Monthly Archives: September 2018

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా పార్వతి పరమేశ్వరుల గాధ దక్షయజ్ఙం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

దక్షయజ్ఞం చిత్రంలో NT రామారావు పరమశివుడుగా దేవిక సతీదేవిగా, SV రంగారావు దక్షుడుగా, చిత్తూరి నాగయ్య దధీచి మహర్షిగా, రాజనాల ఇంద్రుడుగా, రామకృష్ణ చంద్రుడుగా, మిక్కిలినేని బ్రహ్మగా, పద్మనాభం, బాలకృష్ణలు దక్షప్రజాపతి కుమారులుగా, సూరిబాబు నందిగా, రఘురామయ్య నారద మహర్షిగా, కన్నాంబ వైరినిగా, రాజశ్రీ రోహిణిగా ఇంకా ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు. ప్రజాదరణ పొందిన పాత చిత్రాల్లో దక్షయజ్ఞం ఒక మంచి చిత్రం. ‘దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా’.

పౌరాణిక గాధలలో సందేశం మిళితమై సందేశం కోసం సన్నివేశాలు సంఘటనలతో కూడిన గాధలు ఉంటాయి. అలా పార్వతి పరమేశ్వరుల గురించి చెప్పబడినప్పుడు తరుచూ తగిలే గాధ దక్షయజ్ఞం గాధ! పార్వతి మాత గతజన్మ వృత్తాంతం కావడం ఆ జన్మలోను ఈ జన్మలోను శివుడు మరు జన్మ లేకుండా పార్వతి మాతకు నాధుడై ఉండడం ఈ దక్షయజ్ఞం పౌరాణిక గాధ మనసులో భక్తిని ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అలాగే దక్షయజ్ఞం గురించి పురాణ ఫలశ్రుతి ఉంటే, ఈ పౌరాణిక ద్వారా సాక్ష్యాత్తు త్రిమూర్తుల అండ ఉన్నా అహంకరిస్తే ఏస్థితికి ఎటువంటి వారైనా ఎలా పతనం చెందుతారో తెలియబడుతుంది. అటువంటి దక్షయజ్ఞం దైవ చరితను వెండితెరకు ఎక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన వారు కడారు నాగభూషణం, కన్నాంబ. భక్తీ, మనోబలాన్ని, పుణ్యాన్ని పెంచే దైవగాధ తెలుగు తెరపై ప్రేక్షకులకు చిరపరిచయమే.

త్రిమూర్తుల అనుగ్రహం కలిగిన దక్షుడు శాపానుగ్రహాలు ఇవ్వడం

భూలోకమున ప్రాజాపత్యం పెరగడానికి బ్రహ్మ సృష్టించిన ప్రజాపతులలో దక్షుడు ప్రధానంగా ప్రఖ్యాతి గడించి, గర్వంతో అందరికి శాపానుగ్రహాలు ఇట్టే ఇచ్చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో తనతో వాదం ఆడినందులకు కన్నా కుమారులకు సైతం పామరులు కమ్మని, తన కుమారులకు సన్యాస బోధ చేసారని ఆరోపిస్తూ నారద మహర్షికి శాపాలు అనుగ్రహిస్తాడు. ఇలా ఉండే దక్షప్రజాపతికి దత్త పుత్రికలు రోహిణి మొదలైన వారితో27మందితో బాటు, తన వరపుత్రిక అయిన సతిదేవి ఉంటారు.. వారిలో రోహిణి చంద్రుడుని వరిస్తే, ఆమె అభీష్టం మేరకు చంద్రుడికి కబురు పెట్టి రోహిణి అభీష్టం గురించి చెబుతాడు, దక్షుడు. అలాగే బ్రహ్మ అజ్ఞామేరకు దత్త పుత్రికలందరికి పతి ఒక్కడే ఉండాలి, కాబట్టి నీకు సమ్మతమైతే నా దత్త పుత్రికలందరిని నీకిచ్చి వివాహం చేస్తానని అంటాడు. అందుకు అంగీకరించిన చంద్రుడితో 27మంది దత్త పుత్రికలకు వివాహం జరిపిస్తారు. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

ఆ వివాహనికి విచ్చేసిన త్రిమూర్తులలో శివుడు దక్షుడు కోరిక మేర అతిథిగా దక్షుని నివాసంలోనే ఉంటాడు. అక్కడ సతిదేవి శివుడికి పరిచర్యలు చేస్తుంది. శివుని కోసమే పుట్టిన అమ్మ, శివుని ఆరాధనలోనే ఉంటుంది. ఇప్పుడు శివుని వివాహమాడ తలుస్తుంది.
చంద్రుడిని పరిణయమాడిన 27మంది దత్త పుత్రికలలో రోహిణి మినహా అందరూ సంతోషంగా ఉండరు. కారణం చంద్రుడు కేవలం రోహిణిని మాత్రమే ఆదరిస్తూ ఆమెతోనే ఉంటాడు. ఈ కారణం గ్రహించిన నారదుని సూచనా మేరకు, మిగిలిన దత్త పుత్రికలు 26గురు తమ తండ్రి దక్షునితో మొరపెట్టుకుంటారు. దక్షుడు చంద్రుడిని పిలిచి, భార్యలందరినీ సమంగా చూడకపోవడం తప్పు అని చెప్పబోతే, చంద్రుడు తన సంసారం గురించి మాట్లాడడం మర్యాద కాదు అని బదులు ఇవ్వడంతో ఆగ్రహించిన దక్షుడు చంద్రుడిని క్షయ వ్యాదిగ్రస్తుడుగా ఉండమని శాపానుగ్రహం ఇస్తాడు.
వెంటనే చంద్రుడు పరమశివుడుతో మొరపెట్టుకుంటే చంద్రుడుని తన సమక్షంలో ఉండమని, అలాగే దక్షుని శాపం కూడా నిష్ప్రయోజనం కాకుండా పదిహేనురోజులు క్షయిస్తూ, పదిహేనురోజు వృద్ది పొందుతూ ఉండమని అనుగ్రహిస్తాడు. అలా పరమేశ్వరుడు అనుగ్రహం వలననే చంద్రుడు అమావాస్య నుండి పెరుగుతూ, పౌర్ణమి నుండి తగ్గుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన దక్షుడు తన మాట మన్నిస్తానని మాట ఇచ్చిన పరమశివుడు, తన శాపానికి మార్పు చేసి చంద్రుడిని అనుగ్రహించడం నచ్చక పరమశివుడిపైన ద్వేషభావం పెంచుకుంటాడు. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

సతీదేవిని వివాహమాడిన పరమశివుడు

అహంకారంతో వరగర్వంతో ఉండే దక్షుడుకి పరమశివుడుపై ఆగ్రహం రావడంతో తన వరపుత్రిక అయిన సతీదేవికి వివాహం చేయదలచి, సతీదేవి ఇష్టాన్ని ప్రక్కన పెట్టి స్వయంవరం ప్రకటిస్తాడు. సతీదేవి స్వయంవరం విషయం నారద మహర్షి ద్వారా తెలుసుకుని పరమశివుడు, సతీదేవి మనోభిష్టం నెరవేర్చాలని పరమశివుడు భావిస్తాడు. స్వయంవరం సభలో సతీదేవి విగ్రహరూపంలో ఉన్న పరమశివుడు పూలమాల వేసి వరిస్తుంది. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై సతీదేవితో అంతర్ధానం అవుతారు.

ఈ సంఘటనతో దక్షుడి అహంకారం పరమశివుడుపై పూర్తీ ద్వేషభావంతో నిండిపోతుంది. ఇక మహర్షులు లోకాల శ్రేయస్సు కోసం తలపెట్టిన యజ్ఞంలోకి అందరితో బాటు దక్షుడిని ఆహ్వానిస్తారు. ఆ యాగానికి విచ్చేసిన దేవతలు త్రిమూర్తులతో సహా అక్కడే ఆసీనులై ఉంటారు. యాగానికి వస్తున్న దక్షుడుని చూసి అందరూ గౌరవంతో లేచి నిలబడితే త్రిమూర్తులు అందరికన్నా పెద్దవారు కాబట్టి ఆసీనులై ఉంటారు. అయితే దక్షుడు పరమశివుడిని చూసి అల్లుడు మామని గౌరవించక పోవడం ఏమిటి అని అంటాడు. అందులకు పరమశివుడు సభలలో బాంధవ్యాలకు తావుండదు. నే త్రిమూర్తులలో ఒక్కరిగా ఇక్కడ ఉన్నాను అంటాడు. అయిన అహంకారి అయిన దక్షుడు పరమశివుడిని దూషిస్తాడు. ఇక సభలో శాపానుగ్రహాలు వస్తాయి.

దక్షప్రజాపతి తలపెట్టిన నిరీశ్వర యాగం

సభలో తనకు పరాభవం జరిగింది, నా అల్లుడు నన్ను గౌరవించలేదు అని భావించిన దక్షుడు, శివుడుపై ఇంకా ద్వేషంతో రగిలిపోతాడు. తత్ఫలితంగా నిరీశ్వర యాగం తలపెడతాడు, అంటే శివుడు లేని యజ్ఞం చేయ నిశ్చయిస్తాడు. వరబలం మెండుగా ఉన్న దక్షుడంటే మహర్షులకు, దేవతలకు హడలు, ఆ భయంతో ఈ నిరీశ్వర యాగానికి వారు దక్షుడితో చేరతారు. బాంధవ్య దృష్టితో చూసి ఆది శక్తిని, శక్తి ఆధారమైన శివాన్ని కాదనడం దక్షుడు అహంకారం ఏ స్థితికి చేర్చిందో ఇక్కడ ప్రస్పుటం అవుతుంది. ఆది దంపతులని ద్వేషించడంలోనే దక్షుడు పతనం చెందాడు, అయితే ఫలితం కనబడే సంఘటన మాత్రం అతడు తలపెట్టిన నిరీశ్వర యాగం స్థలం. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

జగదంబ అయిన సతీదేవి తనతండ్రి తలపెట్టిన యాగం చూడాలని పరమశివుని ప్రార్ధిస్తుంది. అయితే పరమశివుడు సతీదేవితో దక్షుడి ద్వేషభావన గురించి అప్పుడు చెప్పి, సతీదేవిని వెళ్ళవద్దని వారిస్తాడు. పుట్టింటిపై మమకారంతో అందులోను తనతోబుట్టువులు కూడా ఆ యాగానికి వెళ్ళారని తెలియడంతో అమ్మమనసు అమ్మదగ్గరికి వెళ్ళాలనే నిశ్చయించుకోవడంతో పరమశివుడు శివపరివారంతో సతీదేవిని దక్షయజ్ఞానికి పంపిస్తాడు. యాగానికి వచ్చిన సతీదేవిని యాగశాలలో ఎవరు పలకరించారు, తండ్రి ముఖం చాటేస్తాడు. భర్తమాట కాదని వచ్చినందులకు నాకు తగిన శాస్తి జరిగినది, అని తలచిన అమ్మ అగ్నిలో ఆత్మత్యాగం చేస్తుంది.

dakshayajnam telugu full movie

విషయం పరివారం ద్వారా విన్న శివుడు ప్రళయ రుద్రుడై నాట్యం చేసి, తన జటాజుటం నుండి వీరభద్రుడిని సృష్టిచేసి దక్షయజ్ఞం నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. వీరభద్రుడు దక్షయజ్ఞంలో భీబత్సం సృష్టిస్తాడు. దక్షుడి తలతెగి అగ్నికి ఆహుతి అవుతుంది. అయితే మహా ప్రతివ్రత అయిన దక్షుడి భార్య వైరిని ప్రార్ధనతో త్రిమూర్తులు ప్రత్యక్ష్యమై దక్షుడికి మేక తలను పెడతారు. అలాగే దక్షయజ్ఞం నిర్విఘ్నంగా జరిగేల ఆశీర్విదిస్తారు. అయితే జగదంబ మాత్రం దక్షుడి కుమార్తె మరలా పునర్జీవిగా రావడానికి ఇష్టపడని కారణంగా అమ్మ అదృశ్యంగానే ఉంటుంది. దక్షయజ్ఞం చలనచిత్రం ముగుస్తుంది. ఎంతటి శక్తిమంతులైనా సరే ఆహంకరిస్తే, గర్వంతో ఇతరులను నొప్పిస్తే ఎంతటి పరిణామాలు ఉంటాయో, ఎందరి జీవితాలు తలక్రిందులు అవుతాయో ఈ దక్షయజ్ఞం చిత్రం ద్వారా కనబడుతుంది. దక్షుడి అహంకారం సాక్ష్యాత్తు పరమశివుడు భార్య జగదంబ జీవితాన్నే మార్చేసింది. అలాగే అల్లుడు చంద్రుడు జీవితంపై తీవ్రప్రభావం చూపించింది. దక్షుడితో బంధుత్వం ఏర్పడిన కారణంగా పరమశివుడే నిందింపబడ్డాడు. ఇలా అహంకారి దక్షుడితో సంభందం కలిగిన అందరూ ప్రభావితులైనారు. అయితే దేవతా శక్తికి ప్రకృతి మార్పులతో మొదలువుతుంది కాబట్టి అవన్నీ లోకకళ్యాణం కోసం ఉపయోగపడ్డాయి. “దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

అలనాటి పాత సినిమాలు

Our Films are in Youtube Old Telugu Movies Popular Actors సమస్యలతో సతమతయ్యే వారికి వినోదంగా ఒకప్పుడు హరికథలు, నాటకాలు ఉంటే అవి పౌరాణిక కధలతో సామజిక కుటుంబ సందేశాలను మిళితం చేస్తూ, కొన్నింటిలో అయితే అప్పటి సామజిక దోరణిలను వ్యంగ్యంగానో చెప్పటం జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఎక్కువగా సత్యహరిశ్చంద్ర, వల్లికళ్యాణం, చింతామణి లాంటి డ్రామాలు ఉంటే, ఎన్నెన్నో హరికధలు దేవతలపై చెప్పబడేవిగా చెబుతారు. సాంకేతికత అభివృద్ధి చెంది, నాటకాలను చలనచిత్రాలుగా వెండితెరపై కెక్కించి విజయంతం అయ్యారు.

కధనంలో జరుగుతున్నా సమకాలిక సామజిక పరిస్థితులనుసరించి పౌరాణిక గాధలు ఎక్కువగా సినిమాలుగా వస్తే, జానపద కధలు, చారిత్రక విశేషాలు ఇలా చెబుతూ పొతే అనేకానేక పాత చిత్రాల్లో సందేశాన్ని సామరస్యంగా చెప్పడంలో చక్కగా చిత్రాల్లో చూపినట్టు, మనకి పాత చిత్రాల్లో కనబడుతుంది. సున్నితమైన అంశాల గురించి సున్నితంగానే చెప్పడం కూడా పాతచిత్రాలకే కనబడుతుంది. ఇప్పటి చిత్రాల సందేశాలు ఇప్పటికి అధునాతనమైనవి అయితే అప్పటి చిత్రాల సందేశాలు అప్పటికి అధునాతనంగానే ఉంటాయి. ఎందుకంటే సినిమాలు గతకాలపు సంఘటనలు లేక గ్రందాల విషయాలతో కూడి ప్రస్తుతానికి దగ్గరగా భవిష్యత్తుపై ఊహతో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చిత్రాలు చెబితే గతకాలపు అంశాలలో మంచి చెడులను, లేక భవిష్యత్తు సామజిక పయనం ఎటు ? అనే అంశాలతో మిళితమై ఉంటాయి.

ప్రస్తుతం అంటే అప్పుడు ఎప్పుడు చేదుగానే ఉంటుంది, ఎందుకంటే వర్తమానంలో సామజిక విషయాల అనేక మంది ఆచరణచేసేవి సమాజంలో పోకడలుగా దోరణిలుగా కొనసాగుతాయి. కాబట్టి వాటిపై వచ్చే విమర్శలు, సూచనలు అనేక మంది మానవ మేధ ఒక్కరి మేధాశక్తిని నమ్మజూడదు. ఎందుకంటే ఎక్కువ శాతం ఊహలు కలలుగానే ఉంటాయి, కొన్ని వాస్తవానికి దగ్గరగా ఉంటే, అవి అందరూ అవగతం చేసుకునే అయ్యే స్థితిని సమాజంలో కల్పించలేవు. అందుకే అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం గురించి వచ్చిన చిత్రాలు మాత్రం అవార్డు చిత్రాలుగా ఉంటాయి.

కధను బట్టి పాత్ర, పాత్రను బట్టి పాత్రదారి పాతచిత్రాల తీరు

పాతచిత్రాల కధానాయకులుగా నాగయ్య, ఎస్ వి రంగారావు, నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, భానుమతి, షావుకారు జానకి, అంజలి దేవి, కాంచన, రాజశ్రీ, కన్నాంబ, కృష్ణ కుమారి, జమున, వాణిశ్రీ మొదలైనవారు అనేక తెలుగు చిత్రాల్లో నటిస్తే, చాలామంది వారు సినిమాల్లో జీవించారు అని చెబుతారు. Youtube Old Telugu Movies Popular Actors

కాని పాత చిత్రాలు సాద్యమైనంతవరకు సందేశంతో ఉన్నా సకుటుంబానికి కావాల్సిన విషయాలు వాటిలో ఉండే అందరిని ఎక్కువకాలం అలరించాయి. ఇప్పటికి కొంతమంది యూట్యూబ్ లాంటి వీడియో వెబ్ / మొబైల్ ఆప్స్ ద్వారా వీక్షించేవారు అధికంగానే ఉంటారు. ఎన్నో ఉత్తమ చిత్రాలు ఉంటే కొన్ని చిత్రాలు గురించి ఇప్పటికి, మరికొన్ని రానున్న కాలంలో… క్రిందగా ఉన్న కొన్ని చిత్రాల (Chitralu) గురించి Youtube Old Telugu Movies Popular Actors చదవండి….

లక్ష్మికటాక్షం – పేరాశతో పరుల ధనానికి ప్రతినాయకుడి పాట్లు, లక్ష్మిదేవి అనుగ్రహం కలిగిన కధానాయకుడు

అలనాటి తెలుగు చిత్రాలలో వినోదంతో పాటు సమాజ శ్రేయస్సుకోసం సందేశాలు కూడా కధనంలో కలసి చక్కగా కుటుంబంతో కలసి చూడదగిన చిత్రాలే ఎక్కువగా ఉంటే, వాటిలో లక్ష్మికటాక్షం చిత్రం ఒకటి. NTR KR Vijayala LakshmiKataksham Telugu Movie చిత్రాన్ని విఠలాచార్య దర్శకత్వం వహించారు. అర్హత లేనివాటి కోసం వేషం మార్చుకుని చేసే ప్రయత్నాలు ఫలించవు అని, ఒకవేళా ఫలించిన నశించిన బుద్దితో ఆ సంపద దక్కదని ప్రచండుడి పాత్రలో ప్రస్పుటం అవుతుంది. వేషం మార్చుకుని వేషాలు వేయించగలిగే శక్తిని సంపాదించి కూడా పేరాశతో భోగాలు కోసం అంతులేని సంపదని ఒక్కడి స్వార్ధం కోసం చేసిన ప్రయత్నం విఫలమై చివరికి దుష్ట సర్పంగా మారి అడవులపాలు అయ్యేలా చేసిన పేరాశను పట్టుకున్న ప్రచండుడు. విధిరాతను బట్టి ఎక్కడిజీవితంలో అక్కడ సంతోషంగా గడిపే కులవర్ధనుడుకి ప్రచండుడి ప్రయత్నాలే కులవర్ధనుడుని మహారాజుగా మార్చాయి. ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

కలసిఉంటే కలదు సుఖం – టైటిలే చిత్రానికి కాప్షన్ అయ్యేలా చిత్రం పేరు చిత్రకధ

కలసి ఉంటే కలదు సుఖం నందమూరి తారకరామారావు సావిత్రి జంటగా నటించిన కుటుంబ కధా చిత్రం. తెలుగు చిత్రాలలో కుటుంబ విలువలను అందులోను ఉమ్మడి కుటుంబ విలువలను గూర్చి చక్కగా చెప్పే పాత చిత్రాల్లో కలసి ఉంటే కలదు సుఖం ఒక మంచి చిత్రంగా ఉంది. స్వర్గీయ ఎన్టిఆర్ సావిత్రల కలియకలో ఎస్వి రంగారావుగారు, సూర్యకాంతం, రేలంగి తదితరుల అద్బుత నటనతో చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram Ummadi kutumbamlo bandhalu gurinchi venditerapai veligina chitrarajamu. ముద్దబంతి పూలు పెట్టి, మొగలి రేకులు జడను అంటూ సాగే పాట సూపర్ హిట్ సాంగ్. శ్రీ సారది స్టూడియోస్, బ్యానర్ పై రామరావు, రేలంగి, ఎస్విఅర్ సావిత్రి, గిరిజ హేమలత, రమాదేవి తదితరులు నటించిన తెలుగు చలనచిత్రం కలసి ఉంటే కలదు సుఖం చిత్రానికి తాపి చాణుక్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

కృష్ణుడు భాగవతంలో కధానాయకుడు అయితే భారతంలో ధర్మాన్ని గెలిపించిన భగవానుడు.

మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు శ్రీకృష్ణావతారం చిత్రంలో నటించారు.ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

పరమానందయ్య శిష్యుల కధ – హాస్య భరిత పౌరాణిక చిత్రం

Paramaanandayya Shishyula Kadha Telugu Old Movie శ్రీ దేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పరమానందయ్య శిష్యుల కద చిత్రం– సి పుల్లయ్య దర్శకత్వంలో నాగయ్య, ఎన్టిఆర్, పద్మనాభం, అల్లు రామలింగయ్య, రాజబాబు తదితరులు నటించారు. సహజమైన నవ్వు ఆరోగ్య స్థితిని తెలియజేస్తూ ఉంటే, బుద్దిహీనతతో చేసే పనుల వలవ వచ్చే నవ్వులతో కూడిన హాస్యకదాచిత్రము పరమానందయ్యా శిష్యుల కధ ‘ ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

రాముడు, కృష్ణుడు, శివుడు భగవానుడిని భక్తితో తెలుగుకు పరిచయం చేసిన మహాభక్తుడు

అలనాటి మేటి చిత్రాల్లో భక్తపోతన భక్తీచిత్రం. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana Samskrutam nundi Telugulo Anuvadinchina Bhakta Potanaamaatyulu శ్రీకృష్ణుడు మహాభారతం నడిపించడానికి ద్వాపరయుగంలో ధర్మానికి అధర్మానికి యుద్దంలో ధర్మాన్ని రక్షించబూనిన వారికి మద్దతుగా ఉంటూ ధర్మ సంస్థాపన చేయడానికి అవతరిస్తే, ఆ మహాభారతాన్ని సంస్కృత రచన చేసిన వేదవ్యాసుడు, ఆ పరబ్రహ్మ లీలలను కూడా చెప్పదలచి భాగవతం కూడా రచనచేసి ఆత్మతృప్తిని పొందినట్టుగా శాస్త్ర పండితులు పలువురు ప్రవచన కారులు చెబుతారు. భాగవతం వింటే పుణ్యం కలుగుతుంది అని, మరీ భక్తిశ్రద్దలతో వింటే మోక్షమే ప్రాప్తిస్తుంది అని కూడా ప్రవచన కారులు వారి వారి ప్రవచనాల ద్వారా చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల చేత చెప్పబడుతున్న మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన మహానుభావుడు, తెలుగుజాతికి విలువైన భక్తీ గ్రంధాన్ని అందించిన బమ్మెర పోతరాజు గురించిన తెలుగు చలనచిత్రం చూడడం కూడా ఒక అదృష్టమే అంటారు. ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

మాటపై నిలబడడం అంటే నిప్పులపై నిలబడడం అని నిరూపించిన చిత్రం

NTR Satya Harishchandra Full Story Telugu Movie, Satyaharischandra Maharaju Satyavrata Pouranika Gaadha పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప చిత్రం సత్యహరిశ్చంద్ర గాధ53 ఏళ్ల క్రిందట వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, ఎస్ వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల, రమణారెడ్డి, రాజనాల, రాజశ్రీ, మీనాకుమారి, రేలంగి, గిరిజ తదితరులు నటించారు. సత్యహరిశ్చంద్ర చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించగా ప్రముఖ దర్శకులు కె.వి. రెడ్డి నిర్మాణదర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ సత్యహరిశ్చంద్ర గాధని చిత్రంగా సంస్థ నిర్మించింది. ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

అలనాటి మేటి తెలుగు చిత్రాలకు సాటి రాగల చిత్రాలు అలనాటి చిత్రాల్లోనే ఒకదానితో ఒకటి పోటి పడుతూ ఉంటాయి. గొప్ప గొప్ప కధలతో రచయితలు వస్తే, గొప్ప దార్శనికతతో దర్శకుల చిత్రాలను తీస్తే ఎన్నెన్నో చిత్రాలు మనకి లభిస్తాయి.  అనేక పాత Chitra లు మనకి యూట్యూబ్లో videoలుగా లభిస్తున్నాయి. ఈ పాత చిత్రాల వీడియోలు ఎప్పుడైనా ఎక్కడైనా smartphones ద్వారా వీక్షించవచ్చు.  “Youtube Old Telugu Movies Popular Actors” మరి కొన్ని…..

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు  శ్రీకృష్ణావతారం చిత్రంలో నటించారు.

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ కధ

దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం, ఋషులు, దేవతలు, భూమాత మొరపెట్టుకుంటే శిష్ట రక్షణార్ధం దుష్టులను నిర్జించడానికి అవతరిస్తానని మాట ఇచ్చిన శ్రీమహావిష్ణువు. సాధుజనులకు ధర్మపరాయణులకు రక్షకుడు అయినా శ్రీమహావిష్ణువు అవతారం కృష్ణావతారం.

కంసుడు తన చెల్లెలికి దేవకికి వసుదేవుడుని ఇచ్చి వివాహం చేసి అంగరంగ వైభంగా రధసారధిగా బావగారిని చెల్లెల్ని అత్తవారింటికి సాగనంపుతుంటే ఆకాశవాణి హెచ్చరిక చేస్తుంది, నీ చెల్లెలి కడుపున పుట్టబోయే ఎనిమిదవ బాలుడు చేతిలో మరణం ఉంటుంది అని. అందుకు వెంటనే చెల్లెలిపై కత్తి దూసిన కంసుడుని వసుదేవుడు వారించి, నీ చెల్లెలి వలన నీకు ఆపద లేదు కదా నీ చెల్లెలి సంతానం వలననే కదా, ఆమెకు సంతానం కలగగానే నీకు అప్పజెప్పుతానని చెప్పడంతో ఆలోచనచేసిన కంసుడు ఆ ప్రయత్నం విరమిస్తాడు. అయితే అంతవరకూ దేవకీ-వసుదేవులను తన ఇంటే ఉంచుతాడు. కారణాంతరాల వలన తన భద్రత కోసం ఏడుగురు పిల్లల్ని చంపుతాడు కంసుడు. దేవకీ వసుదేవులను కారాగారంలో బందించి ఉంచుతాడు. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

అష్టమ గర్భంతో ఉన్న దేవకీ కారాగారంలో భర్త వసుదేవులతో కలిసి ఉంటుంది. శ్రావణ మాసం అష్టమి తిథి రాత్రి సమయంలో చీకటిలో శ్రీమహావిష్ణువు దేవకీ అష్టమ గర్భవాసం చేసి కారాగారంలో జన్మిస్తాడు. వెంటనే శ్రీమహావిష్ణువుగా దేవకీవసుదేవులకు కనిపించి తనని గోకులంలో వదిలి అక్కడి యోగమాయ శిశువుగా ఉంది, ఆ శిశువుని ఇక్కడకు తెచ్చి పెట్టమని చెప్ప అంతర్ధానం అవుతారు. వసుదేవుడు బిడ్డని చేతుల్లోకి తీసుకోగానే కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపాలదారులు మాయానిద్రలోకి జారుతారు. వసుదేవుడు తన బిడ్డని ఎత్తుకుని గోకులంవైపు వెళ్తుంటే, యమునా నది రెండుగా చీలి దారి ఇస్తుంది. గోకులంలో ఆ బాలుడుని వదిలి, అక్కడి యోగమాయా శిశువుని తీసుకుని కారాగారం దగ్గరికి వచ్చేస్తాడు, వసుదేవుడు.

శ్రీకృష్ణ జననంతోనే లీలలు ప్రదర్శించే భగవానుడు – శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ

వసుదేవుడు కారాగారంలోకి రాగానే అక్కడ కమ్మిన యోగమాయ తొలగి స్థితి యదాస్థితిలోకి వస్తుంది. పసిపాప ఏడుపు వినగానే కాపలాదారు వెళ్లి కంసుడుకి చెప్పగానే, కంసుడు కారాగారంలో వచ్చి ఆ పసిపాపను చంపబోతాడు. కానీ కంసుడు ప్రయత్నం విఫలమై ఆ పాపా ఆకాశంలో శక్తిగా మారి నాతొబాటు పుట్టిన బిడ్డ క్షేమంగా ఉన్నాడు. అన్యాయంగా పసిబిడ్డలను చంపిన నీకు ఆ బాలుడి చేతిలోనే మరణం ఉంటుంది అని చెప్పి అంతర్ధానం అవుతుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

కృష్ణుడు నంద గోకులంలో బాల్యం నుండే లీలలు ప్రదర్శిస్తూ పెరుగుతాడు. పాలు త్రాగే వయసులోనే దుష్టబుద్ది కలిగిన పోతన అనే రాక్షసిని సంహరిస్తాడు. అలాగే శకటాసురుడిని కాలుతో తన్ని సంహరిస్తాడు. ప్రజలు నీరుత్రాగే కొలనులో విషం చిమ్ముతూ ఉండే కాళియ సర్పంపై నృత్యం చేసి, ఆ సర్పాన్ని కొలను నుండి వెల్లగొడతాడు. తన అల్లరితో అమ్మని ఆబాలగోపాలాన్ని అలరిస్తూ నందగోకులాన్ని ఆనందంలో ,ముంచెత్తుతాడు. కంసుడుని సంహరించి తన కన్నతల్లిదండ్రులతో కలిసి ద్వారకలో ఉంటాడు.

రుక్మిణికళ్యాణం, సత్యభామ, జాంబవతిలతో వివాహం

బాలకృష్ణుడు పెరిగి పెద్దవాడైన కృష్ణుడు విదర్భరాకుమారిగా ఉన్న శ్రీమహాలక్ష్మి అవతారం అయిన రుక్ముణిని వివాహమాడతాడు.
అయితే అనుకోకుండా శ్రీకృష్ణుడు పాలలో చంద్రుడిని దర్శిస్తాడు. అది వినాయకచవితి కావడం వలన ఆరోజు గణపతిని పూజించకుండా చంద్రదర్శనం చేసినవారికి నీలాపనిందలు ఉంటాయి, అని చంద్రుడికి అమ్మవారి శాపానుగ్రహం ఉంటుంది. వెంటనే జరిగిన పొరపాటుని గ్రహించిన శ్రీకృష్ణుడు వినాయక పూజ చేసిన అక్షతలను నెత్తిమీద వేసుకుని, విఘ్నేశ్వరుడుని ప్రార్ధన చేస్తాడు. ఇక తత్ఫలితం శ్రీకృష్ణుడికి సత్రాజిత్ రూపంలో నీలాపనింద వస్తుంది. సూర్యభగవానుడిని ప్రార్ధించి శమంతకమణిని పొందిన సాత్రజితు దేదిప్యామానంగా వెలుగాతాడు. శమంతకమణిని తనకు ఇవ్వవలసినదిగా అడిగిన కృష్ణుడి మాటను మన్నించడు సత్రాజిత్. అయితే సత్రాజిత్ సహోదరుడు అయిన ప్రసేనుడు మణిని ధరించి అడవికి వెళతాడు. అయితే మణిని ధరించి అడవికి వెళ్ళిన సోదరుడు ఎంతకీ రాకపోయేసరికి, తన సహోదరుడిని సంహరించి ఆ మణిని శ్రీకృష్ణుడే కాజేసాడని సత్రాజిత్ శ్రీకృష్ణుడిని నిందమోపుతాడు. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

నిందలపాలు అయిన శ్రీకృష్ణుడు మణిని ధరించి అడవికి వెళ్ళిన ప్రసేనుడుని వెతుకుతూ అడవికి బయలుదేరతాడు. వినాయకుడి అనుగ్రహం వలన శ్రీకృష్ణుడుకి దారిలో సింహ చంపిన ప్రసేనుడి శవం, సింహం జాడలతో బాటపట్టిన కృష్ణుడుకి మరణించిన సింహం కనబడి, ఆ దారిలో బల్లూకం జాడలు కనబడతాయి. ఆ జాడలు వెంటబడిన శ్రీకృష్ణుడు జాంబవంతుడి గృహకి చేరతాడు. అక్కడ జాంబవంతుడితో శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తాడు. రామావతారంలో రాముడితో యుద్ధం చేయాలనే కోరికను కోరిన జాంబవంతుడు, కృష్ణావతారంలో కృష్ణుడుతో తలబడతాడు. అయితే పోరాటంలో ఓడిన జాంబవంతుడుకి విషయం అవగతం అయ్యేలా శ్రీకృష్ణుడు చేస్తాడు. కృష్ణావతారంలో శ్రీరాముడు అని గ్రహించి తనకుమార్తె జాంబవతిని, శమంతక మణిని ఇచ్చి వివాహం చేస్తాడు.

శమంతకమణిని సత్రాజిత్ కి శ్రీకృష్ణుడు ఇచ్చేస్తాడు. అయితే సత్రాజిత్ తన తప్పుని తెలుసుకుని, శమంతక మణిని తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణుడుకి ఇచ్చి వివాహం చేస్తాడు. వినాయక చవితి రోజున చంద్ర దర్శనం చేసినందుకు నీలాపనిందలు కలిగితే, విఘ్నేశ్వరుడు అనుగ్రహం వలన శమంతకమణి తో బాటు ఇద్దరు భార్యామణులు లభిస్తారు. ఈ పౌరాణిక గాధకి ఫలశ్రుతిని కూడా పండితులు చెబుతారు, అంతలా ప్రసిద్ది పొందిన ఈ గాధ ప్రతి వర్షమున వినాయక చతుర్ధి రోజున పూజలో చెప్పుకోవడం కూడా మన భారతీయ సంస్కృతిగా అనాది నుండి వస్తుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

రాజసూయ యాగంలో శిశుపాలుని నూరో తప్పు

పాండవులు రాజసూయ యాగం చేస్తూ, ఆ యాగా ధర్మకర్తగా అగ్రపూజకు శ్రీకృష్ణుడుని ధర్మరాజు భీష్మాచార్యుల సూచనతో ఆహ్వానిస్తాడు. నిండుసభలో అగ్రపూజ అందుకోబుతున్న శ్రీకృష్ణుడిని అందుకు అర్హుడు కాదు అని శిశుపాలుడు అడ్డుపడి, శ్రీకృష్ణుడిని నానా దుర్భాషలాడుతాడు. శతతప్పుల వరకు వేచి చూస్తాను నూరవ తప్పు చేయగానే శిశుపాలుడిని సంహరిస్తానని శిశుపాలుడి తల్లికి మాట ఇచ్చిన శ్రీకృష్ణభగవానుడు, ఈ సభలో వందో తప్పు చేసిన శిశుపాలుడిని తన చక్రాయుధంతో సంహరిస్తాడు. ధర్మరాజు తన పూజని నిర్విఘ్నంగా ముగిస్తాడు.

బాల్యస్నేహితుడు అయిన కుచేలుడు కడు పేదరికంతో ఉండి, శ్రీకృష్ణ దర్శనార్ధం ద్వారకకు వస్తాడు. వచ్చిన చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణుడు కోసం అటుకుల మూట తీసుకువస్తాడు. సభలో శ్రీకృష్ణుడుచేత సేవలు పొందుతున్న కుచేలుడు తెచ్చిన అటుకులు ఇవ్వడానికి మొహమాటపడితే, శ్రీకృష్ణ భగవానుడు ఆ అటుకులను అభిమానంతో ఆరగిస్తున్నా కొలది కుచేలుడుకి దరిద్రం పోయి, అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.
మాయాజూదంలో ఓడిన పాండవ ధర్మపత్నిని నిండుసభలో ఘోర అవమాన ప్రయత్నంలో భాగంగా దుస్శాసునుడు ద్రౌపది వస్త్రపాహరణ దుశ్చర్యకు పాల్పడతాడు. ఆపదలో ద్రౌపది ప్రార్ధనని ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు, ద్రౌపదికి చీరలిచ్చి ఆమెకు రక్షణ కల్పిస్తాడు. కురుపాండవుల మధ్యలో యుద్ధం అనివార్యమైన స్థితిలో ధర్మరాజువైపు నిలబడి, ధర్మరాజు వైపు రాయభారిగా సుయోధనుడికి హితవు చెప్పినా వినని పరిస్థితులలో యుద్దానికి దారితీస్తుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

కురుక్షేత్రం అధర్మం ధర్మం మధ్య యుద్దం

కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో అద్బుతమైన ఘట్టం అక్కడే దుష్ట శిక్షణ శిష్ట రక్షణతో జరగడానికి ముందు లోకానికి అవసరమైన జ్ఞానాన్ని అర్జున విషాదయోగం ద్వారా భోదించాడు. భావంతుడి నోట భక్తుడికి చేసిన గీతపోదేశం భగవద్గీతగా జగద్విఖ్యాతి చెందింది. యుద్ధం రాజధర్మం కనుక నీవు రాజ్యాన్ని పాలించే రాజువి కాబట్టి నీ కర్తవ్యం ధర్మ రక్షణ చేయడం, అటువంటి ధర్మరక్షణలో తనకుమాలిన ధర్మంతో ఉంటావో నీకర్తవ్యమెరిగి ధర్మరక్షణ చేయుదువో నిర్ణయించుకో, ఫలితం నాకర్పించు, నీ పని నీవు చేయి అని తేల్చి చెబుతాడు. మోహం తొలగిన అర్జునుడు యుద్ధం ప్రారంభిస్తాడు.

యుద్దంలో భీష్మ పితామహ యుద్దానికి నిలబడలేకపోయిన అర్జునుడి ముందు శిఖండిని రప్పించే సూచనా, ద్రోణాచార్యులతో అస్త్ర సన్యాసం చేయించడానికి ధర్మరాజుతో అశ్వత్దామా అనే ఏనుగు మరణవార్తని, అశ్వత్దామా మరణించాడు అని గట్టిగా వినబడేలాగా ఏనుగు అని మెల్లగా చెప్పించిన శ్రీకృష్ణ భగవానుడు దృతరాష్ట్రుడి కుటిల బుద్దిని కనిపెట్టి, అతని భారి నుండి భీముడిని కాపాడి, గాంధారి చేత శాపానుగ్రహం పొందుతాడు. యదువంశంలో వారిలో వారే కలహించుకుని యదువంశం నశిస్తుందని. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna.

గాంధారి, మునుల శాపం వలన యదుయోధుల కలహం, వంశ క్షయం.

మునుల శాప ఫలితంగా యదువంశంలో ముసలం పుడుతుంది, ఆ ముసలం అరగదీసి సముద్రంలో కలిపేస్తారు యదుయోధులు. అయితే కొన్నాళ్ళకు సముద్రపు ఒడ్డులోనే మద్యం సేవించి ఒకరితో ఒకరు కలహించుకొని యదుయోధులు మరణిస్తారు. బలరాముడు సముద్రంలోకి వెళ్తాడు. ఒక కిరాతుడు అటుగా వస్తూ ఉంటే ముసలం ముక్క దొరుకుతుంది. ఆ ముక్కని బాణానికి పెట్టి జింక అనుకుని పొదలలో పడుకుని ఉన్న శ్రీకృష్ణ భగవానుని బొటనవేలుని కొడతాడు. తప్పు తెలుసుకున్న ఆ కిరాతుడు వచ్చి శ్రీకృష్ణ భగవానుడి కాళ్ళ మీదపడి జింక అనుకుని మీపాదానికి గురిపెట్టి కొట్టానని చెబుతాడు.

అందుకు శ్రీకృష్ణుడు మానవుడుగా పుట్టిన ప్రతిజీవి ఎదో ఒక సమయంలో చేసిన కర్మలకు ఫలితం అనుభవించాలి. త్రేతాయుగంలో నేనేరాముడుని నీవు వాలివి, నే నిన్ను సుగ్రీవుడు కోసం చెట్టుచాటు నుండి బాణంతో కొట్టాను. ఆ కర్మఫలితం ఇప్పుడు నీద్వారానే నాకు తీరిపోయింది. అని చెప్పి, అవతారం చాలిస్తాడు, శ్రీకృష్ణభగవానుడు.

మనసు, బుద్ది ప్రధానంగా సాగే సంసారంలో బుద్ది బలం యొక్క గొప్పతనం ధర్మాన్ని పట్టుకుంటే ధర్మంద్వారా ధర్మాన్ని పట్టుకున్నవారికి భగవానుడు రక్షణ చేస్తాడు, అని నిరూపిస్తూనే భగవానుడు అయినా మనిషిగా అవతరిస్తే కర్మశేషం అనుభవించాల్సిందే అనే సందేశం ఈచిత్రంలో కనబడుతుంది. రామావతారంలో జాంబవంతుడుకి ఇచ్చిన మాట, ధర్మంవైపు నిలిచిన సుగ్రీవునికి సహాయం చేయడానికి, జాతిధర్మం ప్రకారం వాలిని చెట్టుచాటు నుండి కొట్టిన ఫలితం కారణంగా, కృష్ణావతారంలో అదే వాలి కిరాతుడుగా పుట్టి బాణంతో పొదలమాటున నిద్రిస్తున్న కృష్ణుడు పాదంపై బాణప్రయోగం చేస్తాడు. అసలు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుట్టడం కూడా అంతకుముందు జన్మలలో వారికి భగవానుడు ఇచ్చిన వరమే. అలాగే యశోద దగ్గర పరమాత్మ పాలు త్రాగడానికి కూడా గత జన్మల్లో ఆమె చేసుకున్న పుణ్యఫలమే అని పండితులు చెబుతూ ఉంటారు.
కృష్ణావతారం గాధలు లీలలతో నిండి ఉంటే ఆ లీలలు ఏవయసు వారికి ఆ వయసుకు తగ్గట్టుగా మంచిని సూచిస్తూ ఉంటుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?