సందేశంతో జనతా గారెజ్ తెలుగు

సందేశంతో జనతా గారెజ్ తెలుగు మూవీ…. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఓకే కుటుంబ కథ! జనతా గారేజ్ తెలుగు చలన చిత్రం. యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు కధానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో సమంతా, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే కుటుంబ పెద్దగా మోహన్ లాల్ నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిచిన ఈ చిత్రానికి నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

చంద్రశేఖర్ (సాయి కుమార్) శివ (రహమాన్) ఇద్దరు స్నేహితులు హైదరాబాదులో ఉంటారు. అయితే చంద్రశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. రహమాన్ ఊరిలో ఉన్న తన అన్న సత్యం (మోహన్ లాల్)ని కుటుంబంతో సహా హైదరాబాదుకి తీసుకువచ్చి అక్కడ అతనికి ఒక వర్క్ షాప్ పెట్టిస్తాడు. అయితే ఆ గారేజ్ ఒక స్థాయిలో వెళుతుంది.

సందేశంతో జనతా గారెజ్ తెలుగు మూవీ కధ

సత్యం (మోహన్ లాల్) అన్యాయం జరిగిందంటూ ఎవరు వచ్చి అడిగి సహాయం చేయమన్న వెళ్లి సహాయం చేస్తూ ఉంటాడు. కొద్దిరోజులుగా తన షెడ్లో పనిచేసే పెద్దాయన రాకపోతే ఆయనింటికి వెళ్లి విషయం అడుగుతారు జనతా గారేజ్ పెద్ద మరియు అక్కడ పనిచేసే అతని గ్యాంగ్. తన కూతురిని మానభంగం చేసి చంపేశారని వాపోతాడు ఆ పెద్దాయన. ఈ విషయం గురించి జనతా గారేజ్ వ్యక్తులు అంతా కలిసి DSP చంద్రశేఖర్ (సాయికుమార్) దగ్గరికి వెళ్లి అడుగుతారు. నగరంలో ఒక పెద్దమనిషికి సంభందించిన వారు సాక్ష్యం లేకుండా ఆ తప్పు చేశారని, ప్రస్తుతం పోలీసులు చేతిలో ఏమి లేదని చెబుతారు.

పోలీసుల సమాధానం విన్న జనతా గారేజ్ మనుషులు పెద్దాయన కూతుర్ని మానభంగం చేసిన నలుగురుని ఆక్సిడెంట్ గా చూపి చంపుతారు. ఇక ఆ సంఘటన తరువాత సిటీలో ఎవరికీ ఏ సమస్య వచ్చిన జనతా గారేజ్ వైపు చూడడం, వారికి వచ్చి విన్నవించుకోవడం జరుగుతూ ఉంటే, జనతా గారేజ్ గాంగ్ తమకు చెప్పిన సమస్యలను సరిచేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే సత్యం (మోహన్ లాల్) తమ్ముడుకి పెళ్లి సంభందం వస్తుంది, పెళ్లి చేసుకుని ముంబై వచ్చేయమని (సురేష్ అనుయాయులు) పెళ్ళివారు అడిగినా రహమాన్ పెళ్లిచేసుకుని హైదరాబాదులో అన్నదగ్గరే ఉంటాడు. కొన్నాళ్ళకు వారికి ఒక బిడ్డకలుగుతాడు. అయితే జనందృష్టి ఎలా పడితే అలా ఎదగడం ఉండే సామజిక పరిస్థతిలో జనతా గారేజ్ గ్యాంగ్ అంటే మంచి చేసే గ్యాంగ్ గా పేరు గడిస్తుంది, అలాగే సిటీలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో శత్రుత్వం కూడా సంపాదించుకుంటుంది. ఒకరోజు వారు గుడికి వెళుతుంటే జనతా గారేజ్ శత్రువులు కొందరు సత్యం (మోహన్ లాల్) తమ్ముడు రహమాన్ దంపతులపై దాడి చేసి చంపుతారు, వారి కొడుకు బతుకుతాడు.

ఆ ఇన్సిడెంట్ తరువాత DSP చంద్ర శేఖర్ వచ్చి ఈ పనులు మానేయమని ఇంతకుముందు మీకు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను అని చెబుతాడు. ముంబై నుండి వచ్చిన తమ్ముడు బావమరిది సురేష్ కి తమ్ముడి కొడుకుని వారికి ఇచ్చేసి మేమనే బందువులు ఉన్నట్టు చెప్పకుండా పెంచుకోండి, అని చెబుతాడు. అలా ముంబైకి చేరిన పిల్లవాడు ప్రకృతిపై అమితమైన ప్రేమను పెంచుకుంటూ ఉంటాడు. పిల్లవాడు మేనమామ అయిన సురేష్ కి ఒక పాప, ఇద్దరు పిల్లలు కలిసి పెరుగుతారు. అమ్మానాన్న గురించి అడిగితే మీ అమ్మ నాలాగా మీ నాన్న నీలాగా ఉంటుంది అని మాత్రమే సమాధానం చెబుతాడు సురేష్. పెరిగిన పిల్లవాడు ఆనంద్ (నందమూరి తారక రామారావు jr.), పాప బుజ్జి (సమంత).

NTR & Mohanlal సందేశంతో జనతా గారెజ్ తెలుగు

కధానాయకుడి పరిచయ పాటలో అతని వ్యక్తిత్వం ప్రతిబింబించేలా ప్రకృతిని గురించి కధానాయకుడి ప్రణామం పాట చక్కగా ఉంటుంది. ప్రకృతిని ఇష్టానుసారం వాడుకునే వారు, పద్దతిగా వాడుకునేవారు ఎవరైనా పాటను వింటే ప్రకృతిపై ఇంకా గౌరవం పెరుగుతుంది.

వాతావరణ కాలుష్యం గురించి ఆనంద్ (నందమూరి తారక రామారావు Jr.) ఎప్పుడు ఆలోచన సాగిస్తూ, ప్రకృతిని కాపాడుకోవాలి అని చూస్తూ ఉంటాడు. సురేష్ అప్పుడు ఆనంద్ జనతా గారేజ్ గ్యాంగ్ ఆలోచన చేసినట్టే ఆలోచన చేస్తున్నాడని అర్ధం అవుతుంది. తండ్రి కుటుంబ ఆలోచనలు ఇతనిలోను సాగుతాయి. ఆనంద్ ఆలోచనలు పెదనాన్నసత్యం(మోహన్ లాల్)లాగ సాగితే, సత్యం కొడుకు మాత్రం జనతా గారేజ్ విరోధితో చేతులు కలిపి తండ్రి దారి నుండి తప్పుకుని చెడు దారిలో ఆలోచనలు సాగుతూ ఉంటాయి.

సత్యం అతని అనుయాయులు ఎవరికీ ఏ సమస్య ఉందని జనతా గారేజ్ దగ్గరికి వచ్చిన వారి వారి సమస్యలను తీర్చుతూ సహాయపడుతూ ఉంటారు. అలా జనతా గారేజ్ వాహనాలను మనుష్యులను కూడా రిపేర్ చేయడం కొనసాగిస్తూ ఉంటుంది. సిటీలో ఉన్నా పేదవారి గుడిసెలు కలిచేసి హోటల్ కాంప్లెక్స్ కట్టి అభివృద్ధి చేసి పేదలకు కూడా వేరేచోట ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ తెస్తారు. సత్యం (మోహన్ లాల్) తిరస్కారంతో ఆ స్లం ప్రాజెక్ట్ ఆగిపోతుంది. జనతా గారేజ్ ఏమని చెప్పినా అదే కరెక్ట్ అనే అభిప్రాయం జనాలలో పెరుగుతుంది.

ప్రకృతిపై ప్రేమ కలిగిన ఆనంద్ ముంబైలో ప్రకృతిని పరిరక్షణకోసం అన్నట్టు చేసే ప్రయత్నంలో నిత్యమీనన్ పరిచయం అవుతుంది. బుజ్జి(సమంత), ఆనంద్ (నందమూరి తారక రామరావు Jr.)లు షాపింగ్ మాల్లో కలిస్తే చూసిన నిత్య ఎప్పుడు ప్రకృతి అని నసపెట్టే అతనితో ఏం ఫన్ ఉంటుంది, అంటే. డానికి ఆనంద్ నాతోరా అని నిత్యని తీసుకువెళతాడు ఎప్పుడూ తాను ఆనందంగా గడిపే ప్రదేశాలకి. మనకి ఆనందాన్ని ఇచ్చే ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనే ప్రధాన ఉద్దేశ్యమే ఆనంద్లో ప్రస్పుటం అవుతుంది.

జనతా గారేజ్ యజమాని సత్యం (మోహన్ లాల్)కి ఆక్సిడెంట్ అవుతుంది, హాస్పిటల్ జాయిన్ అవుతాడు. ఆ ఆక్సిడెంట్ జనతా గారేజ్ శత్రువులే చేయించారని జాగ్రత్త అని DSP చంద్ర శేఖర్ మరలా హెచ్చరిస్తారు. ముంబైలో ఆనంద్ ఒక పార్క్ తీసీవేయలనుకున్న ఒక ఎంఎల్ఏ దేశ్ పాండేతో గొడవపడతాడు. ఒకసారి నేను హైదరాబాదు పరిశోదన నిమిత్తం వెళతాను అని అడిగిన ఆనంద్ని వద్దని ఆపేసిన (ఆనంద్ మావయ్య)సురేష్, ఇప్పుడు నీవు హైదరాబాదు వెళ్లి పరిశోదన చేసుకో అని చెప్పి హైదరాబాదుకి పంపించేస్తాడు.

సందేశంతో జనతా గారెజ్ తెలుగు

అయితే హైదరాబాదులో జనతా గారేజ్ యజమాని సత్యంగారికి ఆరోగ్యమ బాగా ఉండకపోవడం వలన వారి మంచి కార్యకలాపాలు కొంచెం తగ్గుతాయి. జనతా గారేజ్లో మిగిలినవారు సత్యంగారి ఆరోగ్యదృష్ట్యా సమస్యలు చెప్పుకునే వారు వచ్చిన కాదని వారిని పంపించేస్తూ ఉంటారు. జనతా గారేజ్ భాద్యతని తన కొడుకుని తీసుకోమని సత్యం(మోహన్ లాల్) అడిగితే కొడుకు కాదంటాడు. అంతే కాకుండా కొడుకు జనతా గారేజ్ విరోధి కూతుర్ని పెళ్లిచేసుకుని, అతని చేతిలో కీలుబొమ్మగా మారతాడు.

సత్యం(మోహన్ లాల్)గారి కొడుకు వలన హైదరాబాదులో ఒక చోట పర్యవరణం కాలుష్యం జరుగుతుంటే, జనతా గారేజ్ యజమాని కొడుకు అని ఎవరు ఆ విషయం జోలికి వెళ్ళరు, కానీ పరిశోదన నిమిత్తం అక్కడికి వచ్చిన ఆనంద్ వారిని కారణం అడిగి తెలుసుకుని, సత్యం(మోహన్ లాల్)గారి కొడుకుని అతని మనుషులతో గొడవపడతాడు. ప్రకృతిలో మనం ఒక బాగంగా వచ్చాము అద్దెకు వచ్చినట్టు, శుభ్రంగా వాడుకోవాలి కానీ, ఎలాపడితే అలా వాడి పర్యావరణం పాడుచేయకూడదు అనే కధానాయకుడి భావన ఒక సద్భావనగా ఉంటుంది.

సత్యం (మోహన్ లాల్) గారు తన కొడుకుతో గొడవపడ్డ ఆనంద్ని జనతా గారేజ్ కి తీసుకువచ్చి వాళ్ళ అబ్బాయి విషయంలో తగువు ఎందుకు అని తెలుసుకుంటాడు. తరువాత ఆనంద్ దగ్గరకి వెళ్లి చాన్నాళ్ళుగా ఈ జనతా గారేజ్ జనాలా సమస్యలు తీర్చింది, ఇప్పుడు నా వయస్సు మీరడం వలన సమస్యలు చెప్పి బాధపెట్టడం ఎందుకు అని వెనుతిరుగుతున్నారు, అందుకు నాకు చాల బాధగా ఉంది. నీవు వచ్చి జనతా గారేజ్ భాద్యతని తీసుకుని నడిపించమని అడుగుతారు, నీపైనే నమ్మకం ఉంది అని అంటారు. సుదీర్ఘ ఆలోచన తరువాయి జనతా గారేజ్ భాద్యతని ఆనంద్ స్వీకరిస్తాడు.

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram

సహాయం అడిగిన మంచివారికి సహాయం చేసే గుణం సత్యం గారికి, ప్రకృతి అమితమైన ప్రేమతో పర్యావరణ పరిరక్షణకు పూనుకునే తమ్ముడి కొడుకు ఆనంద్ కలయిక జనతా గారేజ్. కార్ల రిపేర్ తో బాటు మరలా మనుషుల రిపేర్ మొదలవుతుంది. జనతా గారేజ్ సహాయం కోసం వచ్చి వెనుతిరిగిన మొదటి వ్యక్తితో ఆ రిపేర్ మొదలవుతుంది. అలా వెళ్ళినా మొదటి వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి వికాస్. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చేఅధికారిగా వికాస్ (రాజీవ్ కనకాల) GHMCలో పనిచేస్తున్న ఉద్యోగిని డాకుమెంట్స్ సరిగా లేని బిల్డింగ్ అప్రూవల్ కోసం ఒక వ్యాపారస్తుడి మనుషులు బెదిరిస్తారు.

ఆనంద్ ఆ ఉద్యోగి వికాస్ ని జనతా గారేజ్ పిలిపించి అడిగినప్పుడు తన సమస్యను చెబుతారు, GHMC ఉద్యోగి(రాజీవ్ కనకాల). అప్పుడు ఆనంద్ (నందమూరి తారక రామారావు jr.) సంతకం పెట్టడానికి రేపు వారు గడువు ఇచ్చారని అంటున్నావు, ఈరోజు మేము మీతో మాట్లాడకుండా ఉండి ఉంటే రేపు మీరేం చేసేవారని అడుగుతాడు. డానికి బదులుగా రేపు ఆఫీసుకి వెళ్ళే లోపులోనే సూసైడ్ చేసుకునే వాడిని అని బదులిస్తారు. ఆ సన్నివేశంలో ఒక ఇద్దరు పిల్లలు, భార్య కలిగిన సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగి భావన ఆనంద్కి కనిపిస్తుంది వికాస్ ముఖంలో.

మరునాడు GHMC ఆఫీసులో ఆనంద్ మాటలు అక్కడి ఉద్యోగస్తులని కదిలిస్తాయి. అలాగే అక్కడికి ప్రభుత్వ ఉద్యోగి వికాస్(రాజీవ్ కనకాల) బెదిరింపుతో వచ్చిన మనుషుల్ని ఆనంద్ కొట్టి పంపిస్తాడు. అలా మొదలైన జనతా గారేజ్ అన్ని రిపైర్లు విజయవంతం అవుతాయి. మరలా DSP చంద్రశేఖర్ ఆనంద్ని కూడా హెచ్చరిస్తాడు, ఇలాంటి పనుల వలన సమస్యలు వస్తాయని. డానికి బదులుగా జననానికి జనతా గారేజ్ తో పనిలేకుండా మీరు హామీ ఇవ్వండి మేము మానేస్తామని చెప్పి, ఆనంద్(నందమూరి తారక రామారావు Jr.) జయహో జనతా గారేజ్ అనుకుంటూ తన బాద్యతను తను నిర్వహిస్తూ ఉంటాడు.

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram

అయితే DSP చంద్రశేఖర్ ఆనంద్ ఫ్యామిలీ గురించి ఎంక్వయిరీ చేసి, సత్యం (మోహన్ లాల్)బావమరిదిని సత్యంగారి ఇంటికి తీసుకువస్తాడు. అప్పటిదాక సత్యం (మోహన్ లాల్) గారికి ఆనంద్ తన తమ్ముడి కొడుకు అని, ఆనంద్కి సత్యంగారు పెదనాన్న అన్న విషయం తెలియదు. అయితే ఆనంద్ని ఇంటికి రప్పించడానికి మేనమామ నా కూతురు కావాలా? జనతా గారేజ్ కావాలా ? అని కండిషన్ పెడితే ఆనంద్ కూడా తన తండ్రిలాగానే జనతా గారేజ్ బాద్యతనే ఎంచుకుంటాడు.

ఎప్పుడు జనతా గారేజ్ గ్యాంగ్ ని మీ పనులు మానివేయండి అని సలహా చెప్పే DSP చంద్రశేఖర్ కూడా జనతా గారేజ్ కొచ్చి సమస్యను తీర్చమనే స్థితికి పోలీసులు రావడం, అలా జనతా గారేజ్ నడిపించే ఆనంద్ జనతా గారేజ్ ని వ్యతిరేకిస్తూ ఉండే మూల వ్యక్తిని మట్టుపెట్టడంతోనూ,ఎంత చెప్పినా వినకుండా చెడుమార్గంలో నడిచిన కొడుకుని సత్యంగారు మట్టుపెట్టడంతో, కధ సుఖాంతం అవుతుంది. సాదారణ మనిషి కష్టాలు విని వారి కష్టాలను పోగొట్టే వ్యక్తిగా సత్యం పాత్రలో మోహన్ లాల్ పాత్ర కధకి ఆయువుపట్టు. కొనసాగింపుగా ఆనంద్ పాత్రలో నందమూరి తారక రామారావు చాల బాగా నటించారు. ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడాలి అనే ఆలోచనతోనే ఉండడం దానికోసం ఏమైనా చేయడం చిత్రం మంచి సందేశాత్మక చిత్రంగా ఉంటుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

తెలుగులోవ్యాసాలు