సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా

శ్రీరాముడు రాశిభూతమైన ధర్మము అంటారు. ధర్మము పూర్తి మానవుడుగా మారి, చక్రవర్తి అయితే ఆయనే శ్రీరామచంద్రమూర్తి అంటారు. సీతమ్మ తల్లి రామయ్యను అనుసరించిన మహాసాద్వి. సీతారాముల గురించిన సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ గురించి…

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

బ్యానర్ : లక్ష్మి ఎంటర్ ప్రైజెస్
చిత్ర తారాగణం : శోబన్ బాబు, ఎస్వి రంగారావు, చంద్రకళ తదితరులు
సంగీతం : కేవి మహదేవన్
నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
దర్శకత్వం: బాపు

తెలుగు భక్తి మూవీలో శోభన్ బాబు శ్రీరామచంద్రమూర్తిగా నటించారు. రామచంద్రమూర్తి భార్య సీత పాత్రలో చంద్రకళ నటించారు. శ్రీరామాయణంలో అసురుడు అయిన రావణాసురుడు పాత్రలో ఎస్వీ రంగారావు నటించారు. సంపూర్ణ రామాయణం తెలుగు భక్తి మూవీకి బాపు దర్శకత్వం వహించారు.

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ

అలనాటి పాత తెలుగు సినిమాలు మంచి సందేశం కలిగి ఉంటే, భక్తి సినిమాలు అంటే పరమధర్మమునే తెలియజేస్తాయని అంటారు. భక్తి మూవీస్ వాచ్ చేయడం వలన భగవానుడిపై భక్తిని పెంచుకోవడానికి మనసుకు మంచి ఆలంబనం అవుతుంది.

పుస్తకం చదువుతూ ఉంటే ఒక ఊహాశక్తి మనసులో మెదులుతుంది. సినిమా చూస్తుంటే, చూస్తున్న మూవీ సీన్స్ మనసులో కదలాడుతూ ఉంటాయి. మంచి సీన్స్ మనసులో ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటారు.

శ్రీమహావిష్ణువు తదితర దేవతల అవతార సన్నివేశం సంపూర్ణ రామాయణం భక్తి .

వైకుంఠములో లక్ష్మినారాయణులు ఆదిశేషుని కొలువుతీరి ఉండగా దేవతలు అంతా వచ్చి రావణ రాక్షస అకృత్యాలపై మొరపెట్టుకుంటారు. ద్రుష్ట శిక్షణ చేయడానికి నేను నరుడిగా అవతరిస్తాను. మీరు మీ మీ అంశలతో వానరాలుగా అవతరించండి, అని శ్రీమహావిష్ణువు వెల్లడి చేస్తారు.

ఎందుకంటే రావణుడు మనుషులపై చులకన భావంతో మనుషులు, వానరులు తప్పించి మిగిలిన వారితో మరణం లేని వరం కలిగి ఉంటాడు. వేరొక సన్నివేశంలో రావణాసురుడు వేదవతిని వేదిస్తుంటే, ప్రతిగా వేదవతి నేను మరో జన్మలో నీ మరణానికీ కారణం కాగలనని రావణుడిని శపించి ఆత్మాహుతి చేసుకుంటుంది.

దేవతలు వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు మొదలైనవారు అవతరిస్తే, శ్రీమహావిష్ణువు రామునిగా, రాముని తమ్ములుగా శంఖు, చక్ర, గదలు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా దశరద మహారాజుకి జన్మిస్తారు.

తనఇంట రావణుడు శివ పూజ చేస్తుండగా, పూజ పుష్పం నుండి ఒక బాలిక ఉద్బవిస్తుంది. ఆ శిశువుని రావణాసురుడు పారవేయమని చెబుతాడు. అలా రావణాసురుని ఇంట ఉద్బవించిన శిశువు పొలం దున్నుతున్న జనక మహారాజుకి దొరుకుతుంది.

అలా జనకమహారాజుకి దొరికిన బాలికకు సీత అను పేరు పెడతారు. సీత జగదేక ప్రసిద్ది పొందుతుంది అని జనకమహారాజు గురువులు శతానందులు సెలవిస్తారు.

అయోధ్యలో రామయ్య కౌసల్య – దశరదుల వద్ద అల్లారుముద్దుగా పెరిగి, గురువుల దగ్గర విద్యాభ్యాసం పూర్తీచేసుకుంటాడు.  జనకమహారాజు స్వగృహంలో పెరుగుతున్న సీతమ్మ ఒకరోజు అటాడుకుంటూ ఉండగా బంతి ఒక ధనుస్సు ఉన్న బాక్స్ క్రిందకు వెళుతుంది.

అప్పుడు సీతమ్మ తల్లి a పెట్టెని ఇట్టే జరిపి ఆ పెట్టే కింద ఉన్న బంతిని తీసుకుని మరలా ఆటలోకి వెళుతుంది. అది గమనించిన జనక మహారాజు, వారి గురుదేవులు ఆశ్చర్యచకితులు అవుతారు. వేలమంది తోస్తేకాని జరగని ఆ ధనుస్సు కలిగిని పెట్టెని, ఇట్టే జరిపిన సీతమ్మతల్లికి స్వయంవరంలో ఎవరైతే శివదనుస్సుని ఎక్కుపెడతారో వారికే ఇచ్చి వివాహం జరిపిస్తానని అంటారు.

రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట కానలకు వెళ్ళడం, శ్రీరామాయణం తెలుగు భక్తి మూవీ

ఒకరోజు సభలో దశరధ మహారాజు గురువు వసిష్ఠ మహర్షితో కొలువు దీరి ఉండగా, అక్కడకు విశ్వామిత్ర మహర్షి కూడా వస్తారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాకకు కారణం వివరిస్తూ, రామ చంద్రుని తనతో అడవులకు పంపమని దశరధుని విశ్వామిత్ర మహర్షి అడుగుతారు.

దానికి దశరధ మహారాజు సంశయిస్తే, అప్పుడు వసిష్ఠ మహర్షి నచ్చచెప్పడంతో దశరధ మహారాజు రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి వెనుక పంపడానికి అంగీకరిస్తే, అక్కడికి వచ్చిన రామలక్ష్మణులు తండ్రి అజ్ఞాపాలన మేర విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

విశ్వామిత్రుని వెనుకు రామలక్ష్మణుల నడక సాగుతుండగా తాటక రాక్షసి కనిపిస్తుంది, ఆ రాక్షసి వారి ముగ్గురిపై రాళ్ళతో దాడి చేస్తుంటే, విశ్వామిత్ర మహర్షి అజ్ఞా మేరకు, రాముడు తాటకిని సంహరిస్తాడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు కొన్ని శక్తి అస్త్రశస్త్రాలను ఉపదేశిస్తారు.

విశ్వామిత్ర మహర్షి మరియు ఇతర మునులు జరుపుతున్న యజ్ఞం భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సుబహువు రాక్షసుడుని రాముడు అంతమొందించి, మారీచుడుని రామ బాణంతో కొన్ని యోజనాల దూరంలో పడేటట్టు చేస్తాడు. యాగం సంపూర్తి అవుతుంది.

నారద మహర్షి కూడా అక్కడకు వచ్చి రామచంద్రుడిని దర్శించుకుని, విశ్వామిత్ర మహర్షితో సీతాస్వయంవరం గురించి వివరిస్తారు. అదేవిధంగా ఆ విషయం రావణుడి చెవికి చేరవేస్తాడు. రావణుడు సీతాస్వయంవారానికి బయలుదేరితే, రామలక్ష్మణులు ఇద్దరూ గురువు విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

దారిలో అహల్యకు శాపవిమోచనం కావించి, రామలక్ష్మణ మహర్షులు జనకమహారాజు సభకి చేరుతారు. స్వయంవరానికి విచ్చేసిన మహావీరులందరు ప్రయత్నించి విఫలమైతే, రావణాసురుడుకి కూడా గర్వభంగం అవుతుంది. ఇక గురువు విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదంతో రామచంద్రులు శివధనుస్సు ఎక్కుపెట్టగానే, ధనుస్సు విరుగుతుంది.

సీతారాముల వివాహం అంగరంగవైభవంగా ఇరువురి బంధుమిత్ర సపరివారం మద్య జరుగుతుంది. శివధనుస్సుని విరిచింది ఎవరు అంటూ వచ్చి, అంతకు వేయిరెట్లు అధిక శక్తి కలిగిన హరివిల్లుని కూడా ఎక్కుపట్టమని పరశురాముడు చెబితే, ఆ హరివిల్లుని కూడా ఎక్కుబెట్టిన రాముడు, పరశురాముడుకి శ్రీమహావిష్ణువుగా దర్శనం అయ్యి అక్కడ నుండి నిష్క్రమిస్తారు.

శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తంలో సీతారామలక్ష్మణులు అడవులకు

తరువాతి సన్నివేశంలో భరత, శత్రుఘ్నుడు ఇద్దరు వారి మావగారి గృహానికి వెళతారు. మరొక సందర్భంలో  దశరధ మహారాజు తన సభలో పెద్దలు, ప్రజలు, గురువుగార్ల సమక్షంలో నేను వృద్దుడిని అవుతున్న కారణంగా శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తానని అనగానే అందరు హర్షిస్తారు.

శ్రీరాముడు కేవలం నా పెద్దకుమారుడు కావడం మాత్రమే కాకుండా శ్రీరామునికి చాలా మంచి గుణాలు ఉన్నాయని అందుకే పట్టాభిషేకం చేస్తానని అంటే సభ మరొకసరి సంఘీభావం తెలియజేస్తే, అక్కడికి వేంచేసిన శ్రీరామునికి పట్టాభిషేక విషయం వివరించి, రేపటి పట్టాభిసేకనికి సంసిద్దుడివి కమ్మని చెబుతాడు.

మరుసటి రోజు అయోధ్య అంతా సంబరాలు జరుపుకుంటూ ఉంటే, కైకేయి మందిరానికి వచ్చిన మందర నూరిపోసిన వాక్కుల వలన కైకేయి మనసు చెదిరి, దశరధ మహారాజుని వరాలు అడగడంతో శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి, అదే సమయానికి సీతారామ లక్ష్మణులు అడవులకి బయలుదేరవలసి వస్తుంది.

అంతా ఈశ్వరేచ్చ అని భావించి, సీతారామలక్ష్మణులు అడవులకి వెళతారు, అలా రధంలో బయలుదేరిన రాముని ఎడబాటు భరించలేని దశరధ మహారాజు మరణిస్తారు. తదుపరి వచ్చిన భరతుడు విషయం గ్రహించి తల్లిని మందలించి అన్నగారి వద్దకు అడవులకి బయలుదేరతాడు.

అడవిలో సీతారామలక్ష్మణులు నార దుస్తులు ధరించి ముని ఆశ్రమంలో ఉండగా, భరతుడు సపరివార సైన్యంతో రావడం చూసి లక్ష్మణుడు భారతునిపై సందేహం వెలిబుచ్చుతాడు. కానీ భరతుడు అన్నగారు అయిన శ్రీరామచంద్రుడినే రాజ్యం స్వీకరించాలని, తనతల్లి చేసిన తప్పుకు తానూ ఈ శిక్ష భరించలేనని అంటాడు.

అలాగే కైకేయి తదితర వారంతా శ్రీరాముని అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేయవలసినదిగా కోరితే, శ్రీరాముడు తాను తండ్రికి మాటకు మచ్చ రానివ్వను అంటూ రాజ్యభారం ప్రస్తుతం భరతుడే నిర్వహించవలసినదిగా చెబుతారు. శ్రీరామ పాదుకలు తీసుకుని భరతుడు ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి పాలిస్తానని, గడువు ముగిసే సమయానికి నీవు రాకపోతే, నేను ప్రాయోపవేశం చేస్తానని చెప్పి అయోధ్యకు వెనుతిరుగుతాడు.

రావణుడు సీతాపహరణం చేయడం… సంపూర్ణ రామాయణ తెలుగు భక్తి మూవీ

మరొక సన్నివేశంలో రామలక్ష్మణులను చూసిన శూర్పణఖ మోహితురాలై వారి వెంటబడితే, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కొస్తే, ఆమె రావణ సభకి వెళ్లి మొరపెట్టుకుంటుంది. అంతేకాకుండా సీత అందచందాలు పొగిడేసరికి, రావణుడిలో దుర్బుద్ధి పెరిగి సీతాపహరణకు పధకం వేస్తాడు.

పధకం ప్రకారం మారీచుడు బంగారు లేడి వేషంలో సీతారామలక్ష్మణుల ఆశ్రమం ఆవరణలో తిరుగుతూ ఉంటుంది. ఆ బంగారులేడిని చూసిన సీతమ్మ ఆ లేడిని తనకు తెచ్చి ఇవ్వవలసినదిగా రాముని కోరితే, రాముడు బంగారులేడి వెనుక వేట బాణాలతో బయలుదేరతారు. కొంచెంసేపటికి రాముని ఆర్తనాదం విన్న సీతమ్మ లక్ష్మణుడిని కూడా రాముని బాట పట్టిస్తుంది.

ఇక మారువేషంలో వచ్చిన రావణాసురుడు సీతను అపహరిస్తాడు. ఆకాశమార్గంలో సీతమ్మని తీసుకునిపోతున్న రావణుడిపై జటాయువు పోరాటం చేసి రెక్కలు పోగొట్టుకుంటాడు.

తిరిగి వచ్చిన రాముని దుఃఖానికి హద్దు ఉండదు. లక్ష్మణ ఓదార్పుతో తేరుకుని శ్రీరామలక్ష్మణులు సీతమ్మని వెతుక్కుంటూ బయలుదేరతారు. మధ్యలో కనిపించిన శబరి ఆతిద్యం స్వీకరించాక, శబరి మాటల ప్రకారం వారిరువురు ఋష్యమూక పర్వతం చేరుకుంటారు.

వాలితో ఉన్న తగువు కారణంగా రాజ్యానికి దూరంగా నివసిస్తున్న సుగ్రీవుడు ఆ పర్వతంవైపు వస్తున్న శ్రీరామలక్ష్మణులను చూసి, తనమంత్రి అయిన హనుమతో వాళ్ళెవరో వివరాలు తెలియగోరతాడు.

అప్పుడు ఆ అంజనిపుత్రుడు శ్రీరామలక్ష్మణుల వద్దకు కామరుపంలో వెళతాడు. కానీ కామరుపంలో ఉన్న హనుమని శ్రీరామచంద్రుడు గుర్తించగా, లక్ష్మణుడు తమ వివరాలు చెప్పగా మళ్ళి రాముడు హనుమ సంభోదిస్తే, హనుమ తన నిజ స్వరూపంతో స్వామిని ఋష్యమూక పర్వతంపైకి తీసుకువెళతాడు.

ఋష్యమూక పర్వతంపై శ్రీరామసుగ్రీవుల స్నేహం కుదురుతుంది. సీత గురించి చెబితే, హనుమ సీతమ్మవారి నగలు తెచ్చి రామునికి ఇస్తాడు. నగలు సీతమ్మవే అని గుర్తించి మరల శ్రీరాముడు దుఃఖిస్తాడు. తరువాత సుగ్రీవుడు తన కధని శ్రీరామునికి చెపుతాడు.

అధర్మంగా సుగ్రీవుని రాజ్యబహిష్కరించి, సుగ్రీవుని భార్య అయిన రుమని వాలి అనుభవించడం విన్న శ్రీరామచంద్రమూర్తి వాలిని చంపడానికే నిశ్చయిస్తాడు. వాలి సుగ్రీవుల ద్వంద్వ యుద్దంలో పూలమాల లేని వాలిని శ్రీరాముడు చెట్టు చాటునుండి బాణంతో కొడతాడు. రామబాణం తగిలిన వాలి రాముని చూసి ఇదేమి ధర్మం చెట్టు చాటునుండి బాణప్రయోగం ఏమిటి ? అని అడిగితే.

దానికి రాముడు వ్యన్యమృగాలను చెట్టు చాటునుండి కొట్టడం ధర్మమే, అందులోను నీవు అధర్మం వైపు ఉన్నావు కాబట్టి ఈ విధంగా శిక్షించాను అని చెబుతాడు. అంగదుడుని సుగ్రీవునికి అప్పగించి వాలి మరణిస్తాడు.

సీతాన్వేషణకు హనుమ, జాంబవంత, అంగద తదితర వానరులు బయలుదేరడం…

సుగ్రీవ పట్టాభిషేకం తరువాయి సుగ్రీవుడు రాజ్యభోగాలలో ఉండి, సీతాన్వేషణ విషయం రాముని విషయం మరుస్తాడు. లక్ష్మణస్వామి ఆగ్రహించి సుగ్రీవుని వద్దకు వస్తే, తార మాటలతో చల్లబడ్డ లక్ష్మణస్వామితో సుగ్రీవుడు క్షమాపణ వేడుకుని, రాముని వద్దకు చేరి, సీతాన్వేషణకు వానరాలను నలుదిశలకు పంపుతాడు.

హనుమతో కూడిన అంగద, జాంబవంతుడు మొదలైన వానరులు దక్షిణంవైపు వెళతారు. అయితే హనుమ రాముని నుండి గుర్తుగా ఉంగరం పొంది ఉంటాడు. అలా దక్షిణదిక్కులో ఉన్న సముద్రం దాటే విషయమై వానరులు అందరూ తర్జనబర్జన పడి, చివరికి హనుమనే వేడుకుని, ఆంజనేయస్వామి శక్తిని వేనోళ్ళ పొగుడుతారు.

ఇతరులు గుర్తుచేస్తేకానీ తనశక్తిని గుర్తించలేని మునిశాపం నుండి విముక్తుడై సీతాన్వేషణకు రామబాణంలా సముద్రం దాటుతాడు, హనుమ.

హనుమ లంకలో కావలి కాస్తున్న లంకిణిని ఓడించి, లంకలో ప్రవేశిస్తాడు. అప్పటికి లంకలో రావణుడు సీతమ్మకి రెండూ మసాల గడువు విదించి వెళతాడు. దుఃఖితరాలుగా సీతమ్మ కూర్చుని ఉన్న చెట్టుపై ఉన్న హనుమ రామకధ వినిపించి, అయిన రాక్షస మాయేమో అని శంకించిన సీతమ్మకి రామచంద్రుని ముద్రికను సీతమ్మకి చూపుతాడు.

తనబుజాలపై కూర్చోతల్లి రాముని చెంతకు చేర్చుతాను అని హనుమ పలికితే, సీతమ్మ రాముడే తనభార్యని అయిన నన్ను యుద్దంలో రావణుడిపై గెలిచి తీసుకువెళ్లాలని చెప్పి, తన చూడామణిని హనుమకి ఇచ్చి పంపుతుంది.

వెనుకకు వెళ్తూ హనుమ వనమంతా చెట్ల కొమ్మలు విరిచి కొంతమంది రాక్షసులను నిర్జిస్తాడు. ఇక రావణుడు కొడుకు బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి, పట్టుబడతాడు, హనుమ. సభలో ఆంజనేయస్వామి తన శక్తిని చూపి రామచంద్రుని శరణువేడుకో అని హితవు చెప్పగా, దానికి బదులుగా రావణుడు ఆంజనేయస్వామితోకకి నిప్పంటించమని చెబుతాడు.

ఎవరు అంటించిన నిప్పు వారినే తగలబెట్టినట్టు, ఆంజనేయ స్వామి తనతోకతో లంకలో కొన్ని భవంతులను కాల్చి మరీ రాముని చెంతకు వెళతాడు.

రామరావణ యుద్ధం – శ్రీరామ పట్టాభిషేకం సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ

సీతమ్మ ఇచ్చిన చూడామణి చూసి రామలక్ష్మణులు, సుగ్రీవాది వానరులతో కలిసి యుద్దానికి బయలుదేరతాడు. సముద్రుడు సహకారంతో సముద్రంపై వారధి ఏర్పరచుకుని రామలక్ష్మణులు యుద్ద సైన్యం అంతా లంక చేరతారు.

యుద్ధం మొదలై అనేకమంది వానర యోధులు యుద్ద విన్యాసాలు, లక్ష్మణస్వామి యుద్దనైపుణ్యం, రామరావణుల సంగ్రామంలో రావణుడు మరణిస్తాడు. రావణమరణానంతరం విభీషణుడికి పట్టాభిషేకం చేసి, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, సుగ్రీవుడు మొదలైనవారితో అయోధ్య చేరతారు. అయోధ్యలో శ్రీరామపట్టాభిషేకం జరిగాక, రామచంద్రమూర్తి పరిపాలనలో అయోధ్య ధర్మపదంలో నడుస్తుంది.

శ్రీరామపట్టాభిషేకంతో సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ ముగుస్తుంది.

రామాయణం రాముని చరితము, హనుమాన్, సుందరకాండ వినడం అంటే అది అదృష్టం అయితే, గురువుగారు చాగంటి కోటేశ్వర రావు గారి నోట పలికిన అమృతపలుకులు వినడం మరీ అదృష్టమే.

తెలుగురీడ్స్.కామ్

అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు తెలుగు బాయ్స్ నేమ్స్, తెలుగు గర్ల్ నేమ్స్ తెలుగురీడ్స్ మొబైల్ యాప్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి మీ ఆండ్రాయిడ్ ఫోనులో…. ఈ క్రింది బటన్ టచ్ చేయండి.

టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా

కరోనా వైరస్ పరిచయం చేసిన లాక్ డౌన్ 2020లో కోవిడ్19 వ్యాప్తితో

తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్

Teluguvyasalu