By | August 8, 2021

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం. సమాజంపై ప్రభావం చూపగలిగే వాటిలో వార్తా పత్రికలు ఉంటాయి. మొదట్లో వార్తా పత్రికలే పాలకులకు ప్రజలకు సమాచారం అందించడంలో ముందుండేవి.

టి‌వి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తదితర పరికరాలు వచ్చాక, వార్తలు ప్రచారం పొందడంలో పోటీ పెరిగింది. గతంలో మాత్రం ప్రజలకు వార్తలను అందించడంలో ప్రధాన పాత్ర పత్రికలదే.

ప్రతిదినం ఎన్నో ఇళ్ల ముంగిట్లోకి వార్తలు చేరవేసే ప్రక్రియను వార్తా పత్రికలు చాలాకాలం నుండి మోసుకొస్తున్నాయి. టి‌వి చూసినా సరే, వార్తా పత్రిక చదివితేనే వార్తలు చదివినట్టు ఉండదు అనేవారు కూడా కనబడతారు.

కొందరికి వార్తా పత్రికను చదువుతూ టీ త్రాగే అలవాటు ఉంటుందని అంటారు. వారికి వార్తా పత్రిక చదవకుండా టీ తాగితే, టీ తాగిన తృప్తీ ఉండదనే వారు ఉన్న ఆశ్చర్యపడనవసరం లేదంటారు.

అంటే ప్రతిదినం వార్తా పత్రిక చదవడం కొందరికి ఒక అలవాటుగా మారినట్టే.

ఇక సమాజనికి మీడియా ఒక స్తంభంలాంటిది అయితే, వార్తా పత్రికల ప్రధాన పాత్రను కలిగి ఉండేవి.

ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం కల్పించడంతో బాటు, ప్రజా పాలనలోని లోటుపాట్లు, సామాజిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో వార్తా పత్రికలు కధనాలు చాలా కీలకమైనవి.

ఇంకా సమాజంలో ఎక్కడైనా అమానుషం ఘటన జరిగితే, దానిని నలుగురికి తెలిసేలాగా చేస్తూ, అందుకు కారణం అయినవారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టే విధంగా వార్తా పత్రికలలో కధనాలు సాయపడగలవని అంటారు.

ఉద్యమాలకు ఊపిరి పోయాలంటే, వార్తా పత్రికలలో వచ్చే కధనాలు కీలకంగా మారగలవు.

ప్రపంచంలో జరిగే విషయాలను, ప్రజలకు అక్షర రూపంలో చూపించే వ్యవస్థే వార్తా పత్రికలు

అక్షరం ఆయుధం కన్నా పదునైనది అంటారు. అక్షరంలో పలికే భావం, ఒక వ్యక్తిలో చైతన్యం తీసుకురాగలదు. అలాంటి వారిని ఎక్కువమందిని ఒకేసారి చైతన్య పరచగలిగే భావాలు, వార్తా పత్రికల ద్వారానే ప్రజాలలోకి చేరతాయి.

ప్రజలకు అవసరాలు పట్టించుకోకుండా, సామాజిక అభివృద్దిని కాదని ప్రవర్తించే ప్రభుత్వం ఉంటే, అటువంటి ప్రభుత్వ విధానాలను ఎండగట్టగలిగె అక్షర శక్తి వార్తా పత్రికల కధనాలలో కదులుతూ, ప్రజలలో అవగాహన తీసుకురాగలవు.

రాజకీయాలలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఉంటే, ప్రజల పక్షం ఎప్పుడు ఉండేవి వార్తా పత్రికలుగా చెబుతారు. ప్రజా సమస్యలపై కధనాలు వ్రాస్తూ, ప్రభుత్వ అధికారులలో చలనం కలిగించే శక్తి వార్తా పత్రికలకు ఉంటుంది.

నేటి కాలంలో టి‌విలు, స్మార్ట్ ఫోన్లు అంటూ ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నా, వార్తలను ప్రజలకు అందించడంలో వార్తా పత్రికలు పోటీ పడుతూనే ఉన్నాయి.

ఇంకా వార్తా పత్రిక పఠనం వలన విద్యార్ధులకు జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకా సమాజంపై ఒక అవగాహన కూడా ఏర్పడగలదు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు