బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్ అని అంటారు. కొందరికి పుస్తకాలు చదివే అలవాటు చిన్ననాటి నుండే ఉంటుంది.
telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.
కానీ ఎలాంటి పుస్తకాలు చదివితే, అలాంటి ఆలోచనలు చదివేవారి మనసులో చేరుతూ ఉంటాయి.
గతం మాదిరి ఇష్టం ఉండే విషయాలపైనేపుస్తకాలు ఇంకా ఎక్కువ చదివితే, అదే విషయంలో మరింత అవగాహన ఉంటుంది.
అలా కాకుండా కొత్తగా తెలిసిన విషయాల గురించి పుస్తకాలు చదివితే, కొత్త ఆలోచనలు పుట్టుకు వస్తాయి.
అప్పటికే తెలిసిన విషయాలలో పుస్తకాలు చదివితే, ఆయా విషయాలలో ఎక్కువ పరిజ్ఙానం ఉంటుందంటారు. అంటే మనకు ఎక్కౌంటింగ్ రంగంలో ఉంటే, ఎక్కౌంటింగ్ కు సంబంధించిన పుస్తకాలు చదివితే, ఆరంగంలో మరింత విజ్ఙానం వృద్ది చెందుతుంది.
పుస్తకం చదవడము అంటే, ఆ పుస్తకములో వ్రాయబడిన విషయ పరిజ్ఙానంతో స్నేహం చేయడమే అవుతుంది. ఒక పుస్తకంలో ఒక వస్తువు తయారి గురించి వ్రాస్తే, ఆ పుస్తకం చదివాక, ఆ వస్తువు తయారి గురించిన ఆలోచన కలుగుతుంది. ఒక స్నేహితుడితో మాట్లాడాక ఆలోచన పుట్టినట్టు, పుస్తకం కూడా ఒక విధానంలో ఆలోచనను కల్పించకలదు.
పుస్తకం ఎప్పుడు విజ్ఙాన విషయాలను తెలుపుతూ ఉంటాయి. మనం ఎంచుకున్న అంశం బట్టి పుస్తకాలు మనకు విజ్ఙానమును అందిస్తాయి. ఇతరత్రా ఆంక్షలు కలిగిన పుస్తకాలు అయితే మనసుపై చెడు ప్రభావం చూపుతాయి. అలా కాకుండా మనకు నేర్చుకునే రంగంలో కానీ, ఒక వ్యక్తికి అసరమైన స్ఫూర్తినిచ్చే అంశంలో కానీ పుస్తకాలు ఎంపిక చేసుకంటే, పుస్తకం రూపంలో మనకొక మంచి మిత్రుడు ఉన్నట్టే !
ఎంత ఎక్కువ విషయాలు తెలిసి ఉంటే, మనసులో అన్ని ఆలోచనలు అంటారు. అందుకే తెలిసిన విషయములోనే పరిపూర్ణ పరిజ్ఙానం సంపాదించాలి అంటారు. మనకు తెలిసి ఉన్న విషయములో పూర్తి అవగాహన ఉంటే, ఆ విషయం మనతో బాటు మనల్ని అనుసరిస్తున్నవారికి ఉపయోగపడుతుంది.
అంటే ఒక ఎక్కౌంటెంటుకు ఎక్కౌంటింగులో పూర్తి పరిజ్ఙానం కలిగి ఉంటే, అతనికి వచ్చే సందేహాలతో బాటు అతనిని అనుసరించేవారికి కూడా సందేహాలు తీర్చగలడు. ఆ వ్యవస్థలో ఎక్కౌంటింగ్ పరిధిలో గల సమస్య పరిష్కారం అతని దగ్గర నుండి బయటకుపోదు.
అలా కాకుండా ఇంకా వేరే రంగంలో విషయాలపై దృష్టి సారిస్తే, ఆలోచనలు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్కువగా మేనేజ్మెంటు వ్యవహారంలో మాత్రం మరిన్ని విషయాల గురించి తెలిసి ఉండడమే మేలు అంటారు.
ఉపాధి, సంపాదన కాకుండా మనిషి జీవితానికి భక్తి లేదా జ్ఙాన తత్వ పుస్తకాలు చదవడం మరొక మంచి అలవాటుగా చెబుతారు. తత్వ పుస్తకాలు మనోవిజ్ఙానమును అందిస్తాయని చెబుతారు. మనోవిజ్ఙానం అంటే మనసు మరింత శక్తివంతం కావడమే. మనో బలం మనిషికి మేలైన బలం. అంతకుమించిన బలం మరొకటి ఉండదని అంటారు.