గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత. అనేక మత గ్రంధాలు ఉన్నా, గ్రంధానికి జయంతి జరుపుకోవడం భగవద్గీతకే చెల్లిందని అంటారు. శ్రీ మద్భగద్గీత గొప్ప స్వయంగా భగవానుడే చెప్పడం చేత, దీనికి ఈ ప్రత్యేకత అంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత
గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

ఇక ఈ గీతాజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? అంటే ప్రతిఏడాది మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిధి రోజున గీతాజయంతిగా జరుపుతారు. ఎందుకంటే ఆరోజే భవగతుండి గీతాసారం అర్జునుడికి బోధించినరోజుగా చెబుతారు. మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశీ తిధినే మోక్ష ఏకాదశిగా చెబుతారు.

ఈ సంవత్సరం 2022లో మనకు గీతాజయంతి డిసెంబర్ 14న చెబుతున్నారు. గీతాజయంతి రోజున గీతగురించి ఆలోచన చేయాలనే తలంపు రావడమే ఒక మంచి ఆలోచనగా చెబుతారు. భగవదనుగ్రహం ఉంటే, మంచి తరుణంలో మంచి తలంపులు మనసు తలుస్తుందని అంటారు.

ఎందుకు భగవద్గీతకు ఇంత ప్రాముఖ్యత అంటే, అది చదివి అర్ధం చేసుకున్న మనసుకు పరిపూర్ణమైన జ్ఙానం కలుగుతుందని అంటారు. ఏ విధమైన రంగంలో ఉన్నవారైనా సరే భగవద్గీత చదివితే, ఆయా రంగాలలో తమ తమ సమస్యలకు పరిష్కారం గోచరించే అవకాశాలు ఉంటాయని అంటారు. మహాత్మగాంధీ వంటి మహాత్ములకు భగవద్గీత మార్గదర్శిణి అంటారు.

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

వ్యక్తి జీవన లక్ష్యం ఏమిటో భగవద్గీత సూచిస్తుందని అంటారు. తత్కారణం చేత గీతలోని సారం జీవన పరమార్ధం వైపుకు వ్యక్తి గమనాన్ని మార్చగలదని చెబుతారు. భగవద్గీత వ్యక్తి జీవితాన్ని ఉద్దరించగలిగే జ్ఙానం ఇవ్వగలదు కాబట్టి భగవద్గీత పవిత్రగ్రంధం చెప్పబడిన రోజున గీతాజయంతిగా జరుపుకుంటారు.

ఈ గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పుస్తకంపై ఒక పువ్వు పెట్టి నమస్కారం చేయాలి అంటారు. సమయం ఉన్నవారు భవగద్గీతను రోజు పఠించడం వలన మనసుకు మేలు అంటారు.

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

తెలుగులో చిన్న పిల్లల పేర్లు అచ్చ తెలుగు ఆడ, మగ చిన్నారి పేర్లు

ఫేస్ బుక్ తెలుగురీడ్స్ పేజి

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

ఓర్పు దేవతా లక్షణం అంటారు.

తెలుగురాశి ఫలాలు 2020 టు 2021

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….