భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో…

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు అంటూ ఉంటారు. జీవన యాత్రలో గమ్యం లేకుండా సాగిపోయే సమయంలో, అసలు జీవన యాత్ర లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న వస్తే, తత్వవేత్తల జవాబు ముక్తి అంటారు.

మరి మామూలు విషయములతో ముడిపడి, సాదారణ సమయంలోనూ ఏదో ఒక ఒత్తిడిని కొని తెచ్చుకునే మనసుకు ముక్తి అంటే మూడు ఆమడల దూరం పోతుంది, కదా మరి మనసుని ముక్తివైపు మరల్చగలిగే మెటీరీయల్ ఏది? అన్న ప్రశ్న వస్తే, దానికి జవాబు భాగవతం అని భాగవతప్రియులు, ప్రవచరకారులు చెబుతూ ఉంటారు.

యోగాభ్యాసం చేస్తూ, నియమనిష్టలతో కఠిన ఆహార నియామాలతో ప్రయత్నించినా మోక్షం వస్తుందనే నమ్మకం చెప్పలేం, కానీ త్రికరణశుద్దితో రోజూ కొంతసేపు భాగవతం వింటూ, ఆ భగవంతుని తత్వం వంటబట్టించుకుంటే, మోక్షం చాలా సులువు అంటారు. అందుకేనేమో భాగవతం గురించిన తలంపు వచ్చిందంటే, ఆ జీవికి ఏదో పూర్వజన్మ సుకృతం ఉందంటారు, మన తెలుగుపండితులు.

తెలుగురీడ్స్.కామ్ పుట్టిన తేది సమయం వివరాలతో జాతక రిపోర్టును అందించే వెబ్ సైటు గురించి పోస్టును చదవండి.

నిత్యం ఏదో ఒక సమస్య, లేక తనతో సహచర్యం చేసేవారికి కానీ వారి వలన కానీ ఏదో ఒక సమస్యతో సతమతమయ్యే మామూలు మనిషికి, భాగవతం వింటే మోక్షం ఎలా సాధ్యం అంటే, అది చదివితే లేక వింటే అర్ధం అవుతుంది అంటారు. అయితే అది కొంచెంసేపు విన్నా, చదివినా మన:పూర్వకంగా నమ్మి శ్రద్దతో చేయమంటారు.

భగవంతుడి లీలలు గురించి చదివితే మదిగదిలో మాయ పోయి భగవానుడు మాత్రమే ఉంటాడు. తన లీలలతో మనిషి మదిగదిని నింపేస్తాడు అని భాగవతం గురించి చెబుతూ ఉంటారు. మనిషి మనసు మనిషి జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. కాలంలో కర్మలకు దు:ఖిస్తూ, సంతోషిస్తూ సాగుతుంది. ఇలాంటి మనిషి మనసు ఒక్కోసారి దు:ఖం వలన కలిగిన అనుభూతిని, సంతోష కాలంలో కూడా పొందుతూ, తను పొందవలసిన సంతోషాన్ని కూడా కోల్పోతుంది. అంటే మనసులో బలంగా ముద్రపడిన అంశం ఆధారంగా మనిషి మనసు ఒక బలమైన భావనను మోసుకెళ్లూ కాలంలో ప్రయాణం చేస్తుంది.

సాదారణస్థితిలో మనసు ఏదో ఒక సమస్యతో పాఠం నేర్చుకుంటూనే ఉంటే, కానీ కష్టం కాలంలో అనుకోకుండా వచ్చినప్పుడు మాత్రం, మనసు కకావికలం అవుతుంది, అంటారు. అటువంటి సమయంలోనే మనసుకు మరో మనసు ఓదార్పు అవసరం అంటారు. అయితే అది కొంతవరకు ఉపశమనం ఇస్తే, అసలు కష్టం అనుభవించవలసినది, దానిని దాటవలసినది కష్టం కలిగిన మనసే.

తెలుగురీడ్స్ ఏకాదశి పోస్టును చదవడానికి ఇక్కడ టచ్ చేయండి

అటువంటి మనసుకు బలం తనకు తానే బలం అవ్యాలి. ఎలా మనసు తనకుతానే బలం కాగలదు అని ఆలోచిస్తే, కొందరంటారు. మనసులో కంగారు, భయం, ఆందోళన లాంటి విషయాలు ప్రక్కన పెట్టమంటారు. అలా ప్రక్కన పెట్టాలంటే ఎలా? అంటే మరికొందరంటారు.

సాదారణ సమయాలలో అయితే ఒక మాదిరి ఒత్తిడి వచ్చినప్పుడు ఏదైనా విరామం కోసం, మనసును ఉత్సాహపరచడానికి ఏదైనా సినిమా లేక హాస్యకార్యక్రమం చూసి, మనసను ఉత్తేజపరిచి, కొంచెంసేపు ఒత్తిడిని దూరం చేసినట్టే, అతి కష్టకాలంలో కూడా అదేవిధంగా అనుసరించమంటారు.

అయితే కాసేపు విరామం కోసం సాదరణ ఒత్తిడిలో వెళ్లే, మనసు అత్యంత కష్టకాలంలో వెళ్లలేదు. ఇక్కడే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు, అతి దు:ఖం చెందే మనసుకు అంతకన్నా దు:ఖ సంఘటనలు ఉన్న గాధను వినడంతో, మనసు ధైర్య పొందగలదు, అంటారు. అది ఎలా అంటే…. మహాభారతంలో ధర్మరాజుకు నలదమయంతిల కష్టాలు వినిపించనప్పుడు, ధర్మరాజు ధైర్యం పొందినట్టుగా…అని చెబుతారు.

ఇలా జీవితంలో అత్యంత ఎక్కువ కష్టాలు అనుభవించేవారు తమకొచ్చిన కష్టమే కష్టం, ఇటువంటి కష్టం ఇంతకుమునుపెన్నడు వేరెవరికి వచ్చి ఉండదు, అని భావిస్తూ ఉంటారని పండితులు చెబుతూ ఉంటారు. అలాంటప్పుడే పూర్వంలో జీవితంలో అనేక కష్టాలు వచ్చినప్పుడు, లేక అత్యంత దయనీయస్థితిలోకి జారిపోయినప్పుడు ఎవరు ఎటువంటి కష్టాలు అనుభవించారు. ఎలా వాటిని ఎదుర్కొని జీవితాన్ని గెలిచారు. ఇలాంటి గాధలను మనసును కుదుటపరుస్తాయని అంటారు.

అలాంటి గాధలతో బాటు మనల్ని నడిపించేవాడు ఒక్కడు ఉన్నాడు. ఎటువంటి కష్టం అయినా తీర్చగలడు అనేవాడి గురించి కూడా ఎరుక ఉంటే, కష్ట కాలంలో ఆ భగవానుడు ఆదుకుంటాడని తెలుగు పండితులు చెబుతూ ఉంటారు. మరి అటువంటి ఉన్నాడో లేడో కంటికి కనబడకుండా తన మహిమచేత లోకాన్ని ప్రభావితం చేసే ఆ భగవానుని గురించి తెలుసుకోవాంటే, ఆ భగవానుని చేరిన భక్తుల గురించి తెలుసుకోవాలి అంటారు. భాగవతం భక్తుల గాధలతో భగవానుని మహిమలను తెలియజేస్తుంది. ఆ గాధలలోని ఆంతర్యం అర్ధం అయితే భగవతత్వం మనసుకు గ్రహించగలిగే శక్తి వస్తుంది, అంటారు.

అటువంటి మనసుకు ఓదార్పు బంధవులు, స్నేహితులు అయినను ఓదార్పు పొందలేని మనసుకు భగవానుడే ఓదార్పు అంటారు. అలాంటప్పుడు గుర్తుకువచ్చే భగవానుడు గురించి, భగవానుడి లీలలు గురించి మీరు ముందే తెలుసుకోండి. కష్టకాలంలో మీకు భగవానుడు తలుచుకోడంలో మీమనసు విజ్ఙతను పొంది ఉంటుంది. కష్టంలో భగవానుడు ఆదుకోవడంలో చూపించిన లీలలు గురించి తెలియజేసే భాగవతం గురించిన వివిధ రచనలు మనకు ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ రూపంలో ఉచితంగా లభిస్తున్నాయి. భాగవతం గురించిన ఉచిత తెలుగుబుక్స్ రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్