బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ. ఎన్.టి. రామారావు, ఎస్వీ రంగారవు, రేలంగి, సి.యస్.ఆర్. అంజలీదేవి, రాజసులోచన, సూర్యకళ, హేమలత తదితరులు నటించారు.
telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.
వేదాంతం రాఘవయ్యగారు బాలనాగమ్మ తెలుగు మూవీకి దర్శకత్వం వహించారు.
బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ
రాజదంపతులకు పిల్లలు లేక బాధపడుతుండగా, ఒక సన్యాసి వచ్చి వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉందని, వెంటనే ఈశ్వరుడిని ప్రార్ధించమని చెబుతాడు. దానితో మహారాణి ఆలయానికి వెళ్లి పరమభక్తితో పరమేశ్వరుడిని పూజిస్తుంది.
సంతోషించిన ఈశ్వరుడు ”ఈశాన్య దిక్కున ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు ఆరగించు, ఇతోదకమైన సంతానం కలుగుతుంది” అని ఆకాశవాణిగా పలుకుతాడు. మహరాణి వెంటనే చెట్టు దగ్గరకు వెళుతుంది.
చెట్టున ఉన్న ఫలాలు మహారాణి భూలక్ష్మికి అందకపోవడంతో ఆమె అక్కడే చెట్టు క్రింద ఉన్న పుట్టపై కాళ్లు పెట్టి, చెట్టు కొమ్మల నుండి అందినంతలో ఉన్న ఫలాలను కోసుకుని, క్రిందికి దిగుతుంది.
అలా మహారాణి పుట్టమీద నుండి క్రిందికి దిగగానే, ఆమె చెంగులో ఉన్న ఫలాలు ఒక్కటి మినహా మిగిలినవి అన్ని మరలా చెట్టుకి చేరతాయి. ఇక అక్కడి పుట్టలోని నాగరాజు మానవరూపంలో ప్రత్యక్షమై, మహారాణిని పేరాశకు, ఆమె చేసిన తప్పుకు శిక్షించదలుస్తాడు.
అయితే నేను తల్లిని అయ్యేవరకు నాకు గడువు ఇవ్వవలసినదిగా మహారాణి, నాగరాజుని ప్రార్ధన చేయడంతో, నాగరాజు బిడ్డ పుట్టిన ఆరుమాసాలకు తిరిగి వస్తానని, అప్పుడే నిన్ను కాటువేసి చంపుతానని చెప్పి అంతర్ధానం అవుతాడు.
ఈ విషయం మహారాజుకు చెప్పకుండా మహారాణి భూలక్ష్మి దాచి ఉంచుతుంది. కొన్నాళ్లకు వారికి ఏడుగురు ఆడ శిశువులు జన్మిస్తారు. అయితే దు:ఖిస్తున్న రాణిని, విషయం అడిగి తెలుసుకున్న మహారాజు మొత్తం నాగులన్నింటిని చంపించే ప్రయత్నం చేస్తాడు.
కానీ వారి ప్రయత్నం అలా సాగుతున్నా నాగరాజు అంత:పురంలోకి వచ్చి మహారాణిని కాటువేసి వెళ్లిపోతాడు. పసిపిల్లలను పెంచకుండానే మహారాణి ప్రాణాలు విడుస్తుంది. మహారాజు తనకు పుట్టిన ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటాడు.
ఏడుగురు పిల్లల్లో ఆఖిరి పిల్లపేరు బాలనాగమ్మ.
ఏడుగురు పిల్లల్లో ఆఖిరి పిల్లపేరు బాలనాగమ్మ. పిల్లలు పట్టు మేరకు మహారాజు మరోరాణి మాణిక్యాన్ని వారికి తల్లిగా తీసుకువస్తాడు. మొదట్లో ఆమె పిల్లలను బాగానే చూసుకుంటుంది. కానీ చెలికత్తె చెప్పుడు మాటలకు మాణిక్యం మనసులో స్వార్ధం పెరిగి, పిల్లలను నానా కష్టాలకు గురి చేస్తూ ఉంటుంది.
రాజుకు ఈ విషయం తెలిసి రాజు ఆగ్రహించి, మాణిక్యాన్ని దాసిని చేస్తాడు. తర్వాత మాణిక్యం తన చెలికత్తె సహకారంతో రాజుకు మందు పెట్టి, మహారాజును వశపర్చుకుంటుంది. తనకు వశపడిన రాజుని, నీ పిల్లలని చంపేయమని రాజుకు చెబుతుంది. మాణిక్యానికి వశపడి ఉన్న రాజు, మాణిక్యం మాటానుసారం చిన్న పిల్లలను చంపడానికి అడవికి తీసుకువెళతాడు.
అక్కడ చంపలేక వారిని అక్కడే వదిలేసి, తన రాజ్యానికి వెళ్లిపోతాడు. తిరిగి వెళ్లిన రాజు, మాణిక్యం రాణిగా ఉంటే, రాజు పూర్తిగా అమెకు వశపడి ఉంటాడు. తర్వాత ఆ పిల్లలు అడవిలోనే పెరుగుతారు.
పానుగంటి పురం రామవర్తికి తన చెల్లెలు అయిన భూలక్ష్మి కోల్పోవడంతో, ఆమె పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు. అతనికి ఏడుగురు కొడుకులు, ఆఖిరివాని పేరు కార్యవర్తి. అడవిలో భూలక్ష్మి పిల్లలు పెరిగి పెద్దవుతారు.
భూలక్ష్మి అన్న రామవర్తి పిల్లలు కూడా తమ మేనత్త పిల్లల జాడ కోసం ప్రయత్నిస్తూ పెరుగుతారు. వరుస అయిన ఏడు జంటలు విడివిడిగా పెరిగి యుక్త వయస్సుకు వచ్చాక వారు ఒకరినొకరు తారసపడే అవకాశం వస్తుంది.
రామవర్తి అనుజ్ఙతో అతని ఏడుగురు పిల్లలు తమ మేనత్త సంతానం ఎక్కడ ఉందో వెతుకుతూ అడవికి వస్తారు. ఆ అడవిలో వారు కలుసుకోవడం, వారికి పెళ్లిళ్లు కూడా జరుతాయి.
పెళ్లైన తర్వాత బాలనాగమ్మకు ఒక పిల్లవాడు జన్మిస్తాడు, తర్వాత ఆమె మాంత్రికుడి చేత అపహరింపబడుతుంది. ఆమెను దక్కించుకోవాలని మాంత్రికుడు, బాలనాగమ్మను బంధించి ఉంచుతాడు.
బాలనాగమ్మని విడిపించడానికి వెళ్లిన కార్యవర్తి మాంత్రికుడి మంత్రప్రభావంతో శిలగా మారిపోతాడు. చివరకు బాలనాగమ్మ కొడుకు వచ్చి తన తల్లిదండ్రులను విడిపిస్తాడు.
ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి
తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్
ఆలోచనకు పదును పెడితే పధకం, గురి కుదిరితే రహదారే…