Category Archives: Manchi Telugu Pouranika cinemalu

Manchi Telugu Pouranika cinemalu వినాయక విజయం తెలుగు భక్తి మూవీ తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి స్థాయిలో తెలుగు మూవీ? శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా

తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్

తెలుగులో ఆనాటి మేటి మూవీస్ చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితే, మరల మరలా చూడాలనిపించే మూవీ సూపర్ డూపర్ హిట్.

సినిమా చూడంగానే ఆలోచనను రేకిత్తేంచే మూవీ సందేశంతో కూడిన మూవీ. సమాజంలో ఉండే సమస్యలను అంతర్లీనంగా తెలియజేస్తూ ఉంటాయి.

తెలుగు మూవీ అయితే ఆనందం అందిస్తాయి లేకపోతే ఆలోచింపజేస్తాయి. ప్రధానంగా మూవీ మనసును రంజింప చేయడానికే ఉంటుంది. అలా మనసును రంజింపజేస్తూ సామాజిక సందేశం కానీ వ్యక్తిగత సందేశం కానీ అంతర్లీనంగా అందిస్తాయి. లేదా ముగింపు సందేశంతో ముగుస్తుంది.

కేవలం సందేశాత్మకంగా సాగే సినిమాలు తక్కువగా ఉంటే, ఎక్కువ వినోదం అందిస్తూ ఉండేవి ఎక్కువగా ఉంటాయి. యాక్షన్, డ్రామా, సెంటిమెంట్, లవ్, ఫిక్షన్, డాన్స్ వంటి విషయాలు కలిసి, మనిషి మనసు ఆకట్టుకోవడానికి మూవీ ట్రై చేస్తుంది. మూవీ మనసును రంజింప చేయడం ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది.

విజయవంతమైన తెలుగు మూవీ నీ మనసు నాకు తెలుసు అన్నట్టు మన మనసులో కదలికలకు తగ్గట్టుగా స్క్రీనుపై పాత్రలు కదిలిస్తుంది.
చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితేతెలుగులో ఆనాటి మేటి మూవీస్

అన్ని రకాల ఎమోషన్స్ కలిగిన తెలుగు మూవీ చూసి చూడంగానే నచ్చేస్తుంది. తిరిగి మరలా చూడాలనిపించే విధంగా మన మనసుపై ముద్ర వేస్తుంది. అటువంటి మూవీ మరల మరలా చూడడం అంటే, అది సూపర్ హిట్టే అవుతుంది.

మామగారు, అబ్బాయిగారు, అల్లుడుగారు, ఖైదీ, పెదరాయుడు, సమరసింహారెడ్డి, పోకిరి, బాహుబలి ఇలా కుటుంబ కధతో బాటు వ్యవస్థలోని ఊహాశక్తికి దగ్గరగా ఉండే అంశంతో తెలుగు మూవీ మనల్ని ఆకట్టుకుంటుంది.

సమాజంలో ఒకరికి అన్యాయం జరిగిందనే విషయం ఒక న్యూస్ మారి ఉంటుంది. ఏదో కుటుంబంలోని పెద్దాయన యొక్క కర్తవ్యతా నిష్ట కొందరి మనసులలో చేరి ఉండవచ్చును. సామాజిక పరిస్థితులలో నేరప్రవృత్తులపై వచ్చే కధనాలు, సమాజంలో మంచివారి హృదయాలలో భావనలు పెంచవచ్చును. కల్పనలో ఒక హీరోని సృష్టించే స్థితిలో కొందరు ఆలోచన చేయవచ్చును.

ఎక్కువమంది మనసును రంజింపచేసే సాధనములలో సినిమా ఒక సాధనంగా ఉంది.

అటువంటి తెలుగు మూవీలలో చూసి చూడంగానే నచ్చేసే తెలుగు సినిమాలు కొన్నింటిని ఈ పోస్టులో చూద్దాం.

అయితే అలాంటి సినిమాలలో చూసే పాత, కొత్త తెలుగు మూవీలను ఇందులో చూద్దాం.

భక్తిప్రహ్లాద తెలుగులో ఆనాటి మేటి మూవీస్

మనస్థితికి ఇప్పుడు కాకపోతే మరెప్పుడో చేసుకున్న మన కర్మే కారణం కాగలదని నమ్మేవారికి ఈ భక్తప్రహ్లాదలో సమాధానం లభిస్తుంది. శ్రీమహావిష్ణువు నిలయం వైకుంఠం. అక్కడ ఉండే ద్వారపాలకులు, ఋషులను అడ్డుకుంటారు. ఆ తప్పుకు శిక్షగా శాపం పొందుతారు. ఉదారుడైన శ్రీమహావిష్ణువు వారికి వెసులుబాటు తెలియజేస్తాడు. అదేమిటంటే….

నాభక్తులుగా ఏడు జన్మలు పొందుతారా? లేక నాకు శత్రువులుగా మూడు జన్మలు పొందుతారా? అనే విషయం తేల్చుకుని చెప్పమంటాడు. అందుకు ఆ ద్వారపాలకులు భక్తులుగా ఏడు జన్మలకాలం వైకుంఠం వదిలి ఉండలేం. శత్రువులుగా మూడు జన్మలకాలం దూరమై, మరలా వైకుంఠం వచ్చేవిధంగా అనుగ్రహించమని శ్రీమహావిష్ణువుని కోరతారు.

స్థితికారుడు వారి కోరికను మన్నిస్తాడు. అలా పూర్వజన్మలో చేసిన పాపఫలం అనుభవించడానికి పుట్టిన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు పుడతారు. అయితే ఒకరు శ్రీమహావిష్ణువు చేతిలో మరణించి కొంతపాప పరిహారం పొందుతాడు. రెండవవాడు తన అన్న మరణానికి శ్రీమహావిష్ణువు కారణం అని తలుస్తాడు. తన స్థితికి కారణం స్థితికారుడు అనిభావించిన హిరణ్యకశిపుడు, స్థితికర్తపై కక్షను పెంచుకుంటాడు.

ఆ కక్షతోనే తపస్సుచేసి వరాలు పొందుతాడు. శ్రీహరి భక్తులను వేదిస్తాడు. అంత శ్రీహరి ద్వేషి అయిన అతనికి పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు నిత్య శ్రీహరినామస్మరణ చేస్తూ ఉంటాడు. లోకంలో అందరినీ కట్టడి చేయగలిగాను అనుకునే అసురుడికి కొడుకే కొరకరాని కొయ్యగా మారతాడు. విరోధిగా భావించే శ్రీహరినామస్మరణ, శ్రీహరిధ్యానం అసురుడు అయిన హిరణ్యకశిపుడుకి తలనొప్పిగా మారుతుంది. ఆ తలనొప్పే, తన చావుకు కారణం అవుతుంది.

అసురునింట పుట్టినా అద్భుతమైన గుణములతో ప్రకాశించిన ప్రహ్లాదుడి చరిత్రను చదివితీరాలని పెద్దలంటారు. అటువంటి తెలుగు భాగవతగాధ తెలుగు మూవీగా భక్తప్రహ్లాద పేరుతో ఉంది. ఇది యూట్యూబ్ లో పుల్ లెంగ్త్ మూవీగా అందుబాటులో ఉంది.

భక్తిప్రహ్లాద చూసి చూడంగానే నచ్చేసే తెలుగు మూవీ

మాయాబజార్ పెద్దమాయగాడు మామ అయితే, చిన్నమాయగాడు అల్లుడు.

తెలుగులో అనేక మూవీలు వస్తూ ఉన్న నాటి మాయాబజార్ మూవీ మరలా విడుదల అయితే అదే ముందుంటుందని నిరూపించిన తెలుగు ఓల్డ్ మూవీ మాయాబజార్. అలనాటి మాయాబజార్ పెద్దమాయగాడు మామ అయితే, చిన్నమాయగాడు అల్లుడు.

పెద్దమాయగాడు కృష్ణుడుగా ఎన్టీరామారావు నటిస్తే, చిన్నమాయగాడుగా ఎస్వీరంగారావు మరిపించారు. సావిత్రి కృష్ణుడి అన్నగారి కూతురు శశిరేఖగా నటిస్తే, అమె మనసును మాయచేసినవాడిగా అక్కినేని అభిమన్యుడుగా నటించారు. ఇలా మాయాబజార్ తెరపై మన మనసును కట్టిపడేస్తుంది.

శశిరేఖా పరిణయం తెలుగువారికి తెలిసిన భారత కధే. అయితే ఈ మాయాబజారు తెలుగు మూవీలో పాండవుల ప్రస్తావనే కానీ పాండవుల పాత్రలు సినిమాలో కనబడవు. వారి బిడ్డ అభిమన్యుడు, కృష్ణుడింట సాగించే ప్రేమకధే ఈ మాయాబజార్ సినిమా కధ.

శశిరేఖ – అభిమన్యుల పరిణయానికి సహకరించే పనిలో ఘటోత్కచుడి మాయావిలాసం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రాయలేం కాబట్టి సినిమా చూసి ఆనందించడమే మేలు.

అలనాటి మేటి తెలుగు మూవీలలో సత్యహరిశ్చంద్ర మూవీ ఒక్కటి.

ఈ రోజులలో సత్యానికి పర్యాయపదంగా వాడేంతలగా ప్రసిద్ది పొందిన పేరు సత్యహరిశ్చంద్ర. అబద్దాలాడేవారి గురించి వ్యంగ్య భావనతో మాట్లాడేవారు ”అబ్బో దిగొచ్చాడండీ పెద్ద సత్యహరిశ్చంద్ర” అని సంభోదిస్తూ ఉంటారు. నిత్యం సత్యం చెప్పినవారెవరూ అంటే, సత్యహరిశ్చంద్ర… సత్యహరిశ్చంద్ర….సత్యహరిశ్చంద్ర…

అటువంటి సత్యహరిశ్చంద్రుని జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని పెద్దలంటారు. పురాణాలలో పురాణ పురుషుల చరితములు సినిమాలుగా మార్చి ఇచ్చిన తెలుగు దర్శకులకు కృతజ్ఙతలు చెప్పుకోవాలి. పురాణాలలో వశిష్ఠుడి చేత కీర్తింపబడిన సత్యహరిశ్చంద్ర, పరమేశ్వరుడ విశ్వామిత్రుని రూపంలో పెట్టి అన్ని పరీక్షలలోనూ నెగ్గుతాడు.

సత్యహరిశ్చంద్ర తెలుగు మూవీ గురించి పూర్తిగా రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.

భట్టీ విక్రమార్క అలనాటి తెలుగు మూవీ…

రాజ్యాన్ని పరిపాలన చేసే రాజులు, దైవానుగ్రహం పొంది, ప్రజలను పరిపాలించేవారు. అంతటి రాజులు, దైవం దగ్గరకు పడే పాట్లు వ్యక్తిగత జీవితంలో మార్పులు తెస్తాయి. దైవానుగ్రహం సాధించడానికి శక్తిని, యుక్తిని కలిగిస్తుంది. కానీ ప్రయత్నం సాధకుడే చేయాలి.

అలాంటి సాధకుడికి కాలంలో కలిగే కష్టాలకు ఓర్చగలిగే శక్తి ఉంటుంది. దైవానుగ్రహం వలననే సాధించగలిగే శక్తి ఉన్నా, కాలం పెట్టే పరీక్షలో ఆ శక్తి వలన ప్రయోజనం కన్నా నిరీక్షణ వలన ప్రయోజనం ఉంటుంది. తదుపరి శక్తి వలన ప్రయోజనం పొందగలుగుతారు.

అలా సాక్షాత్తు పరదేవతా అనుగ్రహం పొందిన భట్టీవిక్రమార్కులు అజేయులుగా ఉంటారు. విక్రమార్కుడు బేతాళుడినే వశపరచుకుంటాడు. పరాక్రమముతోనూ, యుక్తితోనే ఉండే విక్రమార్కుడికి తెలివైన మంత్రిగా భట్టీ అండగా ఉంటాడు.

ఎన్ని ఉన్నా కాలం వలన కలిగే కష్టం మాత్రం మనిషి అనుభవించాల్సిందే. అలా విక్రమార్కుడు వ్యక్తిగతంగా పొందిన కష్టం ఏమిటి? దైవానుగ్రహం చేత విశిష్ట శక్తులు కలిగిన మాంత్రికుడిని ఎలా జయించాడు? సినిమా చూసి తెలుసుకోవాలి.

సాహసం కలిగిన కధలు అందరినీ అలరిస్తే, అప్పట్లో సాహసం రాజుల కధలలో…. భట్టీ విక్రమార్క చూసి చూడంగానే నచ్చేమూవీ…

భట్టీ విక్రమార్క అలనాటి తెలుగు మూవీ… ఇందులో రామారావు, అంజలీదేవి, ఎస్వీరంగారు, కాంతారావు తదితరులు నటించారు.
ఇందులో రామకృష్ణ, ఎస్వీరంగారావు, విజయనిర్మల తదితరులు నటించారు.

రావణాబ్రహ్మ భక్తి, అనురక్తిని చూపే భూకైలాస్ తెలుగు మూవీ

ఎన్టీరామారావుగారు శ్రీరాముడు, కృష్ణుడు అంటూ పురాణ హీరోల పాత్రలతో ప్రేక్షకులను మరిపించారు. అయితే ఆయన పురాణప్రతినాయకుడి పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించారు. సాదారణంగా ప్రజాధరణ పొందని కధానాయకుడు ఏదో ఒకసారి ప్రతినాయకుడి పాత్రలో కనబడతారు. కానీ ఎన్టీరామారావుగారు మాత్రం పలుమార్లు ప్రతినాయకుడి పాత్రలను పోషించారు. రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలలో మెప్పించారు.

అలా ఎన్టీరామారావు గారు రావణాబ్రహ్మగా చేసిన తెలుగు మూవీ భూకైలాస్. రావణుడి తల్లి సముద్రతీరంలో సైకత లింగమును పూజిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు శివార్చన చేస్తూ ఉండగా, సముద్రపు అలలు వచ్చి, సైకత లింగమును కలిపేసుకుంటాయి. వెంటనే గృహమునకు పోయి మదనపడుతున్న తల్లిని చూసి రావణాసుడు, సైకత లింగం కాదు. శివుడి ఆత్మలింగం తీసుకువస్తానని కైలాసం బయలుదేరతాడు.

రావణాసురుడు ఆత్మలింగం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. రావణుడి శివునిని ఆత్మలింగం కోరకుండా, అమ్మవారిని కోరతాడు. శివుడు అనుగ్రహిస్తాడు. అమ్మవారిని వెంటపెట్టుకుని స్వగృహమునకు పోతున్న రావణుడిని నారదుడు కలుస్తాడు. ఆ తర్వాత అమ్మవారిని వెంటపెట్టుకుని రావణుడు మరలా శివుని దగ్గరకు వెళతాడు.

కైలాసంలో శివుని దగ్గర నుండి వెనుతిరిగిన రావణుడు, పాతాళలోకంలో ఉన్న మండోదరిని వివాహమాడతాడు. మండోదరిని వెంటపెట్టుకుని తల్లిని చేరిన రావణుడికి అసలు విషయం బోధపడుతుంది. తను ఆత్మలింగం కోసం కోరకుండా వేరు విషయాలకోసం ప్రాకులాడానని…. వెంటనే మరలా తపస్సు చేసిన రావణుడికి శివుని ఆత్మలింగం చేతిలోకి వస్తుంది.

ఈసారి శివుని ఆత్మలింగమును చేతబట్టి పోతున్న రావణుడికి దారి మద్యలో సంధ్యావందనం చేయవలసిన సమయం ఆసన్నమవుతుంది. ముక్కటి ఆత్మలింగమును నేలపైకి చేర్చరాదు. అందుకని ఓ ఆవులమందని కాసే కుర్రవాని చేతికి శివుని ఆత్మలింగం ఇచ్చి రావణుడు సంధ్యావందనానికి సముద్రపు తీరానికి పోతాడు.

అయితే ఆ బాలకుడు మూడుమార్లు రావణా… అంటూ అరిచి శివుని ఆత్మలింగము నేలపై పెడతాడు. పరుగు పరుగున అక్కడికి వచ్చిన రావణుడు శివలింగమును కదిలిస్తాడు. ప్రకృతి శక్తి ముందు అతని శక్తి పనికిరాదు. శివుని ఆత్మలింగం అక్కడే ప్రతిష్టంపబడుతుంది. రావణబ్రహ్మ భక్తి వలన గోకర్ణ క్షేత్రం అలా ఏర్పడిందని అంటారు.

రావణాబ్రహ్మ భక్తి, అనురక్తిని చూపే భూకైలాస్ తెలుగు మూవీ

దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు కర్ణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా నటించిన తెలుగు మూవీ

దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు త్రిపాత్రాభినయం చేసిన సినిమా. ఇది మహాభారతంలోని కర్ణుడి పాత్రను ప్రధానంగా చూపుతుంది. దానంలో కర్ణుడు గొప్పవాడుగా చెప్పబడతాడు. అటువంటి కర్ణుడి పాత్రతో పాటు, కృష్ణుడు, ధుర్యోధనుడి పాత్రలలో ఎన్టీరామారావు నటించారు.

కర్ణుడి వంటి పుట్టుకను సమాజం ప్రశ్నిస్తూనే ఉంటుంది. సమాజం చిన్నచూపు చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ విధానం పద్దతికి విరుద్దంగా ఉంటుంది, కాబట్టి. కుంతికి వివాహం కాకముందే, ఋషి మంత్రం వలన సూర్యానుగ్రహం వలన కర్ణుడు పుడతాడు. అలా పుట్టిన కర్ణుడిని కుంతి ఒక పెట్టెలో పెట్టి నీటిలో వదిలేస్తుంది.

మయసభలో దుర్యోధనుడు పరాభవం పొందడం. పరాభవం పొందిన దర్యోధనుడు శకుని సాయంతో పాండవులను ఓడించడం. పాండవులు వనవాసం చేయడం. పాండవవనవాసం తర్వాత శ్రీకృష్ణరాయభారం. తర్వాత కురుక్షేత్ర యుద్ధమునకు కురుపాండవులు సిద్దపడడం… కధ క్లైమాక్స్ కు చేరుతుంది.

ఆ తరువాత కర్ణుడు సూతుల ఇంట పెరిగి విలుకాడు అవుతాడు. అర్జునుడంతటివాడు కర్ణుడు అంటారు. కానీ అనుగ్రహం అర్జునుడికే ఉంటుంది. కురుసభలో విలువిద్య ప్రదర్శనలో పాల్గొనడానికి ప్రయత్నించిన కర్ణుడికి, దుర్యోధనుడు సాయపడతాడు. అలా వారిద్దరి మద్య స్నేహం ఏర్పడుతుంది.

కుంతి కర్ణుడిని కలుస్తుంది. కర్ణుడు కుంతితో అయిదుగురితో కూడిన పాండవులు నీకు ఉంటారని, అందులో అయితే అర్జునుడు లేకపోతే కర్ణుడు ఇద్దరిలో ఒక్కరే ఉంటారని అంటాడు. చివరికి అర్జునుడితో కూడిన పాండవులే కుంతికి ఉంటారు. ఈ కధ అందరికే తెలిసిందే, కానీ ఎన్టీరామారావుగారి నటన ఆసక్తిగా ఉంటుంది. దానవీరశూరకర్ణ చూసి చూడంగానే నచ్చేమూవీ….

దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు కర్ణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా నటించిన తెలుగు మూవీ

శ్రీరామ కధా గానం లవకుశ తెలుగు మూవీ

లవకుశ శ్రీరామనామము రామ నామము రామ నామము అంటూ రామనామసంకీర్తన చేస్తూ రామకధను చెప్పడం రాముని తనయుల నుండే మరలా ప్రారంభం అయ్యింది… కుశలవులు శ్రీరాముని తనయులు కానీ రాముడిని కలవడం మాత్రం శ్రీరాముని దివ్వగానం ప్రారంభించాకే…

ధర్మము మానవరూపంలో తిరిగితే అది శ్రీరాముడు అంటే, అటువంటి రాముని కుమారులు అయిన కుశలవులకు, ఆ ధర్మమూర్తి గురించి తెలుసుకుని గానం చేశాకే శ్రీరామదర్శనం అయింది. శ్రీరామనామము అంతటి శక్తివంతమని చెబుతారు. శ్రీరాముడు ధర్మము కోసం రాజ్యం విడిచాడు. అదే రాజధర్మం కోసం భార్యను దూరం చేసుకున్నాడు.

ప్రజలకు మార్గదర్శకంగా ఉండే రాజు, ప్రజల దగ్గర చులకన కాకుడదు. అలా చులకన అయ్యే పరిస్థితులు ఉంటే, ఆ పరిస్థితులలో రాజ్యం విడవడం లేక అందుకు కారణం అయ్యినవారిని విడిచిపెట్టడం చేయాలంటారు.

రావణాసురుడు అపహరించిన సీతమ్మను చేపట్టడం ఏమిటి? అని ఒక చాకలివాడు అన్నమాటను శ్రీరాముడు వింటాడు. వెంటనే శ్రీరాముడు తన ప్రాణానికి ప్రాణమైన సీతను వదులుకోలేకా, రాజ్యాన్ని ఎవరోఒకరు తీసుకోవాల్సిందిగా తన తమ్ములను కోరతాడు. అందుకు సోదరులు ఎవరూ అంగీకరించరు. చేసేదిలేక సీతను అడవులలో విడిచిరమ్మని లక్ష్మణుడిని రాముడు ఆజ్ఙాపిస్తాడు.

లక్ష్మణుడు సీతమ్మను అడవిలో వదిలేసి వెళతాడు. సీతమ్మను వాల్మీకి మహర్షి, తన ఆశ్రమమునకు తీసుకువెళతాడు. లోకపావనీ దేవిగా సీతమ్మ అక్కడ పిలవబడుతుంది. సీతమ్మకు కుశ,లవులు జన్మిస్తారు. వారు వాల్మీకి మహర్షి వద్ద శ్రీరామాయణం తెలుసుకుంటారు. గానంచేస్తారు. అలా వారు అయోధ్యలో కూడా రామకధను గానం చేస్తారు.

శ్రీరాముడు తలపెట్టిన అశ్వమేధ యాగంలో అశ్వమును కుశలవులు బంధిస్తారు. తత్ఫలితంగా శ్రీరాముడు వారితో తలపడడం, వారెవరో తెలుసుకోవడం జరుగుతుంది. రామనామ సంకీర్తన ఎక్కువగా వినబడుతుందీ సినిమాలో…. చూసి చూడంగానే నచ్చేమూవీ లవకుశ తెలుగు మూవీ.

శ్రీరామ కధా గానం లవకుశ తెలుగు మూవీ
సుగుణములు కలిగిన సుందరి గుణసుందరి తెలుగు మూవీ.

లోకంలో గుణములే అందములు అయితే, అటువంటి సుగుణముల గలవారిని కాలము పెట్టే పరీక్ష కఠినంగానే ఉంటుంది. పరమేశ్వరుని అనుగ్రహం వలననే సుగుణములు కలుగుతాయి. కానీ అటువంటి సుగుణములు కాలప్రభావం చేత పరీక్షకు గురై, ఎక్కువకాలం కీర్తింపబడతాయి. ఆకోవలోనే అలనాటి పాత తెలుగు సినిమాలు చాలావరకు ఉంటాయి. సుగుణములు కలిగిన సుందరి గుణసుందరి తెలుగు మూవీ.

పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఒకరాజుకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు పెద్దకుమార్తెలకు రాచరికపు మర్యాదలపై ఆసక్తి ఉంటే, చిన్నమ్మాయికి ప్రాతివ్రత్యపు కధలంటే మక్కువ. పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే సతుల కధలంటే ఇష్టం. ఆమె పేరు గుణసుందరి.

ఒకరోజు కొలువుదీరిన మహారాజును, నిండుసభలో అందరూ పొగడ్తలతో ముంచెత్తుతారు. అయితే గుణసుందరి కూడా తండ్రిని గౌరవిస్తుంది, కానీ నాకు కాబోయే భర్తే దైవమంటుంది. రాజుకు కోపం వస్తుంది. ఇంకా పెళ్లైనా కాలేదు…. అప్పుడే ఇలా మాట్లాడుతుందేమిటి? అనుకుంటాడు. అన్ని అంగవైకల్యం ఉన్నవాడిని ఏరికోరి గుణసుందరికిచ్చి వివాహం చేస్తాడు.

రూపం ఎలా ఉన్నా, గుణసుందరిభర్తకు ఏ అంగవైకల్యం లేదనే విషయం బయటపడుతుంది. రాజు ఆశ్చర్యపడతాడు, భవంతిలో మెట్లపైనుండి క్రిందకు జారిపడతాడు. గాయంపాలైన రాజు మంచమెక్కుతాడు. గుణసుందరి తన భర్తతో పాటు బయటకు వెళ్ళిపోతుంది.

పూరిగుడిశెలో ఉంటున్నా, గుణసుందరి భర్తతో హాయిగా కాపురం చేస్తుంది. కానీ రాజుగారి గాయం మానదు. రాజుగారిగాయం నయం కావాలంటే, మహేంద్రమణి కావాలని రాజవైద్యులు చెబుతారు. మహేంద్రమణిని సాధించి, తెచ్చినవారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజు చాటింపువేయిస్తాడు.

రాజుగారి పెద్దల్లుళ్ళు ఇద్దరూ మహేంద్రమణి సాధించడానికి బయలుదేరతాడు. గుణసుందరి తన భర్తయొక్క గాధను, తన భర్తనోటివెంట తెలుసుకుంటుంది. వెంటనే తన తండ్రిని రక్షించవలసినదిగా అతనిని వేడుకుంటుంది. రాజుగారి చిన్నల్లుడు కూడా మహేంద్రమణి కోసం బయలుదేరతాడు.

రాజుగారి ముగ్గురల్లుళ్ళు మార్గమద్యంలో కలుసుకుంటారు. మహేంద్రమణిని సాధించడంలో యక్షకన్యలు పెట్టే పరీక్షలలో ఇద్దరూ ఫెయిల్ అవుతూ ఉంటారు. మూడోవాడు యక్షకన్యలను మెప్పిస్తాడు. అలా మూడోవాడు సాధించిన మహేంద్రమణిని, అతనిని మోసం చేసి, పెద్దవారిద్దరూ తస్కరిస్తారు.

మహేంద్రమణితో రాజుగారి దగ్గరకు వెళతారు. అయితే మంత్రంతో పనిచేసే మహేంద్రమణి పనిచేయదు. ఎందుకంటే వారు ఆ మంత్రం మరిచిపోతారు. పూర్వగాధలోని ఋషి శాపంచేత, బల్లూకముగా మారి గుణసుందరి భర్త స్వగృహమును చేరతాడు.

తీసుకురాబడిన మహేంద్రమణి పనిచేయాలంటే మంత్రం కావాలి. మంత్రం తెలిసినవ్యక్తి ఎలుగుబంటిగా మారాడు. ఎలుగుబంటిగా మారిని భర్తతో గుణసుందరి తన గుడిశెలోనే పరమేశ్వరుడిని ప్రార్ధిస్తుంది. చివరికి పార్వతీ, పరమేశ్వరులు ఎలుగుబంటితో సహా రాజమందిరం చేరి, అక్కడ నిజనిర్ధారణ చేయిస్తారు.

చివరికి రాజుగారిగాయం నయం అవుతుంది. గుణసుందరిభర్తకు శాపవిమోచనం కలుగుతుంది. తెలుగులో ఆనాటి మేటి మూవీస్ లో గుణసుందరి తెలుగు మూవీ.

తెలుగు మూవీస్ తెలుగురీడ్స్

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ కి ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది.

కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, కృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”.

దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు వరాలు కోరుతాడు. పరమశివుడు నీ తల్లి తప్ప నిన్ను ఎవరూ వధించలేరని చెప్పి అంతర్ధానం అవుతాడు.

కన్నతల్లి కొడుకుపై కత్తి దూయటం అసాద్యం కాబట్టి, తనకు మరణం లేదని భావించిన నరకుడు, తన బలంతో రెచ్చిపోతాడు. దేవేంద్రుని పదవిని ఆక్రమిస్తాడు. ఇంకా దేవమాత అయిన అదితి దగ్గర నుండి చెవి కుండళాలు చేజిక్కుంచుకుంటాడు. సాధుజనులను భాదిస్తూ, తాను ఆనందిస్తూ ఉంటాడు. కృష్ణభక్తులను బాధిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రజలకు భూలోకంలోనే నరకలోకయాతనలను చూపిస్తాడు.

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

ద్వారకలో శ్రీకృష్ణు(ఎన్టీ.రామారావు)ని ఆశ్రయంలో ఉన్న నాగదత్తుడి(గుమ్మడి) కూతురు అయిన వసుమతి(ఎస్.వరలక్ష్మి)ని నరకుడు వంచించి తన భార్యగా చేసుకుంటాడు. నారదుడు(కాంతారావు) వలన నరకుడి వంచన సత్యభామ(సావిత్రి), శ్రీకృష్ణులకు తెలుస్తుంది. నరకుడిని భర్తగా అంగీకరించిన వసుమతిని, నాగదత్తుడు నరకుని వధించమని చెబుతాడు. దానికి వసుమతి భర్తే నాదైవమని, నేను నా భర్తను చంపలేనని తేల్చి చెప్పడంతో నాగదత్తుడు నిష్ర్కమిస్తాడు. కానీ తానే నరకుని చంపబోయి, నరకునికి చిక్కి చెరసాల పాలవుతాడు. దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ.

అజేయ బలపరాక్రమాలు కలిగిన నరకుడు తన బలగంతో సాధువులను యజ్ఙయాగాదులలోని అవిస్సులను నరకుడికే అర్పించాలంటూ, వారిని హింసిస్తూ ఉంటాడు. నరకుడి చావు తన చేతిలో లేకపోవడంతో శ్రీకృష్ణుడు నారదునితో నరకునికి హితవు చెప్పిస్తాడు. నారదుని హితవుని నరకుడు లెక్కపెట్టడు. ఇంకా రెచ్చిపోయి సాధు జనులను హింసించడం పెంచుతాడు, వారు చేస్తున్న యజ్ఙయాగాదులను ద్వంసం చేయిస్తూ ఉంటాడు.

నారదుడి సలహామేరకు వసుమతి తన కొడుకుని, చెరసాలలో ఉన్న తన తండ్రి నాగదత్తుడి దగ్గరకు తీసుకువెళుతంది. ఈ విషయం గమనించిన నరకుడు తన కొడుకుని వసుమతి దగ్గర నుండి తీసుకుని, వసుమతిని కూడా చెరసాలలో పెడతాడు. ఇంకా నరకుడు శ్రీకృష్ణుని వేషంలో వచ్చి లోకంలో ఉన్న పడచులను అపహరించుకుపోతాడు. ఈ విషయం సత్యభామకు తెలిసి, శ్రీకృష్ణుని నిలదీస్తుంది. కానీ కృష్ణుని మాటలచేత ఆపని కృష్ణుడు చేయలేదని గ్రహిస్తుంది. అయితే ఆపని నరకుడే చేసాడని, నారదునిచేత తెలుసుకున్న సత్యభామ, ఆ నరకుడిని అంతం చేస్తానని నారదుడుకి మాట ఇస్తుంది.

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

నరకుడు నాగదత్తుడి కనుగుడ్లు పీకించేస్తాడు. సాధుజనులను హింసించడం కొనసాగిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ సభకు నాగదత్తుడు, అదితి కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో నరకుని ఆకృత్యాలను మొరపెట్టుకుంటారు. దానితో శ్రీకృష్ణపరమాత్మ, సత్యభామతో కలిసి నరకునితో యుద్ధానికి వెళతాడు. భూదేవి పుత్రుడైన నరకుడు, భూదేవి అవతారం అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరక బాధలనుండి విముక్తి పొందిన ప్రజలు దీపాలు వెలిగించి, దీపావళి పండుగ చేసుకుంటారు.

సాక్షాత్తు భూదేవి బిడ్డడు, పరమశివుని వరాలు కానీ వ్యగ్రతతో పీడిత బుద్దితో ప్రజలను నరకయాతన పెట్టిన ఘనుడు నరకుడు. అందుకే భగవానుడు కన్నతల్లి చేతుతోనే మరణించేలా చేస్తాడు. లోకపీడితంగా మారితే, ప్రకృతిలోని మాతృస్వభావం చూస్తూ ఊరుకోదు. అలాగే నరకుని ఆకృత్యాలు విన్న సత్యభామ అతనిపై యుద్ధం చేస్తుంది. లోకాన్ని రక్షిస్తుంది. అలనాటి పాత సినిమాలలో ఈ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ పౌరాణిక సినిమా…

దీపావళి సినిమా చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది.

అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా. రేవతి-బలరాముల ఆడబిడ్డ శశిరేఖని, సుభద్ర-అర్జునుల మగబిడ్డ అభిమన్యునికి ఇచ్చి వివాహాం చేయాలని, వారి బాల్యంలోనే పెద్దలు మాటలు ఇచ్చిపుచ్చుకుంటారు. అటుపై సుభద్ర అభిమన్యుని తీసుకుని తన మెట్టింటికి బయలుదేరుతుంది.

శ్రీకృష్ణుడు పాండవులు రాజసూయ యాగం నుండి ద్వారకకు తిరిగి వస్తూ, ధర్మరాజు ఇచ్చిన బహుమతులను తీసుకుని వస్తాడు. వాటిని బలరాముడికి, శశిరేఖకు బహూకరిస్తాడు. బలరామునికి ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”దానిపై నిలబడిన ఎవరైనా సరే, వారి మనసులోని కుఠిలం స్వయంగా వెల్లడి చేసేస్తారు.” ఇంకా శశిరేఖకు ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”ఆ పెట్టెని తెరిచి చూస్తే మనసులో ఏది ఎక్కువ ఇష్టంగా ఉంటే ఆ వస్తువు కానీ లేక ఆ వ్యక్తికాని కనబడతారు” దానిని తెరిచి చూసిన శశిరేఖకు తన బావ అభిమన్యుడు కనబడతాడు.

నిండు సభలో ద్రౌపదికి అవమానం

శ్రీకృష్ణుడు వేరొక చోట ఉండగానే, పాండవులకు జగిరిన అన్యాయం తెలుసుకుంటాడు. అప్పుడు నిండుసభలో ద్రౌపదిపై జరిగిన ఆకృత్యం కూడా స్వామికి తెలయబడడం, ఆమెకు శ్రీకృష్ణ భగవానుడు తనమహిమచేత నిరంతర వస్త్రం ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు పరధ్యానంలోకి వెళ్లడం గమనించిన బలరాముడు, శ్రీకృష్ణుడిని ఏమయ్యిందని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు, తనవారితో పాండవులకు జరిగిన అన్యాయం గురించి, కౌరవులు వడిగట్టిన దారుణాలను వివరిస్తాడు. వెంటనే బలరాముడు ”నేను ధర్యోధనుడిని హెచ్చరించి, పాండవులు రాజ్యాన్ని పాండవులకు తిరిగి వచ్చేలా చేస్తానని” ద్వారక నుండి హస్తినాపురానికి బయలుదేరతాడు.

హస్తినాపురంలో ధర్యోధనుడుకి బలరాముడు వస్తున్నాడనే సమాచారంతో దిగులు చెందుతుంటే, అతని మేనమామ శకుని ”ఎందుకు..దిగులు, బలరాముడుని స్థుతి చేయడం ద్వారా అతనిని ఇట్టే ప్రసన్నం చేసుకోవచ్చును, కావునా బలరాముడికి బ్రహ్మరధం పట్టేవిధంగా ” ఆహ్వానం పలకమని చెబుతూ ఇంకా ”మన లక్ష్మణ కుమారునికి, బలరాముని కూతురు శశిరేఖను ఇచ్చ వివాహం చేయమని అడుగు, ఈ వివాహం జరిగితే భవిష్యత్తులో యాదవ వంశంవారు అంతా మనవైపే ఉండవలసి ఉంటుంది” అని బోధ చేస్తాడు. శకుని సలహాతో ధర్యోధనాధులు సంతోషిస్తారు. మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ.

బలరామునికి ధర్యోధనుడు సకల మర్యాదలు చేసి, ఆసనం వేసి పాదసేవ చేస్తూ ఉంటు అన్ని విషయాలు తమకు అనకూలంగా ఏకరువు పెడతారు. పాండవులు తప్పు చేసినట్టుగా, పాండవులపై ఆరోపణలు చేస్తూ బలరాముడికి ధుర్యోధనాదులు మాటలు ఎక్కిస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణ కుమారుడుకు, శశిరేఖను ఇచ్చి వివాహం చేయవలసినదిగా వరం కోరతాడు, ధర్యోధనుడు. అప్పటికే ధర్యోధనుడు కపట మర్యాదలకు సంతోషించిన బలరాముడు, ధర్యోధనుడు కోరికకు అంగీకారం తెలుపుతాడు. అక్కడి నుండి బలరాముడు, ధర్యోధనుడు ఇచ్చిన అనేక కానుకలను స్వీకరించి తిరిగి ద్వారకకు వస్తాడు.

పాండవులు వనవసానికి వెళ్ళే పమయం

పాండవుల వనవాసానికి వెళ్లే సమయంలో సుభద్ర తన వీరకుమారుడు అభిమన్యునితో కలసి, శ్రీకృష్ణుడి నివాసానికి చేరుతుంది. అయితే ధర్యోధనుడికి ఇచ్చన మాటకు లోబడిన, రేవతి-బలరాములు శశిరేఖను, అభిమన్యునితో కలవకుండా కట్టడి చేస్తారు. శశిరేఖా-లక్ష్మణ కుమారుల వివాహం నిశ్చయం చేస్తారు. సుభద్ర బలరాముడిని తనకు ఇచ్చిన మాట గురించి అడిగినా, రేవతి, బలరాముల మనసు మారదు. దాంతో సుభద్ర అభిమన్యుని తీసుకుని, పాండవుల దగ్గరకు బయలుదేరుతుంది.

అయితే అడవిలో భీమసేనుడి కుమారుడు అయిన ఘటోత్కచుడు ఉన్న చోటికే అభిమన్యుడు చేరుకుంటుండగా, ఘటోత్కచుడు-అభిమన్యుడికి యుద్దం జరుగుతుంది. చివరికి సుభద్ర ప్రతిజ్ఙ చేయబోతూ తనవారి పేరు చెప్పడంతో…వెంటనే ఘటోత్కచుడు సుభద్ర కాళ్లపై పడి శరణు వేడుకుంటాడు. తను ఎవరో చెబతాడు. సుభద్ర, అభిమన్యులు ఘటోత్కచుని ఆహ్వానం మేరకు, వారి నివాసానికి చేరతారు. శశిరేఖా పరిణయం గురించి వివరం తెలుసుకున్న ఘటోత్కచుడు, ద్వారకలో శ్రీకృష్ణుడిని కలుసుకుంటాడు. అక్కడి ఇరువురి మాయా పధకంలో భాగంగా అసలు శశిరేఖని అభిమన్యుని దగ్గరకు చేర్చి, ఘటోత్కచుడు శశిరేఖ వేషంలో లక్ష్మణ కుమారునితో వివాహ ప్రక్రియలో పాల్గొంటాడు. ఇక అక్కడి సినిమాలో తిరిగే మలుపులు మనసుని మరింత రంజింప చేస్తాయి. శ్రీకృష్ణుడి పర్యవేక్షణలో ఘటోత్కచుని మాయాప్రభంజనం ధుర్యోధనాదులను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందీ…వివరణ కన్నా వీక్షణ బాగుంటుంది. మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి స్థాయిలో తెలుగు మూవీ?

ఎప్పుడైనా చారిత్రాత్మకమైన పుస్తకాలు చదివితే, ఒక రాజు గురించి చెప్పేటప్పుడు, అతను ”ఆ దేశానికి రాజు, ఈ దేశానికి రాజు” అంటూ ఎందరో రాజుల గురించి చరిత్రలో చదువుకుంటాం.

కానీ ధర్మానికి రాజుగా మాత్రం ధర్మరాజునే ప్రవచనకారులు చెబుతారు. ధర్మాన్ని అంతలా ఆచరించిన మహానుభావుడుగా ద్వాపరయుగంలో కీర్తింపబడిన ధర్మరాజు గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం.

మన భారతంలోని ధర్మరాజు మాటకు విజయుడుగా కీర్తి పొందిన అర్జునుడు కట్టుబడి ఉంటాడు. భారతంలో అర్జునుడు ధర్మరాజు మాటను అతిక్రమించకుండా నడుచుకున్నాడు. అని పెద్దలు చెబుతూ ఉంటారు.

భీముడు అత్యంత బలశాలి. భారతంలో భీముడు, దర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు వంటి అత్యంత బలమైనవారిని మట్టికరిపించాడు. అలాంటి అతి బలశాలి అయిన భీమసేనుడు కూడా. ధర్మరాజు మాటంటే, ఆమాటకు కట్టుబడి ఉంటాడు.

ఇక నకుల సహదేవులు కూడా చాలా ప్రతిభావంతులు. అత్యంత ఆకర్షణీయమైన రూపం గలవారు. ఈ రోజులలో అదే ప్రధానంగా ఉంది. ద్వాపరయుగంలో అటువంటి అందగాళ్లు అయిన నకుల సహదేవులు కూడా భారతంలోని ధర్మరాజు మాటకు ఎదురుచెప్పరని అంటారు.

ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే? భారతంలో ధర్మరాజు అతని అనుయాయులు వనవాసం చేశారు. అలా పాండవవనవాసం పూర్తయ్యాక, వనవాసం పూర్తి అయ్యిందని అంగీకరించవలసినది దుర్యోధనుడే కదా…

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి స్థాయిలో తెలుగు మూవీ?

దుర్యోధనుడుకు ధర్మరాజు విరోధి. కానీ వనవాసం పూర్తి అయ్యిందనే మాట భారతంలో ధర్మరాజు చెప్పాకా మాత్రమే, దుర్యోధనుడు అంగీకరించాడని పెద్దలు చెబుతారు.

విరాటరాజు తనతోపాటు సమానంగా సింహాసనంపై కూర్చునే అవకాశం ఒక్క ధర్మరాజుగారికే ఇచ్చారని పెద్దలంటారు. ధర్మరాజు ఎక్కడుంటే, అక్కడ పాడిపంటలు పెరుగుతాయని అంటారు.

పాండవులలో భీమార్జునులు, నకుల సహదేవుల మరణిస్తే, తిరిగి వారు పునర్జీవులయ్యింది… ధర్మరాజు గారి ధర్మము వలననే అంటారు.

శ్రీకృష్ణపరమాత్మ పరబ్రహ్మమే అయి ఉన్నాడు. కానీ కృష్ణుడుగా ధర్మరాజుకు నమస్కారం చేస్తాడు. కురుక్షేత్రం యుద్ధంలో పాండవులు గెలిచారు. అలా పాండవులు గెలవడానికి ప్రధాన కారణం ధర్మరాజు ధర్మదీక్ష అని అంటారు.

ఇలా మన భారతంలో ఎవరి శక్తి ఎంతటిది అయినా, ధర్మరాజు ధర్మదీక్ష ప్రధానకారణం అయితే. ధర్మరాజు ధర్మనిరతి చాలా గొప్పగా చెబుతారు.

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి చెప్పే తెలుగు మూవీ?

ఎందుకు ధర్మరాజు గారి గురించి చెప్పాలంటే?

ఎవరైనా మూవీ వాచ్ చేస్తే, అందులో పదే పదే చెప్పబడిన డైలాగ్ ఎక్కువమంది నోట్లో నానుతుంది.

ఏదైనా ఒక మూవీలో పదే పదే వచ్చిన మ్యూజిక్ ఎక్కువమంది నాలుకపై నాట్యం చేస్తుంది.

మరేదైనా తెలుగు మూవీలో బాగా చిత్రికరీంచిన దృశ్యాలు, ఎక్కువమంది మదిలో గూడు కట్టుకుంటుంది.

అలాంటి తెలుగు మూవీ ఏ విషయం హైలెట్ చేస్తే, ఆవిషయం ఎక్కువమంది మనసులో మెదులుతూ ఉంటుంది.

మరి భీమ సేనుడు గురించే బలంగా చూపితే, బలం చాలనుకుంటారు. కర్ణార్జుల గురించే చూపితే, ఏదో ఒక విద్య చాలనుకుంటారు.

మనసును ఆకట్టుకోవడానికి ఏదో బలమైన అంశము ఉండాలి. కానీ ఆ అంశము ధర్మము ప్రధానమని చూపితే, విద్యపై పెరుగుతున్న ఆసక్తి, ధర్మమువైపు కూడా తిరిగి చూస్తుంది.

అందుకే మూవీలలో ధర్మరాజు గారిని కేవలం ఒక పాత్రగా కాకుండా, ప్రధాన పాత్రలను ప్రభావితం చేస్తున్న పాత్రగా తెరపై కదిలితే, అది ఆమూవీకే మెరుగైన మాణిక్యంగా మారుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ గురు స్వరూపంగా దత్తాత్రేయడు. ప్రకృతిధర్మం ఆచరించిన ఋషి దంపతులకు సంతానంగా వచ్చిన పరబ్రహ్మ స్వరూప భక్తిమూవీకధ.

తెలుగు సినిమా నిర్మాణ బ్యానర్: శ్రీదత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్

తెలుగు మూవీ పేరు : శ్రీ దత్త దర్శనము భక్తిమూవీ

నటినటులు: రంగనాథ్, శివకృష్ణ, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, రమణమూర్తి, వీరభద్రరావు, ద్వారకానాథ్, ఆచంట వెంకటరత్నం నాయుడు, మాస్టర్ గురుప్రసాద్, K.R. విజయ, ప్రభ, జయంతి, కాంచన, చలపతిరావు, ఈశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ, శివాజీ, జ్యోతిర్మయి, జయలలిత, జయవాణి, నిర్మల, సిల్క్ స్మిత తదితరులు నటించారు.

తెలుగు పాటలు: వేటూరి

తెలుగు సినిమా పాటలు గానం: SP బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, సుశీల, వాణిజయరాం, మంగళంపల్లి బాలమురళి కృష్ణ.

తెలుగు సినిమా సంగీతం: K.V. మహదేవన్

శ్రీదత్త దర్శణం తెలుగు మూవీ నిర్మాత: K.C. తల్వార్

శ్రీదత్త దర్శణం తెలుగు సినిమా దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ కథ

శ్రీదత్తయంత్ర దర్శనంతో భక్తిమూవీ ప్రారంభం ఉంటుంది. ప్రారంభ సన్నివేశంలో మునిదంపతుల తపోదీక్షకు లోకాలు తల్లడిల్లుతుంటే నారద మహర్షి కంగారుగా నారాయణ మంత్రం జపిస్తూ వైకుంఠము వెళ్ళడం, అక్కడ త్రిమూర్తులు ఒకేచోట నారద మహర్షికి దర్శనం ఇస్తారు. అయితే అలా తపస్సు చేసే మునిదంపతుల పేర్లు అత్రి-అనసూయ వారికోరిక త్రిమూర్తల స్వరూపమే పుత్రసంతానంగా పొందాలని.

నారద సూచన తరువాత త్రిమూర్తులు అత్రిమహర్షి తపస్సు చేసే చోటకి వచ్చి, అత్రిని పిలుస్తారు. అత్రివారిని స్తుతించిన తరువాయి త్రిమూర్తులు అత్రికోరిక తీర్చడం కోసం ముగ్గురు మూర్తులు ఒక బాలమూర్తిగా మారి అత్రికి దర్శనం ఇస్తారు. అయితే అత్రి మహర్షి అంతర్యం గ్రహించిన ఆ బాలమూర్తి కొంతకాలం వేచిచూడండి నేను మీ కడుపునా పుడతాను అని చెప్పి అంతర్ధానం అవుతాడు.

తరువాయి సన్నివేశంలో ప్రతిరోజూ జరిగే సూర్యోదయం ఆరోజు జరగదు, మునులు, సాధువులు, సంసారులు నిత్యకర్మలకు ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు నారదాది మునులు అంతా కలసి అత్రి మహర్షి భార్య అయిన అనసూయ దగ్గరికి వస్తారు. జగమంతా అంధకారం అయ్యింది, ప్రకృతి అల్లాడుతుంది, ఈ ఘోరం నుండి కాపాడేవారు ఎవరూ లేరు తల్లి నీవే దిక్కు అని అంటారు. అప్పుడు అనసూయ ఆలోచన చేస్తుంది, సూర్యుని క్రమాన్నే కట్టడి చేసిన ఆ సాద్వి ఎవరు అని.

సుమతి కధలో అనసూయ మహిమ – త్రిమూర్తలు వరప్రసాదంగా గురుదత్త జననం

అప్పుడే మనకి మహా ప్రతివ్రత అయిన సుమతి కధ ప్రారంభం అవుతుంది, ఈ మూవీలో కుష్టి వ్యాదిగ్రస్తుడైన భర్తకు సుమతి సేవలు చేస్తూ ఉంటుంది. భర్త చీదరించిన, ఆదరించిన భర్తే దైవంగా సేవలు చేస్తూ ఉంటుంది. వ్యాదిగ్రస్తుడైన కౌశికుడు ఒకవేశ్యను చూసి మోహించి, ఆ వేశ్య పొందు కావాలని తన భార్య సుమతితో పట్టుబట్టి చెబుతాడు. ఆ సూర్యాస్తమయం తరువాత తన భర్తను ఒక తట్టలో నెత్తిమీద పెట్టుకుని భర్తను వేశ్యవద్దకు తీసుకుపోవడానికి బయలుదేరుతుంది.

అదే దారిలో ఒకచోట మాండవ్య ముని కొరతవేయబడి ఉండి, మౌనంగా తపస్సు చేస్తూ ఉంటాడు, భర్తను నెత్తిన మోస్తున్న సుమతి అటుగా నడుస్తూ ఉండగా కౌశికుడు కాళ్ళు కదల్చుతూ ఆ మాండవ్యమునిని తన్నడంతో, మునికి భాద ఎక్కువై, ఆ కౌశికుడిని సూర్యాస్తమయం లోపు మరణిస్తాడని శాప వాక్కు ఇస్తాడు. అయితే సుమతి సూర్యోదయం కాకూడదని ప్రకృతిని శాసిస్తుంది, తనప్రాతివత్య శక్తితో.

విషయం గ్రహించిన అనసూయ, నారదాది మునులు సుమతి ఇంటికి వచ్చి, సుమతిని వేడుకుంటారు, సూర్యోదయానికి అనుమతిని ఇమ్మని. సుమతి తనభర్తకు ఉన్న శాపం గురించి అనసూయతో చెబుతుంది. అనసూయ ఆమె భర్త గురించి హామీ ఇవ్వగానే, సుమతి సూర్యోదయానికి అనుమతిస్తుంది, వెంటనే ఆమె భర్త మరణిస్తాడు, వెంటనే సుమతి క్రింద పడిపోతుంది. అప్పుడు అనసూయ మహాసాద్వి ప్రాతివత్య శక్తితో కౌశికుడుని బ్రతికిస్తుంది. దేవతలు సంతషించి అనసూయను మాతా అని సంభోదిస్తారు, త్రిమూర్తులు వచ్చి వరం కోరుకో అంటే, అనసూయ మహాసాద్వి కూడా పుత్రసంతానం అడుగుతుంది. త్రిమూర్తులు తదాస్తు పలికి అంతర్ధానం అవుతారు. అత్రిమహాముని నిశ్చయించిన శుభముహూర్తాన దత్తుడు జన్మిస్తాడు.

ఇంద్రుడికి శ్రీదత్త దర్శనం

త్రిమూర్తుల అంశతో జన్మించిన దత్తాత్రేయుడు సహజంగా జ్ఞానసంపన్నుడుగా ఉంటాడు. ఒకచోట చిన్నపిల్ల చనిపోయి ఏడుస్తున్న తల్లిని చూసి దత్తాత్రేయుడు ఆ పిల్లను పిలిచి బ్రతికిస్తాడు. ఒక చోట ఒక సాధువు తపస్సుకు ప్రయత్నిస్తూ ధ్యానంలో నిమగ్నం కాలేక సతమతం అవుతూ ఉంటాడు, పదేళ్ళ నుండి. అప్పుడు అటుగా వస్తున్న దత్తాత్రేయుడు ఆ సాధువు దగ్గరకొచ్చి విషయం తెలుసుకుని, ఆ సాధువు నుదురుపై ముట్టుకోగానే ఆ సాధువు సమాదిస్థాయిలో ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అలా మహిమలు చూపుతూ శ్రీదత్తాత్రేయుడు తపస్సులోనే పెరుగుతాడు. తపస్సులోనే సమాధి స్థితిని పొంది, బ్రహ్మజ్ఞానిగా నిలబడతాడు.

అత్రి ఆశ్రమంలో అనసూయ పుత్రునిపై ఆలోచనలో ఉండగా దత్తాత్రేయుడు అమ్మా అంటూ వస్తాడు. లోనికి ఆహ్వానించిన అమ్మని సహ్యాద్రి పర్వతాలపై ఉండేందుకు అనుమతి భిక్ష అడుగుతాడు. అంగీకరించని అమ్మకి ఆత్మలేని దేహస్థితిని చూపి, అమ్మ దగ్గర అనుమతిని పొంది, గురుదత్తగా తండ్రిదగ్గర కూడా అనుమతి తీసుకుని సహ్యాద్రి పర్వతాలకు పయనం అవుతాడు, దత్తాత్రేయుడు.

జంబాసురుడు దండయాత్రకు తల్లడిల్లిన ఇంద్రుడు బ్రహ్మలోకం బయలుదేరితే, మధ్యలో నారదుడు ఇంద్రుడిని ఆపి జంబాసురుడిని త్రిమూర్తులు ఏమి చేయలేరు. అటువంటి వరాలు జంబాసురుడికి ఉన్నాయి, నీవు  సహ్యద్రిలో ఉన్న దత్తాత్రేయస్వామిని దర్శించమని సూచిస్తాడు. అయితే దత్తాత్రేయుడు కఠిన పరిక్షలు ఎదుర్కుంటేనే దర్శనం ఇస్తాడు, సులభంగా దత్త దర్శనం కాదు అని సమాచారం ఇస్తాడు.

దత్తాత్రేయస్వామి ఆశ్రమానికి వచ్చిన ఇంద్రుడికి దత్తాత్రేయుడు కొంతమంది మహిళలతో మద్యం సేవిస్తూ కనిపిస్తాడు. కానీ ఇంద్రుడు ఆయనని దత్తాత్రేయుడు అని భావించి, శ్రీదత్తుడి పాదాలు వదలడు. అనఘాదత్తాత్రేయులను స్తుతించి అనుగ్రహం సంపాదిస్తాడు. జంబాసురుడి గురించి వివరించగా, దత్తాత్రేయుడు, నేను సహ్యాద్రి విడిచి రాను అతన్ని ఇక్కడికి తీసుకురా, అంతం చేస్తాను అని చెబుతాడు.

ఇంద్రుడు జంబాసురుడిని సహ్యాద్రి పర్వతలవైపు, శ్రీదత్తుడి ఆశ్రమం దగ్గరికి తీసుకువస్తాడు. సహ్యాద్రికి వచ్చిన జంబాసురుడు అమ్మని అనఘాదేవినే కోరి తన నాశనం తానే కొనితెచ్చుకుంటాడు. అమ్మఅనఘాదేవి జంబాసురుడి తలపై నృత్యం చేయడం, అతను అంతం అవ్వడం జరుగుతుంది. తరువాత దేవేంద్రులకు శ్రీదత్తదర్శన భాగ్యం కలుగుతుంది.

విష్ణుదత్తుడిపై దత్తాత్రేయుల అనుగ్రహం

విష్ణుదత్తుడు ఒక సద్బ్రాహ్మనుడు ఒకరోజు ప్రసాదం చెట్టుకింద పెట్టి లోపాలకి వెళుతుంటే, ఆ చెట్టుపైన ఉన్న రాక్షసుడు విష్ణుదత్తుడిని పిలుస్తాడు. కంగారుపడిన విష్ణుదత్తుడితో నీవు నాకు ఉపకారం చేసావు, నీకు ప్రత్యుపకారం చేస్తాను అని అంటాడు ఆ బ్రహ్మరాక్షసుడు. కానీ నిత్యతృప్తుడైన విష్ణుదత్తుడు తనకి ఏకోరిక లేదని చెబుతాడు, కానీ పట్టువదలని ఆ బ్రహ్మరాక్షసుడిని శ్రీదత్తదర్శనం చేయించమని అడుగుతాడు. బ్రహ్మరాక్షసుడు కంగారుపడతాడు. మేము రాక్షసులం దత్తాత్రేయుడు అంటే మాకు భయం ఇంకేదైనా కోరిక కోరుకో అంటే మాకు ఇంకా ఏ కోరిక లేదని చెబుతారు విష్ణుదత్త దంపతులు. మాట ఇచ్చాను కాబట్టి దూరం నుండి మూడుమార్లు నీకు దత్తాత్రేయులవారిని చూపుతాను కానీ ప్రసన్నం చేసుకోవలసినది మాత్రం నీ భాద్యతే అని చెప్పి శ్రీదత్తదర్శనానికి బయలుదేరతారు.

దత్తాత్రేయ నివాసం దగ్గరికి విష్ణుదత్తుడిని తీసుకువెళతాడు బ్రహ్మరాక్షసుడు, అక్కడ దత్తాత్రేయుడు ఒక త్రాగుబోతుగా ప్రవర్తిస్తూ ఉంటే, విష్ణుదత్తుడు దత్తాత్రేయుడుని సంశయంతో చూస్తాడు. శ్రీదత్త దర్శనం జరగదు. రెండవమరు మళ్ళి బయలుదేరతారు శ్రీదత్త నివాసానికి, కానీ అక్కడ స్వామి కాటికాపరిగా ఉంటాడు. సంశయంతో భయంతో విష్ణుదత్తుడు శ్రీదత్తుడి పాదాలుపై పడితే, చేతిలో ఉన్న ఎముకతో కొట్ట్గాగానే క్రిందపడ్డ విష్ణుదత్తుడు స్వామిని ఆరూపంలో చూసి భయపడి పలాయన బాటపడతాడు.

మూడవమారు శ్రీదత్తదర్శనానికి బ్రహ్మరాక్షసుడు, విష్ణుదత్తుడు బయలుదేరతారు. దత్తత్రేయులు తననివాసంలో మరలా త్రాగుబోతుగా మద్యం సేవిస్తూ కనబడతాడు. వెంటనే విష్ణుదత్తుడు దత్తాత్రేయులవారి పాదాలుపై పడతాడు. స్వామి కొట్టినా, విదిల్చినా, తన్నినా పట్టువదలని విష్ణుదత్తుడిని శ్రిదత్తుడు అనుగ్రహించి దర్శనం ఇస్తాడు. స్వామిని చూసి పొంగిపోయిన విష్ణుదత్తుడు స్వామిపాదాలపై మరలా పడితే, వరం కోరుకో అని విష్ణుదత్తుడుని అడుగుతాడు శ్రీదత్తుడు. అప్పుడు తనతండ్రి పితృకర్మకు భోక్తగా రావలసినదిగా శ్రీదత్తాత్రేయులవారిని కోరతాడు.

విష్ణుదత్తుడి ఇంటికి శ్రీదత్తాత్రేయులవారు భోక్తగా వెళతారు. రెండవభోక్తని పిలవడం మరిచిన విష్ణుదత్త దంపతులు స్వామివారు గుర్తుచేసాక, విష్ణుదత్తుడి భార్య సుశీల ప్రార్ధనతో వాయుదేవుడు స్వరూపం రెండవభోక్తగా వస్తారు. మరల సుశీలమ్మ ప్రార్ధనతో విష్ణుస్థానంలో మూడవభోక్తగా అగ్నిదేవుడు వస్తారు. శ్రీదత్తాత్రేయులవారు ఇద్దరు బ్రాహ్మణులు భోజనం చేసాక వరం కోరుకోండి అంటే, బ్రహ్మరాక్షసుడుకి రాక్షసత్వం నుండి ముక్తిని ఇమ్మంటారు, డానికి నీకు అతను చేసిన సహాయం వలన ఆ రాక్షసుడు బ్రహ్మలోకం చేరాడు, కాబట్టి నీవు వరంకోరుకో అని అంటారు, శ్రీదత్తాత్రేయులవారు. విష్ణుదత్తుడి ఇతరకోరికలు లేకపోవడం వలన, స్వామియే అతని పూర్వీకులకు బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించి, విష్ణుదత్తుడిని అనుగ్రహిస్తారు. తనవిశ్వరూప దర్శనం విష్ణుదత్త దంపతులకి దక్కడం విశేషం.

కార్తవీర్యార్జునుడికి అనఘాదత్తాత్రేయుల దర్శనం

చేతులు సరిగా లేని రాజుని సింహాసనం అధిష్టించవలసినదిగా ఆ రాజ్య గురువులు కోరతారు, నేను సర్వశక్తిమంతుడైనతేనే సింహాసనం అధిష్టిస్తాను కానీ ఇలా పరాధీన అవస్థలో కాదు అనిఅంటాడు. అప్పుడు గురువులు ఆ రాజుకి శ్రీదత్తాత్రేయ స్వామి గురించి, స్వామి పెట్టే పరిక్షలు వివరించి, శ్రీదత్తదర్శనం చేసుకోమని చెబుతారు.

శ్రీదత్తదర్శనానికి వెళ్ళిన రాజుకి స్వామివారు మద్యం సేవిస్తూ త్రాగుబోతుగా కనిపిస్తారు. దగ్గరికి వచ్చిన రాజుని కొట్టినా తన్నినా పట్టువదలకుండా రాజు స్వామి పాదాలపై పడతాడు. శ్రీదత్తాత్రేయస్వామి ఆరాజుని అనుగ్రహించి వరం కోరుకో అని అంటే, ఆ రాజు అయిన కార్తవీర్యుడు తనకి తిరుగులేని శక్తులు ప్రసాదించమంటే, స్వామి అనఘా వ్రతాన్ని బోధించి ఆచరిస్తే, నీ కోరిక తీరుతుంది అని చెబుతారు. అప్పుడు కార్తవీర్య అర్జునుడు అనఘా వ్రతం చేసి, అనఘాదత్తదర్శనంతో సర్వశక్తిమంతుడు అవుతాడు. సహస్రబాహువులతో పాటు, తన రాజ్యంలో ఎవరిమనసులో ఏమి అనుకున్న తనకు తెలిసే వరం, మూడులోకాల్లో విహరించగలిగే శక్తిని, నీ స్వరూపమైన శక్తివంతుడి చేతిలో వీరమరణ వరం పొందుతాడు.

అనఘా వ్రతం రాజ్యంలో అందరూ ఆచరించి తరించాలని కార్తవీర్యార్జునుడు శాశనం చేస్తాడు. అయితే ఆ రాజ్యంలో రాములు అనే చెప్పులుకుట్టుకునే దంపతులకు అనఘావ్రతం చేసుకుందాం అని అనుకుంటారు. ఆ ఊరి పురోహితుడుని ఆ వ్రతం చేసుకుంటాం అని అంటే, మీలాంటివారు వ్రతం కాదు అని చెప్పి పంపించేస్తారు. ప్రజలు మనోభావాలు తెలుసుకునే శక్తిగలిగిన కార్తవీర్యార్జునుడుకి ఈ విషయం అవగతమవుతుంది.

ఒక పేదవానికి దత్తాత్రేయులవారే పూజచేయించడం

ఆ రాములు దంపతుల ఇంటివైపు ఒక బ్రాహ్మణస్వామి వస్తూ ఆ దంపతులకి కనబడితే, వారు ఆ స్వామివారిని అనఘా వ్రతం చేయించమని వేడుకుంటారు. బ్రాహ్మణాస్వామిగా వచ్చిన దత్తాత్రేయులవారు తనమహిమతో వట్టిపోయిన గోవునుండి కూడా పాలు వచ్చేలా చేసి, అనఘా వ్రతం ఆ దంపతులచేత పూర్తీచేయిస్తారు.  ఆ సమయంలోనే ఆ ఊరి పురోహితులు అటుగా వచ్చి, ఆ బ్రాహ్మణస్వామితో గొడవకు దిగితే, మహారాజు కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చి స్వామిని ప్రార్ధించి, క్షమాపణ కోరతాడు. స్వామి అనుగ్రహించి నిజదర్శనం కనబడతారు.

వరప్రభావంతో కార్తవీర్యార్జునుడు ఆకాశవీధిలో వెళుతూ, ఇంద్రుని చూసి అతని ప్రవర్తనను తక్కువగా చూసి వెళతాడు. ఆగ్రహించిన ఇంద్రుడు కార్తవీర్యార్జునుడి సభలోకి అగ్నిదేవుడిని బ్రాహ్మణుడిగా పంపి, ఆకలి తీర్చమని అడగమంటాడు. అందుకు ఒప్పుకున్నా కార్తవీర్యార్జునుడి పర్యవేక్షణలో అగ్ని కొన్ని ఇళ్ళను, ఆశ్రమవాసులను దహిస్తుంటే, చూసిన వశిష్టముని ఆగ్రహించి, ఒక ముని కుమారుని చేతిలో నీకు మరణం సంభవిస్తుంది అని శాపం ఇస్తాడు. అయితే ఎంతవారు అయినా కాలంలో అహంకారం వస్తుంది అని కార్తవీర్యార్జునికి వస్తుంది.

పరశురాముడు కార్తవీర్యార్జునుల యుద్ధం

జమదగ్ని ముని ఆశ్రమంలో ఆతిద్యం స్వీకరించిన కార్తవీర్యార్జునుడు, పంచబక్ష్య భోజనాలు రాజు, రాజపరివారానికి సృష్టించిన సురభి గోవుని చూసి, ఆ గోవుని తనవెంట తీసుకువెళ్లాలని అనుకుంటాడు. జమదగ్నిమునిని అడిగితే ముని ఆవు దైవదత్తమని, ఇవ్వడం సబబు కాదని హితవు చెబుతాడు. కానీ వినని ఆ మహారాజు సురభిగోవుని రాజధానికి తోడ్కుని వెళతాడు. గోవు కంటతడి పెడుతుంది. అదే అతని పతనానికి పెద్ద కారణం అవుతుంది. వరబలం కూడా అహం పెంచుతుంది అని ఇక్కడ తెలియపరుస్తుంది.

జమదగ్నిముని కుమారుడు అయిన భార్గవరాముడు గండ్రగొడ్డలితో కార్తవీర్యార్జునుడిపైకి యుద్దానికి వస్తాడు. సుదర్శన చక్రం గర్విస్తే శాపవశాన కార్తవీర్యార్జునిడిగా జన్మించిన ఆ మహారాజుకి గతం గుర్తుకు వచ్చి భార్గవరాముని చేతిలో మరణిస్తాడు. తిరిగి సుదర్శన చక్రంగా శ్రీమహావిష్ణువు చేతిలోకి వెళతాడు. కార్తవీర్యార్జునుడి కుమారులు వచ్చి జమదగ్ని తలను నరికి వెళ్ళిపోతారు. అప్పుడు జమదగ్ని భార్య రేణుకామాత రామ రామ రామ రామ అంటూ 21 మార్లు అరుస్తూ ఉంటుంది. అన్నిమార్లు భూమండలం అంతా గర్వం కలిగిన రాజులందరిని చంపుతానని ప్రతిజ్ఞా చేస్తాడు.

తల్లిదండ్రులను కావిడిలో పెట్టుకుని ఆ కావిడిని భుజానికెత్తుకుని భార్గవరాముడు బయలుదేరతాడు. మధ్యలో ఆకాశవాణి పిలుపు వినపడిన చోట తల్లిదండ్రులను పెట్టి, భార్గవరాముడు శ్రీదత్తదర్శనానికి వెళతాడు. అక్కడ శ్రీదత్తుడు శునకాలతో ఆడుకుంటూ ఒక అంటారని వ్యక్తిలాగా కనిపిస్తాడు. కానీ భార్గవరాముడు స్వామిగురించి తనతండ్రి నోట విని ఉండడం వలన సందేహం లేకుండా ఆ స్వామినే ప్రార్ధిస్తాడు. దత్తాత్రేయుల వారు భార్గవరాముడిని అనుగ్రహింఛి తల్లి రేణుకమాతా దర్శనం కోసం వెళతారు, స్వామి దత్తాత్రేయులు. రేణుకాజమదగ్ని దంపతుల దహన సంస్కారం తరువాయి, పరశురాముడుగా తన ప్రతిజ్ఞా నేరవేర్చుతాడు.

భార్గవరాముడు పరశుని చేపట్టి అనేకమంది రాజులను చంపడం వలన పరశువుతో పాపం మూటకట్టుకున్నట్టు ఆకాశవాణి ద్వారా నీవు పరశురాముడిగానే మిగిలిపోతావు అని మాటలు వినబడతాయి. తత్ఫలితంగా తన స్థితిని గుర్తించిన పరశురాముడు మరలా శ్రీదత్తదర్శనం పొంది, దత్తాత్రేయుల ద్వారా తత్వబోధ అనంతరం భార్గవరాముడు శాంతిని పొందుతాడు. శ్రీదత్త విశ్వరూప దర్శనంతో చిత్రం సుఖాంతం అవుతుంది.

శ్రీదత్తదర్శనం అంటే పరమాత్మదర్శనంగానే ఉండడం ఈ భక్తి మూవీ యొక్క పరమార్ధంగా కనిపిస్తుంది.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ

స్వామియే శరణం అయ్యప్పా.. అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ. స్వామి అయ్యప్ప దివ్యచరితము, అయ్యప్పమాల దీక్ష మహిమలు చూపే తెలుగుమూవీ. గోదావరి తీరాన అయ్యప్ప దీక్ష తీసుకుని నియమాలను ఆచరించిన భక్తులను అనుగ్రహించే మహిమలు చక్కగా చూపిస్తారు. శబరిగిరి యాత్ర, మధ్యలో విశేషాల వివరణలు ఆద్యంతం భక్తిలోకి తీసుకువెళుతుంది ఈ భక్తిమూవీ.

Banner/బ్యానర్: జానకి ఆర్ట్ పిక్చర్స్
అయ్యప్పస్వామి మహత్యం తెలుగు భక్తి మూవీ
నటినటులు: శరత్ బాబు, షణ్ముఖ శ్రీనివాస్, చంద్రమోహన్, గిరిబాబు, జె.వి. సోమయాజులు, ఈశ్వరరావు, ఆహుతి ప్రసాద్, విద్యాసాగర్ తదితరులు.
దర్శకత్వం: కె. వాసు
నిర్మాత : మాగంటి ప్రసాద్

అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ

అయ్యప్ప చరితమును మహిమలను దీక్ష నియమాలను చక్కగా తెలియజెప్పే తెలుగు మూవీ. శరత్ బాబు ముఖ్యపాత్రలో ఈ భక్తిమూవీ సాంతం అయ్యప్ప దీక్ష మహిమను తెలియపరుస్తుంది.

అయ్యప్పస్వామి మహత్యం చిత్ర కధ

చిత్రప్రారంభం శరత్ బాబు మునిస్వామి స్వామిమాలదీక్షాకాలంలో నియమనిష్టలతో అనుసరిస్తున్నవిధానంలో టైటిల్స్ వస్తూ ఉంటాయి. టైటిల్స్ పూర్తవగానే ఇద్దరు చిన్నారులకు శరత్ బాబు మునిస్వామిగా వారికి అయ్యప్పమాల దీక్ష ఇవ్వడం చూపుతారు. అలాగే ఇంకొక వ్యక్తి మరోప్రక్క డబ్బులు తీసుకుని ఏమాత్రం దీక్ష నియమాలు పాటించకుండా ఉంటూ, ఇతరులకు దీక్ష ఇచ్చే గురుస్వామిగా చెలామణి అవుతూ ఉంటాడు.

అయ్యప్పస్వామి మహత్యం తెలుగు సినిమా యూట్యూబ్ ద్వారా చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి లేక క్లిక్ చేయండి

శరత్ బాబు గురుస్వామిగా మాలలో దీక్షగా చేయవలసిన నియమాలు సక్రమంగా ఆచరిస్తూ, తనతోటి స్వామిలతో ఆచరింపచేస్తూ ఉంటారు. స్వామి మాల పవిత్రతను తెలియజేస్తూ నిత్యదీక్షాపరాయణుడై ఇతరస్వాములకు మార్గదర్శకంగా ఉంటారు. ఆ క్రమంలో తోటి స్వాముల సందేహాలు తీరుస్తూ ఉంటూ ఉండగా, ఒకరు అయ్యప్ప చరిత్రను అడిగితే, తానూ దీక్ష ఇచ్చిన ఇద్దరి చిన్నారులతో పాట రూపంలో వినిపించడంతో అయ్యప్ప దివ్య చరితను మనము చూడగలుగుతాం ఈ భక్తి మూవీ ద్వారా…

చిన్నారుల గానంతో అయ్యప్ప జన్మ వృత్తాంతం

త్రిమూర్తుల భార్యలు అయిన పార్వతి, లక్ష్మి, సరస్వతిల కోరిక మేరకు అత్రిమహర్షి భార్య అయిన అనసూయ ప్రాతివత్య మహత్యాన్ని పరిక్షించదలచి, త్రిమూర్తులు అత్రి ఆశ్రమానికి భిక్షుల వేషంలో వెళతారు. వారిని చూడగానే అత్రిముని వారికి ఏమికావాలని అడిగితే నీ భార్య నగ్నంగా మాకు వడ్డిస్తే, మేము మీ ఇంట భిక్ష స్వీకరిస్తాం అని అంటారు. సంకటంలో పడిన మహర్షి, తన భార్యను అడిగితే, అలాగే ఒప్పుకోండి అని బదులివ్వడంతో భిక్షులు రూపంలో ఉన్న త్రిమూర్తులు ఆశ్రమం లోనికి వెళతారు.

ఆశ్రమంలో భిక్షకు వచ్చింది, త్రిమూర్తులు అని గ్రహించిన అమ్మ అనసూయ వారిని తన ప్రాతివత్య మహిమతో చిన్నారులుగా మార్చివారికీ పాలిస్తుంది. అలాగే వారిని ఊయలలో వేసి ఆడిస్తుంది, సృష్టి, స్థితి, లయకారుకులైన త్రిమూర్తులను చిన్నపిల్లలుగా మార్చివేయగల శక్తి కేవలం భర్తను అనుసరించడం వలన వచ్చింది. తనను అనుసరించడం వలన తన భార్యకు త్రిమూర్తులను చిన్నపిల్లలుగా మార్చగల తపఃఫలం వచ్చేంత గొప్పగా ధర్మాలు తెలిసి ఉండడం, ధర్మంపై కట్టుబడి ఉండడం అత్రి మహర్షి గొప్పతనంగా కనిపిస్తుంది.

అయితే త్రిమూర్తల భార్యలు వచ్చి అనసూయ అమ్మని ప్రార్ధిస్తే, మళ్ళి తన ప్రాతివత్య్త మహిమచేత ఆ చిన్నారి శిశువులను తిరిగి త్రిమూర్తులుగా మారుస్తుంది. అనసూయ ప్రాతివత్య గొప్పతనానికి సంతసించిన త్రిమూర్తులు వరం కోరుకోమంటే, బిడ్డలు లేని తమకు బిడ్డలను ప్రసాదించమని అడుగతారు అనసూయ-అత్రి దంపతులు. అప్పుడు వారికీ త్రిమూర్తి అంశతో కలిగే సంతానంలో దత్తాత్రేయులు ఒకరు.

దత్తాత్రేయులు తన భార్యతో గొడవపడి ఇద్దరు ఒకరినొకరు శాపాలను ఇచ్చుకోవడంతో ఆమె భార్య మహిషి అనే రాక్షసిగా జన్మిస్తుంది. రాక్షసిగా మారినా మహిషి, శుక్రాచార్య ముని సూచనమేరకు బ్రహ్మదేవుల కోసం తపస్సు చేస్తుంది. మహిషి తపస్సు చెడగొట్టే ప్రయత్నం ఇంద్రుడు చేసి సఫలం కాలేడు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు మహిషిని వరం కోరుకోమంటే, ఆమె తనకు చావులేని వరం ఇమ్మంటుంది. పుట్టినవారు మరణించడం, మరణించినవారు పుట్టడం ప్రకృతి లక్ష్మణం దాన్ని ఎవరు మార్చలేరు. అంటే మహిషి తెలివిగా హరిహరులు (శివుడు-విష్ణువు)లకు ఎవరైనా సంతానం కలిగితే ఆ సంతానం చేతిలో మాత్రమే చనిపోయే వరం అడుగుతుంది. బ్రహ్మదేవులు వరం అనుగ్రహిస్తారు, ఇక మహిషి అందరి రాక్షసుల మాదిరి దేవతలను, సజ్జనులను పీడించడం మొదలుపెడుతుంది.

అయ్యప్ప స్వామి జననం

ప్రకృతి నియమాలు, వాటిని పాటించి సదా మంచినే కాంక్షించే వారిని ఇబ్బంది పెడితే, ఆ పరమాత్మా ఎప్పుడు ప్రకృతిలోకి వచ్చి ఆఅడ్డుని తొలగించడం పరిపాటి, స్థితినినిలబెడతాడు. ఇప్పుడు స్థితి స్త్రీ రూపం ధరిస్తే, లయం పురుషత్వంతో స్త్రీని సృజించి, ఒక కారణపురుషునికి జన్మకు కారణం అవుతారు. అలా జన్మించిన బాలుడే మణికంఠగా పెరిగి అయ్యప్ప అయ్యి ఇప్పుడు అందరిని అనుగ్రహిస్తున్న శబరిమల స్వామి. పద్మదళ రాజ్యాధినేత వేటకు అడవికి వచ్చిన రాజు అమందాత కొండలలో శిశువు రోదన విని వెతికితే కనిపించిన బాలుడిని దైవప్రసాదంగా భావించి, అంతఃపురానికి తీసుకువెళ్ళి పెంచుతాడు. ఆ బాలుడికి మణికంఠగా పెరిగి, గురుకులానికి వెళ్ళి సకల విద్యలు అభాసిస్తారు స్వామి అయ్యప్ప. విధ్యాబ్యాసం పూర్తయిన తరువాత గురువుగారికి గురుదక్షిణగా ఆయన పుత్రుడికి దృష్టి, వాక్కు ప్రసాదిస్తారు మణికంఠ.

విధ్యాబ్యాసం పూర్తీ అయ్యి అంతఃపురం చేరతారు స్వామి మణికంఠ, తరువాయి ఇంద్రుడు ఎలాగైనా మణికంఠ జన్మరహస్యం చెప్పి మహిషిని అంతం చేయించాలని తలచి, మణికంఠ పెంచిన తల్లికి శిరోభారం కలిగేల చేస్తాడు. ఇంద్రుడే వైద్యుడుగా వచ్చి రాజుతో రాణి శిరోభారం తగ్గాలంటే పులిపాలు కావాల్సిందే అని చెబుతారు. మణికంఠ పులిపాల కోసం అడవికి బయలుదేరితే అక్కడ మణికంఠకి ఇంద్రుడు తన జన్మరహస్యం, జన్మకారణం చెప్పి మణికంఠని మహిషిపై యుద్దానికి ప్రోత్సహిస్తారు. మణికంఠకి, మహిషి మధ్య జరిగిన ఘోరయుద్దంలో మహిషిని మట్టికరిపిస్తాడు మణికంఠ. తరువాయి మణికంఠ అంతఃపురానికి ఇంద్రుడినే పులిగా తీసుకునివెళతాడు. అప్పటికే ఇంద్రమాయ వలన కలిగిన శిరోభారం తొలగిపోతుంది. పులిగా ఉన్న ఇంద్రుడు నిష్క్రమించాక, మణికంఠ తన తల్లిదండ్రులతో నేను తపస్సుకు వెళతానని వెల్లడి చేస్తాడు.

మణికంఠ నిర్ణయాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులకు, మణికంఠ జ్ఞానబోధ చేస్తే, తండ్రి ఒక కోరిక కోరతాడు. నీ పట్టాభిషేకానికి అని చేయించిన నగలు ఒకసారి ధరించి మాకు దర్శనం కలగజేయి అని తండ్రి మణికంఠని అడిగితే, అందుకు బదులుగా మణికంఠ నేను త్వరలో ప్రతి సంవత్సరం మకరసంక్రాంతి రోజున మీరు తెచ్చే నగలను ధరిస్తాను. ఇప్పుడు నేను సంధించి వదులుతున్న బాణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాకు ఆలయం కట్టించమని చెప్పి, విల్లుతో బాణం విడిచిన మణికంఠ తపస్సుకు బయలుదేరతాడు. అలా తండ్రి కట్టించిన ఆ ఆలయం శబరిమలై భక్తులను అనుగ్రహిస్తున్న అయ్యప్పకి నిలయం అయింది.

మణికంఠను అయ్యప్ప అని మొదట పిలిచినా తల్లిదండ్రులు

స్వామికి అయ్యప్ప పేరు ఎలా వచ్చింది అంటే ! తపస్సుకు బయలుదేరే సమయంలో తల్లిదండ్రులు మణికంఠని తండ్రి అయ్యా అని తల్లి అప్పా అని సంభోదిస్తారు. అలా తల్లిదండ్రులు సంభోదించిన రెండు పేర్లు ఒకటిగా అయ్యప్పగా అయ్యి అందరిని అనుగ్రహిస్తున్నాడు మణికంఠ స్వామి. అలా అయ్యప్ప చరితమును పిల్లచే గానం చేయించిన శరత్ బాబు గురుస్వామి మిగిలిన స్వాములకు పూజవిధానాలు, దీక్షనియమాలు, శబరిమలలో జరిగే సహస్రకలశాబిసేకం వంటి విశేషాలు చూపిస్తూ మాలదీక్షలో మార్గదర్శకంగా నిలుస్తాడు.

అయ్యప్పస్వామి మాలనియమాలు మండలం రోజులు ఆచరించి, శబరిమాల యాత్ర గురుస్వామి శరత్ బాబు మార్గదర్శకత్వంలో సాగడంతో పాటు మధ్యలో భక్తులపై అయ్యప్పస్వామి మహిమలు నిదర్శనంగా మారడం ఈ చిత్రం ఆద్యంతం భక్తిని పండిస్తూ ఉంటుంది. యాత్రలో స్వామిపై, మాలనియమాలపై పాటలు అందరిని అలరిస్తాయి. హరిహర పుత్రుడైన అయ్యప్పదీక్ష భక్తిశ్రద్దలతో ఆచరించి శబరిమల యాత్రను చేస్తే పూర్తీఫలితం ఉంటుంది అని తెలియజెప్పే భక్తిమూవీ. అలాగే తెలిసి తప్పులు చేస్తూ, స్వామి పేరు చెప్పి ఇతరులను మోసం చేసేవారిని స్వామి ఎలా శిక్షిస్తారో ఈ చిత్రం చూపుతుంది.

అందరు దేవతలు అవతరించి అవతార ప్రయోజనం తీరాక భూలోకంలో ఉండరు కదా మరి అయ్యప్ప ఎందుకు శబరిమలలోనే ఉండినట్టు అని శబరిమలయాత్రలో గురుస్వామిని మరో స్వామి ప్రశ్నిస్తారు. అప్పుడు గురుస్వామి స్వామి ఆంజనేయులకు అయ్యప్ప మాట ఇచ్చినవైనం, అలాగే పరబ్రహ్మ భక్తురాలైన శబరికి అయ్యప్పస్వామి ఇచ్చిన వరం గురించి, అయ్యప్ప గుడికట్టమని సందేశం తన తండ్రికి పంపించడం వివరిస్తారు. మణికంఠతండ్రి శబరిగిరిపై కట్టించిన ఆలయం శబరిమలై విరాజిల్లుతుంది. గోదావరి తీరాన ఉన్న ర్యాలీ గ్రామవాసి పరమేశ్వరశాస్త్రి ప్రధాన అర్చకులుగా తంత్రితో  శబరిగిరిపై అయ్యప్ప పూజలు ప్రారంభం అవుతాయి. పరమేశ్వర శాస్త్రి గారి వంశీకులు అర్చకులుగా ఇప్పటికి అయ్యప్ప పూజలు అందుకుంటూ ఉన్నాడు.

యాత్రకు బయలుదేరిన స్వాములకు గురుస్వామి మకరజ్యోతి గురించి వివరిస్తూ శబరిమాల చేరి అయ్యప్ప స్వామి దర్శనం పొందడంతో అయ్యప్ప స్వామి మహత్యం భక్తి

మంచి భక్తి సినిమాలగా అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ ఉంటంది, మాలధారణ, దీక్ష నియమాలు, శబరిమాల యాత్ర విశేషాలను మనకి స్క్రీనుపై చూపుతుంది.

స్వామియే అయ్యప్ప శరణం అయ్యప్పా శబరిమల అయ్యప్ప శరణం అయ్యప్ప, హరిహరతనయ అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద తెలుగు బాలభక్తుడి సినిమా. తన్మయమైన భక్తితో దైవాన్ని రప్పించిన భక్తిరసకరమైన చలనచిత్రం. భక్తుడు పరమాత్మ తత్వంతో తన్మయత్వం చెందుతూ ఉంటే, ఆ భక్తికి భక్తులు, భగవంతుడు పరవసిస్తే, మరి చిన్నారి బాలుడు పరబ్రహ్మంతో తన్మయుడై హరిభక్తిని చాటుతుంటే, శ్రీహరి ఉగ్రనారసింహ అవతారం ఎత్తించిన భక్తిరసభరిత తెలుగు మూవీ.

అమ్మకడుపులోనే భగవతత్వం గురించి తెలియబడడం వలన, చిన్ననాటి నుండే నారాయణ మంత్రంతో మనసుని నింపేసుకున్నబాలుడి భక్తి తత్పరత చాల భక్తిభావాన్ని పెంచుతుంది.

భక్తప్రహ్లాద తెలుగు భక్తి మూవీలో భగవంతుడిగా హరనాథ్ నటిస్తే, బాల భక్తుడిగా రోజారమణి చాల చక్కగా నటించారు. చిన్నారి భక్తుడి తండ్రి హిరణ్యకశిపుడుగా ఎస్వి రంగారావు (SV Rangarao) నటిస్తే, హిరణ్యకశిపుడు భార్య లీలావతిగా అంజలిదేవి నటించారు. చిన్నారి భక్తుడికి  గురువులుగా రేలంగి నరసింహారావు, పద్మనాభంలు నటించారు. నారదుడుగా బాల మురళి కృష్ణ నటించారు.

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద సాంకేతిక వర్గం

Banner/బ్యానర్: AVM Productions/ఏవిఎం ప్రొడక్షన్స్
Direction/దర్శకత్వం:Ch Narayana murthy సిహెచ్. నారాయణమూర్తి
Actor Actress/నటినటులు: SV Rangarao/ఎస్వి రంగారావు, Balamurali Krishna/బాల మురళి కృష్ణ, Relangi/రేలంగి, Padmanabham/పద్మనాభం, Haranath/హరనాథ్, dhoolipala/ధూళిపాళ, Ramana Reddy/రమణారెడ్డి, Nagaiah/నాగయ్య. AnjaliDevi / అంజలీదేవి, Jayanti/జయంతి, Baby Rojaramani/బేబీ రోజారమణి, L Vijayalakshmi/ఎల్ విజయలక్ష్మి, Geetanjali/గీతాంజలి, Vanisri/వాణిశ్రీ, Nirmala/నిర్మల తదితరుల్ Bhakta Prahlada/భక్తప్రహ్లాద చిత్రంలో నటించారు.
Story/కధ: DV Narasaraju/నరసరాజు
Sangitam/సంగీతం: S Rajeswara Rao/ఎస్ రాజేశ్వరరావు

జయ విజయులకు మునుల నుండి శాపం భక్తప్రహ్లాద మూవీలో

వైకుంఠములో ద్వారాపాలకులుగా జయవిజయులు వైకుంఠద్వారం దగ్గర నిలబడి ఉంటారు. సనకసనంద మహర్షులు వైకుంఠములోనికి ప్రవేశించబోతే, వారిని జయవిజయులు అడ్డుకుంటారు.

మహర్షులు తమకు శ్రీమహావిష్ణువు దర్శనం అత్యవసరం అన్నా అడ్డుకుంటారు, శ్రీహరి లక్ష్మీసమేతులై ఏకాంతంగా ఉన్నారని లోనికి ఎవరిని అనుమతించం అని అడ్డుకుంటారు. శ్రీహరి భక్తవత్సలుడు భక్తులకు, శ్రీహరికి ఎవరూ అడ్డుకాకూడదు మీరు అడ్డుతోలగమని చెప్పినా జయవిజయులు సనకసనంద మహర్షులను అడ్డుకుంటారు.

కోపగించిన మహర్షులు రాక్షసులై భూలోకంలో జన్మించమని జయవిజయులకు శాపానుగ్రహం ఇస్తారు. జగన్నాటక సూత్రదారి వచ్చి జరిగిన విషయం గ్రహించి, జయవిజయులు చేసింది తప్పు దానికి మీరు శిక్ష అనుభవించాలంటే, జయవిజయులు శ్రీహరిని ప్రార్ధిస్తారు.

అప్పుడు శ్రీమహావిష్ణువు జయవిజయులు శాపఫలం అనుభవించాక, వారు తిరిగి వైకుంఠము వచ్చేలా అనుమతి ఇవ్వవలసినదిగా తాపసులను కోరితే, బదులుగా సనకసనంద మహర్షులు దానికి మేమంతవారము నీవెట్లా అనుగ్రహించిన మాకు సమ్మతమే అని చెబుతారు.

నాకు విరోధులుగా మూడు జన్మలు ఎత్తి తరువాత వైకుంఠము చేరతారా ? నాకు భక్తులుగా ఏడు జన్మలు ధరించిన తరువాత వైకుంఠము చేరతారా ? అని జయవిజయులకు శ్రీహరి చెబితే. బదులుగా జయవిజయులు స్వామి నీకు దూరంగా ఏడు జన్మల కాలం మేము ఉండలేము, విరోధులుగా మూడు జన్మలకాలం తరువాత వైకుంఠప్రాప్తిని అనుగ్రహించమని వేడుకుంటారు. అలా జయవిజయులు మూడు జన్మలు శ్రీహరికి శత్రువులుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

మొదటి జన్మలో దితి కడుపునా హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా రెండవ జన్మములో రావణ, కుంభకర్ణులుగా మూడవ జన్మములో శిశుపాల, దంతవర్తులుగా భూలోకములో జన్మించి, నన్ను విరోధించినా, నిరంతరం నాపై ధ్యాసనే కలిగి ఉండి, తదుపరి వైకుంఠము చేరగలరని శ్రీహరి సెలవిస్తారు.

హిరణ్యాక్షమరణం, హిరణ్యకశిపుడు తపస్సు, ప్రహ్లాద జననం

తరువాయి సన్నివేశంలో కశ్యప ప్రజాపతి సంద్యాసమయంలో తన ఆశ్రమంనందు ధ్యాననిమగ్నుడై ఉండగా, అయన భార్య అయిన దితి అక్కడికి వస్తుంది. వసంతకాలం ప్రకృతి ప్రభావరిత్యా ఆమె కామప్రభావానికి లోనై కశ్యపప్రజాపతి చెంతచేరుతుంది, విరహభావంతో.

కశ్యప ప్రజాపతి ఆమెను వారించగా ఆమె తిరస్కార వైఖిరికి ఆమె కోరికను తీర్చుతారు. తత్ఫలితంగా అనతికాలంలో ఆ దంపతులకు ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. వారికీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు నామకరణం చేసిన కశ్యప ప్రజాపతి, వారు రాక్షసులై లోకకంటకులుగా శ్రీహరి విరోధులు అవుతారని చెబుతారు. దానికి దితి దుఃఖిస్తే, నీ మనుమడు మాత్రం శ్రీహరి భాక్తాగ్రేసుడై కీర్తిని సముపర్జిస్తాడని ఆమెను ఊరడిస్తారు.

దైత్యుడైన హిరణ్యాక్షుడు ప్రజలను పీడిస్తూ, సాదుజనులను హింసిస్తూ, భూమాతను కూడా హిరణ్యాక్షుడు హింసిస్తూ, భూమిని రక్షించడానికి శ్రీహరి ఆదివరాహఅవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి, శిష్టరక్షణ చేస్తారు.

విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఇదంతా శ్రీహరి వలననే జరిగింది, అందుకు శ్రీహరిపై విరోధం ఇంకా పెంచుకుంటాడు. ఎలాగైనా శ్రీహరిని ఓడించాలని శ్రీహరిపై యుద్దానికి సంసిద్ధుడు అవుతుంటే, గురువు బోధనచేత యుద్దకాంక్ష పక్కనపెట్టి, తపస్సు చేయడానికి బయలుదేరతాడు.

బ్రహ్మదేవుడి గురించి ఘోరతపము ప్రారంభిస్తాడు, బ్రహ్మ ప్రత్యక్ష్యం అయ్యేదాకా కఠోర తపము చేస్తే, బ్రహ్మగారు హిరణ్యకశిపుడు తపస్సునకు మెచ్చి, వచ్చి వరం కోరుకో అంటారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏడేడు పదునాలుగు లోకాలలో గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, అస్త్ర, శస్త్రాలతో, దిక్కులలో, పగలు, రాత్రి, ఇంటా, బయటా, పైన, క్రింద, జంతువులు, మనుషులు, దేవతలు, కిన్నెర, కింపుర్శ, గంధర్వులు, అన్ని వస్తువుల ద్వారా మరణం లేని వరం అడిగితే, బ్రహ్మగారు అనుగ్రహిస్తారు.

హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం తపము చేస్తున్న సమయంలో గర్భిణిగా ఉన్న లీలావతిని ఇంద్రుడు చెరపట్టి తీసుకువెళుతుంటే, నారద మహర్షి అడ్డుపడి, ఆమెగర్భంలో ఉన్నది రాక్షస జాతి బాలుడే అయినా మహాభక్తుడు కాగలడు, కావునా ఆమెను విడిచిపెట్టమని వారిస్తాడు. తదుపరి లీలావతిని నారదమహర్షి తన ఆశ్రమంలోకి తీసుకువెళతారు.

ఆ ఆశ్రమంలో గర్భిణిగా ఉన్న లీలావతితో నారద మహర్షి బ్రహ్మజ్ఞానం భోదిస్తుంటే, ఆమె నిదురిస్తుంటే, ఆమె గర్భంలో ఉన్నఆ నెలల బాలుడు ఆ జ్ఞానసారాన్ని గ్రహిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకు లీలావతి ప్రసవిస్తే, సుపుత్రుడిగా తపస్సు పూర్తిచేసుకుని వచ్చిన హిరణ్యకశిపుడుకి పరిచయం చేస్తారు. లీలావతి మరియు నారదులు. ఆ బాలుడికి ప్రహ్లాదుడిగా నామం నారద మహర్షే సూచిస్తారు.

వరగర్వం వలన హిరణ్యకశిపుడు ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతుంది. సర్వసాదులను హింసిస్తూ, ప్రజలందరినీ నన్నే దేవుడుగా కొలవవలసినదిగా ఆజ్ఞలు జారి చేస్తాడు. ఇంద్రుడిని జయించి, స్వర్గాన్ని ఆక్రమించి ముల్లోకాలకు ప్రభువుగా ప్రకటించుకుంటాడు. సాధువులు, మునులు శ్రీహరిని వేడుకొనగా అందుకు శ్రీహరి హిరణ్యకశిపుడు సుపుత్రుడు నాకు మహాభక్తుడై ఉంటాడు, అందువల్లే హిరణ్యకశిపుడు అంతం కూడా అవుతుంది అని చెబుతారు.

భక్తప్రహ్లాద హరిభక్తి నివారణ ప్రయత్నం చేసే హిరణ్యకశిపుడు

నారాయణనామం పలుకుతుంటే ఎంతమధురంగా ఉంటుందో పలికేవారికీ తెలుస్తుంది అంటారు, కానీ ఈ మూవీలో నారాయణనామం గొప్పతనం కనబడుతుంది. నారాయణనామం యొక్క రుచి ప్రహ్లాద త్రాగినట్టుగా ఈ మూవీ కల్పిస్తుంది. నారాయణనామజపం వలన మరణ భయంపొందని దృఢమైన మనస్సుని పొందిన బాలుడు భక్తి భావన ముగ్ధమనోహరంగా కనిపిస్తుంది, ఈ భక్తప్రహ్లాద మూవీలో. నారాయణమంత్రం తల్లి కడుపులో ఉండగానే నారద మహర్షిచే బోధించబడుతుంది.

మదిలో భక్తిభావనలు పెంపొందించుకోవడానికి భక్తప్రహ్లాద చిత్రం ఒక చక్కటి అవకాశంగా ఉంటుంది. భక్తి ధ్యాసలో భవభందాలా భయం లేదని చాటి చెప్పే చిత్రం, చూస్తున్నవారిలో కూడా నారాయణ నామంపై మమకారం పెంచుతుంది. భక్తుడి భక్తి తత్పరతతో రాతిస్థంభం నుండి కూడా భగవంతుని రప్పించవచ్చని చాటి చెప్పే తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద .

అధర్మ కర్మవలననే ప్రజాపతి సంతానం ద్రుష్టబుద్దితో పుడితే, ధర్మపరివర్తనతో లీలావతి వలన ద్రుష్ట రాక్షసుడికి సుపుత్ర సంతానం కలిగింది. అంతటా హరినామం నిషేదిస్తే, నిషేదించిన ఇంటే హరినామ కీర్తన జరగటం జగన్నాటక సూత్రదారి మాయ ఎంతగొప్పదో అర్ధం అవుతుంది.

నారదుల ఆశ్రమం నుండి ఇంటికి వచ్చిన బాలుడు ఎప్పుడు శ్రీహరి ధ్యాసలోనే ఉండి, ధ్యానం చేస్తూ ఉంటాడు. ముల్లోకాలు జయించిన హిరణ్యకశిపుడుకి కంటిమీద కునుకు లేకుండా చేసేది, తన సుపుత్రుడు భక్త ప్రహ్లాద ప్రవర్తన. రాక్షస బుద్దులు రాకుండా ప్రసన్నంగా ఉండడం దానవాగ్రేసురుడుకి అసలు నచ్చదు. అలా ఉన్న ఆ బాల ప్రహ్లాదుడిని గురుకులంలో విద్యాబుద్దులకోసం చండామార్కుల ఆశ్రమంకు పంపుతారు.

గురుకులంలో ప్రహ్లాదుడి హరిభక్తి కీర్తనలు

గురుకులంలో చేరిన ప్రహ్లాదుడు గురువుల దగ్గర అన్ని విద్యలు, వేదపాటాలు నేర్చుకుంటాడు, కానీ హరిభక్తిని మరువడు. వేదవిద్యలు ఇట్టే పట్టిన ప్రతిభను చూసి ముచ్చటపడి, ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు వద్దకు తీసుకువెళతారు.

హిరణ్యకశపుడు పుత్రుడిని తనతొడపై కూర్చొనబెట్టుకుని, ప్రహ్లాదుడుని నీవు నేర్చుకున్న విద్యలలో సారం ఏమిటో చెప్పమని అడిగితే, తండ్రి తొడపై కూర్చోని ప్రహ్లాదుడు వేదసారమైన పరమాత్మ తత్వాన్ని శ్రీహరిపై పొగుడుతూ పద్యం చెబుతాడు. శ

్రీహరి మాట తనపుత్రుని నోట విన్న హిరణ్యకశిపుడుకి కోపం వస్తుంది. హరిభక్తి మనకు తగదని చెప్పినా, హరి భక్తితత్పరుడైన బాలుడు దృఢమైన మనసుతో శ్రీమహావిష్ణువునే స్తుతిస్తాడు.

తనపుత్రుడికి రాక్షసజాతికి అవసరమైన శాస్త్రవిద్యలు సరిగా బోధించమని మరలా గురుకులానికి ప్రహ్లాదుడిని పంపిస్తారు. తిరిగి గురుకులం చేరిన ప్రహ్లాదుడు, అక్కడి ఉన్నవారందరికీ హరిభక్తి భోదిస్తూ ఉంటాడు.

అది చూసిన చండామార్కులవారు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపునికి అప్పజెప్పి, ప్రహ్లాదుడిని మార్చడం మావల్ల కాదు అని చెబుతారు. హరిభక్తి మానతవా లేదా అని కఠినంగా అడిగినా ప్రహ్లాదుడు హరిభక్తి మానలేను అంటాడు. ఇక ప్రహ్లాదుడిని చంపమని, భటులకు అజ్ఞా ఇస్తాడు, హిరణ్యకశిపుడు.

ఏనుగుతో తొక్కించినా, ఎత్తైన కొండలపై నుండి తోసివేసినా, పాములతో కరిపించినా ఎలా ప్రయత్నించిన శ్రీహరి అనుగ్రహంతో బ్రతికే ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలకు మరణం దరిచేరని ప్రహ్లాదుడిని చూసి, హిరణ్యకశిపుడు తన పుత్రుడిని నిలదీస్తాడు.

నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో చూపించు అని, ప్రహ్లాదుడి భక్తికి పరవశిస్తూ ఉండే, శ్రీమహావిష్ణువు, ప్రహ్లాదుడు చూపించిన రాతికట్టడమైన స్థంభం నుండి పై సగ భాగం సింహంగా, క్రింద భాగం నరుడుగా కలిగి నృసింహస్వామిగా  ఉద్భవించి, పగలు, రాత్రి కానీ సంద్యా సమయంలో ఇంటా బయటా కానీ గడపపై ప్రాణం లేని గోళ్ళతో హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. చివరగా భక్తప్రహ్లాద (BhaktaPrahlada) స్త్రోత్రంతో తృప్తిపడి, ప్రహ్లాదునికి వరాలు ఇస్తాడు.

ఇందుకలడని అందుకలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే కలడు శ్రీహరి అని పడే ప్రహ్లాద పద్యం చక్కగా ఉంటుంది.

భక్తిమార్గం సులభమార్గం అని అదే చివరివరకు తోడు అని భక్త ప్రహ్లాదుడి చరితను చెబుతారు. ఈ భక్తి మూవీ అదే చూపుతుంది.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా

శ్రీరాముడు రాశిభూతమైన ధర్మము అంటారు. ధర్మము పూర్తి మానవుడుగా మారి, చక్రవర్తి అయితే ఆయనే శ్రీరామచంద్రమూర్తి అంటారు. సీతమ్మ తల్లి రామయ్యను అనుసరించిన మహాసాద్వి. సీతారాముల గురించిన సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ గురించి…

బ్యానర్ : లక్ష్మి ఎంటర్ ప్రైజెస్
చిత్ర తారాగణం : శోబన్ బాబు, ఎస్వి రంగారావు, చంద్రకళ తదితరులు
సంగీతం : కేవి మహదేవన్
నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
దర్శకత్వం: బాపు

తెలుగు భక్తి మూవీలో శోభన్ బాబు శ్రీరామచంద్రమూర్తిగా నటించారు. రామచంద్రమూర్తి భార్య సీత పాత్రలో చంద్రకళ నటించారు. శ్రీరామాయణంలో అసురుడు అయిన రావణాసురుడు పాత్రలో ఎస్వీ రంగారావు నటించారు. సంపూర్ణ రామాయణం తెలుగు భక్తి మూవీకి బాపు దర్శకత్వం వహించారు.

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ

అలనాటి పాత తెలుగు సినిమాలు మంచి సందేశం కలిగి ఉంటే, భక్తి సినిమాలు అంటే పరమధర్మమునే తెలియజేస్తాయని అంటారు. భక్తి మూవీస్ వాచ్ చేయడం వలన భగవానుడిపై భక్తిని పెంచుకోవడానికి మనసుకు మంచి ఆలంబనం అవుతుంది.

పుస్తకం చదువుతూ ఉంటే ఒక ఊహాశక్తి మనసులో మెదులుతుంది. సినిమా చూస్తుంటే, చూస్తున్న మూవీ సీన్స్ మనసులో కదలాడుతూ ఉంటాయి. మంచి సీన్స్ మనసులో ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటారు.

శ్రీమహావిష్ణువు తదితర దేవతల అవతార సన్నివేశం సంపూర్ణ రామాయణం భక్తి .

వైకుంఠములో లక్ష్మినారాయణులు ఆదిశేషుని కొలువుతీరి ఉండగా దేవతలు అంతా వచ్చి రావణ రాక్షస అకృత్యాలపై మొరపెట్టుకుంటారు. ద్రుష్ట శిక్షణ చేయడానికి నేను నరుడిగా అవతరిస్తాను. మీరు మీ మీ అంశలతో వానరాలుగా అవతరించండి, అని శ్రీమహావిష్ణువు వెల్లడి చేస్తారు.

ఎందుకంటే రావణుడు మనుషులపై చులకన భావంతో మనుషులు, వానరులు తప్పించి మిగిలిన వారితో మరణం లేని వరం కలిగి ఉంటాడు. వేరొక సన్నివేశంలో రావణాసురుడు వేదవతిని వేదిస్తుంటే, ప్రతిగా వేదవతి నేను మరో జన్మలో నీ మరణానికీ కారణం కాగలనని రావణుడిని శపించి ఆత్మాహుతి చేసుకుంటుంది.

దేవతలు వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు మొదలైనవారు అవతరిస్తే, శ్రీమహావిష్ణువు రామునిగా, రాముని తమ్ములుగా శంఖు, చక్ర, గదలు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా దశరద మహారాజుకి జన్మిస్తారు.

తనఇంట రావణుడు శివ పూజ చేస్తుండగా, పూజ పుష్పం నుండి ఒక బాలిక ఉద్బవిస్తుంది. ఆ శిశువుని రావణాసురుడు పారవేయమని చెబుతాడు. అలా రావణాసురుని ఇంట ఉద్బవించిన శిశువు పొలం దున్నుతున్న జనక మహారాజుకి దొరుకుతుంది.

అలా జనకమహారాజుకి దొరికిన బాలికకు సీత అను పేరు పెడతారు. సీత జగదేక ప్రసిద్ది పొందుతుంది అని జనకమహారాజు గురువులు శతానందులు సెలవిస్తారు.

అయోధ్యలో రామయ్య కౌసల్య – దశరదుల వద్ద అల్లారుముద్దుగా పెరిగి, గురువుల దగ్గర విద్యాభ్యాసం పూర్తీచేసుకుంటాడు.  జనకమహారాజు స్వగృహంలో పెరుగుతున్న సీతమ్మ ఒకరోజు అటాడుకుంటూ ఉండగా బంతి ఒక ధనుస్సు ఉన్న బాక్స్ క్రిందకు వెళుతుంది.

అప్పుడు సీతమ్మ తల్లి a పెట్టెని ఇట్టే జరిపి ఆ పెట్టే కింద ఉన్న బంతిని తీసుకుని మరలా ఆటలోకి వెళుతుంది. అది గమనించిన జనక మహారాజు, వారి గురుదేవులు ఆశ్చర్యచకితులు అవుతారు. వేలమంది తోస్తేకాని జరగని ఆ ధనుస్సు కలిగిని పెట్టెని, ఇట్టే జరిపిన సీతమ్మతల్లికి స్వయంవరంలో ఎవరైతే శివదనుస్సుని ఎక్కుపెడతారో వారికే ఇచ్చి వివాహం జరిపిస్తానని అంటారు.

రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట కానలకు వెళ్ళడం, శ్రీరామాయణం తెలుగు భక్తి మూవీ

ఒకరోజు సభలో దశరధ మహారాజు గురువు వసిష్ఠ మహర్షితో కొలువు దీరి ఉండగా, అక్కడకు విశ్వామిత్ర మహర్షి కూడా వస్తారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాకకు కారణం వివరిస్తూ, రామ చంద్రుని తనతో అడవులకు పంపమని దశరధుని విశ్వామిత్ర మహర్షి అడుగుతారు.

దానికి దశరధ మహారాజు సంశయిస్తే, అప్పుడు వసిష్ఠ మహర్షి నచ్చచెప్పడంతో దశరధ మహారాజు రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి వెనుక పంపడానికి అంగీకరిస్తే, అక్కడికి వచ్చిన రామలక్ష్మణులు తండ్రి అజ్ఞాపాలన మేర విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

విశ్వామిత్రుని వెనుకు రామలక్ష్మణుల నడక సాగుతుండగా తాటక రాక్షసి కనిపిస్తుంది, ఆ రాక్షసి వారి ముగ్గురిపై రాళ్ళతో దాడి చేస్తుంటే, విశ్వామిత్ర మహర్షి అజ్ఞా మేరకు, రాముడు తాటకిని సంహరిస్తాడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు కొన్ని శక్తి అస్త్రశస్త్రాలను ఉపదేశిస్తారు.

విశ్వామిత్ర మహర్షి మరియు ఇతర మునులు జరుపుతున్న యజ్ఞం భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సుబహువు రాక్షసుడుని రాముడు అంతమొందించి, మారీచుడుని రామ బాణంతో కొన్ని యోజనాల దూరంలో పడేటట్టు చేస్తాడు. యాగం సంపూర్తి అవుతుంది.

నారద మహర్షి కూడా అక్కడకు వచ్చి రామచంద్రుడిని దర్శించుకుని, విశ్వామిత్ర మహర్షితో సీతాస్వయంవరం గురించి వివరిస్తారు. అదేవిధంగా ఆ విషయం రావణుడి చెవికి చేరవేస్తాడు. రావణుడు సీతాస్వయంవారానికి బయలుదేరితే, రామలక్ష్మణులు ఇద్దరూ గురువు విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

దారిలో అహల్యకు శాపవిమోచనం కావించి, రామలక్ష్మణ మహర్షులు జనకమహారాజు సభకి చేరుతారు. స్వయంవరానికి విచ్చేసిన మహావీరులందరు ప్రయత్నించి విఫలమైతే, రావణాసురుడుకి కూడా గర్వభంగం అవుతుంది. ఇక గురువు విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదంతో రామచంద్రులు శివధనుస్సు ఎక్కుపెట్టగానే, ధనుస్సు విరుగుతుంది.

సీతారాముల వివాహం అంగరంగవైభవంగా ఇరువురి బంధుమిత్ర సపరివారం మద్య జరుగుతుంది. శివధనుస్సుని విరిచింది ఎవరు అంటూ వచ్చి, అంతకు వేయిరెట్లు అధిక శక్తి కలిగిన హరివిల్లుని కూడా ఎక్కుపట్టమని పరశురాముడు చెబితే, ఆ హరివిల్లుని కూడా ఎక్కుబెట్టిన రాముడు, పరశురాముడుకి శ్రీమహావిష్ణువుగా దర్శనం అయ్యి అక్కడ నుండి నిష్క్రమిస్తారు.

శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తంలో సీతారామలక్ష్మణులు అడవులకు

తరువాతి సన్నివేశంలో భరత, శత్రుఘ్నుడు ఇద్దరు వారి మావగారి గృహానికి వెళతారు. మరొక సందర్భంలో  దశరధ మహారాజు తన సభలో పెద్దలు, ప్రజలు, గురువుగార్ల సమక్షంలో నేను వృద్దుడిని అవుతున్న కారణంగా శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తానని అనగానే అందరు హర్షిస్తారు.

శ్రీరాముడు కేవలం నా పెద్దకుమారుడు కావడం మాత్రమే కాకుండా శ్రీరామునికి చాలా మంచి గుణాలు ఉన్నాయని అందుకే పట్టాభిషేకం చేస్తానని అంటే సభ మరొకసరి సంఘీభావం తెలియజేస్తే, అక్కడికి వేంచేసిన శ్రీరామునికి పట్టాభిషేక విషయం వివరించి, రేపటి పట్టాభిసేకనికి సంసిద్దుడివి కమ్మని చెబుతాడు.

మరుసటి రోజు అయోధ్య అంతా సంబరాలు జరుపుకుంటూ ఉంటే, కైకేయి మందిరానికి వచ్చిన మందర నూరిపోసిన వాక్కుల వలన కైకేయి మనసు చెదిరి, దశరధ మహారాజుని వరాలు అడగడంతో శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి, అదే సమయానికి సీతారామ లక్ష్మణులు అడవులకి బయలుదేరవలసి వస్తుంది.

అంతా ఈశ్వరేచ్చ అని భావించి, సీతారామలక్ష్మణులు అడవులకి వెళతారు, అలా రధంలో బయలుదేరిన రాముని ఎడబాటు భరించలేని దశరధ మహారాజు మరణిస్తారు. తదుపరి వచ్చిన భరతుడు విషయం గ్రహించి తల్లిని మందలించి అన్నగారి వద్దకు అడవులకి బయలుదేరతాడు.

అడవిలో సీతారామలక్ష్మణులు నార దుస్తులు ధరించి ముని ఆశ్రమంలో ఉండగా, భరతుడు సపరివార సైన్యంతో రావడం చూసి లక్ష్మణుడు భారతునిపై సందేహం వెలిబుచ్చుతాడు. కానీ భరతుడు అన్నగారు అయిన శ్రీరామచంద్రుడినే రాజ్యం స్వీకరించాలని, తనతల్లి చేసిన తప్పుకు తానూ ఈ శిక్ష భరించలేనని అంటాడు.

అలాగే కైకేయి తదితర వారంతా శ్రీరాముని అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేయవలసినదిగా కోరితే, శ్రీరాముడు తాను తండ్రికి మాటకు మచ్చ రానివ్వను అంటూ రాజ్యభారం ప్రస్తుతం భరతుడే నిర్వహించవలసినదిగా చెబుతారు. శ్రీరామ పాదుకలు తీసుకుని భరతుడు ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి పాలిస్తానని, గడువు ముగిసే సమయానికి నీవు రాకపోతే, నేను ప్రాయోపవేశం చేస్తానని చెప్పి అయోధ్యకు వెనుతిరుగుతాడు.

రావణుడు సీతాపహరణం చేయడం… సంపూర్ణ రామాయణ తెలుగు భక్తి మూవీ

మరొక సన్నివేశంలో రామలక్ష్మణులను చూసిన శూర్పణఖ మోహితురాలై వారి వెంటబడితే, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కొస్తే, ఆమె రావణ సభకి వెళ్లి మొరపెట్టుకుంటుంది. అంతేకాకుండా సీత అందచందాలు పొగిడేసరికి, రావణుడిలో దుర్బుద్ధి పెరిగి సీతాపహరణకు పధకం వేస్తాడు.

పధకం ప్రకారం మారీచుడు బంగారు లేడి వేషంలో సీతారామలక్ష్మణుల ఆశ్రమం ఆవరణలో తిరుగుతూ ఉంటుంది. ఆ బంగారులేడిని చూసిన సీతమ్మ ఆ లేడిని తనకు తెచ్చి ఇవ్వవలసినదిగా రాముని కోరితే, రాముడు బంగారులేడి వెనుక వేట బాణాలతో బయలుదేరతారు. కొంచెంసేపటికి రాముని ఆర్తనాదం విన్న సీతమ్మ లక్ష్మణుడిని కూడా రాముని బాట పట్టిస్తుంది.

ఇక మారువేషంలో వచ్చిన రావణాసురుడు సీతను అపహరిస్తాడు. ఆకాశమార్గంలో సీతమ్మని తీసుకునిపోతున్న రావణుడిపై జటాయువు పోరాటం చేసి రెక్కలు పోగొట్టుకుంటాడు.

తిరిగి వచ్చిన రాముని దుఃఖానికి హద్దు ఉండదు. లక్ష్మణ ఓదార్పుతో తేరుకుని శ్రీరామలక్ష్మణులు సీతమ్మని వెతుక్కుంటూ బయలుదేరతారు. మధ్యలో కనిపించిన శబరి ఆతిద్యం స్వీకరించాక, శబరి మాటల ప్రకారం వారిరువురు ఋష్యమూక పర్వతం చేరుకుంటారు.

వాలితో ఉన్న తగువు కారణంగా రాజ్యానికి దూరంగా నివసిస్తున్న సుగ్రీవుడు ఆ పర్వతంవైపు వస్తున్న శ్రీరామలక్ష్మణులను చూసి, తనమంత్రి అయిన హనుమతో వాళ్ళెవరో వివరాలు తెలియగోరతాడు.

అప్పుడు ఆ అంజనిపుత్రుడు శ్రీరామలక్ష్మణుల వద్దకు కామరుపంలో వెళతాడు. కానీ కామరుపంలో ఉన్న హనుమని శ్రీరామచంద్రుడు గుర్తించగా, లక్ష్మణుడు తమ వివరాలు చెప్పగా మళ్ళి రాముడు హనుమ సంభోదిస్తే, హనుమ తన నిజ స్వరూపంతో స్వామిని ఋష్యమూక పర్వతంపైకి తీసుకువెళతాడు.

ఋష్యమూక పర్వతంపై శ్రీరామసుగ్రీవుల స్నేహం కుదురుతుంది. సీత గురించి చెబితే, హనుమ సీతమ్మవారి నగలు తెచ్చి రామునికి ఇస్తాడు. నగలు సీతమ్మవే అని గుర్తించి మరల శ్రీరాముడు దుఃఖిస్తాడు. తరువాత సుగ్రీవుడు తన కధని శ్రీరామునికి చెపుతాడు.

అధర్మంగా సుగ్రీవుని రాజ్యబహిష్కరించి, సుగ్రీవుని భార్య అయిన రుమని వాలి అనుభవించడం విన్న శ్రీరామచంద్రమూర్తి వాలిని చంపడానికే నిశ్చయిస్తాడు. వాలి సుగ్రీవుల ద్వంద్వ యుద్దంలో పూలమాల లేని వాలిని శ్రీరాముడు చెట్టు చాటునుండి బాణంతో కొడతాడు. రామబాణం తగిలిన వాలి రాముని చూసి ఇదేమి ధర్మం చెట్టు చాటునుండి బాణప్రయోగం ఏమిటి ? అని అడిగితే.

దానికి రాముడు వ్యన్యమృగాలను చెట్టు చాటునుండి కొట్టడం ధర్మమే, అందులోను నీవు అధర్మం వైపు ఉన్నావు కాబట్టి ఈ విధంగా శిక్షించాను అని చెబుతాడు. అంగదుడుని సుగ్రీవునికి అప్పగించి వాలి మరణిస్తాడు.

సీతాన్వేషణకు హనుమ, జాంబవంత, అంగద తదితర వానరులు బయలుదేరడం…

సుగ్రీవ పట్టాభిషేకం తరువాయి సుగ్రీవుడు రాజ్యభోగాలలో ఉండి, సీతాన్వేషణ విషయం రాముని విషయం మరుస్తాడు. లక్ష్మణస్వామి ఆగ్రహించి సుగ్రీవుని వద్దకు వస్తే, తార మాటలతో చల్లబడ్డ లక్ష్మణస్వామితో సుగ్రీవుడు క్షమాపణ వేడుకుని, రాముని వద్దకు చేరి, సీతాన్వేషణకు వానరాలను నలుదిశలకు పంపుతాడు.

హనుమతో కూడిన అంగద, జాంబవంతుడు మొదలైన వానరులు దక్షిణంవైపు వెళతారు. అయితే హనుమ రాముని నుండి గుర్తుగా ఉంగరం పొంది ఉంటాడు. అలా దక్షిణదిక్కులో ఉన్న సముద్రం దాటే విషయమై వానరులు అందరూ తర్జనబర్జన పడి, చివరికి హనుమనే వేడుకుని, ఆంజనేయస్వామి శక్తిని వేనోళ్ళ పొగుడుతారు.

ఇతరులు గుర్తుచేస్తేకానీ తనశక్తిని గుర్తించలేని మునిశాపం నుండి విముక్తుడై సీతాన్వేషణకు రామబాణంలా సముద్రం దాటుతాడు, హనుమ.

హనుమ లంకలో కావలి కాస్తున్న లంకిణిని ఓడించి, లంకలో ప్రవేశిస్తాడు. అప్పటికి లంకలో రావణుడు సీతమ్మకి రెండూ మసాల గడువు విదించి వెళతాడు. దుఃఖితరాలుగా సీతమ్మ కూర్చుని ఉన్న చెట్టుపై ఉన్న హనుమ రామకధ వినిపించి, అయిన రాక్షస మాయేమో అని శంకించిన సీతమ్మకి రామచంద్రుని ముద్రికను సీతమ్మకి చూపుతాడు.

తనబుజాలపై కూర్చోతల్లి రాముని చెంతకు చేర్చుతాను అని హనుమ పలికితే, సీతమ్మ రాముడే తనభార్యని అయిన నన్ను యుద్దంలో రావణుడిపై గెలిచి తీసుకువెళ్లాలని చెప్పి, తన చూడామణిని హనుమకి ఇచ్చి పంపుతుంది.

వెనుకకు వెళ్తూ హనుమ వనమంతా చెట్ల కొమ్మలు విరిచి కొంతమంది రాక్షసులను నిర్జిస్తాడు. ఇక రావణుడు కొడుకు బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి, పట్టుబడతాడు, హనుమ. సభలో ఆంజనేయస్వామి తన శక్తిని చూపి రామచంద్రుని శరణువేడుకో అని హితవు చెప్పగా, దానికి బదులుగా రావణుడు ఆంజనేయస్వామితోకకి నిప్పంటించమని చెబుతాడు.

ఎవరు అంటించిన నిప్పు వారినే తగలబెట్టినట్టు, ఆంజనేయ స్వామి తనతోకతో లంకలో కొన్ని భవంతులను కాల్చి మరీ రాముని చెంతకు వెళతాడు.

రామరావణ యుద్ధం – శ్రీరామ పట్టాభిషేకం సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ

సీతమ్మ ఇచ్చిన చూడామణి చూసి రామలక్ష్మణులు, సుగ్రీవాది వానరులతో కలిసి యుద్దానికి బయలుదేరతాడు. సముద్రుడు సహకారంతో సముద్రంపై వారధి ఏర్పరచుకుని రామలక్ష్మణులు యుద్ద సైన్యం అంతా లంక చేరతారు.

యుద్ధం మొదలై అనేకమంది వానర యోధులు యుద్ద విన్యాసాలు, లక్ష్మణస్వామి యుద్దనైపుణ్యం, రామరావణుల సంగ్రామంలో రావణుడు మరణిస్తాడు. రావణమరణానంతరం విభీషణుడికి పట్టాభిషేకం చేసి, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, సుగ్రీవుడు మొదలైనవారితో అయోధ్య చేరతారు. అయోధ్యలో శ్రీరామపట్టాభిషేకం జరిగాక, రామచంద్రమూర్తి పరిపాలనలో అయోధ్య ధర్మపదంలో నడుస్తుంది.

శ్రీరామపట్టాభిషేకంతో సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ ముగుస్తుంది.

రామాయణం రాముని చరితము, హనుమాన్, సుందరకాండ వినడం అంటే అది అదృష్టం అయితే, గురువుగారు చాగంటి కోటేశ్వర రావు గారి నోట పలికిన అమృతపలుకులు వినడం మరీ అదృష్టమే.

తెలుగురీడ్స్.కామ్

అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు తెలుగు బాయ్స్ నేమ్స్, తెలుగు గర్ల్ నేమ్స్ తెలుగురీడ్స్ మొబైల్ యాప్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి మీ ఆండ్రాయిడ్ ఫోనులో…. ఈ క్రింది బటన్ టచ్ చేయండి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

వినాయక విజయం తెలుగు భక్తి మూవీ

వినాయక విజయం విజయవంతమైన తెలుగు భక్తి మూవీ. ఆదిదంపతుల ముద్దుబిడ్డ అయిన వినాయకుడి యొక్క పౌరాణిక సినిమా కధ.

కొత్తగా ఏ పని ప్రారంభించాలన్న వినాయకుడి అనుగ్రహం అవసరం, అటువంటి వినాయక విజయం తెలుసుకుంటే, విఘ్నాలు జయించి విజయంవైపు వెళ్ళడమే అవుతుంది.

ఇక ఈ తెలుగు మూవీ విజయవంతమైన భక్తి మూవీ అయిన వినాయక విజయంలో వినాయకుడు (Vinayaka) పుట్టుకకు కారణాలు చూపుతుంది.

కారణజన్ముడు అయిన ఉమాపుత్రుడిగా వినాయకుడి పుట్టుక, వినాయకుడి శిరస్సు మార్చడం. వినాయకునికి(Vinayaka) దేవతల ఆశీస్సులు అందించడం.

వినాయకుని(Vinayaka) విఘ్నాదిపత్యం, చివరగా మూషికునిపై విజయంతో కద కంచికి మనం ఇంటికి అన్నట్లు సాగుతుంది.

వినాయక విజయం తెలుగు మూవీ సాంకేతిక వర్గం.

బ్యానర్: జగన్మాత ఆర్ట్స్
మూవీపేరు: వినాయక విజయం
పాత్రలు:
బాలవినాయకుడు: బేబీ లక్ష్మీసుధ
వినాయకుడు: ఎంజివి మదన్ గోపాల్
శివుడు: కృష్ణంరాజు
పార్వతి: వాణిశ్రీ
విష్ణువు: రామకృష్ణ

వినాయకుడి పుట్టుక కారణాలు ఒక రాక్షసుని వరం అని అంటారు. మూషిక రాక్షసుని వరం ఈ విధంగా ఉంటుంది.

అయోనిజుడు, అకుంటిత దీక్షాపరుడు, బ్రహ్మచర్య దీక్ష, జితేంద్రియుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు, గుణశ్రేష్టుడు, సురశ్రేష్టుడు, సర్వశక్తిసంపన్నుడు అయిన మహావీరుడు అయి బ్రహ్మ సృష్టిలో పుట్టకుండా ఉన్న వ్యక్తి చేత అంతం అయ్యే అవకాశం మూషిక రాక్షసుడికి మరణం సంభవించాలి.

ఆ కారణం లోక కళ్యాణం (Vinayaka Vijayam) అయింది. మన అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడు (Vinayaka)వచ్చాడు.

వినాయక విజయం భక్తి మూవీ కధ ప్రారంభం

కైలాసంలో ఆదిదంపతులు లక్ష్మినారాయణులు, బ్రహ్మాది దేవతలతో కొలువుదీరిన సభతో మూవీ ప్రారంభం అవుతుంది. ఆ యొక్క సభలో దేవతలందరూ త్రిపుసారుల సంహారం అయ్యింది.

కానీ మరలా వారి వారసులు మూషికుడు వలన మరియు గజాసురుడు వలన భవిష్యత్తులో ఇంద్రాది దేవతలకు ఇబ్బందులు కలగవచ్చు అని సందేహం నారద మునీంద్రులు వెలిబుచ్చుతారు.

అందుకు ప్రతిగా శ్రీమహావిష్ణువు ఆదిదంపతులైన పార్వతిపరమేశ్వరులు ఇరువురు కలసి కైలాసంలో ఉండగా లోకాలలో ఎవరికీ ఏ ఇబ్బంది రాబోదని వెల్లడి చేస్తారు.

మరొక సన్నివేశంలో మూషికుడు, గజాసురుడు సభలో కొలువు తీరి ఉండగా నారద మహాముని వేంచేస్తారు. ఉచితాసినులు అయిన నారద మునీంద్రులు వారికి కైలాస సభ ప్రస్తావన తెచ్చి, హరిహరుల సహకారంతో రాక్షస జాతిని అంతమొందించాలని దేవతల ప్రయత్నం అని చెబుతారు.

దానికి మేము అంతకముందే దేవతలను అంతం చేస్తాం అని బదులు ఇస్తాడు మూషికుడు అయితే ఇంతకుముందు చాలామంది రాక్షసులు పలికి ఫలితం సాధించాలేకపోయరని ప్రతిగా బదులు పలుకుతారు నారద మునీంద్రులు.

శక్తితో శివుడు కలిసి ఉన్నన్నాళ్ళు ఎవరికీ అపాయం రాదని చెబితే, వారిని భక్తితో వేరు చేస్తానని గజాసురుడు పలుకుతాడు. ఇంద్రుడిని జయించి స్వర్గాన్ని జయిస్తానని మూషికుడు పలుకుతాడు.

మూషికుడు భార్య ప్రియంవద మాత్రం చాల ప్రాతివత్యం కలిగి, జగన్మాతను ఆరాధిస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు తన పతి యోగక్షేమాలు కోరుతూ పూజలు చేస్తూ ఉంటుంది.

ఇక మూషికుడికి ఇతరుల మనస్సును కొంతసేపు మాయచేసి తానూ అనుకున్న మాయ వారిపై ప్రయోగించకలడు. ఈ విద్యను పూజామందిరంలో ఉన్న తన భార్యపై ప్రయోగించి చూపుతాడు.

మరొక సన్నివేశంలో గజాసురుడు శివుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు, అత్యంత భక్తి శ్రద్దలతో శివుడిని అర్చిస్తూ ఉంటాడు.

దేవేంద్రుడు దుర్వాస మహర్షి చేత శపించబడడం, వినాయక విజయం తెలుగు భక్తి మూవీ.

తరువాతి సన్నివేశంలో ఇంద్రసభకు దూర్వాస మహర్షి వేంచేస్తారు, అప్పుడు దేవేంద్రుడు ఆ మునీంద్రుడుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారు.

సంతసించిన ముని తన తపఃప్రభావమైన ఒక మాలను ఇంద్రుడికి ఇస్తాడు. అప్పుడే మూషికుడు కూడా అక్కడ జరుగుతున్న సన్నివేశం చూస్తాడు. ఇంద్రుడిపై మూషికుడు తన విద్యను ప్రదర్శించి, మహామునిపై దుర్భాషలాడేవిధంగా ప్రేరేపిస్తాడు.

దాంతో ఇంద్రుడితో అహంకారపూరితమైన మాటలు మాట్లాడతాడు. దూర్వాస ముని ఆగ్రహానికి కారణం అయ్యేలా చేస్తాడు. ఇంద్రుడి ప్రవర్తన కారణంగా కోపగించిన ముని దేవేంద్రుడు పదవి కోల్పోయి రాక్షసులచే పీడీంపబడతావని శపించి అక్కడ నుండి నిష్క్రమిస్తారు.

మాయ తొలగగానే నేనెందుకు ఇలా ప్రవర్తించానని దేవేంద్రుడు చింతిస్తుంటాడు. అందుకు అక్కడకు వచ్చిన నారద మహర్షి, నీవు మూషికుని మాయప్రభావం వలన అలా ప్రవర్తించావని చెబుతాడు. అతని దుర్బుద్ధితో నీమీద ఈ ప్రయోగం చేసాడని వివరిస్తారు.

నారదుడు ఆ తరువాతి సన్నివేశంలో పార్వతి మాత వద్దకు వెళతాడు. శివుని గురించి గజాసురుడు చేస్తున్న భక్తిపూర్వకమైన తపస్సు సంగతి చెబుతాడు. అందులో అంతర్యం కూడా పార్వతి మాతకు వివరిస్తాడు.

పరమేశ్వరా అంటే పరిగెత్తుకెళ్ళి మరీ వరాలిచ్చే శివుడితో జాగ్రత్త అని చెబుతారు. అయితే పరమశివుడు మాయలు చేయని మహాదేవుడు, భక్తులు కోరికలు నెరవేర్చే భాక్తపరాదినుడు అని అంటుంది పార్వతి మాత.

ఈలోపు పరమేశ్వరులు అక్కడికి వేంచయగానే నారద మహర్షి నిష్క్రమిస్తారు. పార్వతి మాత మహాదేవుని గజాసురుడు సంగతి అడిగితే, భక్తులు కోరిక నెరవేర్చడమే నా కర్తవ్యం అని బదులిస్తే, తర్వాతి సన్నివేశం గజాసురుని తపఃప్రాంతంలోకి.

తపస్సు చేస్తున్న గజాసురుడు ఎంతకీ, శివుని అనుగ్రహం కలగలేదని, నీ కరుణలేని ఈ జన్మ నాకొద్దని తనతలని తానే నరుక్కోబోతాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమైతే, అప్పుడు గజాసురుడు శివుని చూసి స్త్రోత్రం చేస్తాడు.

ముక్కంటి, గౌరీమనోహరా, గంగాధరా కరుణించితివా అని శివుని కాళ్ళపై పడతాడు. అప్పుడు శివుడు నీ భక్తికి మెచ్చా, వరం కోరుకో అంటాడు. గజాసురుడు నీవు నా గర్భంలో కొలువు అయి ఉండాలి అంటాడు, అప్పుడు పరమశివుడు, ఈ కోరిక వలన విపరీత పరిణామాలు వస్తాయని వారించినా, వాటికి నేనుసిద్దం నీ నా గర్భంలో కొలువు కమ్మని వేడుకుంటాడు, గజాసురుడు.

శివుడు గజాసురుడి గర్భంలోకి శివలింగంగా వెళతాడు. ఇక మూశికుడి ఆగడాలు మొదలవుతాయి. మూషికుడు ఇంద్రుడిని ఓడించి, స్వర్గాన్ని ఆక్రమించి, తానూ ముల్లోకాలకు ప్రభువుగా ప్రకటించుకుంటాడు.

తల్లిచేతిలో పుట్టిన వినాయకుడు (Vinayaka), తండ్రి చేతితో మరలా బ్రతకడం

ఇంద్రాది దేవతలు, మునీంద్రులు బ్రహ్మలోకం వెళ్లి, బ్రహ్మదేవులకు మూషికుని గూర్చి మొరపెట్టుకుంటారు. భ్రాహ్మగారు మూషికుడు వరసంపన్నుడు అంటాడు. ఇంకా అతను అంతం అవ్వాలంటే, అయోనిజుడు, అకుంటిత దీక్షాపరుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు, జితేంద్రీయుడు, గుణశ్రేష్టుడు, సురశ్రేష్టుడు సర్వశక్తి సముపార్జుతుడు మరియు నా సృష్టిలో జన్మించనివాడు అయి ఉండాలి.

అని చెప్పి, ఆ జగజ్జనని శరణు వేడండి అని చెబితే, దేవతలు పార్వతి మాతను కలిసి ఈ విషయం మొరపెట్టుకుంటారు. అప్పుడు పార్వతిమాత పరమశివులు లేరు, శివుడు లేకుండా నేనేమి చేయలేనని చెబితే, దేవతలు శ్రీమహావిష్ణువుని ప్రార్ధిస్తారు.

ప్రత్యక్షమైన ఉపేంద్రుడు పార్వతిమాతలో మోసాన్ని మోసంతో జయించాలి, మేము శివుడిని ఆ గజాసురుని గర్భం నుండి బయటికి తీసుకువస్తాం అయితే, మా ప్రయత్నానికి తోడుగా నీవు కూడా శివుడు వచ్చేవరకు భగ్నం కలగకుండా శివదీక్ష చేయమని అంతర్ధానం అవుతాడు.

అభ్యంగన స్నానం చేయబోతు పార్వతిమాత దేవతలు చెప్పిన సుగుణాలు కలిగిన కుమారుని ఆలోచన చేస్తూ, తన చేతిలో ఉన్న పసుపుముద్దతో బాలుడి బొమ్మను చేస్తుంది. ఆ బొమ్మ బాలుడుకి జగన్మాత ప్రాణం పోస్తే, బాలుడికి(Vinayakudiki) పార్వతి మాత తన శక్తి ఆయుధం ఇచ్చి, నేను శివదీక్ష చేస్తున్నాను కావున, ఎవరు మందిరప్రవేశం చేయకుండా కావలి కాయమని చెప్పి, పార్వతి మాత శివదీక్షలో ఉంటుంది.

గజాసురుడు సభలో కొలువై ఉండగా, విష్ణువు, బ్రహ్మాదిదేవతలు మారువేషంలో వచ్చి ఎద్దులతో నృత్యప్రదర్శన చేసి, అతడిని మెప్పిస్తారు. అప్పుడు గజాసురుడు మీకు కావాల్సినది కోరుకోమంటాడు.

బదులుగా బ్రహ్మ, విష్ణువులు నీ గర్భంలో ఉన్న శివుడుని ఇచ్చేయమని చెబుతారు. గజాసురుడు దేవతలతో శివుడిని మీరే మెప్పించి తీసుకువెళ్ళండి అని బదులుఇస్తాడు. బ్రహ్మవిష్ణువుల స్త్రోత్రానికి శివుడు గజాసురుని గర్భం చీల్చుకొని బయటకి వస్తే, పరమశివుని చూసి గజాసురుడు ఎప్పుడూ నిన్ను చూస్తూ నీ చెంత ఉండే వరం ఇవమని కోరతాడు, శివుడు అనుగ్రహిస్తాడు.

కైలాస ప్రవేశం చేయబోయిన పరమశివుని పార్వతి పుత్రుడు(Vinayakudu) అడ్డగిస్తాడు. శివుడు వారించి చూసిన ఎదురించే బాలుని(Vinayakuni) శిరస్సు ఖండించి, శిరస్సుని ముక్కంటితో దగ్ధం చేస్తాడు. పుత్రుడి ఆర్తనాదంతో బయటకు వచ్చిన పార్వతిమాత విచారిస్తుంది.

అప్పుడు బ్రహ్మవిష్ణువులు ఆ బాలుడుని మేము పునర్జీవుడిని చేస్తాం, కానీ శిరస్సు ఏది పెట్టాలని అంటారు. పరమశివుడు, నంది-బృంగిలను పిలిచి, ఎవరు ఉత్తరదిక్కుకి తలపెట్టుకుని పడుకుంటే, వారి తలను తీసుకురమ్మని చెబుతారు.

శివుని ఆజ్ఞతో బయలుదేరిన వారికి ఉత్తరదిక్కుగా తలపెట్టుకుని నిద్రిస్తున్నఏనుగు మాత్రమే కనిపిస్తుంది. ఉత్తరదిక్కుగా తలపెట్టుకుని పడుకోవడం అంటే దక్షిణ యమస్థానాన్ని చూడడం అని అనుకుని, ఆ ఏనుగు తలని తీసుకుని కైలసానికి వెళతారు.

పార్వతి మాత అంత అందమైన బాలుడికి (Vinayakudiki) ఈ ఏనుగు తలా అని భాదపడితే, నారదుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నీ బిడ్డడు కారణ జన్ముడు అతను ద్విజన్ముడు, ద్విముఖుడు కావాలి కాబట్టి అంగీకరించమని అడుగుతారు.

అలాగే నీ బిడ్డడికి సర్వదేవతా శక్తులు వస్తాయని చెబుతారు. పార్వతి మాత అంగీకారం తరవాత ఏనుగు తలని ఆ బాలుడి(Vinayakudi) కి అతికిస్తారు. ఆ బాలుడు గజముఖుడై గజాననుడుగా మారతాడు.

గజాననుడు విఘ్నాదిపతిగా మూషికుడిని ఓడించి వినాయక విజయం పొందడం (Vinayaka Vijayam).

తరువాయి శాస్త్రోక్తంగా ఆ బాలుడికి బ్రహ్మోపదేశం చేసి తపస్సుకి పంపిస్తారు, పార్వతి పరమేశ్వరులు. తపస్సు విజయవంతంగా పూర్తిచేసుకుని వచ్చిన గజాననుడికి నారద మహర్షి కుమారస్వామిని తమ్మునిగా పరిచయం చేస్తారు. తపస్సు పూర్తిచేసుకుని జితేంద్రీయుడైన పుత్రుని చూసి, గణాధిపతిని చేయదలస్తే,  గణాధిపత్యానికి కుమారస్వామి పోటిపడితే, ఇద్దరికీ ఒక పరీక్షను పార్వతి పరమేశ్వరులు పెడతారు.

ఎవరైతే, ముమ్మారు విశ్వప్రదక్షణ చేస్తారో, వారికీ గణాధిపత్యం ఇవ్వడం జరుగుతుంది అని చెబుతారు. వెంటనే కుమారస్వామి పోటిలో విజయం సాధించడానికి తనవాహనం అయినా నెమలిపై బయలుదేరితే, గజాననుడు ఆలోచన చేసి, తల్లిదండ్రుల వలననే విశ్వం ఉంటే, విశ్వకారకులైన తల్లిదండ్రుల పాదపూజ చేసి ముమ్మారు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే, కుమారస్వామి వెళ్ళిన ప్రతిచోట గజాననుడు ఎదురువస్తూ కనబడతాడు.

ప్రదక్షిణ పూర్తిచేసి వచ్చిన కుమారస్వామి గజాననుడి గెలుపు అంగీకరించి, గణాదిపత్యం అన్నగారికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆవిధంగా గజాననుడు పార్వతి పరమేశ్వరుల పాదపూజ ద్వారా గణముల అన్నింటికీ అధిపతి అయ్యి, విఘ్నేశ్వరుడుగా పిలవబడతాడు.

మూషికుడు గర్విష్టి అయ్యి బందించిన ఇద్దరి దేవతా జంట కోరిక మేరకు వినాయకుడు వారికి మేలు చేయదలచి, మూషికుడుని యుద్దంలో ఓడిస్తాడు, అప్పుడు మూషికుని భార్య ప్రియంవద భక్తికి మెచ్చిన పార్వతిమాత మూషికుని రక్షిస్తే, జగన్మాత మూషికుని గతజన్మ దేవతలకు వివరించి, మూషికుని వినాయకుడిని శరణువేడమంటే, మూషికుడు వినాయకుడిని శరణువేడి వినాయకుడి పాదాల వద్ద ఎలుకగా ఉంటాడు. అతని భార్య వినాయకునికి చత్రమై భర్త చెంతనే ఉంటుంది. వినాయకుడుకి జగన్మాతకి అభేదంగా చెబుతూ వినాయక విజయం విజయవంతం అవుతుంది.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

తెలుగు చిన్న పిల్లల పేర్లు మొబైల్ యాప్ .