మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్

తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి నానుడి పెద్దల నుండి వింటూ ఉంటాం. అంటే మినప గారెలు తింటే ఒంటికి బలం వస్తే, మహాభారతం వింటే మనసుకు బలం వస్తుంది అంటారు. ధర్మం చాలామందికి తెలిసిన ధర్మసూక్ష్మం అందరికీ అందదు అంటారు. కానీ మహాభారతం చదివి, అవగాహనే చేసుకోగలిగితే, ధర్మసూక్ష్మములలో మర్మమేటో తెలియవస్తుందని అంటారు. మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ గురించి ఈ పోస్టులో చదవండి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

మరే ఇతర పురాణం విన్నా భగవంతునిపై భక్తి కలిగితే, మహాభారతం వింటే ధర్మంపై ఆలోచన పుడుతంది. అది సందేహం అవ్వవచ్చును, లేక ధర్మంగా బ్రతకాలన్న తలంపు కావచ్చును. అది చదివే హృదయం, అర్ధం చేసుకునే మనోస్థితిని బట్టి ఉంటుందని కూడా అంటారు. ఎవరైనా ఒక విషయం గురించి చెబుతూ… ఇదే నిజం అంటే, దానికి బదులుగా… సరే అంటాం, కానీ అది అబద్ధం అనగానే మరి నిజమేమిటి? ప్రశ్నిస్తాం అబద్దం మహిమ అలా ఉంటే, మరి సందేహం ఇంకెంత ఆత్రం కలిగిస్తుంది? మరీ ధర్మ సందేహమైతే మరీ ఆసక్తి పెరుగుతంది. అందుకేనేమో తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి అనే నానుడి ప్రాచుర్యం పొంది ఉంటుంది. గారెలు ఒంటికి శక్తి అయితే, మహాభారతం మనసుకు శక్తినిస్తుంది అంటారు.

మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ లింకులు

మూడువేల పేజిలకు పైగా ఉన్న సంపూర్ణ మహాభారతం తెలుగులో చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. మరీ గ్రాంధిక భాష కాకుండా కొంచెం వాడుక భాష మాదిరగానే చదవడానికి అనువుగా ఉండే సైజులో అక్షరాలు ఉంటాయి. ఈ పుస్తకమును రచించినవారు మొదలి వెంకట సుబ్రహ్మణ్యంగారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు రచింపచేసిన  సంపూర్ణ ఆంధ్ర మహా భారతం-1 నుంచి 15 భాగాలు పిడిఎఫ్ ఆన్ లైన్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. సుమారు పదివేలకు పైగా పేజిలతో సంపూర్ణ ఆంధ్ర మహాభారతం 1 నుండి 15 భాగాలు ఉంటాయి. పర్వముల వారీగా శ్లోకాలు, ప్రతిపదార్ధం, తాత్పర్యంతో ఈ తెలుగు పిడిఎఫ్ బుక్ ఉంటుంది. ఈ బుక్ రీడ్ చేయడం వలన తెలియని తెలుగు పదాలకు అర్ధములు తెలియవస్తాయి.

తెలియని వస్తువు వాడేటప్పుడు, ఆ వస్తువును గతంలో ఉపయోగించిన అనుభజ్ఙుని మాటలు విని, తద్వారా కొత్త వస్తువును సరిగా ఉపయోగిస్తాం. ఉపోద్ఘాతం వినడం వలన విషయంపై పట్టు పెరుగుతుంది. అలాగే మహాభారతం లాంటి గ్రంధాలు చదివేటప్పుడు ఆయా గ్రంధం యొక్క ప్రయోజనం, గ్రంధం యొక్క సద్భావనను పండితుల ద్వారా తెలుసుకుని, ఆ గ్రంధం పూర్తి పఠనం చేయడం ద్వారా, సదరు గ్రంధపఠన ఫలితం పూర్తిగా పొందగలరని అంటారు. ఈ విధంగా చూస్తే మహాభారతం దర్మసందేహాలను కూడా తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మహాభారతం సంపూర్ణ గ్రంధపఠనం కన్నా ముందే మహాభారతం గురించిన ప్రవచనాలు వినడం మేలని పండితులు అంటారు. లేదా ఏదైనా మహాభారతం గురించి ధర్మసూక్ష్మములను, మహాభారత ప్రధాన ప్రయోజనం గురించి వివరించే రచనలు మొదటిగా చదవడం కూడా ప్రయోజనమేనని చెబుతారు. ఈ విధంగా అయితే  ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు పేరిట శ్రీరామచంద్రమూర్తి గారు రచించిన తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

బాలలకు బొమ్మలను చూడడం ద్వారా ఆసక్తి కలుగుతుంది. బాలలకు పుస్తకాలలో వచనం కన్నా బొమ్మలు ఎక్కువగా ఉంటే, ఆయా బొమ్మలను పరిశీలిస్తూ, వచనం కూడా చదవడానికి ఇష్టపడతారు. బాలలు భారతం చదవాలంటే వారికి బొమ్మలతో కూడిన తెలుగుభారతం బుక్ ఇస్తే చూస్తూ చదవడానికి ప్రయత్నిస్తారు. బొమ్మలు కలిగిన భారతం పిడిఎఫ్ పుస్తకంగా ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తుంది.  బాలానంద బొమ్మల భారతం తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

ఇంకా ఈ ఇతిహాసములోని వ్యక్తుల గురించి అంటే భీష్ముడు, ద్రోణుడు, భీముడు, ద్రౌపది, శకుని, ధృతరాష్ట్రుడు విడి విడి ఉన్న తెలుగుబుక్స్, పర్వముల వారీగా విడి విడి ఉన్న తెలుగుబుక్స్, భారతంలో నీతి కధలు తదితర మహాభారతంపై ఉన్న వివిధ రచనల తెలుగుబుక్స్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్