Tag Archives: పరమశివుడు

మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస

లోకంలో సామెతలు చాలా విశిష్టమైనవి, అవి చాలా నిగూఢమైన అర్ధాన్ని కలిగి ఉంటాయని అంటారు. అలాంటి వాటిలో జన్మానికో శివరాత్రి అంటూ నానుడి ఉంది. మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస కలిగి ఉంటే, అంతకన్నా మరొక అదృష్ట విషయం ఏముంటుంది?

నిత్యం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనసుకు, ఒక్కరోజులో దేవునిపై ధ్యాస కలగాలంటే, కష్టమే! అందుకనేమో జన్మానికో శివరాత్రి అంటారు. ఏదైనా పండుగ వస్తే, ఆ పండుగ రోజునా ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలతో కొంత కాలాయాపన జరిగితే, చేసే పనిలో ఆటంకం ఉంటే మరికొంత కాలాయాపన ఉంటుంది. కాలాయాపన జరిగిపోతుందనే ఆలోచనతో దేవునిపై ధ్యాస కరువవుతుంది.

అందుకే ముందుగానే రాబోయే పండుగలు గూర్చి తెలుసుకుని ఉండి ఉండాలి అంటారు. మనకున్న వివిధ పండుగలలో వివిధ దేవీదేవతలను పూజిస్తూ ఉంటాం. ఏదేవుని పూజకు ఆయా విధానం ప్రకారం పూజిస్తూ ఉంటాం. పూజావిధానంతో బాటు మన:ప్రవర్తన మరీ ముఖ్యమంటారు. పూజ చేస్తూ ఉన్నప్పుడు ధ్యాస దేవునిపై ఉండి తీరాలి అంటారు. అప్పుడే ఆ పూజకు సరైన ఫలితం ఉంటుందని పండితులు అంటారు.

కావునా ఏ పండుగకు ఏదేవుడుని పూజించాలో ఆ దేవుని పురాణమను విశిష్టముగా చదివితే, ఆ దేవునిపై మనసు మమేకం అవుతుందంటారు. తినగా తినగా వేపాకు తియ్యగా ఉన్నట్టుగా, చదవగా… చదవగా… చదువుతున్న దేవుని మహిమలు మన మనసులో నాటుకుంటాయని అంటారు. ప్రస్తుతం మనకు ముందుకు రాబోయే మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస పెట్టడం ప్రధానమైన విషయం.

పరమశివుని వైభవం శివపురాణము

ముందుగానే పరమశివుని వైశిష్ఠ్యమును తెలియజేసే తెలుగుబుక్స్ రీడ్ చేయడం ద్వారా పరమశివుని వైభవం మనకు అవగతమవుతుంది. శివపురాణం చదవడం వలన మనకు పరమశివుని వైభవం తెలియబడుతుందని పెద్దలు చెబుతారు. శివపురాణం చదవడం వలన నిత్యం శివుడిని తలవడం మనసుకు అలవాటు అయితే, ఆయొక్క అలవాటు వలన మనసు మంచి సమయములలో కూడా పరమశివుడిని మననం చేసుకుని పుణ్యం మూటగట్టుకుంటుందని అంటారు.

మననం మనసుకుండే అలవాటు కావున మననం చేసే విషయాలలో సాత్విక విషయాలు ఉండాలి అంటారు. అలా వివిధ దేవతల మంచి గుణములను తెలియజేసే వివిధ దేవతా పురాణములను రీడ్ చేయడం వలను ఆయా దేవతలపై మనసు మననం చేయడం అలవాటుగా చేసుకుంటుంది. శివపురాణం మంచిగా చదివితే, శివుని వైభవం అర్ధం చేసుకునే మనసు, శివుడిని తలుస్తూ ఉంటుంది. ఆవిధంగా పరమశివుడిని గూర్చి మననం చేసే మనసు, మహాశివరాత్రి పర్వదినాన కూడా మననం చేస్తే, ఆ రోజు పూజావిధానంతో బాటు, మనసంతా శివధ్యాసే ఉంటే, ఆ జన్మకు అంతకన్నా అదృష్టం ఏముంటుంది? అందుకేనేమో జన్మానికో శివరాత్రి అంటారు.

అంటే మనసులోకి ముందుగా పరమశివుడిని తెచ్చుకుని ఉంటే, ఏదోక శివరాత్రికి మనసంతా శివుడే ఉండి, ఆ మనిషి తరించాడానికి మనసు మేలు చేస్తుంది. మరి మనసుకు పరమశివుని వైభవం తెలియజేసే శివపురాణం గురించిన తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ చేయండి లేదా క్లిక్ చేయండి. ఈ మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస పెట్టడానికి ప్రయత్నిస్తే, రాబోయే మహాశివరాత్రులకు మనసు మరింతగా ప్రిపేర్ అవుతుంది.

శివరాత్రి రోజున ఉపవాసం చేయడంతో బాటు, ఆ రోజురాత్రి జాగరణ చేయడం పరపాటి. అయితే ఉపవాసం చేయడం అంటే ఆహారం మీద ధ్యాస లేకుండా, పరమశివునిపైన మాత్రమే ధ్యాస నిలపడం అంటారు. జాగరణ అంటే నిద్ర కూడా మరిచి పరమశివునిపై ధ్యాసను పెట్టడం అంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినమున పరమశివుని వైభవం తెలియజేసే సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం తెలుగుబుక్ తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.

ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస

చదవడం కన్నా శ్రద్దగా వ్రాయడం వలన బుక్ లో ఉన్న విషయం బాగా అర్ధం అవుతుందని అంటారు. దీని కన్నా శ్రద్దగా వినడం వలన మనసు మరింతగా విషయాన్ని అర్ధం చేసుకోగలదు అంటారు. అలా దేవుని గురించి చదవడం కన్నా ముందు వినడం వలన ఆ దేవునిపై భక్తి బాగా పెరుగుతుంది. అటు తరువాయి ఆయా దేవీదేవతల బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా దేవీదేవతలపై భక్తి భావన బలపడుతుంది. అంటే ప్రవచనాలను ఆసక్తితో వినడం ద్వారా భగవంతునిపై ధ్యాస పెరుగుతుంది. అలా ప్రముఖుల ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస పెంచుకోవచ్చును.

ప్రముఖు ప్రవచన కర్తల ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస పెరగడానికి అవకాశం ఎక్కువ. మన తెలుగు ప్రవచన కర్తలలో ప్రముఖులు, ప్రసిద్ద ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఈయన పరమశివుని గూర్చి చెబుతుంటే, మనసు మరు విషయంవైపు మరలదు అంటారు. అటువంటి గొప్పవారి మాటలలో మహాదేవుని గూర్చి వినడం వలన పరమశివునిపై ధ్యాస మరింతగా పెరుగుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు పరమశివుని గురించి అనేకంగా ఉన్నాయి. వాటిలో అష్టమూర్తి తత్వం ప్రవచనాలు చాలా ప్రసిద్ది. అష్టమూర్తి తత్వం గురించి గురువుగారు చెప్పిన ప్రవచనం వినడానికి క్రింది వీడియో చూడండి.

మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస

మహాశివరాత్రి గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన ప్రవచనం ఈ క్రింది వీడియో ద్వారా వీక్షించవచ్చును.

మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస

పరమేశ్వరుడుని చేరుట జీవుని లక్ష్యమైతే, పురాణాలు, పురాణ ప్రవచానాలు మార్గం చూపుతాయని పెద్దలంటారు. పరమశివుని గురించి ధ్యాస సాదారణ రోజులలో చదవడం, వినడం ద్వారా అలవాటు చేసుకుంటే, మహాపర్వదినాలలో మనసే మార్గముగా మారిపోతుందని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం
కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి ఇస్తాడు. పరమశివుడు ఆ ఫలమును పార్వతికి ఇస్తాడు. పార్వతి మాత ఆయొక్క జ్ఙానఫలమును, తమ పిల్లలకు ఇవ్వడానికి నిశ్చయిస్తుంది. అయితే ఆదిదంపతుల కుమారులు ఇరువురు, ఆఫలము తమకు కావాలని అంటారు. అప్పుడు ఆ ఫలమును చెరిసగం చేసుకుని స్వీకరించమని, పార్వతిమాత సెలవిస్తుండగా, పరమశివుడు మాతకు మాటకు అడ్డుపడి, వలదు..వలదు… ఆఫలమును ఎవరో ఒకరే భుజించవలసి ఉంటుంది, అని పలుకుతాడు. అప్పుడు మాత పార్వతిదేవి, మహాదేవునితో ”మీరే పరిష్కారం చెప్పమనగా..” అప్పుడు శంకరుడు ”ఎవరైతే…ముల్లోకములకు ప్రదక్షిణ చేసి, ముందుగా కైలాసం వస్తారో…వారికే, ఈ జ్ఙాన ఫలము” అంటూ సమాధానం చెబుతాడు.

వెంటనే కుమారస్వామి..ఇప్పుడే ముల్లోకములకు ప్రదక్షిణ చేసి వచ్చెదనని కైలాసం నుండి బయలుదేరతాడు. అయితే వినాయకుడు కైలాసంలోనే ఉండి, మాతాపితలకు ప్రదక్షిణ చేస్తే, ముల్లోకములకు ప్రదక్షిణ చేసినట్టే, అని భావించి, విఘ్నేశ్వరుడు పార్వతి పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి, ఆఫలమును స్వీకరిస్తాడు. అయితే ముల్లోకములను చుట్టి తిరిగి కైలాసం వచ్చిన కుమారస్వామి, విషయం తెలుసుకుని, ఆగ్రహంతో మరలా కైలాసం వదిలి వెళతాడు. కైలాసం వీడి వెళుతున్న కుమారస్వామిని ఆపడానికి, ఆది దంపతులు ఇద్దరూ ప్రయత్నిస్తారు. అయినను వినక వెనుదిరగకుండా వెళుతున్న కుమారస్వామిని, ఆపడానికి ఒక అవ్వ ప్రయత్నిస్తుంది. కానీ విఫలం అవుతుంది. ఇక అప్పుడు జగన్నాత పార్వతిదేవి, కుమారస్వామి దగ్గరకు వచ్చి శివమహిమను తెలిపే, శివలీలలను చెప్పడం ప్రారంభిస్తుంది.

పాండ్యరాజు అంత:పురంలో తన రాణితో ఇష్టాగోష్టిలో ఉండగా అతనికి ఒక సందేహం వస్తుంది. స్త్రీకేశముల సువాసనను సహజంగా కలిగి ఉంటాయా? అనే సందేహం కలుగుతుంది. దానికి రాణి దగ్గర కూడా సమాధానం లేకపోయేసరికి, ఇదే విషయంలో సందేహం తీర్చినవారికి వేయిబంగారు నాణెముల నజరానతో కూడిన ప్రకటన తన పాండ్యరాజ్యంలో చేయిస్తాడు.

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

రాజ్యంలో ప్రకటించబడిన బహుమతికై ఆశతో ఎదురుచూసిన ధర్మి అనే ఒక పేద బ్రాహ్మణునికి, దేవాలయంలో శివుడే మారువేశంలో వచ్చి, ఆ సందేహ నివృత్తి కవితను ఇచ్చి వెళతాడు. దానితో ఆ పేద బ్రాహ్మణుడు ఆ కవితను తీసుకుని, పాండ్యరాజు గారి సభకు బయలుదేరతాడు. అక్కడ సభలో ఎవరూ ఆ సందేహ నివృత్తిని చేయగలిగేవారు లేకపోవడంతో రాజుగారు ఆశ్చర్యపడతారు. అప్పుడే శివానుగ్రహి అయిన ధర్మి బ్రాహ్మణుడు ఆ సభలోకి ప్రవేశిస్తాడు. ధర్మి తనకు శివుడు అందించిన తాళపత్రంలోని కవితను పాండ్యరాజుగారికి చదివి వినిపిస్తాడు. ఆ కవితకు మెచ్చినరాజు, ధర్మికి బహుమానం అందజేయబోతుండగా, అక్కడి ఆస్థాన పండితుడు అయిన నక్కీరుడు, ధర్మితో ఆ కవితను నీవే వ్రాశావా? అందులో దోషముంది అని చెబుతాడు. ఇక చేసేది లేక ధర్మి సభనుండి నిరాశతో నిష్క్రమించి, దేవాలయమునకు చేరి దు:ఖిస్తూ కూర్చుంటాడు. అక్కడకు మరలా వచ్చిన శివుడు సభలో జరిగిన విషయం చెప్పమని ధర్మిని ప్రశ్నిస్తాడు. ధర్మి నీవు వ్రాసిన కవితలో దోషముంది అని సభలో చెప్పినట్టుగా శివునితో చెబుతాడు. దానికి బదులుగా శివుడు అలా చెప్పినవారిని నాకు చూపించమని, ధర్మిని రాజుగారి సభకు తీసుకువెళతాడు. రాజుగారి సభలో నక్కీరుడు, పరమశివునితో కూడా మీరు కవితలో భావదోషముందని, ఆరోపిస్తాడు. ఆగ్రహించిన పరమశివుడు తన త్రినేత్రంతో నక్కీరుని దగ్ధం చేస్తాడు. తరువాయి రాజుగారి ప్రార్ధనతో పరమశివుడు, నక్కీరుడిని పునర్జీవునిగా చేస్తాడు. తరువాత ధర్మికి వేయి బంగారు నాణేములు బహుమతిగా లభిస్తాయి. ఇక్కడ ధర్మికి బంగారు నాణేములు, నక్కీరునికి పాండిత్యపరీక్ష రెండూ ఒకేసారి చేయడం శివలీలగా పార్వతి మాత కుమారస్వామికి వివరిస్తుంది.

Shiva leelalu gurinchi kumaraswamito

ఇంకా శివుని లీలలు గురించి కుమారస్వామితో మాట్లాడుతున్న పార్వతి మాత, తనను కూడా మహాదేవుని ఏవిధంగా పరీక్షించిందీ…ఆ వివరం కూడా చెప్పనారంభిస్తుంది.

లోకమాత అయిన దాక్షాయినికి, తన తండ్రి అయిన దక్షుడు చేస్తున్న యజ్ఙం గురించి తెలియవస్తుంది. ఆ యొక్క యాగమునకు వెళ్లాలని నిశ్చయించుకున్న దాక్షాయినిదేవి, పరమశివుని తన కోరికను తెలియజేస్తుంది. అప్పుడు మహాదేవుడు వలదని, నీవు నీపుట్టింటి మమకారంతో ఇప్పుడు దక్షుని యజ్ఙమునకు వెళ్లినచో అవమానం పొందుతావు అని వారిస్తాడు. కానీ జగన్మాత మహాదేవునితో వాదించి, శివుని అంగీకారం అడుగుతుంది. అప్పుడు పరమశివుడు విధి లోకమాతతో కూడా ఆడుకుంటుంది అని అనుకుంటూ, వెళ్లమని దాక్షాయినికి అనుజ్ఙ ఇస్తాడు. అప్పుడు లోకమాత దక్షయజ్ఙానికి బయలుదేరుతుంది.

నిరీశ్వర యాగానికి పరమశివుని పిలవకుండా చేయడం వలదని, మంత్రి సలహా ఇస్తాడు. అయినను దక్షుడు వినకుండా నిరీశ్వర యాగమునకు చేయడానికి పూనుకుంటాడు. అక్కడకు వచ్చిన జగన్మాత, తనకు తండ్రి అయిన దక్షునికి నచ్చజెప్పబోతుంది. కానీ దానికి దక్షుడు నిరాకరిస్తాడు. అవమాన భారంతో దాక్షాయిని మరలా కైలాసం చేరి, శివుని చేరుతుంది. కైలాసంలో శివునికి, పార్వతికి వాదం పెరిగి యుద్దమునకు దారి తీస్తుంది. ఆ యుద్ద ఫలితంగా శక్తి అయిన దాక్షాయిని దేహం దగ్గమవుతుంది. (గమనిక: దాక్షాయిని శరీరత్యాగం గురించి, పురాణ ప్రవక్తల మాటలు ప్రకారం అయితే దాక్షాయిని, దక్షయజ్ఙంలోనే ఆత్మార్పణం చేసుకున్నట్టుగా చెబుతారు.) తర్వాత దేవతల ప్రార్ధన మేరకు పార్వతిదేవిగా జగన్మాతకు తిరిగి శివుని చేరుతుంది. ఈ గాధను కూడా శ్రద్దగా ఆలకించిన కుమారస్వామికి ఇంకా మహాదేవి మరో శివలీల గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

Besta nayakudi kuturuga lokapavani

బెస్తనాయకుడి కూతురుగా పుట్టిన లోకపావని గంగా అను నామంతో యుక్తవయస్సులో ఉండగా తనతోటివారితో సముద్రపు ఒడ్డున ఆటాలాడుకుంటూ ఉంటుంది. అక్కడికి శివుడు కూడా ఒక బెస్తవాని రూపంలో వచ్చి, గంగను అల్లరి చేసి వెళతాడు. తర్వాత సముద్రంలోకి వెళ్లిన బెస్తవారు, అందరూ తిరిగి వెనుకకు రాలేకపోతూ ఉంటారు. ఎందుకంటే సాగరంలో ఉన్న తిమింగళం, సముద్రంలోకి వచ్చిన బెస్తవారిని తినేస్తూ ఉంటుంది.

దానితో బెస్త నాయకుడు సాగరంలో తిమింగళాన్ని చంపినవానికే, నాకూతురు గంగను ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు.బెస్తనాయకుడు కూతురు అయిన గంగ అక్కడి ఉన్న ధైర్యవంతులతో కూడి, సముద్రంలోకి వెళ్లడానికి బయలుదేరుతుంది. కానీ అక్కడికి బెస్తవాని వేషంలో వచ్చిన శివుడు తానే సముద్రంలోకి బయలుదేరతాడు. సముద్రంలో తిమింగళం బెస్తవాని వేషంలో ఉన్న శివునితో పోరాడి మరణిస్తుంది. అలా మరణించిన తిమింగళంతో బెస్తవాడు ఒడ్డుకు చేరతాడు. అలా బెస్తవారి వేషంలో ఉన్న పార్వతి, పరమేశ్వరులు ఒక్కటవుతారు. ఈ గాధను కూడా ఆలకించిన షణ్ముఖునికి, అమ్మ పార్వతిమాత ఇంకా ఒక అహంకారి సంగీత విద్వాంసుని విషయంలో శివలీలను వివరించడం ప్రారంభిస్తుంది.

హేమనాధ భాగవతులు పేరుగాంచిన గొప్ప సంగీత విద్వాంసుడు. సరస్వతీ కటాక్షం పొందిన హేమనాధ భాగవతులు ఎన్నో సత్కారాలు అందుకున్న పిదప, అతను పాండ్యారాజ్యానికి చేరతాడు. అక్కడ హేమనాధ భాగవతులకు, పాండ్యరాజే స్వయంగా స్వాగతం పలుకుతాడు. అహంకారం హెచ్చిన హేమనాధ భాగవతులు, తనకు స్వాగతం పలికిన పాండ్యరాజుతో చాలా గర్వంగా మట్లాడి, సభాప్రవేశం చేస్తాడు. సభలో హేమనాధుడు చేసిన గానకచేరికి, రాజు సంతోషించి, స్వయంగా హేమనాధుని దగ్గరకు వచ్చి, చాలా వినయంతో బహుమతులు సమర్పిస్తాడు. అయితే అహంకరించి ఉన్న హేమనాధుడు, నేను చాలా గొప్పవాడిని, నన్ను ఎవరైనా మీ సభలో ఓడించినచో, నేను పాండ్యరాజ్యానికి మొత్తం నాసంపదను దారాదత్తం చేస్తానని, లేకపోతే పాండ్యరాజ్యం మొత్తం నామాటకు దారాదత్తం కావాలని సవాలు చేస్తాడు. ఇంకా నేను గెలిచాక పాండ్యరాజ్యంలో ఎవరూ పాటలు పాడరాదని కూడా పలుకుతాడు.

pandyaraju

పోటికి సమ్మతించిన పాండ్యరాజు, పోటిని రేపు నిర్వహిస్తానని చెప్పి, హేమనాధుడికి అతిధి గృహంలో ఆతిధ్యం స్వీకరించమని చెబుతాడు. అటు తరువాయి తన ఆస్థాన పండితులను ”మీలో హేమనాధునితో పోటిపడేవారు ఎవరు?” అని అడుగుతాడు. కానీ వారిలో ఎవరూ ముందుకు రారు. పాండ్యరాజు సంకటంలో పడతాడు. అయితే పాండ్యరాజుకు మంత్రి ఒక సలహా ఇస్తాడు. అదేమిటంటే..”అహంకారం ఉన్న వ్యక్తికి, అనుగ్రహం ఉన్న వ్యక్తి చేతిలో ఓటమి తప్పదు” కాబట్టి దైవానుగ్రహం భాణబట్ట అనే సాధారణ గాయకుడిని తీసుకువచ్చి పోటిలో నిలబెడదాం అని చెబుతాడు. దానికి పాండ్యరాజు అంగీకరిస్తాడు. భాణబట్టుని, పాండ్యరాజు హేమనాధునితో పోటిపడవలసినదిగా ఆజ్ఙాపిస్తాడు. ఆయొక్క రాజాజ్ఙతో భాణబట్ట పరమశివుని ఆలయానికి వెళ్లి, నాకేమిటి ఈ పరీక్ష అంటూ శివుని వేడుకుంటూ, శివలింగం దగ్గరే పడి ఉంటాడు.

అప్పుడు శివుడు ఒక కట్టెలమ్ముకునేవాని వేషం ధరించి, ఆ నగరంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన పరమశివుడు (కట్టెలవాని వేషంలో) హేమనాధుడు విశ్రమించిన అతిధిగృహం దగ్గర ఉన్న ఒక మండపంపై కూర్చుని అద్భుతమైన గానం చేస్తాడు. ఆ గానం విన్న హేమనాధుడు బయటకు వచ్చి, ఆ అద్భుతగానం చేసిందెవరని వెతుకుతాడు. అక్కడే ఉన్న కట్టెలవానిని, ఇప్పుడు అద్భుతగానం చేసిందెవరని అడుగుతాడు. అప్పుడు కట్టెలవాడు, హేమనాధునితో నిద్రపట్టక నేనే ఏదో ఒక కూత కూశానని చెబుతాడు. దానికి ఆశ్చర్యపడిన హేమనాధుడు, నీవు ఈ పాట ఎవరిదగ్గర నేర్చుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కట్టెలవాడు, బాణబట్టు పేరు చెబుతాడు. దానితో దిమ్మతిరిగిన హేమనాధుడికి తన ఎంత అహంకరించినది..ఆలోచన చేసుకుంటాడు. తనతో పోటీపడబోయే శిష్యుని గానం ఇంత గొప్పగా ఉంటే, మరి ఆ బాణబట్టు గానం ఇంకెంత గొప్పగా ఉంటుందో అని ఊహించిన హేమనాధుడు ఊరి విడిచి వెళ్లిపోతాడు. వెళ్లేముందు, తన సంగీతం అంతా పాండ్యరాజ్యానికి ధారదత్తం చేస్తున్నట్టు వ్రాసిన తాళపత్రం కట్టెలవాని చేతికి ఇస్తాడు. ఆ పత్రాన్ని శివుడు శివాలయంలో ఉన్న బాణబట్టుకు అందజేసి, శివలింగంలోకి చేరతాడు. ఇలా లోకమాత కుమారస్వామికి శివలీలలు వివరించి, కుమారస్వామి మనసుని శాంతింపజేస్తుంది. శివుడు వినాయకునితో కలసి, కుమారస్వామి, పార్వతిమాత ఉన్న కొండకు వస్తారు.

ఏకొండపై కుమారస్వామికి లోకమాత శివలీలు వివరించిందో…ఆకొండే పళనిగా ప్రసిద్ది చెందుతుందని వరమిస్తారు. సినిమా సుఖాంతం అవుతుంది.

సాదారణంగా శివుని లీలలు గురించి వింటే, మాములు మనిషి మనసు శాంతిని పొందుతుంది. ఇక సాక్షత్తు మహాదేవుని కుమారుడు అయిన కుమారస్వామి మనసు ఇంకెంత శాంతిని పొంది ఉంటుంది. అంత శాంతిని పొందిన కుమారస్వామి వెలిసిన కొండ పళని కొండ. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా పార్వతి పరమేశ్వరుల గాధ దక్షయజ్ఙం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

దక్షయజ్ఞం చిత్రంలో NT రామారావు పరమశివుడుగా దేవిక సతీదేవిగా, SV రంగారావు దక్షుడుగా, చిత్తూరి నాగయ్య దధీచి మహర్షిగా, రాజనాల ఇంద్రుడుగా, రామకృష్ణ చంద్రుడుగా, మిక్కిలినేని బ్రహ్మగా, పద్మనాభం, బాలకృష్ణలు దక్షప్రజాపతి కుమారులుగా, సూరిబాబు నందిగా, రఘురామయ్య నారద మహర్షిగా, కన్నాంబ వైరినిగా, రాజశ్రీ రోహిణిగా ఇంకా ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు. ప్రజాదరణ పొందిన పాత చిత్రాల్లో దక్షయజ్ఞం ఒక మంచి చిత్రం. ‘దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా’.

పౌరాణిక గాధలలో సందేశం మిళితమై సందేశం కోసం సన్నివేశాలు సంఘటనలతో కూడిన గాధలు ఉంటాయి. అలా పార్వతి పరమేశ్వరుల గురించి చెప్పబడినప్పుడు తరుచూ తగిలే గాధ దక్షయజ్ఞం గాధ! పార్వతి మాత గతజన్మ వృత్తాంతం కావడం ఆ జన్మలోను ఈ జన్మలోను శివుడు మరు జన్మ లేకుండా పార్వతి మాతకు నాధుడై ఉండడం ఈ దక్షయజ్ఞం పౌరాణిక గాధ మనసులో భక్తిని ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అలాగే దక్షయజ్ఞం గురించి పురాణ ఫలశ్రుతి ఉంటే, ఈ పౌరాణిక ద్వారా సాక్ష్యాత్తు త్రిమూర్తుల అండ ఉన్నా అహంకరిస్తే ఏస్థితికి ఎటువంటి వారైనా ఎలా పతనం చెందుతారో తెలియబడుతుంది. అటువంటి దక్షయజ్ఞం దైవ చరితను వెండితెరకు ఎక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన వారు కడారు నాగభూషణం, కన్నాంబ. భక్తీ, మనోబలాన్ని, పుణ్యాన్ని పెంచే దైవగాధ తెలుగు తెరపై ప్రేక్షకులకు చిరపరిచయమే.

త్రిమూర్తుల అనుగ్రహం కలిగిన దక్షుడు శాపానుగ్రహాలు ఇవ్వడం

భూలోకమున ప్రాజాపత్యం పెరగడానికి బ్రహ్మ సృష్టించిన ప్రజాపతులలో దక్షుడు ప్రధానంగా ప్రఖ్యాతి గడించి, గర్వంతో అందరికి శాపానుగ్రహాలు ఇట్టే ఇచ్చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో తనతో వాదం ఆడినందులకు కన్నా కుమారులకు సైతం పామరులు కమ్మని, తన కుమారులకు సన్యాస బోధ చేసారని ఆరోపిస్తూ నారద మహర్షికి శాపాలు అనుగ్రహిస్తాడు. ఇలా ఉండే దక్షప్రజాపతికి దత్త పుత్రికలు రోహిణి మొదలైన వారితో27మందితో బాటు, తన వరపుత్రిక అయిన సతిదేవి ఉంటారు.. వారిలో రోహిణి చంద్రుడుని వరిస్తే, ఆమె అభీష్టం మేరకు చంద్రుడికి కబురు పెట్టి రోహిణి అభీష్టం గురించి చెబుతాడు, దక్షుడు. అలాగే బ్రహ్మ అజ్ఞామేరకు దత్త పుత్రికలందరికి పతి ఒక్కడే ఉండాలి, కాబట్టి నీకు సమ్మతమైతే నా దత్త పుత్రికలందరిని నీకిచ్చి వివాహం చేస్తానని అంటాడు. అందుకు అంగీకరించిన చంద్రుడితో 27మంది దత్త పుత్రికలకు వివాహం జరిపిస్తారు. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

ఆ వివాహనికి విచ్చేసిన త్రిమూర్తులలో శివుడు దక్షుడు కోరిక మేర అతిథిగా దక్షుని నివాసంలోనే ఉంటాడు. అక్కడ సతిదేవి శివుడికి పరిచర్యలు చేస్తుంది. శివుని కోసమే పుట్టిన అమ్మ, శివుని ఆరాధనలోనే ఉంటుంది. ఇప్పుడు శివుని వివాహమాడ తలుస్తుంది.
చంద్రుడిని పరిణయమాడిన 27మంది దత్త పుత్రికలలో రోహిణి మినహా అందరూ సంతోషంగా ఉండరు. కారణం చంద్రుడు కేవలం రోహిణిని మాత్రమే ఆదరిస్తూ ఆమెతోనే ఉంటాడు. ఈ కారణం గ్రహించిన నారదుని సూచనా మేరకు, మిగిలిన దత్త పుత్రికలు 26గురు తమ తండ్రి దక్షునితో మొరపెట్టుకుంటారు. దక్షుడు చంద్రుడిని పిలిచి, భార్యలందరినీ సమంగా చూడకపోవడం తప్పు అని చెప్పబోతే, చంద్రుడు తన సంసారం గురించి మాట్లాడడం మర్యాద కాదు అని బదులు ఇవ్వడంతో ఆగ్రహించిన దక్షుడు చంద్రుడిని క్షయ వ్యాదిగ్రస్తుడుగా ఉండమని శాపానుగ్రహం ఇస్తాడు.
వెంటనే చంద్రుడు పరమశివుడుతో మొరపెట్టుకుంటే చంద్రుడుని తన సమక్షంలో ఉండమని, అలాగే దక్షుని శాపం కూడా నిష్ప్రయోజనం కాకుండా పదిహేనురోజులు క్షయిస్తూ, పదిహేనురోజు వృద్ది పొందుతూ ఉండమని అనుగ్రహిస్తాడు. అలా పరమేశ్వరుడు అనుగ్రహం వలననే చంద్రుడు అమావాస్య నుండి పెరుగుతూ, పౌర్ణమి నుండి తగ్గుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన దక్షుడు తన మాట మన్నిస్తానని మాట ఇచ్చిన పరమశివుడు, తన శాపానికి మార్పు చేసి చంద్రుడిని అనుగ్రహించడం నచ్చక పరమశివుడిపైన ద్వేషభావం పెంచుకుంటాడు. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

సతీదేవిని వివాహమాడిన పరమశివుడు

అహంకారంతో వరగర్వంతో ఉండే దక్షుడుకి పరమశివుడుపై ఆగ్రహం రావడంతో తన వరపుత్రిక అయిన సతీదేవికి వివాహం చేయదలచి, సతీదేవి ఇష్టాన్ని ప్రక్కన పెట్టి స్వయంవరం ప్రకటిస్తాడు. సతీదేవి స్వయంవరం విషయం నారద మహర్షి ద్వారా తెలుసుకుని పరమశివుడు, సతీదేవి మనోభిష్టం నెరవేర్చాలని పరమశివుడు భావిస్తాడు. స్వయంవరం సభలో సతీదేవి విగ్రహరూపంలో ఉన్న పరమశివుడు పూలమాల వేసి వరిస్తుంది. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై సతీదేవితో అంతర్ధానం అవుతారు.

ఈ సంఘటనతో దక్షుడి అహంకారం పరమశివుడుపై పూర్తీ ద్వేషభావంతో నిండిపోతుంది. ఇక మహర్షులు లోకాల శ్రేయస్సు కోసం తలపెట్టిన యజ్ఞంలోకి అందరితో బాటు దక్షుడిని ఆహ్వానిస్తారు. ఆ యాగానికి విచ్చేసిన దేవతలు త్రిమూర్తులతో సహా అక్కడే ఆసీనులై ఉంటారు. యాగానికి వస్తున్న దక్షుడుని చూసి అందరూ గౌరవంతో లేచి నిలబడితే త్రిమూర్తులు అందరికన్నా పెద్దవారు కాబట్టి ఆసీనులై ఉంటారు. అయితే దక్షుడు పరమశివుడిని చూసి అల్లుడు మామని గౌరవించక పోవడం ఏమిటి అని అంటాడు. అందులకు పరమశివుడు సభలలో బాంధవ్యాలకు తావుండదు. నే త్రిమూర్తులలో ఒక్కరిగా ఇక్కడ ఉన్నాను అంటాడు. అయిన అహంకారి అయిన దక్షుడు పరమశివుడిని దూషిస్తాడు. ఇక సభలో శాపానుగ్రహాలు వస్తాయి.

దక్షప్రజాపతి తలపెట్టిన నిరీశ్వర యాగం

సభలో తనకు పరాభవం జరిగింది, నా అల్లుడు నన్ను గౌరవించలేదు అని భావించిన దక్షుడు, శివుడుపై ఇంకా ద్వేషంతో రగిలిపోతాడు. తత్ఫలితంగా నిరీశ్వర యాగం తలపెడతాడు, అంటే శివుడు లేని యజ్ఞం చేయ నిశ్చయిస్తాడు. వరబలం మెండుగా ఉన్న దక్షుడంటే మహర్షులకు, దేవతలకు హడలు, ఆ భయంతో ఈ నిరీశ్వర యాగానికి వారు దక్షుడితో చేరతారు. బాంధవ్య దృష్టితో చూసి ఆది శక్తిని, శక్తి ఆధారమైన శివాన్ని కాదనడం దక్షుడు అహంకారం ఏ స్థితికి చేర్చిందో ఇక్కడ ప్రస్పుటం అవుతుంది. ఆది దంపతులని ద్వేషించడంలోనే దక్షుడు పతనం చెందాడు, అయితే ఫలితం కనబడే సంఘటన మాత్రం అతడు తలపెట్టిన నిరీశ్వర యాగం స్థలం. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

జగదంబ అయిన సతీదేవి తనతండ్రి తలపెట్టిన యాగం చూడాలని పరమశివుని ప్రార్ధిస్తుంది. అయితే పరమశివుడు సతీదేవితో దక్షుడి ద్వేషభావన గురించి అప్పుడు చెప్పి, సతీదేవిని వెళ్ళవద్దని వారిస్తాడు. పుట్టింటిపై మమకారంతో అందులోను తనతోబుట్టువులు కూడా ఆ యాగానికి వెళ్ళారని తెలియడంతో అమ్మమనసు అమ్మదగ్గరికి వెళ్ళాలనే నిశ్చయించుకోవడంతో పరమశివుడు శివపరివారంతో సతీదేవిని దక్షయజ్ఞానికి పంపిస్తాడు. యాగానికి వచ్చిన సతీదేవిని యాగశాలలో ఎవరు పలకరించారు, తండ్రి ముఖం చాటేస్తాడు. భర్తమాట కాదని వచ్చినందులకు నాకు తగిన శాస్తి జరిగినది, అని తలచిన అమ్మ అగ్నిలో ఆత్మత్యాగం చేస్తుంది.

dakshayajnam telugu full movie

విషయం పరివారం ద్వారా విన్న శివుడు ప్రళయ రుద్రుడై నాట్యం చేసి, తన జటాజుటం నుండి వీరభద్రుడిని సృష్టిచేసి దక్షయజ్ఞం నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. వీరభద్రుడు దక్షయజ్ఞంలో భీబత్సం సృష్టిస్తాడు. దక్షుడి తలతెగి అగ్నికి ఆహుతి అవుతుంది. అయితే మహా ప్రతివ్రత అయిన దక్షుడి భార్య వైరిని ప్రార్ధనతో త్రిమూర్తులు ప్రత్యక్ష్యమై దక్షుడికి మేక తలను పెడతారు. అలాగే దక్షయజ్ఞం నిర్విఘ్నంగా జరిగేల ఆశీర్విదిస్తారు. అయితే జగదంబ మాత్రం దక్షుడి కుమార్తె మరలా పునర్జీవిగా రావడానికి ఇష్టపడని కారణంగా అమ్మ అదృశ్యంగానే ఉంటుంది. దక్షయజ్ఞం చలనచిత్రం ముగుస్తుంది. ఎంతటి శక్తిమంతులైనా సరే ఆహంకరిస్తే, గర్వంతో ఇతరులను నొప్పిస్తే ఎంతటి పరిణామాలు ఉంటాయో, ఎందరి జీవితాలు తలక్రిందులు అవుతాయో ఈ దక్షయజ్ఞం చిత్రం ద్వారా కనబడుతుంది. దక్షుడి అహంకారం సాక్ష్యాత్తు పరమశివుడు భార్య జగదంబ జీవితాన్నే మార్చేసింది. అలాగే అల్లుడు చంద్రుడు జీవితంపై తీవ్రప్రభావం చూపించింది. దక్షుడితో బంధుత్వం ఏర్పడిన కారణంగా పరమశివుడే నిందింపబడ్డాడు. ఇలా అహంకారి దక్షుడితో సంభందం కలిగిన అందరూ ప్రభావితులైనారు. అయితే దేవతా శక్తికి ప్రకృతి మార్పులతో మొదలువుతుంది కాబట్టి అవన్నీ లోకకళ్యాణం కోసం ఉపయోగపడ్డాయి. “దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?