇద్దరు భార్యామణులు లభిస్తారు. ఈ పౌరాణిక గాధకి ఫలశ్రుతిని కూడా పండితులు చెబుతారు, అంతలా ప్రసిద్ది పొందిన ఈ గాధ ప్రతి వర్షమున వినాయక చతుర్ధి రోజున పూజలో చెప్పుకోవడం కూడా మన భారతీయ సంస్కృతిగా అనాది నుండి వస్తుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

రాజసూయ యాగంలో శిశుపాలుని నూరో తప్పు

పాండవులు రాజసూయ యాగం చేస్తూ, ఆ యాగా ధర్మకర్తగా అగ్రపూజకు శ్రీకృష్ణుడుని ధర్మరాజు భీష్మాచార్యుల సూచనతో ఆహ్వానిస్తాడు. నిండుసభలో అగ్రపూజ అందుకోబుతున్న శ్రీకృష్ణుడిని అందుకు అర్హుడు కాదు అని శిశుపాలుడు అడ్డుపడి, శ్రీకృష్ణుడిని నానా దుర్భాషలాడుతాడు. శతతప్పుల వరకు వేచి చూస్తాను నూరవ తప్పు చేయగానే శిశుపాలుడిని సంహరిస్తానని శిశుపాలుడి తల్లికి మాట ఇచ్చిన శ్రీకృష్ణభగవానుడు, ఈ సభలో వందో తప్పు చేసిన శిశుపాలుడిని తన చక్రాయుధంతో సంహరిస్తాడు. ధర్మరాజు తన పూజని నిర్విఘ్నంగా ముగిస్తాడు.

బాల్యస్నేహితుడు అయిన కుచేలుడు కడు పేదరికంతో ఉండి, శ్రీకృష్ణ దర్శనార్ధం ద్వారకకు వస్తాడు. వచ్చిన చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణుడు కోసం అటుకుల మూట తీసుకువస్తాడు. సభలో శ్రీకృష్ణుడుచేత సేవలు పొందుతున్న కుచేలుడు తెచ్చిన అటుకులు ఇవ్వడానికి మొహమాటపడితే, శ్రీకృష్ణ భగవానుడు ఆ అటుకులను అభిమానంతో ఆరగిస్తున్నా కొలది కుచేలుడుకి దరిద్రం పోయి, అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.
మాయాజూదంలో ఓడిన పాండవ ధర్మపత్నిని నిండుసభలో ఘోర అవమాన ప్రయత్నంలో భాగంగా దుస్శాసునుడు ద్రౌపది వస్త్రపాహరణ దుశ్చర్యకు పాల్పడతాడు. ఆపదలో ద్రౌపది ప్రార్ధనని ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు, ద్రౌపదికి చీరలిచ్చి ఆమెకు రక్షణ కల్పిస్తాడు. కురుపాండవుల మధ్యలో యుద్ధం అనివార్యమైన స్థితిలో ధర్మరాజువైపు నిలబడి, ధర్మరాజు వైపు రాయభారిగా సుయోధనుడికి హితవు చెప్పినా వినని పరిస్థితులలో యుద్దానికి దారితీస్తుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

కురుక్షేత్రం అధర్మం ధర్మం మధ్య యుద్దం

కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో అద్బుతమైన ఘట్టం అక్కడే దుష్ట శిక్షణ శిష్ట రక్షణతో జరగడానికి ముందు లోకానికి అవసరమైన జ్ఞానాన్ని అర్జున విషాదయోగం ద్వారా భోదించాడు. భావంతుడి నోట భక్తుడికి చేసిన గీతపోదేశం భగవద్గీతగా జగద్విఖ్యాతి చెందింది. యుద్ధం రాజధర్మం కనుక నీవు రాజ్యాన్ని పాలించే రాజువి కాబట్టి నీ కర్తవ్యం ధర్మ రక్షణ చేయడం, అటువంటి ధర్మరక్షణలో తనకుమాలిన ధర్మంతో ఉంటావో నీకర్తవ్యమెరిగి ధర్మరక్షణ చేయుదువో నిర్ణయించుకో, ఫలితం నాకర్పించు, నీ పని నీవు చేయి అని తేల్చి చెబుతాడు. మోహం తొలగిన అర్జునుడు యుద్ధం ప్రారంభిస్తాడు.

యుద్దంలో భీష్మ పితామహ యుద్దానికి నిలబడలేకపోయిన అర్జునుడి ముందు శిఖండిని రప్పించే సూచనా, ద్రోణాచార్యులతో అస్త్ర సన్యాసం చేయించడానికి ధర్మరాజుతో అశ్వత్దామా అనే ఏనుగు మరణవార్తని, అశ్వత్దామా మరణించాడు అని గట్టిగా వినబడేలాగా ఏనుగు అని మెల్లగా చెప్పించిన శ్రీకృష్ణ భగవానుడు దృతరాష్ట్రుడి కుటిల బుద్దిని కనిపెట్టి, అతని భారి నుండి భీముడిని కాపాడి, గాంధారి చేత శాపానుగ్రహం పొందుతాడు. యదువంశంలో వారిలో వారే కలహించుకుని యదువంశం నశిస్తుందని. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna.

గాంధారి, మునుల శాపం వలన యదుయోధుల కలహం, వంశ క్షయం.

మునుల శాప ఫలితంగా యదువంశంలో ముసలం పుడుతుంది, ఆ ముసలం అరగదీసి సముద్రంలో కలిపేస్తారు యదుయోధులు. అయితే కొన్నాళ్ళకు సముద్రపు ఒడ్డులోనే మద్యం సేవించి ఒకరితో ఒకరు కలహించుకొని యదుయోధులు మరణిస్తారు. బలరాముడు సముద్రంలోకి వెళ్తాడు. ఒక కిరాతుడు అటుగా వస్తూ ఉంటే ముసలం ముక్క దొరుకుతుంది. ఆ ముక్కని బాణానికి పెట్టి జింక అనుకుని పొదలలో పడుకుని ఉన్న శ్రీకృష్ణ భగవానుని బొటనవేలుని కొడతాడు. తప్పు తెలుసుకున్న ఆ కిరాతుడు వచ్చి శ్రీకృష్ణ భగవానుడి కాళ్ళ మీదపడి జింక అనుకుని మీపాదానికి గురిపెట్టి కొట్టానని చెబుతాడు.

అందుకు శ్రీకృష్ణుడు మానవుడుగా పుట్టిన ప్రతిజీవి ఎదో ఒక సమయంలో చేసిన కర్మలకు ఫలితం అనుభవించాలి. త్రేతాయుగంలో నేనేరాముడుని నీవు వాలివి, నే నిన్ను సుగ్రీవుడు కోసం చెట్టుచాటు నుండి బాణంతో కొట్టాను. ఆ కర్మఫలితం ఇప్పుడు నీద్వారానే నాకు తీరిపోయింది. అని చెప్పి, అవతారం చాలిస్తాడు, శ్రీకృష్ణభగవానుడు.

మనసు, బుద్ది ప్రధానంగా సాగే సంసారంలో బుద్ది బలం యొక్క గొప్పతనం ధర్మాన్ని పట్టుకుంటే ధర్మంద్వారా ధర్మాన్ని పట్టుకున్నవారికి భగవానుడు రక్షణ చేస్తాడు, అని నిరూపిస్తూనే భగవానుడు అయినా మనిషిగా అవతరిస్తే కర్మశేషం అనుభవించాల్సిందే అనే సందేశం ఈచిత్రంలో కనబడుతుంది. రామావతారంలో జాంబవంతుడుకి ఇచ్చిన మాట, ధర్మంవైపు నిలిచిన సుగ్రీవునికి సహాయం చేయడానికి, జాతిధర్మం ప్రకారం వాలిని చెట్టుచాటు నుండి కొట్టిన ఫలితం కారణంగా, కృష్ణావతారంలో అదే వాలి కిరాతుడుగా పుట్టి బాణంతో పొదలమాటున నిద్రిస్తున్న కృష్ణుడు పాదంపై బాణప్రయోగం చేస్తాడు. అసలు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుట్టడం కూడా అంతకుముందు జన్మలలో వారికి భగవానుడు ఇచ్చిన వరమే. అలాగే యశోద దగ్గర పరమాత్మ పాలు త్రాగడానికి కూడా గత జన్మల్లో ఆమె చేసుకున్న పుణ్యఫలమే అని పండితులు చెబుతూ ఉంటారు.
కృష్ణావతారం గాధలు లీలలతో నిండి ఉంటే ఆ లీలలు ఏవయసు వారికి ఆ వయసుకు తగ్గట్టుగా మంచిని సూచిస్తూ ఉంటుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

పవన్ కళ్యాణ్ తెలుగు మూవీస్ లిస్ట్