శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది

శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది. అదేవిధంగా పుస్తకం చదువుతున్న మనసు ఏకాగ్రత దృష్టితో పుస్తకంలో వ్రాయబడిన విషయాలతో మమేకం అవుతుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఎక్కువగా పుస్తకం చదివేటప్పుడు అందులోని విషయంపై ఆసక్తిని బట్టి, ఆ పుస్తకంపై ఏకాగ్రతా దృష్టి ఏర్పడుతుంది. కానీ కేవలం పుస్తకం చూస్తూ పేజీలు తిరగేయడం వరకే పరిమితం అయితే పుస్తకంలో వ్రాయబడి ఉన్న విషయం పూర్తిగా అవగతమవదు.

పుస్తకం చూస్తూ ఉంటే, అందులో దేని గురించి వ్రాయబడి ఉన్నదో తెలియబడుతుంది, క్లుప్తంగా తెలుస్తుంది. కానీ దానిని పూర్తిగా చదివి అవగాహన చేసుకుంటే, ఆ పుస్తకములోని విషయ సారం తెలియవస్తుంది.

పుస్తకంలోని రచయిత ముందుమాట చదివితే పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం తెలియబడుతుంది. పుస్తకం చదివితే పుస్తకంలోని విషయసారం అవగతమవుతుంది.

ఆకట్టుకునే విధంగా ఒక వస్తువు ఉంటుంది. ఆకట్టుకునే విధంగా ఒక వీడియో ఉంటుంది. ఆకట్టుకునే విధంగా ఒక సినిమా ఉంటుంది. కానీ పుస్తకం మాత్రం విషయ విశ్లేషణతో ఉండి, ఆకట్టుకోవడంలో మిగిలిన మీడియా కన్నా వెనుకే ఉంటుంది. అయితే విజ్ఙాన పరిజ్ఙానం ఎక్కువగా విశ్లేషించబడేది పుస్తకాలలోనే అంటారు.

యాధాలాఫంగా ఒక బుక్ చూడడం అంటే, యాధాలాఫంగా యూట్యూబ్ వీడియో చూసినట్టే. పనిగట్టుకుని ఒక బుక్ కోసం వెతికితే, ఏరికోరి నచ్చిన సినిమా చూసినట్టే.

ఎందుకంటే యధాలాఫంగా చూసే వీడియో అయినా మనకు అవసరంలేని సమయంలో అంతగా ప్రధాన్యత మన మనసు ఇవ్వదని అంటారు. అలా కాకుండా ప్రత్యేకించి ఒక వీడియో కోసం వెతికితే, ఆవీడియో ఆసాంతం చూస్తూ ఉంటాం. అలాగే ఏదో యాధాలాఫంగా పుస్తకం చూస్తే, ఆ బుక్ చదవాలని అనిపించకపోవచ్చును.

బాల్యంలో మనసు మాట విని ఉండకపోవచ్చును కానీ పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది.

ఏదైనా ఒక అంశములో ఒక పుస్తకం చదవాలనే కోరిక మనసులో మెదిలితే… ఆబుక్ చదవడానికి మనసు సమాయత్తం అవుతుంది. జీవితంలో బ్రతకడానికి ఉపాధి కోసం చదువుకున్న చదువులో కూడా బాల్యంలో మనసు మాట విని ఉండకపోవచ్చును. పెద్దల ప్రోత్సాహంతోనో, పెద్దల భయంతోనో చదువుపై శ్రద్ధ పెట్టి ఉంటాము.

అయితే జీవితంలో ఉపాధి కొరకు మాత్రమే కాకుండా పుస్తకాలు ఇంకా ఇతర విషయాల వలన కూడా ఇతర పుస్తకాలు చదివే వయస్సు వస్తుంది.

ఉద్యోగం చేస్తున్న రంగంలో ఇంకా విజ్ఙానం అవసరం అయితే మరిన్ని పుస్తకాలు చదవడం తప్పదు. అయితే జీవితంలో కాలక్షేపంగా పుస్తకాలు చదివే అలవాటు కూడా కొందరికి ఉంటుంది. మొదట్లో చందమామ కధలు, లేక సాహిత్యం గురించిన పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది.

కొందరికి వార పత్రికలు, మాసపత్రికలు చదివే అలవాటు ఉంటుంది. ఏదైనా పుస్తకాలు చదివే అలవాటు కొందరికి బాగానే ఉంటుంది.

ఎన్ని చదివినా ఏదో ఒక కొత్త ఆలోచనను మనసు సృష్టించే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఆలోచనను సృష్టించే మనసు గురించి చదివితే.. అదే ఒక చిత్రంగా ఉంటుంది.

కనబడని మనసు బౌతికంగా ఉండే మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మనసు ఎంత బలంగా ఉంటే, అంత ప్రతిభావంతంగా కార్యాలు నెరవేరతాయి. కోరికలు తీరతాయి. మనసు అంటే ఆలోచనను కల్పించేదిగా చెబుతారు.

అటువంటి బలమైన మనసు గురించి చదివితే, మానసిక అశాంతి ఉండకపోవచ్చును. ఎందుకంటే మనసు ఎక్కడ ఉంటుందో? దేనిని ఆధారంగా చేసుకుని పనిచేస్తుందో? దానిని తెలుసుకుంటే, ఇక తెలుసుకోవడానికి ఏమి లేదు, అంటారు.

మనోవిజ్ఙానం మన భారతీయ విజ్ఙానంలో ప్రభావంతమైన విషయం

మనోవిజ్ఙానం మన భారతీయ విజ్ఙానంలో ప్రభావంతమైన విషయం. మనసుని నియంత్రిస్తే, లోకంలో కార్యం సాధించడంలో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అంటారు. అంత బలమైన మనసుకు పుస్తకం చదివే అలవాటు ఉండవచ్చును, ఉండకపోవచ్చును. కానీ దానిని గురించి వీడియో ప్రవచనాలు చూసిన మేలు అంటారు.

పుస్తకం మనకు విజ్ఙాన విషయాలను అందిస్తుంది. పుస్తకం భక్తిని గురించి తెలియజేస్తుంది. పుస్తకం మనకు సమాజం గురించి తెలియజేస్తుంది. ఏదైనా లోకంలో విజ్ఙాన విధానం ఉంటే, అది పుస్తక రూపంలో మార్చబడి లేక మార్చుతూ ఉంటారు.

విజ్ఙానం ముందుగా పుస్తకంలోకి మారి, మరింతమంది విద్యార్ధులకు చేరువ అవుతుంది. అటువంటి పుస్తకం ఉపాధి లబ్ది చేకూరాక కూడా మనోమయమైన పుస్తకాలలో మంచి తత్వవిజ్ఙానం కలిగిన పుస్తకం ఏదైనా ఒక్కటి ఎంపిక చేసుకుని చదవుకోవడం మంచి అలవాటుగా చెబుతారు. అలా శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది. తద్వారా విషయాలపై అవగాహన పెరుగును.

విషయములు ఆలోచన పుస్తకం
శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది

తత్వతహా, భక్తి పరంగానూ మనకు మంచి విజ్ఙానం అందించే పుస్తకాలలో ముందుండేది.. భగవద్గీత…భగవానుడు, భక్తుడికి బోధించిన గీత… విశేషమైన విషయ పరిజ్ఙానం అందిస్తుంది. ఇంకా భగవద్గీతతో బాటు వివిధ పురాణ పుస్తకాలు కూడా మనకు మనసు గురించి, నియమాల గురించి తెలియజేస్తూ ఉంటాయి.

విగ్రహం చూడడంలోనే నిగ్రహం పాటించడం ఉంది. అటువంటి విగ్రహ స్వరూపముల గుణగణాలను వివరించే పురాణ పుస్తకాలు మనోనియంత్రణకు గురించే తెలియజేయబడతాయి. నిగ్రహం ఉండడం వలన భగవంతుడినే చేరవచ్చని, నిగ్రహం కోల్పోవడం వలన భగవంతుడి వద్ద నుండి దిగజారిపోవడం ఎలా ఉంటుందో… వివిధ పురాణ గాధలు తెలియజేస్తాయి. అంటే విగ్రహ స్వరూపములు చెప్పేది నిగ్రహంగా ఉండమనే….

విగ్రహం చూస్తూ నిగ్రహం అలవాటు చేసుకోమనడంలోనే మనకు మనోవిజ్ఙానం ఆచరణాత్మకంగా దేవాలయాల ద్వారా తెలియజేస్తే, ఆయా దేవతా పురాణా మరింత మనోవిజ్ఙానం అందిస్తాయి.

దు:ఖంతో ఉండే మనసు త్వరగా స్వస్థతను కోల్పోయి, నిగ్రహం తప్పుతుందని అంటారు. అలాంటప్పుడు భగవంతుడిని గుర్తుకు తెచ్చుకుని నిగ్రహంగా ఉండమంటారు. మనసులో నిగ్రహం ఏర్పడడానికి విగ్రహ స్వరూపాలు ద్వారా మన మనసులో వివిధ దేవతామూర్తులను దేవాలయాలు చేరుస్తూ ఉంటాయి.

అలాంటి దేవాలయములలోని దేవతల గురించి, ఆయా దేవతల పురాణ పుస్తకాలు చదవడం వలన మనసు శాంతిగా ఉంటుందని అంటారు. ఈ తెలుగురీడ్స్.కామ్ ద్వారా ఉచితంగా లభించే తెలుగు పుస్తకాల లింకులు పోస్టులలోనూ, పేజిలలోనూ జత చేయడం జరిగింది. ఈ క్రింది బటన్ టచ్ లేక క్లిక్ చేసి ఉచిత భక్తి పుస్తకాలు చదవవచ్చును, లేక డౌన్ లోడ్ చేయవచ్చును.

వ్యక్తి శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది… ఆప్రకారం అందులోని విషయం మనసులోకి బాగా చేరుతుంది.