Monthly Archives: March 2021

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో వ్యవసాయం ఆధారంగా అనేక పంటలు రైతే పండిస్తాడు. దేశ ప్రజల తినే ఆహారం అంతా, దేశంలో రైతులు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది.

మనిషి బ్రతకడానికి శక్తి కావాలి. శక్తి ఆహార పదార్ధాలు ఆరగించడం ద్వారా లభిస్తుంది. శక్తి వలననే మనిషి పని కొనసాగించగలడు. అందుకు అవసరమైన ఆహారం దేశంలో రైతు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది.

వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి కీలకమైన అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి చాల ప్రధాన పాత్ర పోషిస్తుంది.

రైతు గొప్పతనం గురించి ఇన్ తెలుగు

తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంలో ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు.

పంటలు పండించేవారిని మాత్రమే కాకుండా, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం తదితర పనులు చేపట్టిన వారిని కూడా రైతులు అనే అంటారు.

మనదేశంలో రైతు మూడు విధాలుగా పంటలు పండిస్తాడు. ఖరిప్, రబీ, జైద్ కాలాలుగా విభజించి, ఆయా కాలాల్లో తగు పంటలు రైతు పండిస్తాడు.

భూమిని నమ్ముకుని రైతు జీవనం సాగిస్తాడు. భూమిని సాగు చేస్తూ ఆహార పదార్ధాలుగా మారే ముడి పంటలను రైతే పండిస్తాడు. ఎక్కువమందికి భూమి సొంతంగానే ఉంటుంది. కొందరు ఇతరుల భూమిని బాడుగకు తీసుకుని సాగు చేస్తూ ఉంటారు.

ఎక్కువ భూమి ఉన్న రైతు కూలీల ద్వారా వ్యవసాయపు పనులు చేయిస్తూ ఉంటాడు. రైతు కాయకష్టం పైన మనదేశంలో ఆహార పదార్ధాలు ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. ఇంకా రైతు కూలీల శ్రమ వ్యవసాయం అభివృద్దికి తోడ్పడుతుంది.

జీవించే రైతే దేశానికి వెన్నుముక

భారత దేశ౦ వ్యవసాయక దేశం .ప్రప౦చ౦లో అత్యధిక జనాభా గల దేశాలలో రె౦డవదిగా ఉంది. ఇంకా ఇందులో ఎక్కువ శాతం ప్రజలు గ్రామీణ వాసులు ఉంటారు. వ్యవసాయ పనులలో పురుషులు, స్త్రీలు కూడా పాల్గొంటారు.

సమాజంలో పని చేయించేవారు, పని చేసేవారు, పని కల్పించేవారు మొదలైనవారిపై సమాజిక ఆర్ధిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. వీరందరికీ అవరసరమైన ఆహార ఉత్పత్తులు మాత్రం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. కావున ఏ దేశానికైనా వ్యవసాయం ప్రధానం. దానిని నమ్ముకుని జీవించే రైతే ఆ దేశానికి వెన్నుముకగా మారతాడు.

ప్రపంచంలో వ్యవసాయ భూమి ఉన్న దేశాలలో మొదటిది అమెరికా అయితే, రెండవది భారతదేశం. కానీ దిగుబడిలో మాత్రం ఆ దేశం వెనకబడి ఉండడం గమనించవలసిన విషయం.

రైతే మానవ మనుగడకు ప్రధానమైతే, అటువంటి రైతు ఇబ్బందులు ప్రక్రుతి పరంగా ఉంటాయి. అకాల వర్షం రైతుకు నష్టం తీసుకురావచ్చు. వర్షాభావం కూడా రైతుకు నష్టమే... అటువంటి ప్రక్రుతి ప్రభావాలలో మార్పులు రాకుండా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణలో కఠిన చర్యలు అవసరం.

దేశంలో రైతు ఆధారిత భూములకు తగినంత నీటి సదుపాయం కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆహార పదార్ధాలు ఉత్పత్తి చేసే రైతు సాగుకు నష్టం కలగకుండా పర్యావరణ పరిరక్షణ అందరి సామజిక బాద్యత… వ్యవసాయ ఆధారిత దేశంలో రైతు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు. మనిషికి మంచి గుణాలలో శాంతంగా ఉండడం కూడా చెబుతారు. కానీ కోపం వస్తే, నియంత్రణ లేనివారికి, మాత్రం శాంతంగా ఉండే మనసు క్రోదానికి బలవుతుంది. తత్ఫలితంగా కోపం వలన నష్టాలు ఎక్కువ అవుతాయి.

మనకు కోపం రావడానికి కారణాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయిష్టమైన విషయాలు ఎదుర్కొనేటప్పుడు, మనిషి మనసు సహజంగా కోపానికి లోనవుతుంది. మనసుకు అయిష్టాలు చాలానే ఉండవచ్చు.

నచ్చని మాట వినబడినా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నచ్చనివారు ఎదురుపడిన కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. నచ్చని పని చేయాలంటే, కోపం, అసహనం కలిగే అవకాశాలు ఉంటాయి.

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అసహనం పెరిగే కొలది చిరాకు, కోపం పెరుగుతూ ఉంటాయి. చిరాకు, చికాకు వలన చీటికి, మాటికి కోపం రావడం అలవాటు అయితే, అది ఇతరులపై ప్రదర్శించడం అలవాటు అయి, వారి మనసులో మనపై చికాకు భావన పెంచుకునే అవకాశం మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

దాని పర్యవసానంగా పలు సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. నలుగురిలోనూ “వీడికి కోపం ఎక్కువ” అనే భావన బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

కాని కోపం రాని మనిషి ఉండడు. అయితే కొందరు కోపాన్ని నియంత్రిస్తారు. కొందరు కోపాన్ని ఇతరులపై ప్రదర్శిస్తారు. కోపాన్ని నియంత్రించుకోగలగడం గొప్ప విషయంగా పెద్దలు పరిగణిస్తారు.

తన కోపమే తన శత్రువు అంటారు. అంటే ఎవరికీ కోపం వస్తే, అదే వారి శత్రువుగా మారుతుంది.

ఎందుకంటే ఎప్పుడూ కోపగించే తత్త్వం కలిగిన వ్యక్తితో ఎవరూ ఆప్యాయంగా మాట్లాడలేరు. ఆప్యాయంగా మాట్లాడే మనిషి ఒక్కరు కూడా లేకపోతే, ఒంటరితనం పెరిగి, మనిషి ఒంటరివాడుగా మారతాడు. కష్టసుఖాలు పంచుకోకుండా మనిషి మనసు ఉండలేదు.

ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే అలవాటు ఉంటే, అది చివరికి క్రోధంగా దారి తీసే అవకాశం ఉంటుంది. క్రోధం వలన మనసు విచక్షణ కోల్పోతుంది. అలాంటి సమయాలలో మనసు ఇష్టారీతిలో ప్రవర్తిస్తుంది.

ఇష్టానుసారం మెదిలే మనసుకు అంతులేని ఆలోచన, ఆందోళన, చికాకు ఎక్కువ అవుతాయి.

నచ్చిన విషయాలు మనసుకు ఎదురైనప్పుడు సంతోషించే మనసు, నచ్చని విషయం ఎదురైనప్పుడు మాత్రం అందుకు కారణం అయినవారిని వెతుక్కొని, వారిని తప్పుబడుతుంది.

అలాగే తమకు నచ్చినట్టు ప్రవర్తించే మనిషి అంటే ఇష్టం. తమకు నచ్చనట్టు ప్రవర్తించే మనిషి అంటే కష్టంగా కొందరి మనసు మారుతూ ఉంటుంది. కానీ అలంటే సమయంలో సంయమనం పాటించేవారిని, గొప్పవారిగా పెద్దలు చెబుతారు.

నచ్చడం, నచ్చకపోవడం అనే అలవాటు, మనిషికి నచ్చినట్టుగా కాకుండా శాస్త్రం లేక పెద్దలు ఆమోదించిన విధానం ప్రకారం ఉంటే, వారు మార్గదర్శకులుగా మారగలరు. కానీ నచ్చడం, నచ్చకపోవడం అనే అలవాటు, మనసును బట్టి ఏర్పరచుకుంటే, అదే అలవాటు కోపానికి కారణం కాగలదు.

తత్కారణంగా అలవాటు కోపంగా మారితే, తన కోపమే తన శత్రువుగా మారుతుంది.

ఆహారం ఒక పద్దతిగా వైద్యులు సుచించినట్టుగా తీసుకుంటే, అనారోగ్యం కూడా నయం అవుతుంది. అలా కాకుండా ఆహారం మనసు కోరినట్టుగా అతిగా ఆరగిస్తే, అదే ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా నచ్చని ఆహారం తినవలసి వచ్చినప్పుడు కోపం కలిగే అవకాశం ఉంటుంది.

ఇలా పలు విషయాలలో మనిషికి నచ్చడం, నచ్చకపోవడం ఉంటుంది. కానీ నచ్చిన విషయం అందరికి ఆమోదయోగ్యమైతే, అది మంచి విషయంగా ఉండవచ్చు. నచ్చని విషయం అందరికి ఆమోదయోగ్యంగా ఉండి, ఒక్కరికే నచ్చకపోతే, సదరు వ్యక్తి తన ఆలోచనను గమనించాలి.

కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి కోపం ఎందుకు వస్తుంది

మనిషి మనసుకు నచ్చడం, నచ్చకపోవడం, వినడం, వినకపోవడం, ఇష్టం, అయిష్టం వంటి వాటి భావనలు బలపడి ఉంటే, అవే కోపానికి కారణం కాగలవు, కీర్తికి కారణం కాగలవు.

ఒకరికి చదువుకోవడం ఇష్టం. అది మంచి, చదువుకునే విషయంలో కాలయాపన జరిగితే కోపం. అది మంచి చేసే కోపం. కానీ అదే కోపం పదే పదే తెచ్చుకుంటే, అది భాధకు కారణం కాగలదు.

మంచి విషయానికైనా, చెడు విషయానికైనా కోపం రావచ్చు. కానీ అది నియంత్రించబడాలి. అప్పుడే అది మనిషికి శాంతిని అందిస్తుంది. లేకపోతే కోపం వచ్చిన వ్యక్తి మనసుతోపాటు, ఇతరుల మనసు మదనపడుతుంది.

కావునా కోపమనేది కేవలం ఒక చెడు విషయాన్నీ ఖండించడానికి ఉపయోగపడాలి… కానీ మనసుకు అలవాటుగా మారకూడదు. అతి సర్వత్రావర్జయేత్ అంటారు.

అంటే అతి అన్నింటా అనర్ధమే అంటారు. కోపం విషయంలో ఇది నిజమని, గుర్తించకపొతే, మనసుకు కోపం చాలా చాలా నష్టాన్నే మిగిలుస్తుంది.

కారణం లేని కోపం చేటు చేస్తుంది. కారణాంతరాల వలన కోపం కలిగినా, దానిని నియంత్రించుకునే అలవాటు నేర్చుకోవాలి.

కోపం వలన కష్టాలు తీరవు కానీ కోపం వలన కొత్త కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ. కావునా కోపం అనే గుణం దుర్గుణంగా మారకుండా, కోపం అనే గుణంపై నియంత్రణ ప్రయత్న పూర్వకంగా సాధించాలి.

సాదారణ స్థితి మనిషికి మరొక మనిషితో సత్సంబంధం ఏర్పరిస్తే, కోపం వలన సత్సంబంధం మద్య బేధభావం ఏర్పడే అవకాశం ఎక్కువ. కాబట్టి కోపం కారణంగా నష్టాలు అధికంగా ఉండవచ్చు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగువ్యాసం. సమాజంలో అంటువ్యాధులు ప్రభలితే, వాటి ప్రభావం అందరి ఆరోగ్యంపైనా పడుతుంది. దీని గురించి అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో వ్యాసం.

అంటువ్యాధి అంటేనే ఒకరి నుండి మరొకరికి పాకే గుణం కలిగి ఉంటుంది. సహజమైన వాతావరణంలో మనిషి సహజంగా తోటివారితో కలిగి జీవిస్తాడు. తద్ఫలితంగా అంటువ్యాధి వ్యాప్తి చెంది, నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ.

మనిషి సంఘజీవి, సమాజంలో కొందరితో కలిసి జీవించే మనిషి తనకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకుని జేవిస్తూ ఉంటాడు. ఇంకా సమాజంలో పలువురితో కలిసి పని చేస్తూ, లేక చేయిస్తూ జేవిస్తూ ఉంటాడు. అలా మనిషి నిత్యం సమాజంలో కొందరితో కలిసి మెలసి, కొందరితో కలుస్తూ జీవనం కొన సాగిస్తూ ఉంటాడు.

అటువంటి మనిషికి ఒకరినొకరు కలవడం వలన సాంగత్యం ఏర్పడుతుంది. ఆ సాంగత్యం మనసుపైనా, శరీరం పైన ప్రభావం చూపుతుంది. అలా ఉండే మానవ జీవనంలో సహజమైన వాతావరణం మంచి స్థితిని అందిస్తే, అసహజమైన వాతావరణం చెడు ఫలితాలను అందిస్తుంది.

సహజమైన వాతావరణం అంటే పరిసరాల పరిశుభ్రతతో ఉండడం. ఇంకా పర్యావరణ సమతుల్యతతో కొనసాగడం జరుగుతుంది.

అపరిశుభ్రత వలన కలిగే అంటువ్యాధులు అపారనష్టం గురించి

అసహజమైన వాతావరణం అంటే పరిసరాలు అపరిశుభ్రతతో ఉండడం. పర్యావరణం కాలుష్యం అవ్వడం వంటివి జరుగుతాయి. ఇలా సమాజంలో వాతావరణం అసహజంగా మారడం వలన అనేక అంటువ్యాధులు ప్రభలుతాయి. సంఘజీవి అయిన మనిషి నిత్యం పరిచయస్తులతో కలుస్తూ, ఉండడం వలన వ్యాధులు ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

ఇలా అంటువ్యాధులు సమాజంలో ప్రమాదకరంగా మారితే, అవి సమాజానికి అపారనష్టం కలిగిస్తాయి. సమాజానికి అపార నష్టం అంటే, ఆర్ధికంగా, నైతికంగా మనుషులు ఆందోళనను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సహజమైన పరిస్థితులలో మనిషి మనుగడ చాలా బాగుంటుంది. దైనందిన జీవనం కొనసాగుతూ, ఆర్ధికంగా ఎదుగుతూ, తోటివారికి సాయం చేస్తూ ఉంటాడు.

అదే అసహజమైన పరిస్థితులు పెరిగి, అంటువ్యాధులు ప్రభలితే, అదే మనిషి సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన ఆర్ధిక వనరులు కోల్పోయే అవకాశం ఎక్కువ. ఇంకా అనారోగ్యం ఎక్కువ అవుతుంది. తనకు సోకినా వ్యాధిని మరొకరికి వ్యాప్తి చెందడానికి కారకుడు కూడా కావచ్చును.

వ్యాధి గుణం ఒకరి నుండి మరొకరికి, ఆ మరొకరి నుండి ఇంకొకరికి ఆ ఇంకొకరి నుండి వేరొకరికి ఇలా ఒకరి నుండి రెండవ వారికి….మూడవవారికి… పదవవారికి… ఇరవైవారికి… అనేకమందికి పాకే గుణం వ్యాధికి ఉంటుంది. అటువంటి అంటువ్యాధులు చాలా ప్రమాదకరం.

కొన్ని రకాల అంటువ్యాధులు ప్రాణాంతకంగా మారతాయి. అటువంటి అంటువ్యాధులు మరింత ప్రమాదకరం.. వీటి వలన అనేకమంది ప్రాణాలు కోల్పోతారు.

మానవ మనుగడ అంతా ఒకరికొకరు సాయం వలననే సాగుతుంది. అటువంటి మనుషుల మద్య అంటువ్యాదులు తీవ్రత పెరిగితే, మానవ సంభందాలు ప్రభావితం అవుతాయి. కొందరు మనోధైర్యం కోల్పోయే అవకాశం కూడా అంటువ్యాధులు వలన ఏర్పడవచ్చు.

కావున అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా మనిషి చుట్టూ ఉండే సహజమైన వాతావరణం, సహజంగానే ఉండే విధంగా మనిషి కృషి చేయాలి. వ్యవస్థలు కూడా పరిసరాల పరిశుభ్రత విషయంలో పాటుపడాలి.

అంటువ్యాధులు నివారణ చర్యలు

ఎప్పుడైనా అంటువ్యాధి సమాజంలో వ్యాప్తి చెందుతూ ఉంటే, ముందుగా సంభందిత సామజిక వ్యవస్థలు మేల్కోవాలి.

  • వృద్ది చెందుతున్న అంటువ్యాధి లక్షణాలు గురించి పూర్తీ సమాచారం సేకరించాలి.
  • పెరుగుతున్న వ్యాధి గురించి సరైన అవగాహనా సమాజంలో కలగజేయాలి.
  • అంటువ్యాధి యొక్క సహజ లక్షణాలు గురించి అర్ధవంతంగా సంబందిత సమాజంలో తెలియజేయాలి
  • వ్యాధి లక్షణాలపై అపోహలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
  • అంటువ్యాధి గురించి పుకారు వార్తలను సమాజంలో పాకకుండా జాగ్రత్త తీసుకోవాలి
  • అంటువ్యాధి నివారణ చర్యలు అందరికి తెలియజేయాలి
  • అంటువ్యాధి నివారణకు టీకా అందరికి అందే ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాలి
  • ముఖ్యంగా అంటువ్యాధి వ్యాపించకుండా సామజిక దూరం గురించి ప్రజలకు ప్రేరణ కలిగించాలి
  • అంటువ్యాధి నివారణకు ప్రాధమిక జాగ్రత్తలు ప్రాముఖ్యతను పదే పదే ప్రచారం కల్పించాలి

ఈ విధంగా ప్రాధమికంగా అంటువ్యాధి నివారణ చర్యలను, తగు వైద్య సూచనలు తెలియజేస్తూ సమాజంలో విస్తరింప జేస్తూ ప్రజల ద్వారానే ప్రజలలో వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా చూడాలి. ఆపై పెరుగుతున్న అంటువ్యాధి నివారణకు వైద్యపరమైన మార్గాలు అన్వేషించాలి.

తగిన సమయంలో సత్వర నిర్ణయాలు తెసుకునే వారి నాయకత్వంలో అంటువ్యాధి నివారణ గురించిన బాద్యతలు ఉంచాలి.

అంటువ్యాధి సమాజంలో ఒకసారి వ్యాపిస్తే, మరలా ఆ సమాజంలో వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. కావునా అంటువ్యాధికి టీకా సిద్దం చేయాలి. ఆ టీకా సమాజంలో ప్రజలందరికి వేయించాలి. ఇందుకోసం యుద్దప్రాతిపదికన చర్యలు అవసరం అని నిపుణులు అంటారు.

సమాజంలో ప్రమాదకరమైన అంటువ్యాధులు పెరిగితే, అవి సమాజంలో భారీ నష్టాన్ని అందిస్తాయి. కాబట్టి వాటిని వీలైనంత తక్కువ సమయంలో నివారించాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం. నేటి బాలికలే రేపటి తల్లులు మారతారు . గృహిణిగా ఇంటి బాధ్యతలు చక్క పెట్టె, అమ్మ పిల్లలకు మొదటి గురువు గా ఉంటుంది.  తల్లి దగ్గర నేర్చిన పాఠం జీవితంలో ఎప్పటికి గుర్తు ఉంటుంది. కాబట్టి ఒక తల్లి తన పిల్లలకు విద్యను నేర్పించడానికి, ఆమె బాల్యం లో చదువుకుని ఉండుట చాల చాలా ప్రధానమైన విషయం.

మారుతున్న కాలంలో ఆడువారు ఉద్యోగస్తులుగా చక్కగా రాణిస్తున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం కూడా బాలికలకు చదువు అవసరం ఉంది.

చదువుకున్న ఇల్లాలు వలన ఇంట్లో పిల్లలు బాగుగా చదవగలరు . ఇంకా విద్య యొక్క ఆవశ్యకత ను తల్లి ముందుగానే పిల్లల్లో ఏర్పరచగలదు . మనదేశం లో ఎక్కువ మంది నాయకులు తల్లుల బోధ వలననే మంచి ఆశయం కోసం కృషి చేసారని అంటారు.

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

కాబట్టి మంచి సమాజం భవిష్యత్తు మంచి అమ్మ దగ్గర పెరిగే బిడ్డల బట్టి ఆధారపడి ఉంటె, అటువంటి అమ్మ బాల్యంలో సరైన చదువుకుని ఉంటె, కచ్చితంగా మెరుగైన సమాజం కోసం రేపటి పౌరులు అమ్మ ఒడిలోనే పాఠాలు నేర్చుకునే అవకాశం బాలికల చదువు పైనే ఆధారపడి ఉంటుంది.

మహిళలు కేవలం ఉద్యోగస్థులుగానే కాకుండా అనేక రంగాలలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు . క్రీడారంగం , రాజకీయ రంగం, సినిమా రంగం  వంటి పలు రంగాలలో ఆడువారి పనితీరు అద్భుతంగా ఉంటుంది.

వివిధ రంగాలలో అద్భుతమైన ఫలితాలు సాధించిన ఆడువారు, ఆలా నేటి బాలికలకు ఆదర్శంగా నిలిచే మహిళల అక్షరాస్యత, ఆసియాలోకే అతి తక్కువగా భారత దేశంలోనే ఉంది.

నేటికి 20 కోట్ల మంది మహిళలు నిరక్ష్య రాస్యులుగా ఉన్నట్టు అంచనా ఉంది. దీనిని బట్టి చూస్తే బాలికలకు అవసరం  విద్య అనేది గతంలో తక్కువగా ఉందని అర్ధం అవుతుంది. స్త్రీలు కూడా మంచి విద్యను అభ్యసిస్తే, వారి ద్వారా పిల్లలకు మంచి విద్య అందే అవకాశం ఉంటుంది. కాబట్టి బాలికలకు  విద్య అంటే తెలిసి ఉండడం, విషయ పరిజ్ఞానం వలన విషయాలపై అవగాహన ఉంటుంది. అలాగే అనేక విషయాలలో ఆగవగాహన వలన అపోహలకు  తావు ఉండదు.

అపోహలు లేనప్పుడు మనో భయాలు తక్కువగా ఉంటాయి. నిరక్ష్యరాస్యులు  అయిన స్త్రీలు గర్భస్థ సమయంలో ఇబ్బందులు  పలు అయ్యే అవకాశం ఉంటుందని  అంటారు.

కానీ చదువుకున్న మహిళలకు వారి వారి విషయాలపై కూడా తగినంత అవగాహనా ఉంటుంది. కాబట్టి బాలికలకు విద్య నేటి సమాజంలో చాల అవసరం ఉంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం. విద్య వలన వ్యక్తి బుద్ది వికసిస్తుంది. విద్య పలురకాలు…

అయితే ప్రాధమికంగా శాస్త్రీయ విద్యతో విద్యార్ధి దశ ప్రారంభం అయితే, అటువంటి విద్య అన్ లైన్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చు.

నేటి విద్యా వ్యవస్థ సాంకేతికత తోడై సులభతరంగా మారుతుంది. నేర్చుకునే ఉత్సాహం ఉండాలే కానీ ఎవరైనా విద్య నేరుకునే విధంగా విద్యావ్యవస్థ మారుతుంది.

ఇంటర్నెట్ ఆధారిత పరికరాల వాడుక పెరిగాక, ఆన్ లైన్ విద్యకు ప్రాముఖ్యత పెరిగింది. నేటి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకంగా విద్య అందరికి అందుబాటులోకి వచ్చింది.

ఒకప్పుడు విద్య నేర్చుకోవడానికి విద్యాలయానికి వెళ్లి, నిర్ణీత సమయాలలో విద్యాభ్యాసం చేయవలసి ఉంటే, ఇప్పుడది మరింత సులభం అయ్యింది.

ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే పరికరాలతో ఆన్ లైన్ విద్య సులభంగా నేర్చుకోవచ్చు. ఆయా పరికరాలు ఉపాద్యాయులను తెరపై చూపుతుంది. బోధన కొనసాగిస్తుండగానే, బోధించేవారిని ఇంటర్నెట్ ఆధారిత పరికరాలలో చూడవచ్చు.

ఇంటివద్ద నుండే విద్యనూ అన్ లైన్ ద్వారా అభ్యాసం చేయవచ్చు. ఇందుకు డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా లాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్ ఉపయోగించవచ్చు.

ఒకసారి రికార్డు చేయబడిన వీడియోలు మరల, మరలా చూడవచ్చు. అర్ధం కానీ పాఠ్యాంశాలు మరల మరలా వినడానికి అన్ లైన్ విద్య ఉపయోగపడుతుంది. ఇనుడుకు యూట్యూబ్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

విద్య వ్యక్తికి చాలా ప్రధానమైన విషయం. విద్య అంటే తెలుసుకోవడం. వ్యక్తి జీవనం కొనసాగించడానికి శాస్త్రీయంగా ఏమి తెలియాలో? బ్రతకడానికి ఏమి తెలియాలో? అది తెలిసిన వారి నుండి తెలుసుకోవడం.

శాస్త్రీయమైన విద్యాభ్యాసం పాఠశాలలందు నేర్పించబడుతుంది. కానీ అటువంటి శాస్త్రీయమైన విద్య సైతం ఆన్ లైన్ ద్వారా అభ్యాసం చేయవచ్చు.

ఇందుకు బాలురు, బాలికలు, మహిళలు, పురుషులు ఎవరైనా అన్ లైన్ ద్వారా విద్యనూ నేర్వవచ్చును.

నేటి విద్యా విధానం సాంకేతికత వలన అందరికి అందుబాటులోకి వచ్చింది. చెప్పేవారు ఉంటే, ఏ సమయంలోనైనా ఆన్ లైన్ ద్వారా విద్య అభ్యసించవచ్చు.

అంటువ్యాధులకు దూరంగా ఉండడానికి అన్ లైన్ విద్య అవసరం ఉంది.

కరోనా వైరస్ వలన అంటువ్యాధులు అంటే భయం వ్యాపించింది. అంటువ్యాధి వలన సమాజం అంతా వ్యాధిగ్రస్తం అయ్యే అవకాశం ఎక్కువ. ఒకరి నుండి ఒకరికి పాకే గుణం ఉండే అంటువ్యాధులు సోకకుండా అన్ లైన్ విద్య విద్యార్ధులకు ఉపయోగపడుతుంది.

రవాణా ఖర్చులు అదా చేసుకోవచ్చు. ప్రధానంగా కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఆసక్తి ప్రధానం.

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? ప్రశ్నతో పాటు సమస్యలు కూడా ఉంటాయి.

అయితే ప్రధానంగా ఇందులో ప్రధాన సమస్య ప్రతిరోజు కొద్ది గంటలపాటు తదేకంగా ఎల్ఇడి స్క్రీను చూడడం వలన కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇంకా స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ వంటి పరికరాలు అలవాటు అయితే, మనిషిలో ఒంటరితనం పెరిగే అవకాశం కూడా ఎక్కువ.

తోటివారితో కూడిన విద్య, గురువు ముందు నేర్చుకోవడం మేలైన విద్యావిధానం అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. శ్రీరామాయణంలో రాముడి పితృవాక్య పరిపాలన, సీతమ్మ ప్రాతివత్య ధర్మం, సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడి సేవానిరతి, లక్ష్మణస్వామితోడు ఏ పాత్ర చూసిన రాముని ధర్మమునకు కట్టిబడి ఉంటారు. ధర్మమునకు కట్టుబడి రాముడు నడిస్తే, రాముని వెంట నడిచినవారే ఎక్కువమంది ఉంటారు. మరణానికి చేరువ అయ్యేవారు రావణుడికి దగ్గరగా ఉంటే, ధర్మము అంటే ఇష్టపడేవారు రాముని చుట్టూ ఉంటారు. అలా రాముడి ధర్మమే రామాయణంలో చాలా ప్రధానంగా ఉంటుంది.

అలాంటి సుగుణాభిరాముడి గురించి శ్రీరామాయణం అంటే శ్రీరాముని పదహారు గుణాలను తెలుపుతూ ఉంటుంది.

ఈశ్వరునికి ఉండే పదహారు విశిష్టమైన గుణాలు ఒక మానవుడికి ఉంటే, ఆయనే శ్రీరామచంద్రమూర్తిగా ప్రవచనకారులు చెబుతారు.

ఇంకా శ్రీరాముడు పరమ ధర్మమూర్తిగా పురాణాలలో చెప్పబడతారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది… అనే ఆర్యోక్తి శ్రీ రామాయణంలో రాముని ద్వారా తెలుసుకోవచ్చు.

ఒక ప్రాంతంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి, ఆ ప్రాంతవాసులకు ఆదర్శం అయితే, ఆ ప్రాంతం మిగిలిన ప్రాంతాలకు ఆదర్శప్రాయంగా కనబడును.

అలాగే ఒక కుటుంబ పెద్ద కూడా సమాజంలో తగినంత అనుభవం కలిగి ఉంటాడు. కాబట్టి కుటుంబ పెద్ద అయినా తండ్రి తనయుడికి ఆదర్శప్రాయంగా నిలిస్తే, అతనిని అనుసరించడం తనయుడి ధర్మం.

అటువంటి కర్తవ్య దీక్షనే శ్రీరామచంద్ర మూర్తి రామాయణంలో నిర్వహించినట్టుగా రామాయణం ద్వారా మనకు తెలియబడుతుంది.

కేవలం తండ్రి మాటపై గురువుతో రాముడు అడవులలో నడిచాడు.

అయోధ్యలో అంతపురంలో సౌకర్యవంతమైన జీవనం కలిగి ఉన్న శ్రీరాముడు, విశ్వామిత్రుడి వెంట అడవులలో నడిచాడు.

శ్రీరాముడిని తనతో పంపవలసినదిగా, దశరడుని విశ్వామిత్రుడు కోరతాడు. అప్పుడు దశరదుడు శ్రీరాముడిని, విశ్వామిత్రుని వెంట పంపుతాడు… విశ్వామిత్రుడి చెప్పినట్టు శ్రీరాముడు అడవులలో నడుచుకుంటాడు.

విశ్వామిత్రుడిని దగ్గర అనేక అస్త్ర, శస్త్రాలను శ్రీరాముడు పొందుతాడు… కానీ వాటిని స్వప్రయోజనానికి ఉపయోగించకుండా కేవలం ధర్మరక్షణకై ఉపయోగించడం రామాయణంలో రాముడి దగ్గరే తెలుసుకోవాలని పెద్దలంటారు.

ఎంతటి శక్తిని పొందినా గురువు దగ్గర ఎంతటి వినయంతో నడుచుకోవాలో రామాయణంలో శ్రీరాముడిని నుండి నేర్చుకోవాలి.

గురువుపై గురి కుదిరితే అత్యంత శక్తివంతమైన, అసాదరణమైన విజయం సాధించవచ్చని శ్రీరామాయణంలో శ్రీరాముడిని చూసి తెలుసుకోవచ్చు.

శక్తివంతులైన రాక్షసులకు, ఇతరులకు సాద్యం కానీ శివధనుస్సు ఎక్కుపెట్టగలగడం శ్రీరాముడికే సాద్యం అయ్యింది.

చెప్పుడు మాటలు వింటే, బుద్ది నశిస్తుందని రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు

చెప్పుడు మాటలు వింటే, బుద్ది నశిస్తుందని శ్రీరామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే శ్రీరాముడంటే అమితమైన ప్రేమ కలిగినవారిలో కైకేయి ఉంటుంది.

ఆమెకు రాముడంటే చాలా ఇష్టం. అటువంటి కైకేయి చెప్పుడు మాటల వలన సమాజంలో నిందితురాలిగా మారింది. కన్న కొడుకు కూడా ఆమెను అసహ్యించుకోవడం కైకేయి విషయంలో శ్రీరామాయణంలో చూడవచ్చు.

శ్రీరామపట్టాభిషేకం అడ్డుకుని, కొడుకుకు రాజ్యం ఇప్పించాలనే సంకల్పం, మంధర మాటల వలన కైకేయి మనసులో కలుగుతుంది.

వెంటనే దశరడుడిని కోరడంతో, ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి మాటమేరకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడానికి అడవులకు బయలుదేరతాడు. శ్రీరాముడిని అడవులకు పంపింది, దైవమె అయినా, చెప్పుడు మాటలు వింటే, లోకనింద పొందే అవకాశం ఎక్కువ అని రామాయణంలో కైకేయి పాత్ర నిరూపిస్తుంది.

వ్యక్తి మహనీయుడుగా మారాలంటే అందుకు ఆదర్శప్రాయమైన పాత్రలు శ్రీరామాయణంలో చాలా కనబడతాయి. శ్రీరాముడులాగా అందరితో మంచి అనిపించుకుంటే, కష్టంలో అందరూ సాయపదతారని శ్రీరామాయణం చాటి చెప్పుతుంది.

అన్నీ తెలిసినా, మరొకరికి ఉపకారం చేయకుండా, అపకారం తలపెడితే, ఎంత ప్రమాదమో రామాయణంలో రావణుడు పాత్ర తెలియజేస్తుంది.

రావణుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. బలవంతుడు. అనేకమంది శక్తివంతులైన రాక్షసగణం కలిగినవాడు. అటువంటి వాడు అన్నీ తెలిసినా, మరొకరికి ఉపకారం చేయకుండా, అపకారం తలపెడితే, ఎంత ప్రమాదమో రామాయణంలో రావణుడు పాత్ర తెలియజేస్తుంది.

సాక్షాత్తు దైవానుగ్రహం కలిగి ఉన్నా, మన ప్రవర్తన ఇతరులకు అపకారం చేస్తే, ఫలితం అనుభవించాల్సిందే… రావణుడికి పరమేశ్వరుడి అనుగ్రహం కలిగింది. కాబట్టి పంచభూతాలను శాసించాడు.

ఇంకా లోకాన్ని పీదించాడు. మితిమీరి శ్రీరాముడి భార్యను తీసుకువెళ్ళి లంకలో కూర్చోబెట్టాడు. అందుకు ఫలితంగా సీతమ్మ తల్లి వేదనకు గురైంది…. సీత ఆవేదన, రావణుడికి పాపం పెరుగుతూ, పుణ్యం నశించడం మొదలైంది.

నశించిన పుణ్యం వలన కేవలం రావణుడికి దైవానుగ్రహం దూరం అయింది. రాముడు, రావణుడిని జయించాడు.

శ్రీరామాయణం వ్యక్తి సమాజంలోను, కుటుంబంలోను ఎలా జీవించాలో? తెలియజేస్తుందని పెద్దలు చెబుతారు.

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం. డిజిటల్ యుగంలో, మొబైల్(సెల్) ఫోన్లు మన జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. ఈ పరికరాలు నిత్యం సోషల్ మీడియాతో కనెక్ట్ కావడానికి, మరియు వినోదంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. మొబైల్ వాడుక విస్తృతంగా పెరుగుతున్న వలన, అదే ఆందోళనకు దారితీస్తుంది. ఎందుకంటే మొబైల్ ఒక వ్యసనం వలె మారే అవకాశం ఉంది. ఈ వ్యాసం మొబైల్ వ్యసనానికి కారణాలు, పర్యవసానాలు మరియు సంభావ్య పరిష్కారాలను అన్వేషిస్తుంది, ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేయగలిగే శక్తివంతమైన చేతిలో ఉండే పరికరం.

మితి మీరిన సెల్ ఫోన్ వాడకం మనిషికి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని అంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వలన వ్యక్తి మొబైల్ పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్(సెల్) ఫోన్లు చాలా అనువుగా ఉంటాయి. ఎక్కడంటే అక్కడే మొబైల్లో గేమ్స్ అడవచ్చును, కనుక ఇది ఒక కారణం అవుతుంది. ఇక వినోదకరమైన అనేక అంశాలు ప్రధానంగా ప్రభావం చూపుతాయి.

ఇంకా సమాజంలోసెల్ ఫోన్ అతిగా వాడడం మొబైల్ వాడడం వలన నష్టాలు వివరిస్తూ అనేకమంది ఔత్సాహికులు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సెల్ ఫోను వాడుక పెరుగుతూనే ఉంది.

మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణలు మితిమీరుతున్నాయని, అటువంటి సెల్ ఫోన్ మాటల వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని వైద్యులు అంటున్నారు.

మనమద్య సెల్ ఫోన్ రాకముందు సమాజంలో పలకరింపులు బాగుంటే, ఇప్పుడు పలకరింపులు పరిమితమైపోతున్నాయనే భావన బలపడుతుంది.

ఇపుడు సెల్ ఫోన్ వలన నిద్రలేవగానే, ఒకరికొకరు గుడ్ మార్నిగ్ అని చెప్పుకోవడం కంటే నిద్రలేవగానే సెల్ ఫోన్ ను చెక్ చేయడం ఎక్కువైపోయింది. స్మార్ట్ ఫోన్ చూడకుండా తెల్లవారదు, పొద్దుపోదు అన్నచందాన మనిషి జీవన కొనసాగుతుందనే వాదన బలంగా ఉంది.

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు చాలానే చెబుతారు.

  • స్మార్ట్ ఫోన్ వాడుక, అదొక అలవాటుగా మారి, వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం.
  • శరీర ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
  • మానసిక చికాకులు, మనోవ్యాదులు పెరిగే అవకాశం
  • ముఖాముఖి సంబంధాలను మొబైల్ వ్యసనం తగ్గించేస్తుంది.

స్మార్ట్ ఫోన్ వాడుక, అదొక అలవాటుగా మారి వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం.

మన మానవ సమాజం అంతా మానవ సంబంధాలతో సాగుతుంది. నిత్య జీవితంలో బంధుమిత్రులతో కలిసి పనిచేస్తూ, కష్టసుఖాలలో భాగం అవుతూ ఉంటాం.

ఇలాంటి మన మానవ సమాజంలో యంత్రికతకు చోటు తక్కువగా ఉండేది. కాని ఇప్పుడు సినిమాలు మనిషిపై పోకడ పేరుతొ ప్రభావం చూపితే, టివిలు ఒంటరితనం పెంచితే, సెల్ ఫోన్స్ మనిషిపై పూర్తీ యాంత్రికమైన భావనను పెంచుతున్నాయి.

మనకున్న సమాజంలో నిత్యం ఎదో అలవాటుగా పని చేస్తూ, సంపాదన చేస్తూ ఉండే ప్రజల మధ్యలో చదువుకునే బాలబాలికలు ఉంటారు. అలవాటుగా పెద్దల నుండి పిల్లలకు కొన్ని అలవాట్లు సంక్రమిస్తూ ఉంటాయి..

ఇప్పుడు ఆ కోవలోకి సెల్ ఫోన్ వాడుక కూడా చేరుతుంది. తండ్రిని మించిన తనయుడు అన్నట్టుగా ఫోన్ వాడుక పిల్లలల్లో పెరుగుతుండడం పెరుగుతుందని, దాని వలన బాల్యం నుండే పిల్లలలో అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా.

ఒక అట వస్తువుగా, ఒక పరికరంగా, ఒక టీవీగా, ఓకే సంభాషణ అందించే పరికరంగా, ఇద్దరితో సమన్వయము చేసే పరికరంగా, బిల్ పే చేసే నేస్తంలాగ, వినోదం పంచె మిత్రుడిలాగా సెల్ ఫోన్ మనిషికి మరింత చేరువై, అది ఒక అలవాటుగా మారుతుంది.

ఎప్పుడు సెల్ ఫోన్ వాడుట కూడా ఒక వ్యసనంగా మారే అవకాశం ఎక్కువ అని అంటారు.

శరీర ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.

సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని తిరిగితే, అది స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుతుంటే, క్యాన్సర్‌ కావాలని కొనుకున్నట్టే. మొబైల్ ఫోన్లను పదేళ్లుగా వాడే యువతకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు.

అతిగా సెల్ ఫోన్ యూజ్ చేయడం వలన, చేతికి బాధారకమైన స్థితి రావచ్చు, మణికట్టు నుండి మెదడుకు గల నాళం దెబ్బతినే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

అంతేకాకుండా సెల్ ఫోన్ అలవాటుగా మారి వాహన వాడుకలో కూడా ఫోన్ వాడడం పరిపాటి అయిపోతుంది. దీని వలన వాహన ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువ.

ప్రతిరోజూ సెల్ ఫోను గంటల తరబడి ఉపయోగిస్తూ, మొబైల్ ఫోన్లను 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించినట్లయితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు కానుందని నిపుణుల మాట.

మరోవైపు సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారిలో వినికిడి సమస్య వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

సెల్ ఫోన్లో అధికంగా మాట్లాడే వారిలో తలనొప్పి, కళ్ళు తిరగడం, తల తిరగడం, కళ్లు బైర్లుకమ్మడం, ఆకలి మందగించడం, ఆందోళన వంటి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం కూడా ఎక్కువేనని అంటారు.

మానసిక చికాకులు, మనోవ్యాదులు పెరిగే అవకాశం

అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అతి అన్నింటిలోను అనర్ధమే అని భావన వస్తుంది. ఇది సెల్ ఫోన్ విషయంలో రుజువు అవుతుంది.

ఆత్రుత ఉంటుంది…. రోజు ఆత్రం కలిగించే విషయాలను మనసు మరిగితే, అవే విషయాలను మనసు రోజూ కోరుతుంది. ఇటువంటి ఆత్రం సెల్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ వాడుక వలన పెరిగె అవకాశాలు ఎక్కువని అంటారు.

నిత్యం ఒత్తిడికి లోనైతే మొదట కోల్పోయేది నిద్రాసమయం. ఇప్పటికే ఈ సమస్య సమాజంలో ఉంటే, అది సెల్ ఫోన్ వలన మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

సరసమైన ధరలలో నిత్యావసర వస్తువుల కంటే, సరసమైన ధరలలో స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అటువంటి స్మార్ట్ ఫోన్ మనిషి జీవనంలో అంతర్భాగం అయిపొయింది.

సెల్ ఫోన్ వాడొద్దని చెప్పడానికి ప్రధాన కారణం, దాని నుండి వచ్చే రేడియో ధార్మికత…

పిల్లలపై, తల్లులపై, తండ్రులపై, అత్త, మామలపై ఇలా ఏ బంధం చూసినా ఒంటరిగా మారడానికి సెల్ ఫోన్ ఒక ఆయుధంగా మారుతుంది.

తగు సమయంలో దీనిని గురించి ఆలోచన లేకుండా, అదే పనిగా సెల్ ఫోన్ వాడితే, మనిషిలో యాంత్రికత పెరిగి, మానవ సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఎక్కువ.

కాబట్టి సెల్ ఫోన్ అతి వాడుకను అతి త్వరగా నియంత్రణలోకి తీసుకురావలసిన అవసరం అందరికి ఉంది. ఇది అందరి పట్ల ఉన్న ప్రధాన సామజిక భాద్యత గుర్తించవచ్చు.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది.

పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది.

భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం.

వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి.

సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది.

ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి.

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

మనదేశంలో పల్లెటూరు అందంగా కనబడుతుంది. సూర్యోదయం పచ్చని పొలాల్లో నుండి పొడుచుకువస్తుంది. భానుడి కిరణాల వేడి పెరిగేకొలది చెట్లు చల్లదనం మనకు ఎంతో హాయిని అందిస్తాయి.

గ్రామంలో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషి మరుపురాని స్మృతులుగా ఉంటాయని అంటారు.

ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో, మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా పల్లెటూళ్ళల్లో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో, కాయగూరల పాదులతో చక్కగా ఉంటుంది.

మనిషికి కావాల్సిన గాలి చాలా సహజంగా ఒక్క పల్లెటూళ్ళల్లోనే లభిస్తుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్ల ద్వారా ఆక్షిజన్ పుష్కలంగా లభిస్తుంది.

భూమి, గాలి, నీరు, నిప్పు పల్లెటూళ్ళల్లో సహజంగా ఉంటాయి.

భూమి, గాలి, నీరు, నిప్పు ఎంత సహజంగా ఉంటే, ప్రకృతి అంట ప్రశాంతంగా ఉంటుంది. భూమిపై కొన్నాళ్లు ఉండి వెళ్ళిపోయే మనిషి ప్రకృతిపై చేసే మార్పులే మనిషికి భవిష్యత్తుగా మారతాయి.

అలాంటి మనిషి కాపాడుకుంటున్న, కాపాడుకోవలసిన అంశాలలో పల్లెటూరి వాతావరణం, పశుసంరక్షణ ప్రధానమని పెద్దలు చెబుతారు. భూమి, గాలి, నీరు, నిప్పు వలననే మనిషి మనుగడ సాగుతుంది.

స్వచ్చమైన గాలి మనసుపై మంచి ప్రభావం చూపుతుంది. భూమిలో నుండి వచ్చే ఆహార పదార్ధాలు స్వచ్చంగా ఉంటే, మనిషి పూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండగలడు. స్వచ్చమైన నీరు మానవ శరీరం పోషణలో కీలకంగా ఉంటుంది.

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఈ విధంగా భూమి, గాలి, నీరు మనిషి ఆరోగ్యంపైన, మనసుపైనా కూడా ప్రభావం చూపుతాయని అంటారు.

సహజమైన ప్రక్రుతి పల్లెటూరిలో మెరుగ్గా ఉంటుంది. అందమైన పల్లెటూరు గురించి ఎంత చెప్పిన తక్కువే, ఎంత అనుభపూర్వకంగా తెలుసుకుంటే, అంత ప్రయోజనం తెలుసుకున్న వారికి ఉంటుంది.

పల్లె గురించి, పల్లె అందాల గురించి పల్లెటూరి కవితలు చెబుతాయి. గుడికి వెళ్లేముందు గుళ్ళో దేవుడి గురించి తెలుసుకుని వెళ్లినట్టు, పల్లెటూరికి వెళ్ళేముందు పల్లె గురించి తెలుసుకుంటే, ఆ వాతావరణం ఆస్వాదించగలం.

అందమైన పల్లెటూళ్ళల్లో వ్యక్తి గ్రామ జీవితం

అందమైన పల్లెలో సహజమైన ప్రక్రుతి చాలా సహజంగా ఉంటుంది. అందమైన పల్లెటూళ్ళల్లో వ్యక్తి గ్రామ జీవితం శ్రమతో కూడినది అయినా సంతృప్తికరమైనదిగా ఉంటుందని అంటారు.

ఒక వ్యక్తి కోడికూసే వేలకు నిద్రలేవడం పల్లెటూళ్ళల్లో ఉంటుంది. సూర్యోదయమునకు ముందే నిద్రలేవడం ఆరోగ్య లక్షణాలలో మొదటిదిగా చెబుతారు. అలా గ్రామంలో నివసించేవారు సహజంగా ఆరోగ్యలక్షణం పాటిస్తూ ఉంటారు.

ఇంకా గ్రామాలలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ఉంటుంది.

బంధువులు, భాందవ్యాలు బలంగా ఉండడంలో పల్లెటూరి ప్రశాంతత ప్రధానం అంటారు.

పల్లెలో నివాసం అంటే ప్రశాంతమైన ప్రకృతిలో పడుకున్నట్టే….

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుందని మీరు అంగీకరిస్తారా? అవును ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం ఒక నేస్తంలాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తాను

ఎందుకు ఒంటరిగా ఉంటే పుస్తకం ఓకే నేస్తం మాదిరిగా ఉంటుందని అంటున్నాను అంటే, పెద్దలు ఇదే మాటను ఎక్కువగా చెబుతారు. పుస్తకం వలన విషయపరిజ్ఞానం పెరుగుతుందని అంటారు.

పెద్దలు పలికే పలుకలలో పుస్తకాలు ఎక్కువగా చదవండి… అగవగాహన చేసుకోండి… విషయాలపై ఆలోచన చేయండని చెబుతారు. కావున పెద్దల మాటలను బట్టి చూస్తే, పుస్తకాలు ఒక మంచి మిత్రుడు మాదిరిగా మారతాయి.

నా దృష్టిలో నుండి చూస్తే నాకు తెలుగు పుస్తకం తెలుగు నేస్తంలాగా, ఇంగ్లీష్ పుస్తకం ఒక గుడ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. తెలుగు పుస్తకం చదివితే తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. బాగా తెలుగు తెలిసిన స్నేహితుడి మాటలు తెలుగులో అక్షరాలుగా పదాలు పేరాలలో పేరుకుపొతే అవి ఒక తెలుగు మిత్రుడి మాటలుగా నా మనసులోకి ప్రవేశిస్తున్నాయి.

ఇప్పుడు నా స్నేహితులతో లేకుండా ఒంటరిగా ఉంటే పది మంది మిత్రులు ఉన్నట్టే. ఎందుకంటే నాకు ఉన్న సబ్జెక్ట్ పుస్తకాలే నాకు మిత్రులు.

ఇంకా గ్రంధాయలం నుండి ఎరువు తెచ్చుకునే తాత్కాలిక నేస్తం అప్పుడప్పుడు పలకరిస్తుంది.

గ్రంధాలయం నుండి ఒక నాయకుడు చరిత్ర పుస్తకం అయితే ఓ పాతకాలపు నేస్తం నాకు దొరికినట్టే…

అలాగే నేటి నాయకుల చరిత్ర అయితే ఓ సోషల్ ఫ్రెండ్ ఉన్నట్టే… ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది..

తరం మారుతుంది తరతరాల సంస్కృతి పుస్తకం వలననే తరం నుండి తరానికి చేరుతుంది… అంటే పుస్తకం ఒక దీర్ఘకాలిక నేస్తమే అవుతుంది…

మంచి పుస్తకం కాలంలో ఎంతోమందికి ఓ మంచి నేస్తంగా మారుతుంది.

మంచి పుస్తకం కాలంలో ఎంతోమందికి ఓ మంచి నేస్తంగా మారుతుంది. ఎందుకంటే మంచి పుస్తకం అంటే అందరికి మక్కువ ఉంటుంది. కాలంలో కలిసిపోయిన విషయాలను పుస్తకం గుర్తుకు తేగలదు.

ఓ మంచి నాయకుడు జీవితం ఒక పుస్తకంగా మారితే, ఆ నాయకుడు కాలం చేసాక కూడా ఆయన జీవితం పుస్తకరూపంలో లోకంలో ఉంటుంది. ఆ పుస్తకం ఎంతోమందికి మంచిమిత్రుడులాగా ఉపయోగపడుతుంది.

క్రీడాలంటే ఇష్టం ఉన్నవారికి ఒక గొప్ప క్రీడాకారుడి జీవిత చరిత్ర పుస్తకం ఒక మంచి నేస్తంగానే కనబడుతుంది.

ఎవరికీ ఎలాంటి ఇష్టం అలాంటి రంగంలో పుస్తకం ఒక మంచి నేస్తంగా మారుతుంది.. కాలంలో అనేకమందితో విషయ విజ్ఞానం మిత్రునివలె పంచుకుంటుంది.

అల ఒక పుస్తకం పాఠ్యపుస్తకంగాను, జీవిత చరిత్రగాను, పురాణ కాలక్షేపంగాను ఓ మిత్రుని మాదిరిగా మనసుకు మంచిని పంచుతుంటే, మరి పుస్తకం మంచి మిత్రుడు అని ఒప్పుకోవాలి…

పుస్తకం చదవడం అంటే ఒక స్నేహితుడి అంతరంగంతో గడిపినట్టే….

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు