Telugu Bhāṣā Saurabhālu

Category: Bhakti Bhavamu

  • భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం

    భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం ముఖ్యమంటారు. మనిషి మనసు విషయవాంఛలయందు మమేకం అయి ఉంటుంది. ఏదో ఒక వాంఛ తీరుతుంటే, కొత్త విషయం, కొత్త వాంఛ పుడుతుంది… వాంఛలు వస్తూ ఉంటాయి… కానీ భక్తి వచ్చుటకు మార్గం కనబడదు. భక్తి వచ్చుటకు అవకాశం ఏర్పడదు. విషయవాంఛలయందు మమేకం కాకుండా ఉండలేరని అంటారు. ఎందుకంటే విషయవాంఛలు మనసుకు అంతగా అలావాటు అయి ఉంటాయి. కావునా మనసు మార్గం భక్తిమార్గం కావాడానికి సమయం పడుతుందని అంటారు. కోరికతో…

    Read all

  • ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం

    ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం. ముక్కోటి ఏకాదశి తిధిన తలంపులన్నీ భగవంతుడి కోసం. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి ప్రాణీ పుట్టక తప్పదు. జీవనయాత్రలో ఎన్నో పుట్టుకలు, మరెన్నో మరణాలు అయితే జనన మరణ సమయాలలో తీవ్రమైన బాధను భరించవలసి ఉంటుంది. జీవి యాత్రలో మరణం లేని దశకు చేరే అవకాశం మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఉంటే, అది ఏకాదశి తిధి రోజున సార్ధకం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని…

    Read all

  • చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో

    చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో దీపావళి పండుగ ప్రారంభం చేయడం లక్ష్మీ పూజ భక్తిశ్రద్దలతో ఆచరించడం అలక్ష్మిని దూరం చేయడం దీపావళితో సంతోషాల పర్వం మనసులో నూతనోత్తేజం దీపారాధన చేయడంతో ప్రారంభం… చిన్ని చిన్ని దీపాల వరుసతో తైల దీపాలను వెలిగిస్తూ, భక్తితో భగవంతుడికి నమస్కరించడంతో చుట్టూ ఉండే పరిసరాలలోని గాలిలోకి మంచి గాలి తోడు అయ్యే విధంగా పూర్వపు దీపాల వరుస ప్రకృతికి మేలు చేయడానికే అన్నట్టుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే…

    Read all

  • భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానం.

    భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానంగా మనసులో మెదలాలి అంటారు. భక్తి అంటే కొందరు భగవంతుడిపై తదేక దృష్టితో ఉండే బలమైన భావన అంటారు. కొందరు భక్తి అంటే భగవంతుడి కోసం పడే తపన అంటారు. కొందరు భక్తి అంటే భగవంతుడికి నచ్చినట్టు సమాజంలో నడుచుకోవడం అంటారు… ఎవరు ఏమన్నా అందులో మూలం భగవంతుడే కావడం విశేషం. అంటే భగవంతుడు గురించి తెలుసుకోవడం భక్తి అయితే భగవంతుడిని గురించీ తెలియజేయడం భక్తి అయితే భగవంతుడిని…

    Read all

  • నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే

    నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే నిర్మల మనసుతో భగవంతుడిని చేరడానికి చేసే ప్రయత్నం అంటారు. అసలు నిర్మల అంటే మాలిన్యం లేనిది అయితే నిర్మల మనసు అంటే మనసులో మలినం లేకుండా ఉండడం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే, అందులో ఉన్న మలినం, అందులో ఉండే మంచి గుణాలు తెలియబడతాయని అంటారు. అంతేకానీ ప్రశాంతత లేని మనసులో తన గురించిన ఆలోచన కన్నా ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. స్వీయ పరిశీలన వలన మనసు శాంతితో ఉండవచ్చు…

    Read all

  • చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది

    భక్తి భావన బలపడడంలో ప్రధాన పత్రం చిత్తం పోషిస్తే, అటువంటి చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిదిగా ఉంటుంది. వ్యక్తి జీవితం యొక్క భక్తి మార్గములో మనసు చాలా ప్రధానమైనది. అది ఎటు తిరిగితే, జీవనగతి అటే ఉంటుంది. అటువంటి మనసుపై ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. ఒక వ్యవస్థలో వ్యక్తి చుట్టూ పరిసరాల నుండి చేరే ప్రాపంచిక విషయాలు మనసుకు అలవాటుగా మారతాయి. జీవనంలో వ్యక్తి మనసులోకి ప్రవేశించిన అనేక విషయాల్లో కొన్నింటిపై…

    Read all

  • భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని

    భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని, భాగవతము భగవంతునిపై అచంచల విశ్వాసము కలిగిన భక్తుల గురించి, భగవంతుడి గురించి తెలియజేస్తుంది. రోజు మంచిమాటలు వింటూ నిద్రిస్తూ ఉంటే, మనసు భగవంతుడిపైకి మరలుతుందని దృతరాష్ట్రుడి నిష్క్రమణ తెలియజేస్తుంది. సకలభోగాలు అనుభవించిన పాండవులు, కృష్ణనిర్యాణం కాగానే సర్వము త్వజించి ఉత్తరదిక్కుకు ప్రయాణం చేసే విధానం, భోగాలపై మనసులో వైరగ్యా అవసరాన్ని తెలియజేస్తుంది. శివుని గురించి చెబుతుంది. లోకాలను రక్షించడం కోసం విషమును కంఠమునందే నిలుపుకున్న పరమేశ్వరుడి గురించి భాగవతం తెలియజేస్తుంది. పశువులకు…

    Read all

  • త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది.

    త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మఅయితే ముగ్గురిగా మనిషి అంతర్గతంలో ఉంటాడు… కానీ ఒక్కటే అనే భావం బలపడడానికి మాత్రం మనసే కదలాలని అంటారు. శివుడు – లయకారుడు విష్ణువు – స్థితికారుడు బ్రహ్మ – సృష్టికర్త తమోగుణం రజోగుణం సత్వగుణం శివుడు లయకారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు. విష్ణువు స్థితికారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు. బ్రహ్మ సృష్టికర్త కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు. అంటే త్రిమూర్తులకు…

    Read all

  • తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన

    తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన మంచి ఫలితం ఇస్తుందని అంటారు. స్కూల్ కు వెళ్ళే బాలబాలికలను తెల్లవారు జామునే చాడువుకోమన్నట్టుగా… స్కూల్ కు వెళ్ళే ఒక పిల్లవాడు ఎంత శ్రద్ద పెడితే, అన్ని మార్కులు పరిక్షలలో సాధించగలడు. అటువంటి పిల్లవానికి ఏకాగ్రత కోసం తెల్లవారు జాములో చదువుకోమని పెద్దలు చెప్పేవారు. అంటే భగవంతుడి విషయంలో కూడా స్కూల్ పిల్లవాని వలె భక్తునికి శ్రద్ద అవసరం అనుకుంటా… అందుకే స్కూల్ పిల్లవానిని చాడువుకోమన్నట్టుగా తెల్లవారుజామునే భగవంతుడిని ప్రశాంత చిత్తంతో ప్రార్ధన చేయమంటారు. అవును శ్రద్ధ వలననే ఒక పిల్లవాడు పుస్తకంలోని విషయం గ్రహిస్తున్నాడు. విషయసారం గ్రహింఛి కొత్త విషయం కనుగోనడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అలాగే భక్తుడు కూడా భగవంతుడిపై శ్రద్ద పెడితే, భగవతత్వం మనసులోకి వచ్చేస్తుందేమో? మరి భగవంతుడిపై శ్రద్ద పెట్టె ఆసక్తి మనసులో కలగాలంటే, దానికి ఆలంబన కోసం పురాణ పుస్తకాలూ చదవడం లేక పురాణ ప్రవచనాలు వినడం చేయమంటారు. పురాణాలు చదవకపోయినా ప్రతిరోజు ఈశ్వరుని పూజ చేస్తూ ఉండాలని అంటారు. కష్టాలలో ఉన్నవారికి సాయం చేస్తూ, ఆ సాయం ఈశ్వరునికి అర్పించేవారు ఉంటారు. ప్రతి పనిలోనూ ఈశ్వరుని చూడడం ప్రధానమని అంటారు. ఈశ్వర సంభందంగా జీవనం సాగించేవారిని ఆ ఈశ్వరుడే రక్షణ చేస్తాడని అంటారు. అయితే ఈశ్వరుడు చిత్తశుద్దిని చూస్తాడని చెబుతారు. ఈ చిత్తశుద్ది ఉంటే, మనిషి మహనీయుడు అని అంటారు. అటువంటి చిత్తశుద్ది కలగాలంటే ప్రశాంతమైన చిత్తం కలిగి ఉండాలి. ప్రశాంతమైన చిత్తం కదిలే మనసులో కన్న, ఒక చోట దృష్టి సారించే మనసులో ఎక్కువగా ఉంటుందని అంటారు. అలా మనసు ఒక చోట దృష్టి కేంద్రీకృతం చేయాలంటే, దానికి ఎంతో ఇష్టం అయితేనే దృష్టి పెడుతుందని అంటారు. అలా మనసు ఒక చోట కేంద్రీకృతం అయ్యేలాగా దృష్టి పెట్టడానికి పూజ పునాదిగా చెబుతారు. సంసారం సాగించేవారికి పూజ ప్రధానం అంటారు. సంసారం సమస్యలను తెస్తుంది, సుఖదుఖాలను తీసుకువస్తుంది… వాటిని దాటి మనసుని ఏకీకృతం చేయడం చాలా కష్టమంటారు… అలాగే అది అసాద్యమేమి కాదని కూడా అంటారు. చిత్తశుద్దితో పూజ చేయడానికి సాదారణ పూజ ప్రశాంత చిత్తంతో తెల్లవారు జామున ప్రారంభించడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతూ ఉంటారు.

    Read all

  • నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు

    నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు. వ్యక్తి పుట్టుకకు ప్రయోజనం భగవంతుడిని చేరడమే అయితే, అందుకు తొమ్మిది భక్తి మార్గాలను పెద్దలు చెబుతూ ఉంటారు. తొమ్మిది భక్తి మార్గాలలో దేనిని భక్తితో శ్రద్దతో ఆచరించినా తరించవచ్చు అని అంటారు. శ్రవణం, కీర్తనము, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అను తొమ్మిది భక్తి మార్గాలు నారదుడు ధర్మరాజుకు చెప్పినట్టుగా ఐతీహ్యం. శ్రవణం శ్రవణము అనగా వినడము… అంటే భగవంతుని గూర్చి చెప్పబడిన గాధలు వినడం. ఇంకా భగవంతుడి గురించిన ప్రవచనాలు వినడం. ఇంకా భగవంతుని భక్తుల గురించి వినడం. భగవంతుడి లీలలు గురించి వినడం. ఏదైనా భగవంతుని గురించి శ్రద్ధాభక్తులతో వినడం శ్రవణభక్తి అంటారు. ధర్మరాజు,…

    Read all

  • దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు

    దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు. తగు నియమాల వలన మనసులో దైవంపై భక్తి శ్రద్దలు పెరుగుతాయని చెబుతారు. దేవాలయం అంటే భక్తులను అనుగ్రహించడానికి దైవము కొలువుతీరిన క్షేత్రం. ఆ క్షేత్రం పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన పరమాత్మ భక్తుల కోరికలు తీర్చడానికి కొలువైన పరమ పావన దైవనివాసం. అంతరి పరమపుణ్య ప్రదమైన దేవాలయములో దైవ దర్శనమునకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిభందనలు చెబుతారు. గుడికి వెళ్ళే భక్తులు (స్త్రీ / పురుషులు) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేయవలెను. నుదుట కుంకుమ ధరించాలి.…

    Read all

  • తెలుగు భజన పాటలు వింటూ

    తెలుగు భజన పాటలు వింటూ ఉంటే, మదిలో పాటల పల్లకి అవుతుంది. కీర్తనలు భజన పాటల రూపంలో భజించడం అంటే మనసును భక్తివైపు మరల్చడమే. భక్తుడి భజన వలన భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. అలాగే భక్తుని మది గుడిలో నుండి మనసంతా వ్యాపిస్తాడని అంటారు. భజన చేయడం వలన భగవంతుని అనుగ్రహం త్వరగా పొందవచ్చని పెద్దల మాట. పదే పదే భగవణ్ణామమ్ భజించడం అంటే భగవంతుని అనుగ్రహం కోసం తపించడమే అంటారు. కర్మ ప్రభావం చేత మనిషి…

    Read all

  • భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది.

    భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది. భక్తీ, ముక్తికి భగవద్గిత మనసుకు ఔషధం వంటిది అని అంటారు. మహాభారతములో భీష్మ పర్వములో ప్రారంభం అయ్యే భగవద్గీత ఒక ప్రత్యేక గ్రంధంగా ప్రసిద్ది చెందింది. భగవద్గీత ఉపనిషత్తుల సారమని అది జీవితానికి దిశా నిర్దేశం చేయగలదని అంటారు. భక్తీ భావనతో గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు ప్రోత్సాహకంగా ఉంటుంది. భగవద్గీత చదువుతూ, చిత్తశుద్దితో జీవించడం పాపహరణకు ఒక మార్గమని పెద్దలు చెబుతారు. మనిషి జీవనంలో యోగం ఉంటుంది. మనిషి జీవించే క్రమంలో కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు ఉంటాయి. భగవానుడు…

    Read all

  • భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు.

    భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు. ప్రవచనాలు వినడం వలన భాగవతం బాగుగా మనసులో నాటుకుంటుంది. వినుడు భాగవతం భగవంతుడిని చేరాలనే భావనను పెంపొందించుకో… తెలుగులో భాగవతం విను, అలా భాగవతం వినగా వినగా… కాలంలో వచ్చే కష్టానికి కారణం కనబడగలదు. భాగవతం రచించిన తరువాతే వ్యాసుని మనసు శాంతించినది అని పండితులు చెబుతారు. అలాంటి భాగవతం వినాలనే సంకల్పం చేయడం, భక్తి అనే భావన బలపడుతుంది. చదివే భాగవతం మనసులో బలంగా నాటుకోవాలంటే,…

    Read all

  • రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

    రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు… మీకు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ శుభాకాంక్షలు… రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము మననము చేయడము జీవనగమ్యము చేరడానికే. రాముడు అనుగ్రహం ఉంటే, సాధ్యం కానీ విజయం సిద్దిస్తుంది. శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామనామము జపించడమే మార్గం. ఏమి కర్మలు చేసి ఉన్నమో? ఏమి కర్మలు వెంటాడుటయో? కాలం – కర్మ జీవితాన్ని ఎటు మలుపు తిప్పుటయో? ఎవరికెరుక? ఆ రామునికెరుక… కనుక రామునే పట్టుకుంటాను. రామనామము నిత్యము…

    Read all

  • భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.

    భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది. భక్తి భలే మందు మనుసుకు. భక్తిభావన చేత మనసు శాంతికి దగ్గరగా అశాంతికి ఆమడ దూరంగా ఉంటుంది. భక్తి భావనలు… భక్తి భావన బలమైనది దైవంపై మనసుకు ఏర్పడే భక్తి భావన ఎంత బలంగా ఉంటే, అంతటి మనోశక్తి అంటారు. విగ్రహం ముందు నిగ్రహం మనలో మనోశక్తికి మూలం అంటారు. ఎవరికి ఇష్టమైన దైవం, వారి వారి మనసు మూలంలో ఉంటారు. కానీ మనసు తనకు తాను ఏర్పరచుకునే…

    Read all

Go to top