భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం

సహచరుల సంఘీభావం పొందిన వ్యక్తి, సాధనలో ముందుంటాడు. లక్ష్యం చేధించడంలో ముందుకు సాగుతాడు. అటువంటి సంఘీభావమునకు తోడు, మనోబలం కూడా తోడైతే, ఇక ఆవ్యక్తి ప్రణాళికకు పరాజయం ఉండదు. అటువంటి భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

సత్సంకల్పం చేయడం ప్రధానంగా మన భారతీయుల చరిత్రలో చదివి ఉంటాం. ధృఢ సంకల్పం మన భారతీయ పురాణ, చారిత్రక పుస్తకాలలో చదివి ఉంటాం. ఏదైనా సాధనకు మంచి పునాది పడితే, సాధకుడు మంచి ఫలితాలను సాధించడం జరుగుతుంది.

చరిత్ర ఘనమే, ప్రస్తుతం కష్టకాలం ఇప్పటి మన స్థితి. ఇంతకు పూర్వం వరకు మన చరిత్ర గురించి గొప్పగా చదువుకున్న వ్యక్తులుగానో, చదువుకుంటున్న విద్యార్ధులుగానో ఉండి ఉంటాం. కానీ ఈ కరోనా కాలం స్థితి రూపును పూర్తిగా మార్చింది.

మారిన స్థితి, పరిస్థితులను మంచి భవిష్యత్తుకు పునాదిగా మారుస్తుంది. ఈ మారుతున్న స్థితిలో అవకాశం పట్టుకుని, భవిష్యత్తును సాధించడమే లక్ష్యం అయితే, ఆ లక్ష్యం మరింతమందికి భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, గడుస్తున్న కష్టకాలం గమనిస్తే, అవకాశం అందివస్తుంది. ఇదే విధానం క్రిందినుండి పైస్థాయికి ఎదిగిన వ్యాపారులలో కనబడుతుంది.

అవకాశం అందరికీ పేపరుపై, లేకా స్మార్ట్ ఫోన్ స్క్రీనుపై కనబడదు. అవకాశం ఆలోచనలో ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులను, కాలగతిని గమనించే ఆలోచనలో అవకాశం దాగి ఉంటుంది. పాఠ్యపుస్తకంలో ప్రశ్నకు సమాధానం ఉన్నట్టుగా….

ఆలోచన ఉండే మనసులో కొంత గందరగోళం ఉండవచ్చును. నీటిచెరువులో రాయి పడి చెదిరిన తరంగాలు, మరలా కుదురుకున్నట్టుగా… ఆలోచనలతో సతమతమయ్యే మనసు కూడా కుదురుకుంటే, ప్రశాంతతో ఉంటుంది. ప్రశాంత చిత్తంలో సరైన ఆలోచన ఉంటుంది. ఉపాయం వస్తుంది.

భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలము

భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలము తోడవుతుంది. మంచి సంకల్పము వలన, మంచి వ్యక్తితో బాటు, వ్యక్తి ఉన్న సమాజానికి మేలు చేస్తుంది.

సాధారణ పరిస్థితులలో మార్పు చాలా నిదానంగా ఉంటే, కష్టకాలంలో మార్పు చాలా బలంగా ఉంటుంది. ఈ కరోన కష్టకాలంలో ఆరోగ్యమును కాపాడుకోవడం చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే అంటురోగం మనకు రాకుండా ఉంటే, మనతోబాటు ఉన్నవారికి కూడా రానట్టే… ప్రభుత్వాలు లాక్ డౌన్ ద్వారా కరోనా కట్టడికి ప్రయత్నించినా కేసులు పెరిగాయి.

కరోనా కాలంలో కావాల్సింది సంయమనమే పాఠించడమే. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్త వ్యవహరించడం ప్రధానం. స్వీయ నియంత్రణ కలిగి సామాజిక దూరం పాటించడం చాలా ప్రధానం. కరోన మనకు సోకకుండా ఉంటే, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం రక్షించినట్టే.

వ్యవస్థలకు కొన్ని రోజులపాటు బ్రేక్ వేసిన కరోనా, మరలా వ్యవస్థలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే సమయానికి అవి మార్పులకు గురి అవుతాయి. కాలం తెచ్చే మార్పులో ఒకరికి అవకాశం ఉంటే, మరొకరికి అవరోధంగా ఉంటుంది.

జీవించవలసిన సమాజం బాగుంటేనే, నేటి బాలల రేపటి భవిష్యత్తు

మన ఆరోగ్యం కాపాడుకుంటూ మన జీవన పోరాటం చేయడం ఇప్పుడు మనందరి ముందున్న మంచి సంకల్పం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇప్పుడు మన ఆరోగ్యమే మన సామాజిక శ్రేయస్సు… వారసులకు ఆస్తిగా మన సంపాధన ఉంటుంది. కానీ సంపద ఉన్నా జీవించవలసిన సమాజం బాగుంటేనే, నేటి బాలల రేపటి భవిష్యత్తు బాగుంటుంది.

మనం జీవిస్తున్న సమాజంలోనో లేక మన బంధుమిత్రులు జీవిస్తున్న సమాజంలోనో మన వారసులు వారి స్వంత జీవనం మొదలు పెడతారు. అటువంటి రేపటి పౌరులకు ఆరోగ్యకరమైన సమాజం ఇవ్వడంలో మనవంతు పాత్రత మనం పోషించి ఉండాలి.

కరోనా బారినపడకుండా మన వంతు ప్రయత్నం మన చేయడమే… నేటి మన సత్సంకల్పం.

ధన్యవాదాలు