Telugu Cinema Reading Things రాధే శ్యామ్ ప్రేమ కధ పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా? శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్ వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం
వాల్తేరు వీరయ్య తెలుగు మూవీకి దర్శకుడు బాబీ కొల్లి నిర్మాణం మైత్రీ మూవీ మేకర్స్ విడుదల 2023 సంక్రాంతి సీజన్ తెలుగులో మెగా మాస్ మహారాజా యాక్షన్ కామెడీ మూవీ. ఈ చిత్రంలో చిరంజీవి వీరయ్య క్యారెక్టర్లో అభిమానులను అలరిస్తే, రవితేజ సాగర్ గా అందరిని ఆకట్టుకుంటాడు. ఇంకా వీరికి జంటగా శ్రుతి హాసన్, కేథరిన్ ట్రెసా నటించారు.
ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పాటలు బాగుంటాయి. మాస్ ప్రేక్షకులను మెప్పించడానికే ఈ సినిమా తీసినట్టుగా ప్రచారం జరిగింది. అలాగే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది.
రాజకీయాల నుండి తిరిగి ఇండస్ట్రీకి వచ్చాక, మెగాస్టార్ రేంజికి తగ్గ సినిమాగా వాల్తేరు వీరయ్య కలెక్షన్లు ఉన్నాయని అభిమానులు ఆనందిస్తున్నారు. నిజంగానే ఈ సినిమా చూస్తున్నంతసేపూ కాలక్షేపంగా కధ కదులుతూ, చిరంజీవి కామెడి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక సెకండాప్ సినిమాలో రవితేజ ఎంట్రీ నుండి సినిమా ముగింపు వరకు సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
సినిమాలో మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర అయితే, సినిమా సెకండాఫ్ లో మాస్ మహరాజా పాత్ర పవర్ పుల్ గా కనబడుతుంది. అంతే పవర్ పుల్ గా ఎమోషన్ తో ఎండ్ అవుతుంది. ప్రేక్షకులు వారి ఎమోషన్ కు కనెక్ట్ అవుతారు.
వాల్తేరు వీరయ్య తెలుగు మూవీ ఇక కధ విషయానికొస్తే…
వైజాగ్ లో మత్యకారులకు నాయకుడుగా వాల్తేరు వీరయ్య ఉంటాడు. అడిగినవారికి ఎటువంటి సాయం చేయడానికి అయినా చేయడానికి సిద్దంగా ఉంటాడు. అతని మంచితనం అతని చుట్టూ అక్కడి ప్రజలు ఉంటారు. వీరయ్య ఐస్ ప్యాక్టరీ రన్ చేస్తూ ఉంటాడు. అందులో మైకేల్ పని చేస్తూ ఉంటాడు.
మంచితనం ఎక్కువైన చోట, చెడ్డతనం చాపకింద నీరులాగా భారీగా పెరిగిపోతుంది. అలా… వాల్తేరు వీరయ్య నీడలో ఒక మైకేల్(ప్రకాశ్ రాజ్) డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతనిపై అనుమానం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. కానీ వీరయ్య(చిరంజీవి) తమ్ముడు సాగర్(రవితేజ) సిన్సియర్ పోలీసు అధికారి.
సాగర్ కు మైకేల్ కదలికలు అనుమానస్పదంగా అనిపించినా, అతనిని ఇంట్రాగేషన్ చేసే అవకాశం దొరకదు. కానీ వీరయ్య ఐస్ ప్యాక్టరీ నుండి స్కూల్ కు ఐస్ సరఫరా జరుగుతుంది. అయితే అందులో పొరపాటున మైకేల్ డ్రగ్స్ పెట్టిన ఐస్ వెళుతుంది. దాని వలన 25మంది విద్యార్ధులు మరణిస్తారు.
దాని పర్యవసానంగా వీరయ్యను జైలులో బందిస్తారు. వీరయ్యను ఎన్ కౌంటర్ చేయాలని పోలీసులు బావిస్తారు. కానీ అక్కడ రవితేజ మరణాన్ని పొందుతాడు. మైకేల్ విదేశాలకు వెళ్లిపోతాడు. మరణ సమయంలో వీరయ్య, సాగర్ ల బంధం ఎంత బలమైనదో… తెలుస్తుంది. వారి మద్య సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంటుంది. ఇది అసలు కధ అయితే….
ప్రధమార్దంలో మైకేల్ తమ్ముడు సోలమన్ సీజర్ పోలీసుల నుండి తప్పించుకోవడం, అతనిని పట్టుకోవడానికి పోలీసు అధికారులు వీరయ్యతో ప్రయత్నం చేయడం. పోలీసులే కాకుండా రా అధికారుల కూడా ప్రయత్నం చేయడం… ఇదంతా కామెడీ యాక్షన్ కలగలపి ఉంటుంది.
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు రాజకీయాలు రాజకీయ నాయకులు యుక్తులు, కుయుక్తులు మనకు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులను చూపుతూ ఉంటారు. వీటిని చూసి ఎవరు ఎలా ప్రభావితం అవుతారో తెలియదు కానీ రాజకీయాలు అంటే సమాజాన్ని బాగు చేయగలవు. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు సమాజానికి హాని కూడా చేయగలవు అని సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. రాజకీయాలు రాజకీయ నాయకులు ప్రభావము రాజకీయాలు మనం నివసిస్తున్న సమాజంపై ప్రభావం చూపుతూ, మనపై ఎప్పుడూ ప్రభావం చూపుతాయి. వాటిని శాసించేవారు రాజకీయ పార్టీల నాయకులు.
రాజకీయపార్టీ అంటే మన భవిష్యత్తుని నిర్ణయించే సామాజిక శక్తి. రాజకీయ నాయకుడు మన భవిష్యత్తుపై ప్రభావం చూపించేవారిలో ముఖ్యుడు. మంచి నాయకత్వంలో నాయకులు నడిస్తే, అది మంచి రాజకీయ పార్టీ. ఒక మంచి నాయకుడిని గెలిపిస్తే, అది ఆ ప్రాంతపు అభివృద్దికి తోడ్పడుతుంది. ఎక్కువమంది మంచి నాయకులకు ప్రజలు ఎన్నికలలో ఎన్నుకుంటే… ఆ రాష్ట్రమే బాగుపడుతుంది. అలా ఒక రాష్ట్రంలో ఎక్కువమందిని ఎన్నుకునే అవకాశం రాజకీయ పార్టీ వలన సాద్యపడుతుంది. కావునా ఒక రాజకీయ పార్టీ యొక్క సిద్దాంతాలు, వారి భవిష్యత్తు దార్శినికతను తెలుసుకోవాలి.
మీడియాలో మనకు రాజకీయ పార్టీల నిర్ణయాలు, రాజకీయ నాయకులు చేష్టల గురించి విశ్లేషణలు ఒక అవగాహనను కల్పిస్తాయి. సినిమాలు ఐతే రాజకీయం ఎలా ఉంటుందో? చూపుతూ ఉంటారు.
రాజకీయ పార్టీలు సమాజ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు…
ఒక్కసారి ఓటేసి గెలిపించిన నాయకుడు ఒక అధికార పదవిని చేపడతారు. అధికారం చేపట్టిన నాయకుడు, అధికార రాజకీయ పార్టీ అధినేత పాలనలో భాగమై పని చేస్తారు.
ఒక రాజకీయ పార్టీయే ఒక ప్రభుత్వంగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉంటుంది. కావునా ఒక రాజకీయ పార్టీ అధినేత విధానం బట్టి ఆ ప్రాంతపు అభివృద్ది ఆధారపడి ఉంటుంది.
చాలా రాజకీయ పార్టీలలో ఆ పార్టీ అధ్యక్షుడే, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్నారు.
మన దేశానికి కూడా గతంలో రాజకీయ పార్టీ అధ్యక్షులే, ప్రధానమంత్రిగా ఉండేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలు, పార్టీ అధ్యక్షలు ఒకరైతే, దేశప్రధానిగా మరొకరు ఉంటున్నారు.
పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వానికి నాయకత్వం వహించినా లేక పార్టీ సభ్యులు ఎంపిక చేసినవారు ప్రభుత్వానికి నాయకత్వం వహించినా, ఆయా రాజకీయ పార్టీల విధానాన్ని బట్టే పాలన ఉంటుందని అంటారు.
కావునా ప్రధానంగా రాజకీయ పార్టీ యొక్క విధి విధనాలు తెలుసుకోవాలి.
మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలలో ఉండే, ప్రాంతీయ నాయకులు గురించి పూర్తిగా అవగాహన ఓటరుకు ఉండాలి. అప్పుడే సరైన నాయకత్వంలో అధికారం ఉంటుందని అంటారు.
ప్రజాక్షేమం కోరి పనిచేసేవారి వర్తమానంలో చేసే పనులు భవిష్యత్తులో ప్రజల సౌకర్యం కోసమే ఉండాలి కానీ భవిష్యత్తులో ప్రజలకు కష్టాలు కలిగించేవి కాకుడదని అంటారు.
అంటే దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసే రాజకీయ పార్టీల గురించి ఆలోచన చేయాలని అంటారు.
ముందుగా మనకు మన సమాజం. మన సమాజంలో రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు రాజకీయ తీరు… ఇలా రాజకీయ అవగాహన ఉండాలి. రాజకీయం ఎలా ఉంటుందో? అందులో ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయో మనకు న్యూస్ మీడియా అందిస్తుంది. కొన్ని తెలుగు సినిమాలు కూడా రాజకీయ నేపధ్యం మిళితమై ఉంటాయి.
అలాంటి కొన్ని ‘రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు‘, రాజకీయాలు రాజకీయ నాయకులు యుక్తులు రాజకీయాలను, రాజకీయ నాయకులు ప్రభావమును” చూపించే కొన్ని తెలుగు సినిమాలు.
ఈ తెలుగు సినిమాలో కధానాయకుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఆ ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి అని బహిరంగ రహస్యమే. అటువంటి ముఖ్యమంత్రి చనిపోతే, అతని కొడుకు మరలా ముఖ్యమంత్రి కావాలంటే, ఎలాంటి పరిస్థితులు? ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు మేలు మాత్రమే చేయడానికి అతని చేసే రాజకీయాలు… ఈ సినిమాలో ఉంటాయి.
ఠాగూర్ తెలుగు సినిమా ఒక ఉపాధ్యాయుడు సమాజంలో అవినీతిని అంతం చేయడానికి పూనుకుంటే?
ఈ తెలుగు సినిమా మరొక భాషలో నుండి రీమేక్ చేశారు. ఒక టీచర్ నివసించే చోట ఒక వ్యాపారి రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను మేనేజ్ చేసుకుంటూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతాడు. అలాంటి వ్యక్తి చేతిలో తనవారిని పోగొట్టుకున్న టీచర్, అతనిపై పగ తీర్చుకోవడం కన్నా, సమాజంలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసే యజ్ఙం మొదలుపెడతాడు. దీర్ఘకాలిక ప్రణాలికతో సమాజంలో అవినీతిపరులకు సింహస్వప్నంగా మారతాడు. ఇది ఒక ప్రాంతంలో అవినీతిని అంతం చేయడానికి టీచర్ పోరాటం, యువత సహకారం, ఒక మంచి సంకల్పమునకు యువత ఎలా ఆసక్తిపరులు అవుతారో…. చూపుతుంది.
ఒకేఒక్కడు తెలుగు సినిమా ఒక చదువుకున్న సామాన్యుడికి ఒక్కరోజు అధికారం ఇస్తే?
రాజకీయ నాయకులలో ముఖ్యమంత్రి ఒక పార్టీకి నాయకత్వం వహిస్తాడు. ఒక రాష్ట్రమును నాయకత్వం వహిస్తాడు. ఆ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రమును పరిపాలన చేయడంలో అవినీతికి పరాకాష్టగా మారితే, అతనికి ఒక సామాన్య ఉద్యోగి చెప్పే సమాధానం. సమాజంపై మంచి అవగాహన ఉన్నవారు అధికారంలో ఉంటే, రాష్ట్రములో ఉండే, సమస్యలకు పరిష్కారం ఎలా ఉంటుందో? ఈ సినిమాలో ఉంటుంది.
శకుని ఇచ్చిన హామిని నెరవేర్చని ముఖ్యమంత్రికి బుద్ది చెప్పిన యువకుడు
ఎన్జీకె తెలుగు సినిమా ఒక కార్యకర్త ఒక ప్రాంతంలో నాయకుడుగా ఎదగడానికి పడే పాట్లు. రాజకీయాలలో ఎటువంటి నాయకులు ఉంటారు? నీచ రాజకీయాల మద్య నలిగిపోయే కార్యకర్త.
రంగం తెలుగు సినిమా రాజకీయాలలో యువత ఉంటే, సమాజం వేగంగా వృద్ది చెందుతుంది. కాలం చెల్లిన పెద్దలను కాదని, విజన్ తో వెళ్ళే యువతకు నాయకత్వం వహించే ఒక వ్యక్తికి సహకరించే మీడియారంగం. ఇంకా అతనిని బ్యాక్ గ్రౌండులో మరొక శక్తి అతని ప్రణాళికలో నడిచే యువత. చివరకు ఆ నాయకుడికి ప్రజలు పట్టం కడితే, అతని ఉద్దేశ్యం ఏమిటి? అతనికి సహకరించినవారు, అతని వలన మోసపోయాము అని తెలిస్తే, జరిగిదేమిటి? ప్రజలకోసం ఎలాంటి ముగింపు సమాజానికి మంచి సందేశం ఇస్తుంది… ఈ సినిమా చూడాలి అంటారు.
ఎవడైతేనాకేంటి తెలుగు సినిమా ఒక స్వార్ధ రాజకీయ నాయకుడు ఇంట్లో అంతా స్వార్ధపరులు, అతని చుట్టూ ఉండేవారు కూడా అంతే… అయితే అతని కనిష్ట కుమారుడు మాత్రం ప్రజల కష్టాలను చూస్తాడు. వారికోసం తండ్రిని ఎదిరించి, ప్రజలకు మేలు చేయడానికి పూనుకుంటాడు.
సామాన్యుడు తెలుగు సినిమా
మీడియా తలచుకుంటే, ఒక రాజకీయ నాయకుడుతో ఎలా మంచి పనులు చేయవచ్చో? ఈ సామాన్యుడు సినిమాలో చూపుతారు.
ప్రతినిధి తెలుగు సినిమా ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిని అడ్డుపెట్టుకుని, సమాజానికి మేలు చేయాలనుకుంటాడు.
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు ఇంకా సామాజిక స్పృహ ఉండే కొన్ని సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా వచ్చి బాక్సాఫీసు దుమ్ముదులుపుతున్నాడు. వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం సృష్టిస్తున్నాడు. ఈ 2023సంక్రాంతి బరిలో దిగిన ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్లు చూస్తుంటే, అటు ఫ్యాన్స్లో పూనకాలు వస్తుంటే, ఇటు ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతుంది. ఆడా, ఈడా కాదు ఎక్కడైనా వాల్తేరు వీరయ్య హవానే కొనసాగుతుంది.
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశం అమెరికాలో కూడా వాల్తేరు వీరయ్య వసూళ్ల వర్షం కురుస్తుంది. సినీ ప్రపంచంలో చిరంజీవి మూవీ మంచి బిజినెస్ చేస్తోంది. సంక్రాంతి సెలవులు ముగిసినప్పటికీ థియేటర్లలో వీరయ్య హోరు కొనసాగుతుంది, జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నైజాం, వైజాగ్ ఇలా చాలా చోట్లా సాలిడ్ కలెక్షన్లు సాధిస్తోంది.
ఈ మూవీ USAలో కూడా అనూహ్యమైన వసూళ్లు సాధిస్తోంది. ప్రస్తుతానికి అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది వాల్తేరు వీరయ్య. అంతేకాకుండా అమెరికాలో చిరు పేరిట రికార్డుగా ఉన్న అత్యధిక వసూళ్లను కొల్లగొట్టేందుకు ‘వాల్తేరు వీరయ్య’ దూసుకుపోతుంది. అమెరికాలో చిరు సినిమాల్లో ‘సైరా నరసింహా రెడ్డి’ 2.6 మిలియన్ డాలర్లు ఎక్కువగా కలెక్ట్ చేసింది.. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ ఈ రికార్డ్ బద్దలు కొట్టడం ఖాయంగా కనబడుతుంది.
శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన వాల్తేరు వీరయ్యలో రవితేజ, కేథరిన్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు.
బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తే, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మించింది. ముఖ్యంగా రవితేజ క్యారక్టరైజేషన్ మరియు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. మూవీ రిలీజ్కు ముందే విడుదల చేసిన పాటలు ఒక్కోటి మంచి సక్సెస్ పొందాయి. దీంతో సినిమాపై పాజిటివ్ టాక్ పెరిగింది.
మరోవైపు చిరు తుఫాన్ పెర్ఫామెన్స్కు రవితేజ యాక్టింగ్ కూడా తోడవడంతో ఎంటర్టైన్మెంట్ పీక్స్కు చేరింది. థియేటర్లలో వీరిద్దరి మద్య గల సన్నివేశాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది ఒక అభిమాని సృష్టించిన సినిమా, అందరి అభిమానులను విశేషంగా అలరిస్తుంటే, ఇది కలెక్షన్లతో ధియేటర్లలో అదరగొడుతుంది.
మెగాస్టార్ చిరంజీవి స్టామినా పవర్ ఏమిటో వాల్తేరు వీరయ్య తెలుగు సినిమాతో మరొకసారి సిని ప్రపంచంలో కనబడుతుంది.
రాధే శ్యామ్ ప్రేమ కధ! భారీ ఫ్యాన్స్ గల హీరోల సినిమాలకు అంచనాలు ఎక్కువగా ఉంటే, వారి ఫ్యాన్స్ మరిన్ని అంచనాలు ఉంటాయి. అలా భారీ అంచనా వేసుకునే సినిమా హీరోలలో ప్రభాస్ ముందుంటారు.
ప్రేమ కధను జాతకంలో ముడిపెట్టి, అందంగా తెరపై చూపించే ప్రయత్నం జరిగింది. ప్రభాస్ లవర్ బాయ్ గా, అతనికి జోడిగా పూజా హెగ్డె కనిపిస్తారు.
నలభై సంవత్సరాల గతానికి వెళితే, ఓ ప్రేమ కధ ఎలా సాగుతుందో? అలా తీయడానికి ప్రయత్నం జరిగింది.
విక్రమాదిత్య ప్రసిద్ద హస్తసాముద్రికుడు. ఒక్కవ్యక్తి చేయి, ఒక్కసారి చేయి చూసి అతని జాతకం మొత్తం చెప్పగల ప్రతిభ విక్రమాదిత్య(ప్రభాస్) సొంతం. ఇక ప్రేరణ ఒక డాక్టర్. ప్రేరణ (పూజా హెగ్డే) ఒక హాస్పటల్ డీన్ తమ్ముడి కూతరు. ప్రేరణ – విక్రమాదిత్య ఇద్దరి కలయిక, ఇద్దరి మద్య ప్రేమ బలపడడం. ఇద్దరి మద్య విధి విదించిన ప్రతిబంధకాలు, ఆ ప్రతిబంధకాలను నిలబడి ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారనేది… సినిమా కధ.
తెరపై ఎక్కువ సేపు కనిపించే ప్రభాస్ మెప్పిస్తాడు. అతనికి జోడిగా పూజా హెగ్డే బాగా నటించింది. కొన్ని ప్రయత్నాలు అంచనాలకు భిన్నంగా జరుగుతాయి. కాబట్టి ఒక మంచి ప్రేమ కధగా ఈ రాధే శ్యామ్ ప్రేమ కధ చాలా అందంగా తెరపై చూడవచ్చును.
రాధే శ్యామ్ ప్రేమ కధ పాయింట్ ఏంటంటే?
ప్రాణాలు కాపాడే డాక్టర్ ప్రాణాలు మింగేసి వ్యాధితో బాధపడుతుంటే, ప్రపంచాన్ని నడిపింఇచే అతీతశక్తి విధి గురించి తెలియజేసే వ్యక్తికి, అతని జీవితం ఎలా ఉండబోతుందో? ముందుగానే తెలియబడితే… వారి మద్య ఎలా విధి నడిపిస్తుంది? బహుశా ఈ పాయింట్ ఆధారంగా కధను తెరకెక్కించి ఉంటారు.
ఓ అందమైన ప్రేమ కధను ఆహ్లాదకరంగా చూడడానికి ధియేటర్ వెళ్ళి చూడాల్సిందే.
పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా? చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ హిట్ కానీ సినిమా క్లైమాక్స్ ఆసక్తిగా లేదని అభిప్రాయాలు. పాటలు సూపర్ హిట్ కానీ సినిమా ముగింపులో ఆసక్తికరంగా లేదు… సుకుమార్ డైరక్షన్ సూపర్ కానీ సినిమ క్లైమాక్స్ తేలిపోయింది… సినిమాలో అన్నీ బాగున్నాయి కానీ నిడివి ఎక్కువైంది…. రకరకాల అభిప్రాయాలతో సినిమా డివైడింగ్ టాక్ తెచ్చుకుందని తేల్చేసినవారు కొందరు.
ఈ సినిమా హిట్టా… ఫట్టా అని తేల్చిచెప్పేలోగా కలెక్షన్స్ ప్రారంభం బ్రహ్మాండంగా ఉండడం జరిగింది… ఆ తర్వాత ఇతర భాషలలో నటులు పుష్ప సినిమా గురించి మాట్లాడడం ఈ సినిమాపై ఆసక్తిని బాగా పెంచితే, అల్లు అర్జున్ యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది.
ఇలా పుష్ప రాజ్ గా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ, పుష్ప సినిమా టాక్ తో సంబంధం లేకుండా పుష్ప సినిమా చూడడం జరిగిపోయింది.
పుష్ప సినిమా ఎందుకు చూడాలంటే, మొదటిగా అల్లు అర్జున్ యాక్షన్, ఇంకా సుకుమార్ డైరక్షన్….
సుకుమార్ డైరక్షన్
అల్లు అర్జున్ యాక్షన్
సినిమా పాటలు
సినిమా బ్యాక్ డ్రాప్
అయితే సినిమా క్రైమాక్స్ కొచ్చేసరికి ఏదో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉండకుండా ఉండడమే…. డివైడింగ్ టాక్ కు కారణం అవుతుంది.
సినిమా రివ్యూలతో సంబంధం లేకుండా…. ఎటువంటి ఊహాత్మకమైన ఆలోచన లేకుండా సినిమా చూడడం మొదలు పెడితే, సినిమా సరదాగా యాక్షన్ సన్నివేశాలతో సాగిపోతుంది….
పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా?
చాలా వరకు సుకుమార్ సినిమాలు ప్రేక్షకులలో ఆలోచనను క్రియేట్ చేసే విధంగా ఉండడం చేత వెంటనే అందరి రెస్పాన్స్ ఒకేలాగా ఉండకపోవచ్చును… వాస్తవికత కన్నా కల్పన అద్బుతంగా అనిపిస్తే, వాస్తవానికి దగ్గరగా ఉండే కల్పన నిదానంగా బాగున్నట్టుగా అనిపిస్తుంది. అలా పుష్ప సినిమా కధ బాగుందనిపించుకోవడానికి పాపులర్ హీరో కాబట్టి సరిపోయింది… అదీ పాపులర్ హీరో నటన అద్భుతంగా ఉంటే, ఇంకా ఆ సినిమాకి హీరోనే ప్లస్… ఇప్పుడు పుష్ప సినిమాకు సుకుమార్ డైరక్షన్లో అల్లు అర్జున్ అద్భుతమే చేశాడు. అందుకే ఈ సినిమా హిట్టే….
శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ అందమైన ఫ్యామిలీ కధలో ప్రేమకధ కూడా ఉంటుంది.
శుభకాంక్షలు తెలుగు మూవీ 1997 లో రిలీజ్ అయ్యింది. ఈ తెలుగుమూవీలో జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తెలుగు సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ ప్రేక్షకులలను బాగా ఆకట్టుకున్న సినిమా ఇది. ఈ మూవీలో పాటలు బాగా పాపులర్ అయ్యాయి.
ఆనందమానంద మాయె అనే పాట బాగా పాపులర్ అయితే గుండె నిండా గుడి గంటలు, అద్దంకి చీర కట్టే ముద్దుగుమ్మా,పంచవన్నెల చిలక నిన్ను పాటలు కూడా ఆకట్టుకుంటాయి.
ఇక శుభాకాంక్షలు తెలుగు మూవీ కధలోకి వెళ్తే…
స్టీఫెన్ క్రైస్తవ మతానికి చెందినవాడు. సీతారామయ్య హిందూ మతానికి చెందినవాడు. ఒకేవీధిలో రెండు కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తుంటారు. ఇంకా ఈ రెండు కుటుంబాల సభ్యుల మధ్య మంచి స్నేహ సంబంధం ఉంటుంది.
ఆ కుటుంబాలలో అబ్బాయిలు మోసెస్, బలరామయ్యలు కూడా మంచి స్నేహంగా ఉంటూ ఉంటారు. ఈ క్రమంలో రాబర్ట్(మోసెస్ తమ్ముడు), జానకి(బలరామయ్య చెల్లెలు) ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే ఈ రెండు కుటుంబాలు వీళ్ళ ప్రేమను అంగీకరించరు.
దాంతో వీరిద్దరూ దూరంగా పారిపోయి పెళ్ళి చేసుకుంటారు. ఇక అప్పటినుండి ఆ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి నెలకొంటుంది.
25 సంవత్సరాల తర్వాత స్టీఫెన్, బలరామయ్యల కుటుంబాలను ఏకం చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. అతనే చందు. ఆక్రమంలో చందు గోపి అనే తన స్నేహితుడితో పాటు ఆ ఊరు వచ్చి తను రాబర్ట్, జానకిల కొడుకునని అందరితో చెబుతాడు.
వాళ్ళకి ఇల్లు దొరకని పరిస్థితులలో నాదబ్రహ్మం అనే వ్యక్తి మాత్రం వాళ్ళను పిలిచి తన ఇంట్లో ఉండమంటాడు. ఆ తర్వాత చందు నెమ్మదిగా విడిపోయిన ఆ ఇద్దరి కుటుంబాలతో పరిచయం పెంచుకుంటాడు. అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తుంటాడు.
ఒకసారి స్టీఫెన్, సీతారామయ్య భార్యలిద్దరూ చందుకు పెళ్ళి చేయాలని చూస్తారు. అయితే వారిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు చందు కోసం పెళ్ళి సంబంధం తెస్తారు. వాళ్ళిద్దరి బారినుంచి తప్పించుకోవడం కోసం చందు తనకి ఇదివరకే నిర్మలా మేరీ అనే అమ్మాయితో పెళ్ళి అయిందని అబద్ధం చెబుతాడు.
అయితే ఆ అబద్దం నిజం చేస్తూ ఒక సన్నివేశం కధ మలుపు తిప్పుతుంది. ఉన్నట్టుండి నిర్మలా మేరీ అనే పేరుతో ఒక అమ్మాయి ఇతని కోసం వచ్చి తానే అతని భార్య అని చెబుతుంది.
చందు చెప్పిన అబద్దం నిజం చేస్తూ, వచ్చిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? చందు నందిని ప్రేమకధ ఏమయ్యింది? ఈ ప్రశ్నవలకు సమాధానాలు చివరకి ఏమవుతుందో సినిమా చూడాల్సిందే…
శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ
ఫ్యామిలీ హీరో జగపతిబాబు ప్రేక్షకులను మెప్పిస్తే, పాటలు అందరినీ అలరిస్తాయి. అందాల తార రాశి, జగపతిబాబుల మద్య ప్రేమ, జగపతిబాబు, రవళిల మద్య జరిగే సన్నివేశాలు కధను కొనసాగిస్తాయి.
శుభాకాంక్షలు తెలుగు మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించినది.
తెలుగులో ఆనాటి మేటి మూవీస్ చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితే, మరల మరలా చూడాలనిపించే మూవీ సూపర్ డూపర్ హిట్.
సినిమా చూడంగానే ఆలోచనను రేకిత్తేంచే మూవీ సందేశంతో కూడిన మూవీ. సమాజంలో ఉండే సమస్యలను అంతర్లీనంగా తెలియజేస్తూ ఉంటాయి.
తెలుగు మూవీ అయితే ఆనందం అందిస్తాయి లేకపోతే ఆలోచింపజేస్తాయి. ప్రధానంగా మూవీ మనసును రంజింప చేయడానికే ఉంటుంది. అలా మనసును రంజింపజేస్తూ సామాజిక సందేశం కానీ వ్యక్తిగత సందేశం కానీ అంతర్లీనంగా అందిస్తాయి. లేదా ముగింపు సందేశంతో ముగుస్తుంది.
కేవలం సందేశాత్మకంగా సాగే సినిమాలు తక్కువగా ఉంటే, ఎక్కువ వినోదం అందిస్తూ ఉండేవి ఎక్కువగా ఉంటాయి. యాక్షన్, డ్రామా, సెంటిమెంట్, లవ్, ఫిక్షన్, డాన్స్ వంటి విషయాలు కలిసి, మనిషి మనసు ఆకట్టుకోవడానికి మూవీ ట్రై చేస్తుంది. మూవీ మనసును రంజింప చేయడం ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది.
విజయవంతమైన తెలుగు మూవీ నీ మనసు నాకు తెలుసు అన్నట్టు మన మనసులో కదలికలకు తగ్గట్టుగా స్క్రీనుపై పాత్రలు కదిలిస్తుంది.
తెలుగులో ఆనాటి మేటి మూవీస్
అన్ని రకాల ఎమోషన్స్ కలిగిన తెలుగు మూవీ చూసి చూడంగానే నచ్చేస్తుంది. తిరిగి మరలా చూడాలనిపించే విధంగా మన మనసుపై ముద్ర వేస్తుంది. అటువంటి మూవీ మరల మరలా చూడడం అంటే, అది సూపర్ హిట్టే అవుతుంది.
మామగారు, అబ్బాయిగారు, అల్లుడుగారు, ఖైదీ, పెదరాయుడు, సమరసింహారెడ్డి, పోకిరి, బాహుబలి ఇలా కుటుంబ కధతో బాటు వ్యవస్థలోని ఊహాశక్తికి దగ్గరగా ఉండే అంశంతో తెలుగు మూవీ మనల్ని ఆకట్టుకుంటుంది.
సమాజంలో ఒకరికి అన్యాయం జరిగిందనే విషయం ఒక న్యూస్ మారి ఉంటుంది. ఏదో కుటుంబంలోని పెద్దాయన యొక్క కర్తవ్యతా నిష్ట కొందరి మనసులలో చేరి ఉండవచ్చును. సామాజిక పరిస్థితులలో నేరప్రవృత్తులపై వచ్చే కధనాలు, సమాజంలో మంచివారి హృదయాలలో భావనలు పెంచవచ్చును. కల్పనలో ఒక హీరోని సృష్టించే స్థితిలో కొందరు ఆలోచన చేయవచ్చును.
ఎక్కువమంది మనసును రంజింపచేసే సాధనములలో సినిమా ఒక సాధనంగా ఉంది.
అటువంటి తెలుగు మూవీలలో చూసి చూడంగానే నచ్చేసే తెలుగు సినిమాలు కొన్నింటిని ఈ పోస్టులో చూద్దాం.
అయితే అలాంటి సినిమాలలో చూసే పాత, కొత్త తెలుగు మూవీలను ఇందులో చూద్దాం.
భక్తిప్రహ్లాద తెలుగులో ఆనాటి మేటి మూవీస్
మనస్థితికి ఇప్పుడు కాకపోతే మరెప్పుడో చేసుకున్న మన కర్మే కారణం కాగలదని నమ్మేవారికి ఈ భక్తప్రహ్లాదలో సమాధానం లభిస్తుంది. శ్రీమహావిష్ణువు నిలయం వైకుంఠం. అక్కడ ఉండే ద్వారపాలకులు, ఋషులను అడ్డుకుంటారు. ఆ తప్పుకు శిక్షగా శాపం పొందుతారు. ఉదారుడైన శ్రీమహావిష్ణువు వారికి వెసులుబాటు తెలియజేస్తాడు. అదేమిటంటే….
నాభక్తులుగా ఏడు జన్మలు పొందుతారా? లేక నాకు శత్రువులుగా మూడు జన్మలు పొందుతారా? అనే విషయం తేల్చుకుని చెప్పమంటాడు. అందుకు ఆ ద్వారపాలకులు భక్తులుగా ఏడు జన్మలకాలం వైకుంఠం వదిలి ఉండలేం. శత్రువులుగా మూడు జన్మలకాలం దూరమై, మరలా వైకుంఠం వచ్చేవిధంగా అనుగ్రహించమని శ్రీమహావిష్ణువుని కోరతారు.
స్థితికారుడు వారి కోరికను మన్నిస్తాడు. అలా పూర్వజన్మలో చేసిన పాపఫలం అనుభవించడానికి పుట్టిన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు పుడతారు. అయితే ఒకరు శ్రీమహావిష్ణువు చేతిలో మరణించి కొంతపాప పరిహారం పొందుతాడు. రెండవవాడు తన అన్న మరణానికి శ్రీమహావిష్ణువు కారణం అని తలుస్తాడు. తన స్థితికి కారణం స్థితికారుడు అనిభావించిన హిరణ్యకశిపుడు, స్థితికర్తపై కక్షను పెంచుకుంటాడు.
ఆ కక్షతోనే తపస్సుచేసి వరాలు పొందుతాడు. శ్రీహరి భక్తులను వేదిస్తాడు. అంత శ్రీహరి ద్వేషి అయిన అతనికి పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు నిత్య శ్రీహరినామస్మరణ చేస్తూ ఉంటాడు. లోకంలో అందరినీ కట్టడి చేయగలిగాను అనుకునే అసురుడికి కొడుకే కొరకరాని కొయ్యగా మారతాడు. విరోధిగా భావించే శ్రీహరినామస్మరణ, శ్రీహరిధ్యానం అసురుడు అయిన హిరణ్యకశిపుడుకి తలనొప్పిగా మారుతుంది. ఆ తలనొప్పే, తన చావుకు కారణం అవుతుంది.
అసురునింట పుట్టినా అద్భుతమైన గుణములతో ప్రకాశించిన ప్రహ్లాదుడి చరిత్రను చదివితీరాలని పెద్దలంటారు. అటువంటి తెలుగు భాగవతగాధ తెలుగు మూవీగా భక్తప్రహ్లాద పేరుతో ఉంది. ఇది యూట్యూబ్ లో పుల్ లెంగ్త్ మూవీగా అందుబాటులో ఉంది.
భక్తిప్రహ్లాద చూసి చూడంగానే నచ్చేసే తెలుగు మూవీ
మాయాబజార్ పెద్దమాయగాడు మామ అయితే, చిన్నమాయగాడు అల్లుడు.
తెలుగులో అనేక మూవీలు వస్తూ ఉన్న నాటి మాయాబజార్ మూవీ మరలా విడుదల అయితే అదే ముందుంటుందని నిరూపించిన తెలుగు ఓల్డ్ మూవీ మాయాబజార్. అలనాటి మాయాబజార్ పెద్దమాయగాడు మామ అయితే, చిన్నమాయగాడు అల్లుడు.
పెద్దమాయగాడు కృష్ణుడుగా ఎన్టీరామారావు నటిస్తే, చిన్నమాయగాడుగా ఎస్వీరంగారావు మరిపించారు. సావిత్రి కృష్ణుడి అన్నగారి కూతురు శశిరేఖగా నటిస్తే, అమె మనసును మాయచేసినవాడిగా అక్కినేని అభిమన్యుడుగా నటించారు. ఇలా మాయాబజార్ తెరపై మన మనసును కట్టిపడేస్తుంది.
శశిరేఖా పరిణయం తెలుగువారికి తెలిసిన భారత కధే. అయితే ఈ మాయాబజారు తెలుగు మూవీలో పాండవుల ప్రస్తావనే కానీ పాండవుల పాత్రలు సినిమాలో కనబడవు. వారి బిడ్డ అభిమన్యుడు, కృష్ణుడింట సాగించే ప్రేమకధే ఈ మాయాబజార్ సినిమా కధ.
శశిరేఖ – అభిమన్యుల పరిణయానికి సహకరించే పనిలో ఘటోత్కచుడి మాయావిలాసం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రాయలేం కాబట్టి సినిమా చూసి ఆనందించడమే మేలు.
అలనాటి మేటి తెలుగు మూవీలలో సత్యహరిశ్చంద్ర మూవీ ఒక్కటి.
ఈ రోజులలో సత్యానికి పర్యాయపదంగా వాడేంతలగా ప్రసిద్ది పొందిన పేరు సత్యహరిశ్చంద్ర. అబద్దాలాడేవారి గురించి వ్యంగ్య భావనతో మాట్లాడేవారు ”అబ్బో దిగొచ్చాడండీ పెద్ద సత్యహరిశ్చంద్ర” అని సంభోదిస్తూ ఉంటారు. నిత్యం సత్యం చెప్పినవారెవరూ అంటే, సత్యహరిశ్చంద్ర… సత్యహరిశ్చంద్ర….సత్యహరిశ్చంద్ర…
అటువంటి సత్యహరిశ్చంద్రుని జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని పెద్దలంటారు. పురాణాలలో పురాణ పురుషుల చరితములు సినిమాలుగా మార్చి ఇచ్చిన తెలుగు దర్శకులకు కృతజ్ఙతలు చెప్పుకోవాలి. పురాణాలలో వశిష్ఠుడి చేత కీర్తింపబడిన సత్యహరిశ్చంద్ర, పరమేశ్వరుడ విశ్వామిత్రుని రూపంలో పెట్టి అన్ని పరీక్షలలోనూ నెగ్గుతాడు.
సత్యహరిశ్చంద్ర తెలుగు మూవీ గురించి పూర్తిగా రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.
రాజ్యాన్ని పరిపాలన చేసే రాజులు, దైవానుగ్రహం పొంది, ప్రజలను పరిపాలించేవారు. అంతటి రాజులు, దైవం దగ్గరకు పడే పాట్లు వ్యక్తిగత జీవితంలో మార్పులు తెస్తాయి. దైవానుగ్రహం సాధించడానికి శక్తిని, యుక్తిని కలిగిస్తుంది. కానీ ప్రయత్నం సాధకుడే చేయాలి.
అలాంటి సాధకుడికి కాలంలో కలిగే కష్టాలకు ఓర్చగలిగే శక్తి ఉంటుంది. దైవానుగ్రహం వలననే సాధించగలిగే శక్తి ఉన్నా, కాలం పెట్టే పరీక్షలో ఆ శక్తి వలన ప్రయోజనం కన్నా నిరీక్షణ వలన ప్రయోజనం ఉంటుంది. తదుపరి శక్తి వలన ప్రయోజనం పొందగలుగుతారు.
అలా సాక్షాత్తు పరదేవతా అనుగ్రహం పొందిన భట్టీవిక్రమార్కులు అజేయులుగా ఉంటారు. విక్రమార్కుడు బేతాళుడినే వశపరచుకుంటాడు. పరాక్రమముతోనూ, యుక్తితోనే ఉండే విక్రమార్కుడికి తెలివైన మంత్రిగా భట్టీ అండగా ఉంటాడు.
ఎన్ని ఉన్నా కాలం వలన కలిగే కష్టం మాత్రం మనిషి అనుభవించాల్సిందే. అలా విక్రమార్కుడు వ్యక్తిగతంగా పొందిన కష్టం ఏమిటి? దైవానుగ్రహం చేత విశిష్ట శక్తులు కలిగిన మాంత్రికుడిని ఎలా జయించాడు? సినిమా చూసి తెలుసుకోవాలి.
సాహసం కలిగిన కధలు అందరినీ అలరిస్తే, అప్పట్లో సాహసం రాజుల కధలలో…. భట్టీ విక్రమార్క చూసి చూడంగానే నచ్చేమూవీ…
భట్టీ విక్రమార్క అలనాటి తెలుగు మూవీ… ఇందులో రామారావు, అంజలీదేవి, ఎస్వీరంగారు, కాంతారావు తదితరులు నటించారు.
ఇందులో రామకృష్ణ, ఎస్వీరంగారావు, విజయనిర్మల తదితరులు నటించారు.
రావణాబ్రహ్మ భక్తి, అనురక్తిని చూపే భూకైలాస్ తెలుగు మూవీ
ఎన్టీరామారావుగారు శ్రీరాముడు, కృష్ణుడు అంటూ పురాణ హీరోల పాత్రలతో ప్రేక్షకులను మరిపించారు. అయితే ఆయన పురాణప్రతినాయకుడి పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించారు. సాదారణంగా ప్రజాధరణ పొందని కధానాయకుడు ఏదో ఒకసారి ప్రతినాయకుడి పాత్రలో కనబడతారు. కానీ ఎన్టీరామారావుగారు మాత్రం పలుమార్లు ప్రతినాయకుడి పాత్రలను పోషించారు. రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలలో మెప్పించారు.
అలా ఎన్టీరామారావు గారు రావణాబ్రహ్మగా చేసిన తెలుగు మూవీ భూకైలాస్. రావణుడి తల్లి సముద్రతీరంలో సైకత లింగమును పూజిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు శివార్చన చేస్తూ ఉండగా, సముద్రపు అలలు వచ్చి, సైకత లింగమును కలిపేసుకుంటాయి. వెంటనే గృహమునకు పోయి మదనపడుతున్న తల్లిని చూసి రావణాసుడు, సైకత లింగం కాదు. శివుడి ఆత్మలింగం తీసుకువస్తానని కైలాసం బయలుదేరతాడు.
రావణాసురుడు ఆత్మలింగం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. రావణుడి శివునిని ఆత్మలింగం కోరకుండా, అమ్మవారిని కోరతాడు. శివుడు అనుగ్రహిస్తాడు. అమ్మవారిని వెంటపెట్టుకుని స్వగృహమునకు పోతున్న రావణుడిని నారదుడు కలుస్తాడు. ఆ తర్వాత అమ్మవారిని వెంటపెట్టుకుని రావణుడు మరలా శివుని దగ్గరకు వెళతాడు.
కైలాసంలో శివుని దగ్గర నుండి వెనుతిరిగిన రావణుడు, పాతాళలోకంలో ఉన్న మండోదరిని వివాహమాడతాడు. మండోదరిని వెంటపెట్టుకుని తల్లిని చేరిన రావణుడికి అసలు విషయం బోధపడుతుంది. తను ఆత్మలింగం కోసం కోరకుండా వేరు విషయాలకోసం ప్రాకులాడానని…. వెంటనే మరలా తపస్సు చేసిన రావణుడికి శివుని ఆత్మలింగం చేతిలోకి వస్తుంది.
ఈసారి శివుని ఆత్మలింగమును చేతబట్టి పోతున్న రావణుడికి దారి మద్యలో సంధ్యావందనం చేయవలసిన సమయం ఆసన్నమవుతుంది. ముక్కటి ఆత్మలింగమును నేలపైకి చేర్చరాదు. అందుకని ఓ ఆవులమందని కాసే కుర్రవాని చేతికి శివుని ఆత్మలింగం ఇచ్చి రావణుడు సంధ్యావందనానికి సముద్రపు తీరానికి పోతాడు.
అయితే ఆ బాలకుడు మూడుమార్లు రావణా… అంటూ అరిచి శివుని ఆత్మలింగము నేలపై పెడతాడు. పరుగు పరుగున అక్కడికి వచ్చిన రావణుడు శివలింగమును కదిలిస్తాడు. ప్రకృతి శక్తి ముందు అతని శక్తి పనికిరాదు. శివుని ఆత్మలింగం అక్కడే ప్రతిష్టంపబడుతుంది. రావణబ్రహ్మ భక్తి వలన గోకర్ణ క్షేత్రం అలా ఏర్పడిందని అంటారు.
రావణాబ్రహ్మ భక్తి, అనురక్తిని చూపే భూకైలాస్ తెలుగు మూవీ
దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు కర్ణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా నటించిన తెలుగు మూవీ
దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు త్రిపాత్రాభినయం చేసిన సినిమా. ఇది మహాభారతంలోని కర్ణుడి పాత్రను ప్రధానంగా చూపుతుంది. దానంలో కర్ణుడు గొప్పవాడుగా చెప్పబడతాడు. అటువంటి కర్ణుడి పాత్రతో పాటు, కృష్ణుడు, ధుర్యోధనుడి పాత్రలలో ఎన్టీరామారావు నటించారు.
కర్ణుడి వంటి పుట్టుకను సమాజం ప్రశ్నిస్తూనే ఉంటుంది. సమాజం చిన్నచూపు చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ విధానం పద్దతికి విరుద్దంగా ఉంటుంది, కాబట్టి. కుంతికి వివాహం కాకముందే, ఋషి మంత్రం వలన సూర్యానుగ్రహం వలన కర్ణుడు పుడతాడు. అలా పుట్టిన కర్ణుడిని కుంతి ఒక పెట్టెలో పెట్టి నీటిలో వదిలేస్తుంది.
మయసభలో దుర్యోధనుడు పరాభవం పొందడం. పరాభవం పొందిన దర్యోధనుడు శకుని సాయంతో పాండవులను ఓడించడం. పాండవులు వనవాసం చేయడం. పాండవవనవాసం తర్వాత శ్రీకృష్ణరాయభారం. తర్వాత కురుక్షేత్ర యుద్ధమునకు కురుపాండవులు సిద్దపడడం… కధ క్లైమాక్స్ కు చేరుతుంది.
ఆ తరువాత కర్ణుడు సూతుల ఇంట పెరిగి విలుకాడు అవుతాడు. అర్జునుడంతటివాడు కర్ణుడు అంటారు. కానీ అనుగ్రహం అర్జునుడికే ఉంటుంది. కురుసభలో విలువిద్య ప్రదర్శనలో పాల్గొనడానికి ప్రయత్నించిన కర్ణుడికి, దుర్యోధనుడు సాయపడతాడు. అలా వారిద్దరి మద్య స్నేహం ఏర్పడుతుంది.
కుంతి కర్ణుడిని కలుస్తుంది. కర్ణుడు కుంతితో అయిదుగురితో కూడిన పాండవులు నీకు ఉంటారని, అందులో అయితే అర్జునుడు లేకపోతే కర్ణుడు ఇద్దరిలో ఒక్కరే ఉంటారని అంటాడు. చివరికి అర్జునుడితో కూడిన పాండవులే కుంతికి ఉంటారు. ఈ కధ అందరికే తెలిసిందే, కానీ ఎన్టీరామారావుగారి నటన ఆసక్తిగా ఉంటుంది. దానవీరశూరకర్ణ చూసి చూడంగానే నచ్చేమూవీ….
దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు కర్ణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా నటించిన తెలుగు మూవీ
శ్రీరామ కధా గానం లవకుశ తెలుగు మూవీ
లవకుశ శ్రీరామనామము రామ నామము రామ నామము అంటూ రామనామసంకీర్తన చేస్తూ రామకధను చెప్పడం రాముని తనయుల నుండే మరలా ప్రారంభం అయ్యింది… కుశలవులు శ్రీరాముని తనయులు కానీ రాముడిని కలవడం మాత్రం శ్రీరాముని దివ్వగానం ప్రారంభించాకే…
ధర్మము మానవరూపంలో తిరిగితే అది శ్రీరాముడు అంటే, అటువంటి రాముని కుమారులు అయిన కుశలవులకు, ఆ ధర్మమూర్తి గురించి తెలుసుకుని గానం చేశాకే శ్రీరామదర్శనం అయింది. శ్రీరామనామము అంతటి శక్తివంతమని చెబుతారు. శ్రీరాముడు ధర్మము కోసం రాజ్యం విడిచాడు. అదే రాజధర్మం కోసం భార్యను దూరం చేసుకున్నాడు.
ప్రజలకు మార్గదర్శకంగా ఉండే రాజు, ప్రజల దగ్గర చులకన కాకుడదు. అలా చులకన అయ్యే పరిస్థితులు ఉంటే, ఆ పరిస్థితులలో రాజ్యం విడవడం లేక అందుకు కారణం అయ్యినవారిని విడిచిపెట్టడం చేయాలంటారు.
రావణాసురుడు అపహరించిన సీతమ్మను చేపట్టడం ఏమిటి? అని ఒక చాకలివాడు అన్నమాటను శ్రీరాముడు వింటాడు. వెంటనే శ్రీరాముడు తన ప్రాణానికి ప్రాణమైన సీతను వదులుకోలేకా, రాజ్యాన్ని ఎవరోఒకరు తీసుకోవాల్సిందిగా తన తమ్ములను కోరతాడు. అందుకు సోదరులు ఎవరూ అంగీకరించరు. చేసేదిలేక సీతను అడవులలో విడిచిరమ్మని లక్ష్మణుడిని రాముడు ఆజ్ఙాపిస్తాడు.
లక్ష్మణుడు సీతమ్మను అడవిలో వదిలేసి వెళతాడు. సీతమ్మను వాల్మీకి మహర్షి, తన ఆశ్రమమునకు తీసుకువెళతాడు. లోకపావనీ దేవిగా సీతమ్మ అక్కడ పిలవబడుతుంది. సీతమ్మకు కుశ,లవులు జన్మిస్తారు. వారు వాల్మీకి మహర్షి వద్ద శ్రీరామాయణం తెలుసుకుంటారు. గానంచేస్తారు. అలా వారు అయోధ్యలో కూడా రామకధను గానం చేస్తారు.
శ్రీరాముడు తలపెట్టిన అశ్వమేధ యాగంలో అశ్వమును కుశలవులు బంధిస్తారు. తత్ఫలితంగా శ్రీరాముడు వారితో తలపడడం, వారెవరో తెలుసుకోవడం జరుగుతుంది. రామనామ సంకీర్తన ఎక్కువగా వినబడుతుందీ సినిమాలో…. చూసి చూడంగానే నచ్చేమూవీ లవకుశ తెలుగు మూవీ.
శ్రీరామ కధా గానం లవకుశ తెలుగు మూవీ
సుగుణములు కలిగిన సుందరి గుణసుందరి తెలుగు మూవీ.
లోకంలో గుణములే అందములు అయితే, అటువంటి సుగుణముల గలవారిని కాలము పెట్టే పరీక్ష కఠినంగానే ఉంటుంది. పరమేశ్వరుని అనుగ్రహం వలననే సుగుణములు కలుగుతాయి. కానీ అటువంటి సుగుణములు కాలప్రభావం చేత పరీక్షకు గురై, ఎక్కువకాలం కీర్తింపబడతాయి. ఆకోవలోనే అలనాటి పాత తెలుగు సినిమాలు చాలావరకు ఉంటాయి. సుగుణములు కలిగిన సుందరి గుణసుందరి తెలుగు మూవీ.
పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఒకరాజుకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు పెద్దకుమార్తెలకు రాచరికపు మర్యాదలపై ఆసక్తి ఉంటే, చిన్నమ్మాయికి ప్రాతివ్రత్యపు కధలంటే మక్కువ. పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే సతుల కధలంటే ఇష్టం. ఆమె పేరు గుణసుందరి.
ఒకరోజు కొలువుదీరిన మహారాజును, నిండుసభలో అందరూ పొగడ్తలతో ముంచెత్తుతారు. అయితే గుణసుందరి కూడా తండ్రిని గౌరవిస్తుంది, కానీ నాకు కాబోయే భర్తే దైవమంటుంది. రాజుకు కోపం వస్తుంది. ఇంకా పెళ్లైనా కాలేదు…. అప్పుడే ఇలా మాట్లాడుతుందేమిటి? అనుకుంటాడు. అన్ని అంగవైకల్యం ఉన్నవాడిని ఏరికోరి గుణసుందరికిచ్చి వివాహం చేస్తాడు.
రూపం ఎలా ఉన్నా, గుణసుందరిభర్తకు ఏ అంగవైకల్యం లేదనే విషయం బయటపడుతుంది. రాజు ఆశ్చర్యపడతాడు, భవంతిలో మెట్లపైనుండి క్రిందకు జారిపడతాడు. గాయంపాలైన రాజు మంచమెక్కుతాడు. గుణసుందరి తన భర్తతో పాటు బయటకు వెళ్ళిపోతుంది.
పూరిగుడిశెలో ఉంటున్నా, గుణసుందరి భర్తతో హాయిగా కాపురం చేస్తుంది. కానీ రాజుగారి గాయం మానదు. రాజుగారిగాయం నయం కావాలంటే, మహేంద్రమణి కావాలని రాజవైద్యులు చెబుతారు. మహేంద్రమణిని సాధించి, తెచ్చినవారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజు చాటింపువేయిస్తాడు.
రాజుగారి పెద్దల్లుళ్ళు ఇద్దరూ మహేంద్రమణి సాధించడానికి బయలుదేరతాడు. గుణసుందరి తన భర్తయొక్క గాధను, తన భర్తనోటివెంట తెలుసుకుంటుంది. వెంటనే తన తండ్రిని రక్షించవలసినదిగా అతనిని వేడుకుంటుంది. రాజుగారి చిన్నల్లుడు కూడా మహేంద్రమణి కోసం బయలుదేరతాడు.
రాజుగారి ముగ్గురల్లుళ్ళు మార్గమద్యంలో కలుసుకుంటారు. మహేంద్రమణిని సాధించడంలో యక్షకన్యలు పెట్టే పరీక్షలలో ఇద్దరూ ఫెయిల్ అవుతూ ఉంటారు. మూడోవాడు యక్షకన్యలను మెప్పిస్తాడు. అలా మూడోవాడు సాధించిన మహేంద్రమణిని, అతనిని మోసం చేసి, పెద్దవారిద్దరూ తస్కరిస్తారు.
మహేంద్రమణితో రాజుగారి దగ్గరకు వెళతారు. అయితే మంత్రంతో పనిచేసే మహేంద్రమణి పనిచేయదు. ఎందుకంటే వారు ఆ మంత్రం మరిచిపోతారు. పూర్వగాధలోని ఋషి శాపంచేత, బల్లూకముగా మారి గుణసుందరి భర్త స్వగృహమును చేరతాడు.
తీసుకురాబడిన మహేంద్రమణి పనిచేయాలంటే మంత్రం కావాలి. మంత్రం తెలిసినవ్యక్తి ఎలుగుబంటిగా మారాడు. ఎలుగుబంటిగా మారిని భర్తతో గుణసుందరి తన గుడిశెలోనే పరమేశ్వరుడిని ప్రార్ధిస్తుంది. చివరికి పార్వతీ, పరమేశ్వరులు ఎలుగుబంటితో సహా రాజమందిరం చేరి, అక్కడ నిజనిర్ధారణ చేయిస్తారు.
చివరికి రాజుగారిగాయం నయం అవుతుంది. గుణసుందరిభర్తకు శాపవిమోచనం కలుగుతుంది. తెలుగులో ఆనాటి మేటి మూవీస్ లో గుణసుందరి తెలుగు మూవీ.