లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు అంటే కరోనా వ్యాప్తి అదుపు తప్పిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వములకు అవకాశం దొరికింది. ఇది ప్రధానంగా ఉంటే మరొక ముఖ్యమైన లాభం… ప్రకృతిలో పర్యావరణ కాలుష్యం తగ్గడం.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

లాక్ డౌన్ కాలంలో లాభపడింది ఎవరంటే, ప్రకృతి అని అంటారు. ఆర్దికంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ లాక్ డౌన్ నష్టపరిస్తే, ప్రకృతికి మేలు చేసింది. లాక్ డౌన్ కు ముందు ప్రజలంతా దైనందిన జీవితంలో వాహనములు వాడుక ఎక్కువగా ఉండేది. ఇంకా లాక్ డౌన్ కాలంలో పరిశ్రమల రన్నింగ్ కూడా ఎక్కువగానే ఉండేది.

ఆనాటి కాలంలో నదులలో నీరు కొండలలో అడవులలో ప్రవహించి, వివిధ ఔషధ గుణాలు కలిగి ఉండేవి. అయితే పరిశ్రమలు పెరిగాకా, పారిశ్రామిక వ్యర్దాలతో నీరు ప్రవహించడం నేటి రోజులలో ఉందని అంటారు. ఒకప్పటి నదీజలం ఆరోగ్యదాయకంగా ఔషధ గుణంతో ఉంటే, నేటి నదీజలం ఏవిధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉంటున్నాం.

అలాంటి నదులు పరిశ్రమలు గత కొన్ని రోజులుగా మూతపడి ఉండడం వలన కొంత స్వచ్ఛతకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ముఖ్యంగా యమునా నది ఎక్కువగా కాలష్యం బారిన పడి ఉంటే, లాక్ డౌన్ కారణం యమునా నది స్వీయశుద్ది జరిగినట్టుగా చెబుతున్నారు. నదులకు స్వీయశుద్ది గుణం ఉంటుందని ఈ వార్త తెలియజేస్తుంది. లాక్ డౌన్ వల కలిగిన లాభాలు లో నదలు శుద్ది జరగడం ఒక్కటి.

నీరు లేకుండా మనిషి జీవనం సాగదు. శుద్దజలాలు ఉపయోగించేవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. కానీ అటువంటి జలము కలుషితం జరగడం విచాకరం అయితే లాక్ డౌన్ వేళ నదులకు తమకుతామే స్వీయశుద్ది జరుపుకునే అవకాశం కాలం కరోనా రూపంలో ఇచ్చింది. విలువైన నదీ జలాలను శుభ్రంగా ఉంచుకోవడం నదులను పరిరక్షించడం మనసామాజిక బాధ్యత.

ఇక ఆక్సిజన్ లేకుండా మన ఉనికి ఉండదు. అటువంటి ఆక్సిజన్ కలిగి ఉండే గాలి కలుషితం కావడం కూడా ఉంది. కానీ కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ పర్యావరణపరంగా ప్రకృతికి మేలునే చేసింది. ఎక్కువమంది ప్రజలు ఇంటికే పరిమితం కావడం. ట్రాన్స్ పోర్టు నిలిచిపోవడంతో వాహన వినియోగం తగ్గింది. తత్ఫలితంగా గాలికాలుష్యం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇటువంటి ఫలితం, సాదారణ పరిస్థితులలో గాలికాలుష్యం నివారణ అంటే చాల కష్టం.

గాలి-నీరు లేకపోతే భూమిమీద మానవ మనుగడ లేదు. అటువంటి గాలినీరు కలుషితం కావడంలో మనిషి పాత్రకూడా ఉంటే, అది మనిషికి మనిషే చేసుకునే మానవద్రోహం… మనిషికి ప్రాణాలను నిలబట్టేవి గాలి-నీరు… అందరికీ తెలుసు… చదువుకున్నందరికీ తెలుసు. అటువంటి గాలినీరు కలుషితం కాకుండా చూసుకుంటే భవిష్యత్తు తరానికి సహజ వనరులు సహజంగానే అందుతాయి.

లాక్ డౌన్ వలన ఆర్ధిక పరిస్థితి కుదేలయ్యింది, కానీ ప్రకృతి పరంగా పర్యావరణ కాలుష్యం కొంతవరకు నయం అయ్యింది. కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ మనకు ప్రకృతికి పరిరక్షణకు సాయపడింది.

లాక్ డౌన్ వలన బిజి జీవితానికి కరోనా బ్రేక్ వేసింది.

లాక్ డౌన్ కలిగిన లాభాలలో మరొక అంశం… మెకానిజంగా మారిన మనిషి జీవితంలో అనూహ్యమైన మార్పు తీసుకువచ్చింది. పోటీ ప్రపంచంలో పోటీపడుతూ యాంత్రికంగా తయారవుతున్న బిజి జీవితానికి కరోనా బ్రేక్ వేసింది. ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజి బిజిగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా ఖాళీగా మారడంతో, బంధాలతో పరిచయం పునరుత్తేజం పొందాయి.

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు
లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు

కరోనా కారణంగా లాక్ డౌన్ చేసిన లాభంలో ఇదీ ఒక్కటి. నిరంతరంగా ఒకే ప్రక్రియతో ఉంటే మనసు ఒత్తిడికి గురవ్వడం లేకా నియంత్రణలో ఉండదని పూజలోనే వివిధ ప్రక్రియలు చెబుతారు. భక్తిని పెంచుకోవడంలో రోజూ పూజ అంటే మనసు నిలబడదని, తీర్ధయాత్రలు, దేవాలయ దర్శనాలు చెబుతారు. అటువంటి మనసును, మనిషి ఆర్ధికంగా నిలబడే ప్రయత్నంలో బలవంతంగా అణిచివేసే యాంత్రిక జీవితంలో వెళ్ళే కొందరికి లాక్ డౌన్ వలన లాభమే జరిగింది.

యాంత్రిక జీవనం నుండి ఒక్కసారిగా ఒంటరిగా కూర్చోబెట్టింది… కరోనా.. దీని కారణంగా వచ్చిన లాక్ డౌన్ ఎక్కువమందిని ఇంటికే పరిమితం చేసింది.

లాక్ డౌన్ వలన ఆర్ధికంగా నష్టం చాలా ఎక్కువ అయినా కానీ ప్రకృతిపరంగా మేలును చేసింది. ఈ మేలును కొనసాగింపుగా లాక్ డౌన్ తర్వాత కూడా పర్యావరణమును కాపాడుకోవడంలో శ్రద్ద చూపాలి. ఇంకా వ్యక్తిగతంగా గతంలో మాదిరిగా సామాజిక స్పందన ఉండకూడదు. చేయి చేయి కలపడం, గుంపులలో పాల్గొనడం మాత్రం ఖచ్చితంగా చేయరాదని ప్రభుత్వం మరియు నిపుణుల సూచనలు.

ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు ఎక్కువయ్యాయి అంటే జనజీవనం సాదారణ పరిస్థితులలోకి వస్తుంది. అయితే ఇప్పుడే జాగ్రత్త పడవలసిన సమయంగా నిపుణులు చెబుతారు. లాక్ డౌన్ వల కలిగిన లాభాలు ప్రకృతిలో కాలుష్యం తగ్గడం, వ్యక్తిగత జీవన విధానంలో మార్పుకు నాంది. అయితే ఇంకా భారతీయ ఆర్ధికవ్యవస్థ అంతర్జాతీయంగా బలపడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు నిపుణుల అంచనా.

ధన్యవాదాలు

తెలుగురీడ్స్.కామ్ ఇతర పోస్టుల లింకులు ఈ క్రింది బటన్లకు గమనించగలరు.