Monthly Archives: September 2019

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

అలనాటి పాత తెలుగు సినిమాలలో నలదమయంతి తెలుగుభక్తి సినిమా ఒక్కటి. ఈ తెలుగు సినిమాలో నలమహారాజు, దమయంతిల వివాహ ఘట్టం నుండి సన్నివేశాలు ఉంటాయి.

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

నలదమయంతి కధ మహాభారతంలో ధర్మరాజు విన్న కధలలో ఒక్కటి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, అగ్రజుడు అయిన ధర్మరాజు ఈ కధ వింటాడు. ఇక ఈ సినిమా అయితే నలదమయంతిల హంసరాయభారంతో ప్రారంభం అవుతుంది. హంస రాయభారంతో నలుడికి దమయంతి మీద, దమయంతికి నలుడి మీద ఒకరంటే ఒకరికి ఇష్టం మానసికంగా ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. దానికి నలుడు కూడా బయలుదేరతాడు.

దమయంతి అందచందాలు గురించి, గుణగణాలు గురించి బాగా విన్న దేవతలు ఆమెను పరీక్షించాలనుకుంటారు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యమధర్మరాజు నలుడు దగ్గరకు వచ్చి, ముందుగా ఒక మాట తీసుకుంటారు. వారికి నలుడు ప్రతిజ్ఙ చేస్తాడు, మీరు చెప్పిన పనిని చేసిపెడతానని. వెంటనే వారు దమయంతికి తమగురించి గొప్పగా చెప్పి, తమలో ఎవరినైనా ఒకరిని వరించేలా, ఆమె మనసుని మార్చమని అడుగుతారు. నలుడు నేనెలా అంత:పుర కన్యతో మాట్లాడేది, అనగా దానికి వారు నలుడు అదృశ్యమయ్యే శక్తిని ఇస్తారు.

అంత:పురంలో దమయంతి ఒంటరిగా ఉన్నప్పుడు, నలుడు అక్కడికి వస్తాడు, ఆమెకు దేవతలు గురించి చెబుతాడు. అయితే ఆమె నలుడే తన భర్త అని తేల్చి చెబుతుంది. ఈ విషయం తెలుసుకున్న దేవతలు స్వయంవరం సభలో తాము కూడా నలుడులాగా మారి, సభాసినులై ఉంటారు. స్వయంవరంలో అయిదుగురు నలుడులు కనిపించేసరికి, దమయంతి అమ్మవారిని ప్రార్ధిస్తుంది. అప్పుడు దమయంతికి అమ్మవారు అంతర్లీనంగా ఒక సూచన చేస్తుంది. ”దేవతలు కనురెప్ప వేయరు, ఎవరు కనురెప్పలు వేస్తూ ఉంటారో అతనే నలుడు” అని చెప్తుంది. దానితో దమయంతి నలుడినే వరిస్తుంది.

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

నలదమయంతిలకు ఇద్దరు పిల్లలు కలుగుతారు. అయితే సోదరుడు పుష్కరుడు చేసిన మోసపూరిత జూదంలో రాజ్యాన్ని కోల్పోతాడు. దమయంతి పిల్లలను తన పుట్టింటికి పంపించేసి, తాను నలుడితో కలసి కానలకు వెళ్తుంది. అడవులలో నలదమయంతిలకు తినడానికి ఏమి దొరకక నానా కష్టాలు పడుతూ ఉంటారు. అప్పుడు నలుడు దమయంతి ”ఇన్ని కష్టాలు నాతో నీకెందుకు, నీవు నీ పుట్టింటికి వెళ్లు” అంటాడు. అందుకు బదులుగా దమయంతి నలుడితో ”త్రిమూర్తులు కన్నా నాకు మీరే మిన్న అన్నట్టుగా” పలికి ఆమె అతనితోనే ఉంటుంది. ఆమెతోనే ఉంటే ఆమె పుట్టింటికి వెళ్లకుండా నాతోనే ఉండి ఈ అష్టకష్టాలు పడుతూనే ఉంటుందని భావించిన, నలుడు ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమెను ఆ అడవిలో వదిలేసి వెళతాడు.

దమయంతి నిద్రలేచి చూసేసరికి ఒక కొండచిలువ ఆమెకు కనబడుతుంది. ఆమె తప్పించుకునే లోపు ఆమెను కొండచిలువ చుట్టుముడుతుంది. ఆమె ఆర్తనాదం విన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కొండచిలువను చంపి, ఆమెను రక్షిస్తాడు. తర్వాత దమయంతి వారి గూడెంకు వెంటబెట్టుకుని వెళతాడు.

ఇక మరొ ప్రక్క నలుడు అడవిలో నడుస్తూ, ఆకలితో అలమటిస్తుండగా అక్కడ దగ్గరిలో మంటలలో ఉన్న పాము ఒక్కటి కనిపిస్తుంది. నలుడు వెంటనే పాముని మంటలలో నుండి కాపాడతాడు. వెంటనే పాము నలుడి కాలుపై కాటు వేస్తుంది. దానితో నలుడు తన అందమైన రూపం కోల్పోయి, వికృత రూపంలోకి మారతాడు. అప్పుడు ఆ పాము ఒక మానవరూపంలో ప్రత్యక్షమై, ఇది నీ మేలుకే వచ్చింది. ఈ రూపంలోనే నీవు ఆయోధ్యాధీశుడు అయిన ఋతుపర్ణుడిని సేవించమని చెప్పి అంతర్ధానం అవుతాడు.

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

దమయంతి ప్రాణాలను కాపాడిన వాడే, దమయంతిని బలత్కారం చేయబోతాడు, అప్పుడు ఆమె పరాశక్తిని ప్రార్ధించడంతో, దమయంతి అక్కడి నుండి రక్షించబడుతుంది. తర్వాత దారిలో కొందరి బాటసారుల ద్వారా ఆమె తన తండ్రి ఇంటికి చేరుతుంది.

నలుడు ఋతుపర్ణుడి దగ్గర బాహుకుడు అను నామధేయంతో సేవకుడిగా చేరతాడు. ఇలా విధి విలాసంలో భాగంగా వేరు అయిన నల దమయంతులు చివరికి ఎలా కలుసుకున్నారు. విడదీసిన విధే తిరిగి వారు కలవడానికి ఎలా సహకరించింది? ఈ విధంగా చిత్రం సాగుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ

బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ. ఎన్.టి. రామారావు, ఎస్వీ రంగారవు, రేలంగి, సి.యస్.ఆర్. అంజలీదేవి, రాజసులోచన, సూర్యకళ, హేమలత తదితరులు నటించారు.

వేదాంతం రాఘవయ్యగారు బాలనాగమ్మ తెలుగు మూవీకి దర్శకత్వం వహించారు.

బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ

రాజదంపతులకు పిల్లలు లేక బాధపడుతుండగా, ఒక సన్యాసి వచ్చి వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉందని, వెంటనే ఈశ్వరుడిని ప్రార్ధించమని చెబుతాడు. దానితో మహారాణి ఆలయానికి వెళ్లి పరమభక్తితో పరమేశ్వరుడిని పూజిస్తుంది.

సంతోషించిన ఈశ్వరుడు ”ఈశాన్య దిక్కున ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు ఆరగించు, ఇతోదకమైన సంతానం కలుగుతుంది” అని ఆకాశవాణిగా పలుకుతాడు. మహరాణి వెంటనే చెట్టు దగ్గరకు వెళుతుంది.

చెట్టున ఉన్న ఫలాలు మహారాణి భూలక్ష్మికి అందకపోవడంతో ఆమె అక్కడే చెట్టు క్రింద ఉన్న పుట్టపై కాళ్లు పెట్టి, చెట్టు కొమ్మల నుండి అందినంతలో ఉన్న ఫలాలను కోసుకుని, క్రిందికి దిగుతుంది.

అలా మహారాణి పుట్టమీద నుండి క్రిందికి దిగగానే, ఆమె చెంగులో ఉన్న ఫలాలు ఒక్కటి మినహా మిగిలినవి అన్ని మరలా చెట్టుకి చేరతాయి. ఇక అక్కడి పుట్టలోని నాగరాజు మానవరూపంలో ప్రత్యక్షమై, మహారాణిని పేరాశకు, ఆమె చేసిన తప్పుకు శిక్షించదలుస్తాడు.

అయితే నేను తల్లిని అయ్యేవరకు నాకు గడువు ఇవ్వవలసినదిగా మహారాణి, నాగరాజుని ప్రార్ధన చేయడంతో, నాగరాజు బిడ్డ పుట్టిన ఆరుమాసాలకు తిరిగి వస్తానని, అప్పుడే నిన్ను కాటువేసి చంపుతానని చెప్పి అంతర్ధానం అవుతాడు.

ఈ విషయం మహారాజుకు చెప్పకుండా మహారాణి భూలక్ష్మి దాచి ఉంచుతుంది. కొన్నాళ్లకు వారికి ఏడుగురు ఆడ శిశువులు జన్మిస్తారు. అయితే దు:ఖిస్తున్న రాణిని, విషయం అడిగి తెలుసుకున్న మహారాజు మొత్తం నాగులన్నింటిని చంపించే ప్రయత్నం చేస్తాడు.

కానీ వారి ప్రయత్నం అలా సాగుతున్నా నాగరాజు అంత:పురంలోకి వచ్చి మహారాణిని కాటువేసి వెళ్లిపోతాడు. పసిపిల్లలను పెంచకుండానే మహారాణి ప్రాణాలు విడుస్తుంది. మహారాజు తనకు పుట్టిన ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటాడు.

ఏడుగురు పిల్లల్లో ఆఖిరి పిల్లపేరు బాలనాగమ్మ.

ఏడుగురు పిల్లల్లో ఆఖిరి పిల్లపేరు బాలనాగమ్మ. పిల్లలు పట్టు మేరకు మహారాజు మరోరాణి మాణిక్యాన్ని వారికి తల్లిగా తీసుకువస్తాడు. మొదట్లో ఆమె పిల్లలను బాగానే చూసుకుంటుంది. కానీ చెలికత్తె చెప్పుడు మాటలకు మాణిక్యం మనసులో స్వార్ధం పెరిగి, పిల్లలను నానా కష్టాలకు గురి చేస్తూ ఉంటుంది.

రాజుకు ఈ విషయం తెలిసి రాజు ఆగ్రహించి, మాణిక్యాన్ని దాసిని చేస్తాడు. తర్వాత మాణిక్యం తన చెలికత్తె సహకారంతో రాజుకు మందు పెట్టి, మహారాజును వశపర్చుకుంటుంది. తనకు వశపడిన రాజుని, నీ పిల్లలని చంపేయమని రాజుకు చెబుతుంది. మాణిక్యానికి వశపడి ఉన్న రాజు, మాణిక్యం మాటానుసారం చిన్న పిల్లలను చంపడానికి అడవికి తీసుకువెళతాడు.

అక్కడ చంపలేక వారిని అక్కడే వదిలేసి, తన రాజ్యానికి వెళ్లిపోతాడు. తిరిగి వెళ్లిన రాజు, మాణిక్యం రాణిగా ఉంటే, రాజు పూర్తిగా అమెకు వశపడి ఉంటాడు. తర్వాత ఆ పిల్లలు అడవిలోనే పెరుగుతారు.

పానుగంటి పురం రామవర్తికి తన చెల్లెలు అయిన భూలక్ష్మి కోల్పోవడంతో, ఆమె పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు. అతనికి ఏడుగురు కొడుకులు, ఆఖిరివాని పేరు కార్యవర్తి. అడవిలో భూలక్ష్మి పిల్లలు పెరిగి పెద్దవుతారు.

భూలక్ష్మి అన్న రామవర్తి పిల్లలు కూడా తమ మేనత్త పిల్లల జాడ కోసం ప్రయత్నిస్తూ పెరుగుతారు. వరుస అయిన ఏడు జంటలు విడివిడిగా పెరిగి యుక్త వయస్సుకు వచ్చాక వారు ఒకరినొకరు తారసపడే అవకాశం వస్తుంది.

రామవర్తి అనుజ్ఙతో అతని ఏడుగురు పిల్లలు తమ మేనత్త సంతానం ఎక్కడ ఉందో వెతుకుతూ అడవికి వస్తారు. ఆ అడవిలో వారు కలుసుకోవడం, వారికి పెళ్లిళ్లు కూడా జరుతాయి.

పెళ్లైన తర్వాత బాలనాగమ్మకు ఒక పిల్లవాడు జన్మిస్తాడు, తర్వాత ఆమె మాంత్రికుడి చేత అపహరింపబడుతుంది. ఆమెను దక్కించుకోవాలని మాంత్రికుడు, బాలనాగమ్మను బంధించి ఉంచుతాడు.

బాలనాగమ్మని విడిపించడానికి వెళ్లిన కార్యవర్తి మాంత్రికుడి మంత్రప్రభావంతో శిలగా మారిపోతాడు. చివరకు బాలనాగమ్మ కొడుకు వచ్చి తన తల్లిదండ్రులను విడిపిస్తాడు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది.

అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా. రేవతి-బలరాముల ఆడబిడ్డ శశిరేఖని, సుభద్ర-అర్జునుల మగబిడ్డ అభిమన్యునికి ఇచ్చి వివాహాం చేయాలని, వారి బాల్యంలోనే పెద్దలు మాటలు ఇచ్చిపుచ్చుకుంటారు. అటుపై సుభద్ర అభిమన్యుని తీసుకుని తన మెట్టింటికి బయలుదేరుతుంది.

శ్రీకృష్ణుడు పాండవులు రాజసూయ యాగం నుండి ద్వారకకు తిరిగి వస్తూ, ధర్మరాజు ఇచ్చిన బహుమతులను తీసుకుని వస్తాడు. వాటిని బలరాముడికి, శశిరేఖకు బహూకరిస్తాడు. బలరామునికి ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”దానిపై నిలబడిన ఎవరైనా సరే, వారి మనసులోని కుఠిలం స్వయంగా వెల్లడి చేసేస్తారు.” ఇంకా శశిరేఖకు ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”ఆ పెట్టెని తెరిచి చూస్తే మనసులో ఏది ఎక్కువ ఇష్టంగా ఉంటే ఆ వస్తువు కానీ లేక ఆ వ్యక్తికాని కనబడతారు” దానిని తెరిచి చూసిన శశిరేఖకు తన బావ అభిమన్యుడు కనబడతాడు.

నిండు సభలో ద్రౌపదికి అవమానం

శ్రీకృష్ణుడు వేరొక చోట ఉండగానే, పాండవులకు జగిరిన అన్యాయం తెలుసుకుంటాడు. అప్పుడు నిండుసభలో ద్రౌపదిపై జరిగిన ఆకృత్యం కూడా స్వామికి తెలయబడడం, ఆమెకు శ్రీకృష్ణ భగవానుడు తనమహిమచేత నిరంతర వస్త్రం ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు పరధ్యానంలోకి వెళ్లడం గమనించిన బలరాముడు, శ్రీకృష్ణుడిని ఏమయ్యిందని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు, తనవారితో పాండవులకు జరిగిన అన్యాయం గురించి, కౌరవులు వడిగట్టిన దారుణాలను వివరిస్తాడు. వెంటనే బలరాముడు ”నేను ధర్యోధనుడిని హెచ్చరించి, పాండవులు రాజ్యాన్ని పాండవులకు తిరిగి వచ్చేలా చేస్తానని” ద్వారక నుండి హస్తినాపురానికి బయలుదేరతాడు.

హస్తినాపురంలో ధర్యోధనుడుకి బలరాముడు వస్తున్నాడనే సమాచారంతో దిగులు చెందుతుంటే, అతని మేనమామ శకుని ”ఎందుకు..దిగులు, బలరాముడుని స్థుతి చేయడం ద్వారా అతనిని ఇట్టే ప్రసన్నం చేసుకోవచ్చును, కావునా బలరాముడికి బ్రహ్మరధం పట్టేవిధంగా ” ఆహ్వానం పలకమని చెబుతూ ఇంకా ”మన లక్ష్మణ కుమారునికి, బలరాముని కూతురు శశిరేఖను ఇచ్చ వివాహం చేయమని అడుగు, ఈ వివాహం జరిగితే భవిష్యత్తులో యాదవ వంశంవారు అంతా మనవైపే ఉండవలసి ఉంటుంది” అని బోధ చేస్తాడు. శకుని సలహాతో ధర్యోధనాధులు సంతోషిస్తారు. మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ.

బలరామునికి ధర్యోధనుడు సకల మర్యాదలు చేసి, ఆసనం వేసి పాదసేవ చేస్తూ ఉంటు అన్ని విషయాలు తమకు అనకూలంగా ఏకరువు పెడతారు. పాండవులు తప్పు చేసినట్టుగా, పాండవులపై ఆరోపణలు చేస్తూ బలరాముడికి ధుర్యోధనాదులు మాటలు ఎక్కిస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణ కుమారుడుకు, శశిరేఖను ఇచ్చి వివాహం చేయవలసినదిగా వరం కోరతాడు, ధర్యోధనుడు. అప్పటికే ధర్యోధనుడు కపట మర్యాదలకు సంతోషించిన బలరాముడు, ధర్యోధనుడు కోరికకు అంగీకారం తెలుపుతాడు. అక్కడి నుండి బలరాముడు, ధర్యోధనుడు ఇచ్చిన అనేక కానుకలను స్వీకరించి తిరిగి ద్వారకకు వస్తాడు.

పాండవులు వనవసానికి వెళ్ళే పమయం

పాండవుల వనవాసానికి వెళ్లే సమయంలో సుభద్ర తన వీరకుమారుడు అభిమన్యునితో కలసి, శ్రీకృష్ణుడి నివాసానికి చేరుతుంది. అయితే ధర్యోధనుడికి ఇచ్చన మాటకు లోబడిన, రేవతి-బలరాములు శశిరేఖను, అభిమన్యునితో కలవకుండా కట్టడి చేస్తారు. శశిరేఖా-లక్ష్మణ కుమారుల వివాహం నిశ్చయం చేస్తారు. సుభద్ర బలరాముడిని తనకు ఇచ్చిన మాట గురించి అడిగినా, రేవతి, బలరాముల మనసు మారదు. దాంతో సుభద్ర అభిమన్యుని తీసుకుని, పాండవుల దగ్గరకు బయలుదేరుతుంది.

అయితే అడవిలో భీమసేనుడి కుమారుడు అయిన ఘటోత్కచుడు ఉన్న చోటికే అభిమన్యుడు చేరుకుంటుండగా, ఘటోత్కచుడు-అభిమన్యుడికి యుద్దం జరుగుతుంది. చివరికి సుభద్ర ప్రతిజ్ఙ చేయబోతూ తనవారి పేరు చెప్పడంతో…వెంటనే ఘటోత్కచుడు సుభద్ర కాళ్లపై పడి శరణు వేడుకుంటాడు. తను ఎవరో చెబతాడు. సుభద్ర, అభిమన్యులు ఘటోత్కచుని ఆహ్వానం మేరకు, వారి నివాసానికి చేరతారు. శశిరేఖా పరిణయం గురించి వివరం తెలుసుకున్న ఘటోత్కచుడు, ద్వారకలో శ్రీకృష్ణుడిని కలుసుకుంటాడు. అక్కడి ఇరువురి మాయా పధకంలో భాగంగా అసలు శశిరేఖని అభిమన్యుని దగ్గరకు చేర్చి, ఘటోత్కచుడు శశిరేఖ వేషంలో లక్ష్మణ కుమారునితో వివాహ ప్రక్రియలో పాల్గొంటాడు. ఇక అక్కడి సినిమాలో తిరిగే మలుపులు మనసుని మరింత రంజింప చేస్తాయి. శ్రీకృష్ణుడి పర్యవేక్షణలో ఘటోత్కచుని మాయాప్రభంజనం ధుర్యోధనాదులను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందీ…వివరణ కన్నా వీక్షణ బాగుంటుంది. మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు

కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు తెలుగు ఓల్డ్ మూవీ. తెలుగు ఓల్డ్ మూవీలో పెద్దమనుషులు సినిమా కొందరి పెద్దమనుషుల మసుగును చూపుతుంది.

తెలుగులో గల ఓల్డ్ మూవీస్ చూడడానికి మనసు మొరాయించ వచ్చును. కానీ మనసుకు మేలు కలిగించే విషయాలు పాత సినిమాలలో కూడా కనబడతాయి.

వాస్తవాలకు దూరంగా అవసరాలకు అనుగుణంగా మాట ఎలా మారుతుందో ఆలోచన చేస్తే, పెద్ద మనుషుల ప్రవర్తన, వారి మాటలు ఇంకెంతలాగా అవసరానికి అనుగుణంగా వాస్తవాలను దాస్తాయో పెద్దమనుషులు సినిమా చూస్తే అవగతమవుతుంది.

బయట సన్మానాలు సత్కారాలు, వారి మాటకు తిరుగు ఉండదు, ఇంట్లో వారి మాటకు విలువ ఉండదు. సమాజంలో అవసరానికి దణ్ణం పెడితో, ఇంట్లో అవసరం ఉన్నా పట్టించుకోని బంధాలతో సాగే పెద్దమనుషుల కధే ఈ చిత్రం.

ఒక ఊరిలో అయిదుగురు పెద్ద మనుషులలో నలుగురు పెద్దమనుషుల జీవితం పైన వివరించనట్టే ఇంటాబయటా కూడా అలానే ఉంటుంది. అయితే అందులో అయిదో పెద్దమనిషి మాత్రం ఇంటా బయటా గౌరవం ఉంటుంది.

ఇంకా అతని చెంత ధనం కన్నా ధర్మం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత అతని బీద కుటుంబం అయినా ఓ మధ్యతరగతి పెద్దమనిషిగా ఇంటాబయటా సమాన గౌరవం పొందుతూ తనపని తాను చేస్తూ ఉంటాడు.

పెద్దమనుషుల మూవీలో రామదాసు ప్రధాన పాత్ర

అతని పేరే రామదాసు, అతను భార్య, గుడ్డి కూతురితో కలసి తాను నిర్వహిస్తున్న పత్రికా ప్రింటింగ్ ప్రెస్ తో కూడి ఉన్న ఇంటిలోనే నివాసం ఉంటారు. ఈ మూవీలో రామదాసు ప్రధాన పాత్ర.

అయితే ఈ రామదాసు మాత్రం ఆ ఊరి చైర్మెన్ అంటే అభిమానం, నమ్మకం మరియు గౌరవం ఇంకా స్వామి భక్తి ఎక్కువ. ఎందుకంటే రామదాసు ఆద్యర్యంలో ఒక శరణాలయం నిర్వహణ జరుగుతూ ఉంటుంది.

అయితే ఆ బాధ్యతలో ఎక్కడా తప్పుడు లెక్కలు చూపించకుండా, వచ్చిన విరాళపు సొమ్ము అంతా శరణాలయానికే ఖర్చు చేస్తూ ఉంటాడు. కానీ చైర్మెన్ ఇతర సహచరులు అయిన పూజారి, వ్యాపారి, కాంట్రాక్టరుతో ఎంతోకొంత సొమ్మును ఎప్పటికప్పుడు చైర్మెన్ గారికి చాటుమాటున చేరవేస్తూ ఉంటారు.

వీరు ముగ్గురు చేసే వారి వారి వృత్తులలో లాభాలు అక్రమమార్గంలో అర్జించి, వాటిలో వాటాను మాత్రం చైర్మెన్ గారికి ఇస్తూ ఉంటారు. ఇదంతా రామదాసుకు తెలియదు.

ఇంకా రామదాసు విషయంలో చైర్మెన్ ఏది అడగడు, అతను చెప్పినదానికి సరేనంటూ పైకి నటిస్తూ ఉంటాడు. అందుకే రామదాసు తన పత్రికలో రామదాసుగారి ప్రజాసేవ గురించి గొప్పగా వ్రాస్తాడు.

చైర్మెన్ గారికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు, అతని ఇంట్లోనే ఉంటారు. తమ్ముడు తిక్క శంకరం ఎప్పుడూ అన్నయ్యని అల్లరి చేస్తూనే ఉంటాడు. అతను మేక వన్నె పులిగానే వర్ణిస్తూ..ఉంటాడు.

వాస్తవానికి తమ్ముడుని పిచ్చోడు అని ముద్ర వేసి, చెల్లిని ఒక ముసలోడికిచ్చి వివాహం చేసి, ఆస్తిని తమ్ముడికి, చెల్లెలకు పంచే అవకాశం లేకుండా చైర్మెన్ తగు జాగ్రత్తలతో ఆస్తిని కాపాడుకుంటాడు.

మొత్తమ్మీద చైర్మెన్ పైకి పెద్దమనిషి, లోపల చిన్న మనిషి. చిల్లరకు చాటుమాటున చేయి చాస్తూ, పైకి పెద్ద పెద్ద దానాలు చేస్తూ ఉంటాడు. ఇంకా చైర్మెన్ గారి కొడుకు పట్నంలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉంటాడు.

చైర్మెన్ గారి అబ్బాయికి అతని బాబయి తిక్క శంకరం, పత్రికా సంపాదకుడు రామదాసు, అతని ఫ్యామిలి అంటే బాగా ఇష్టం. అతని మద్య మద్యలో ఊరికి వచ్చినప్పుడు రామదాసుగారింటికి వెళ్లి వస్తూ ఉంటాడు.

ఆ క్రమంలోనే రామదాసు కూతురుకి కళ్ళ ఆపరేషన్ చేయించడానికి పూనుకుంటాడు. ఒక్కసారి పట్నం తీసుకుపోయి పరీక్షలు చేయించి తీసుకువస్తాడు కూడాను.

చైర్మెన్ చేసిన హత్యను, తనమీద వేసుకుని జైలుకు వెళ్ళిన రామదాసు

ఇదిలా ఉండగా చైర్మెన్ గారి కారు డ్రైవరు, చైర్మెన్ విధవ చెల్లెలతో సరసమాడుతూ కనబడతాడు. వెంటనే చైర్మెన్ తన దగ్గర ఉన్న తుపాకితో ఆ కారు డ్రైవరుని కాల్చి చంపుతాడు. అక్కడే ఉన్న రామదాసు, చైర్మెన్ గారి చేతిలో తుపాకి తీసుకుని, కారు డ్రైవరు దగ్గరకు పరుగు పరుగున వెళతాడు.

అందరూ అక్కడికి చేరతారు, కారు డ్రైవరు రామదాసు చేతుల్లోనే కన్నుమూస్తాడు. అక్కడికి చైర్మెన్ కూడా వస్తాడు. అప్పటికే వచ్చిన పోలీసులు ఇది ఎలా జరిగిందని అడగడంతో, రామదాసు నేనే పొరపాటున పిట్టను కాల్చబోతే, అది ఇతనికి తగిలిందని సమాధానం చెబుతాడు.

రామదాసుకు కోర్టు కొంతకాలం కారాగార శిక్ష విధిస్తుంది. జైలులో రామదాసుని కలసిన చైర్మెన్, తాను నిజం చెప్పి పోలీసులకు లొంగిపోతానని నంగనాచి వినయం ప్రదర్శిస్తాడు. రామదాసు అది నిజమనుకుని, మీరు ఎట్టి పరిస్థితులలోనూ నిజం చెప్పవద్దు అని, మీరు ప్రజాసేవ చేయాలని చెబుతాడు.

ఇక రామదాసు జైలుకెళ్లడంతో చైర్మెన్ సహచరుల అరాచకాలు ఎక్కువ అవుతాయి. అనాధ శరణాయం నుండి కూడా దోపిడి చేస్తూ ఉంటారు. ఇంకా రామదాసు కూతురు, చైర్మెన్ గారి అబ్బాయిని వల్లో వేసుకుందని, చైర్మెన్ గారికి మాటలు ఎక్కిస్తారు. తరువాత రామదాసు భార్యని, అతని గుడ్డి కూతురుని అవమానించడంతో వారు ఊరు వదిలి వెళ్లిపోతారు.

రామదాసు జైలు నుండి వచ్చాక వారి ఆరాచకాలకు ఏవిధంగా అడ్డు వచ్చాడు. వారిని భగవంతుడు ఏవిధంగా శిక్షించింది? తెరపై చూడాలి. ఇంకా రామదాసు కూతురు చైర్మెన్ గారి అబ్బాయి ఒక్కటవటంతో కధ సుఖాంతం అవుతుంది. తిక్క శంకరయ్య సన్యాసం స్వీకరించడంతో సినిమాకు ముంగింపు పలకుతారు కె.వి. రెడ్డిగారు.

ఇది కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు తెలుగు మూవీ స్టోరీ.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి స్థాయిలో తెలుగు మూవీ?

ఎప్పుడైనా చారిత్రాత్మకమైన పుస్తకాలు చదివితే, ఒక రాజు గురించి చెప్పేటప్పుడు, అతను ”ఆ దేశానికి రాజు, ఈ దేశానికి రాజు” అంటూ ఎందరో రాజుల గురించి చరిత్రలో చదువుకుంటాం.

కానీ ధర్మానికి రాజుగా మాత్రం ధర్మరాజునే ప్రవచనకారులు చెబుతారు. ధర్మాన్ని అంతలా ఆచరించిన మహానుభావుడుగా ద్వాపరయుగంలో కీర్తింపబడిన ధర్మరాజు గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం.

మన భారతంలోని ధర్మరాజు మాటకు విజయుడుగా కీర్తి పొందిన అర్జునుడు కట్టుబడి ఉంటాడు. భారతంలో అర్జునుడు ధర్మరాజు మాటను అతిక్రమించకుండా నడుచుకున్నాడు. అని పెద్దలు చెబుతూ ఉంటారు.

భీముడు అత్యంత బలశాలి. భారతంలో భీముడు, దర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు వంటి అత్యంత బలమైనవారిని మట్టికరిపించాడు. అలాంటి అతి బలశాలి అయిన భీమసేనుడు కూడా. ధర్మరాజు మాటంటే, ఆమాటకు కట్టుబడి ఉంటాడు.

ఇక నకుల సహదేవులు కూడా చాలా ప్రతిభావంతులు. అత్యంత ఆకర్షణీయమైన రూపం గలవారు. ఈ రోజులలో అదే ప్రధానంగా ఉంది. ద్వాపరయుగంలో అటువంటి అందగాళ్లు అయిన నకుల సహదేవులు కూడా భారతంలోని ధర్మరాజు మాటకు ఎదురుచెప్పరని అంటారు.

ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే? భారతంలో ధర్మరాజు అతని అనుయాయులు వనవాసం చేశారు. అలా పాండవవనవాసం పూర్తయ్యాక, వనవాసం పూర్తి అయ్యిందని అంగీకరించవలసినది దుర్యోధనుడే కదా…

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి స్థాయిలో తెలుగు మూవీ?

దుర్యోధనుడుకు ధర్మరాజు విరోధి. కానీ వనవాసం పూర్తి అయ్యిందనే మాట భారతంలో ధర్మరాజు చెప్పాకా మాత్రమే, దుర్యోధనుడు అంగీకరించాడని పెద్దలు చెబుతారు.

విరాటరాజు తనతోపాటు సమానంగా సింహాసనంపై కూర్చునే అవకాశం ఒక్క ధర్మరాజుగారికే ఇచ్చారని పెద్దలంటారు. ధర్మరాజు ఎక్కడుంటే, అక్కడ పాడిపంటలు పెరుగుతాయని అంటారు.

పాండవులలో భీమార్జునులు, నకుల సహదేవుల మరణిస్తే, తిరిగి వారు పునర్జీవులయ్యింది… ధర్మరాజు గారి ధర్మము వలననే అంటారు.

శ్రీకృష్ణపరమాత్మ పరబ్రహ్మమే అయి ఉన్నాడు. కానీ కృష్ణుడుగా ధర్మరాజుకు నమస్కారం చేస్తాడు. కురుక్షేత్రం యుద్ధంలో పాండవులు గెలిచారు. అలా పాండవులు గెలవడానికి ప్రధాన కారణం ధర్మరాజు ధర్మదీక్ష అని అంటారు.

ఇలా మన భారతంలో ఎవరి శక్తి ఎంతటిది అయినా, ధర్మరాజు ధర్మదీక్ష ప్రధానకారణం అయితే. ధర్మరాజు ధర్మనిరతి చాలా గొప్పగా చెబుతారు.

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి చెప్పే తెలుగు మూవీ?

ఎందుకు ధర్మరాజు గారి గురించి చెప్పాలంటే?

ఎవరైనా మూవీ వాచ్ చేస్తే, అందులో పదే పదే చెప్పబడిన డైలాగ్ ఎక్కువమంది నోట్లో నానుతుంది.

ఏదైనా ఒక మూవీలో పదే పదే వచ్చిన మ్యూజిక్ ఎక్కువమంది నాలుకపై నాట్యం చేస్తుంది.

మరేదైనా తెలుగు మూవీలో బాగా చిత్రికరీంచిన దృశ్యాలు, ఎక్కువమంది మదిలో గూడు కట్టుకుంటుంది.

అలాంటి తెలుగు మూవీ ఏ విషయం హైలెట్ చేస్తే, ఆవిషయం ఎక్కువమంది మనసులో మెదులుతూ ఉంటుంది.

మరి భీమ సేనుడు గురించే బలంగా చూపితే, బలం చాలనుకుంటారు. కర్ణార్జుల గురించే చూపితే, ఏదో ఒక విద్య చాలనుకుంటారు.

మనసును ఆకట్టుకోవడానికి ఏదో బలమైన అంశము ఉండాలి. కానీ ఆ అంశము ధర్మము ప్రధానమని చూపితే, విద్యపై పెరుగుతున్న ఆసక్తి, ధర్మమువైపు కూడా తిరిగి చూస్తుంది.

అందుకే మూవీలలో ధర్మరాజు గారిని కేవలం ఒక పాత్రగా కాకుండా, ప్రధాన పాత్రలను ప్రభావితం చేస్తున్న పాత్రగా తెరపై కదిలితే, అది ఆమూవీకే మెరుగైన మాణిక్యంగా మారుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా

పాత పౌరాణిక సినిమాలలో ఆంజనేయుని గురించి అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఆంజనేయుడు అంటే అందరికీ ఇష్టేమే. అలాంటి శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా గురించి తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. శ్రీ ఆంజనేయచరిత్ర సినిమాను చూడడానికి ఇక్కడ తాకండి

నిత్యం రామనామజపంతో చిరంజీవిగా ఉండే శ్రీఆంజనేయస్వామి అనేకమంది భక్తులను కలిగిన పరమ శ్రీరామభక్తుడు. రామసంకీర్తనం చేస్తూ, శ్రీరామచంద్రుడిని హృదయంలో పదిలపర్చుకున్న భక్తాగ్రేసుడు, హనుమ, ఆంజనేయస్వామి, మారుతి, అంజనీపుత్రుడు, రామదూత అంటూ అనేక నామాలతో నిత్యం భక్తుల మనసులో మెదులుతూనే ఉంటాడు.

శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా భక్తి చిత్రాలలో ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకోవడంలో బాగుంటుంది. ఆంజనేయుడు అన్నా వినాయకుడు అన్నా పిల్లలకు మహాఇష్టంగా ఉంటే, వారికి కూడా పిల్లలంటే మహాప్రీతి. అలాంటి ఆంజనేయుని పుట్టుక, విద్యాభ్యాసం, హనుమ విజయాలు గురించి శ్రీ ఆంజనేయ చరిత్ర సినిమాలో చక్కగా చూపించారు.

ధర్మరాజు సోదరుడు భీమసేనుడికి ఒక ముసలికోతి తోకతో గర్వభంగం

శ్రీ ఆంజనేయచరిత్ర తెలుగు సినిమా ప్రారంభం శ్రీరామసంకీర్తనం చేస్తున్న హనుమతో ప్రారంభం అవుతుంది. హనుమా రామగానం చేస్తూంటే, భీమసేనుడు అటువైపుగా వచ్చే సన్నివేశాలు పాట మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. పాట పూర్తయ్యేసరికి, భీమసేనుడి రాకను గమనించిన, అంజనీపుత్రుడు ఒక ముసలికోతి వేషం వేసుకుని, తనతోకను దారికి అడ్డుగా పెట్టి, ఒకరాయికి ఆనుకుని లేవలేని స్థితిని తలపిస్తూ కూర్చుని ఉంటాడు. అటుగా వెళ్తూ అక్కడికి చేరిన భీమసేనుడు దారిలో కనిపించిన తోకను గమనించి, ఆతోక ఎక్కడి నుండి వచ్చిందో గమనించి, ఆవైపు చూస్తాడు. తోకను అడ్డుతీయమని భీముడు ఆంజనేయస్వామితో వాదిస్తాడు.

ఆంజనేయుడు భీమసేనుడితో…”నీవే తోకను నీవే తీసి, నీదారిన నీవు వెళ్లు” అంటాడు. భీముడి శతవిధాలా ప్రయత్నించినా…ఆంజనేయుని తోకను ఒక్క ఇంచుకూడా కదపలేకపోతాడు. అప్పుడు భీమసేనుడు ఇది సామాన్య కోతికాదు అని గ్రహించి, ఆ ముసలికోతితో తన అహంకారానికి క్షమాపణ అడుగుతాడు. అప్పుడు ఆంజనేయస్వామి తన నిజస్వరూపంతో ప్రత్యక్షమవుతాడు. ఇద్దరు సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, పరామర్శించుకుంటారు. తరువాత భీమసేనుడు అభ్యర్ధన మేరకు తన జీవితచరిత్రను, చెప్పడం ప్రారంభిస్తాడు, ఆంజనేయస్వామి.

భీమసేనుడితో హనుమ తనకధను తానే చెప్పడం

అంజనీదేవి సంతానాపేక్షతో పరమశివుని కొరకు తపము చేస్తూ ఉంటుంది. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆదేశానుసారం, వాయుదేవుడు ఒక పురుషస్వరూపంలో ఆంజనీదేవికి సాక్షాత్కారిస్తాడు. అప్పుడు వాయుదేవుడు నీకు సంతానం అనుగ్రహించడానికే, నేను వచ్చాను అని చెప్పి, ఒక దివ్యమైన ఫలమును అంజనీదేవికి వాయదేవుడు అనుగ్రహిస్తాడు. శివానుగ్రహం వలన, అంజనీదేవికి పుత్రుడు జన్మిస్తాడు. బాలుడైన హనుమ దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ, చెట్లు ఎక్కుతూ అల్లరి చేస్తూ ఉంటాడు. అలా ఒక్కసారి ఆకాశంలో సూర్యబింబం చూసి, అదేదో ఒక పండు అనుకుని, అందుకోవడానికి వాయువేగంతో ఆకాశంలోకి వెళతాడు, బాలహనుమ. సూర్యబింబాన్ని అందుకోబోతున్న బాలహనుమపై, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు.

దానితో బాలహనుమ ఆకాశం నుండి క్రిందపడిపోతూ ఉంటే, అతని తండ్రి వాయుదేవుడు, ఆ బాలుడిని పట్టుకుని, ఇంద్రుడుపై ఆగ్రహించి, తన సహజస్వభావాని లోకాల నుండి నిష్క్రమింపజేస్తాడు. దాంతో లోకాల్లో వాయుస్థంభన జరిగి, ప్రపంచం స్థంబింపజేయడంతో ఇంద్రుడు, త్రిమూర్తులు, వాయుదేవుని దగ్గరకు వచ్చి, హనుమకు అనేకవరాలు ఇచ్చి వెళతారు. చిరంజీవిగా, అత్యంత బలవంతునిగా, శస్త్రాస్త్రములతో బంధింపబడనివానిగా వరములు ప్రసాదిస్తారు. ఇంతటి శక్తిసంపన్నుడైన బాలహనుమకు ఆగడాలు, అల్లరి ఇంకా ఎక్కువ అవుతుంది.

ఆంజనేయుని అల్లరికి ఋషులు కూడా గురికావడంతో, ”నీ శక్తిని నీవు మరిచిపోవుదవని…” ఒక ఋషి హనుమకు శాపానుగ్రహం ఇస్తారు. అక్కడకు పరుగున వచ్చిన అంజనీదేవి ప్రార్ధనమేరకు ”ఎవరైనా ఆంజనేయునికి, తన శక్తి ఏమిటో గుర్తు చేస్తే, తిరిగి అతను అత్యంత శక్తివంతుడై, అఖండ విజయాలను ” సాధిస్తాడని చెబుతాడు. ఇంకా వేదాధ్యయనం కొరకు సూర్యభగవానుని దగ్గరకు ఆంజనేయుని, పంపమని ఋషులు చెబుతారు. సూర్యభగవానుని వద్ద విద్యనభ్యసించిన ఆంజనేయస్వామి, సూర్యాదేశం ప్రకారం, కిష్కిందలోని సుగ్రీవుని వద్దకు చేరతాడు.

సుగ్రీవుని రాజ్యం నుండి తరిమేసిన వాలీ

మాయారాక్షసుని చేతిలో వాలి యుద్ధం చేస్తూ మరణించాడని భావించిన సుగ్రీవుడు, పెద్దల సలహాతో సింహాసనం అధిష్ఠించి, మారుతిని మహామంత్రిగా నియమించుకుంటాడు. అయితే సుగ్రీవుడు ఒకరోజు సభలో కొలువుతీరి ఉండగా, వాలి సభాప్రవేశం చేసి, సుగ్రీవుని అక్కడి నుండి వెళ్లగొడతాడు. అన్నదమ్ముల మద్య గొడవకు కలుగజేసుకోవడం, ధర్మంకాదని అనుకుని, హనుమ సుగ్రీవుని అనుసరిస్తాడు. వారివురూ ఋష్యమూకం పర్వతంపైకి చేరతారు.

సుగ్రీవుని-శ్రీరామునికి మైత్రి

సీతావియోగంతో…సీతాన్వేషణ చేసుకుంటూ రామలక్ష్మణులు అటుగా రావడం, సుగ్రీవుడు గమనిస్తాడు. నారబట్టలు కట్టుకుని వస్తున్న వారిని చూసిన సగ్రీవుడు వారెవరో కనుగొని, మిత్రులైతే తీసుకురమ్మని చెప్పి హనుమను వారి దగ్గరకు పంపుతాడు. వారెవరో తెలుసుకోవడానికి మారుతి మారువేషంలో వారి వద్దకు వెళతాడు. ఒక బ్రాహ్మణ వేషంలో తనముందుకు వచ్చిన హనుమను చూసిన శ్రీరాముడు ఆంజనేయా అని సంబోదిస్తాడు. వెంటనే రామలక్ష్మణులను ఋష్యమూక పర్వతంపైన సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళతాడు. అక్కడ శ్రీరామునికి, సుగ్రీవునికి స్నేహం కుదురుతుంది.

తర్వాత సుగ్రీవుడు వాలిని రెచ్చగొట్టి, వాలితో తలపడతాడు. ఇద్దరూ ఒకేలాగ ఉండడంతో శ్రీరాముడు బాణ ప్రయోగం చేయడం సాద్యపడదు. దానితో వాలీ చేతిలో చావు దెబ్బలు తిని చివరికి పారిపోయి సుగ్రీవుడు బయటపడతాడు. అయితే ఈ సారి సుగ్రీవుడు ఒకమాలను ధరించి, మరలా వాలీని యుద్ధానికి పిలుస్తాడు. యుద్ధానికి మరలా బయలుదేరుతున్న వాలీని, తార వారిస్తుంది. కానీ తారమాటను పట్టించుకోకుండా వాలీ సుగ్రీవునితో యుద్ద చేస్తాడు.

అప్పుడు శ్రీరాముడు తన బాణంప్రయోగం చేస్తాడు. వాలీ మరణం తర్వాత సుగ్రీవుడు కిష్కిందకు పట్టాభిషక్తుడవుతాడు. వానాకాలం కాగానే సీతాన్వేషణ చేద్దామని, సుగ్రీవుడు లక్ష్మణునితో చెబుతాడు. శీతాకాలం ప్రారంభంగానే సుగ్రీవుడు వానరసైన్యాన్ని వివిధ నాయకత్వంలో వానరులను ఒక మాసం గడువు విధించి నలుదిశలా పంపుతాడు. దక్షిణదిశకు అంగదుని నాయకత్వంలో హనుమతో కూడిన వానరులు బయలదేరతారు. అలా వెళుతున్నవారికి ఎంతకూ సీత కనబడదు. ఇంకా వారికి సముద్రం కనబడుతుంది. సముద్రం దాటి సీతాన్వేషణ చేసేవారెవరు అని వానరులు అంతా వారిలోవారు చర్చించుకుంటూ ఉంటారు.

ఆంజనేయుడు సముద్రం దాటుట

అప్పుడు జాంబవంతుడు, అంగదుడు అంతా ఆంజనేయస్వామిని పొగడ్తలతో, అమితమైన శక్తివంతునిగా కీర్తించి, హనుమశక్తిని, హనుమకు గుర్తు చేస్తారు. ఋషిశాపం వలన మరిచిన తన శక్తి ఏమిటో తిరిగి తెలుసుకున్న ఆంజనేయస్వామి, నూరు యోజనాల సముద్రమును దాటడానికి సిద్దపడతాడు. తోటివారి ఆశీష్సుల అందుకున్న ఆంజనేయుడు అపరిమిత శక్తివంతుడుగా మారి, విడిచిపెట్టిన రామబాణంలాగా సముద్రం దాటి లంకవద్దకు ప్రవేశిస్తాడు. అక్కడ లంకిణిని ఒక దెబ్బతో శాపవిమోచనం కలుగజేస్తాడు. అక్కడి నుండి ఎడమపాదం లంకలో పెట్టి, లంకాప్రవేశం చేస్తాడు.

సీతమ్మని కలసిన హనుమ

అశోకవనంలో సీతాదేవి కూర్చుని ఉన్న చెట్టు వద్దకు, రావణుడు వచ్చి, సీతదేవితో పరుష మాటలు మాట్లాడతాడు. రావణుడు రెండు మాసాలు గడువు విదించి, అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. రావణుడి మాటలకు గాయపడిన మనసుతో విలపిస్తున్న సీతమ్మకు రామగానం చేయడం ప్రారంభిస్తాడు, అప్పటికే ఆ చెట్టుపై చేరిన హనుమ. తర్వాత హనుమ, సీతమ్మ తల్లి ముందుకు వస్తాడు. ఆంజనేయునిపై సందేహం వెలిబుచ్చిన సీతమ్మతల్లికి, శ్రీరాముని గుర్తులు తెలియజేస్తాడు. దానితో సీతమ్మతల్లి హనుమపై నమ్మకం ఏర్పడి, శ్రీరాముని క్షేమం అడుగుతుంది. అప్పుడు హనుమ సీతావియోగంతో శ్రీరాముని శోకమును గురించి వివరిస్తూనే, శ్రీరాముడు చేసిన పనుల గురించి చెప్పి, సీతమ్మకు ధైర్యం చెబుతాడు. తర్వాత హనుమ సీతమ్మ దగ్గర ఆనవాలుగా చూడామణిని స్వీకరించి, అక్కడి వనమును అంతా కకావికలం చేయనారంభిస్తాడు. అనేకమంది రాక్షసులను ముప్పుతిప్పలు పెడతాడు. విషయం తెలుసుకున్న రావణుడు కుమారుడు, ఆంజనేయునితో యుద్ధ చేసి మరణిస్తాడు. తర్వాత రావణుడి మరో కుమారుడు మేఘనాధుడు, వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. బ్రహ్మగారిపై గౌరవంతో, ఆ అస్త్రమునకు పట్టుబడతాడు.

శ్రీరామలక్ష్మణులు వానరసైన్యంతో సముద్రం దాటి లంకకు చేరుట

బ్రహ్మాస్త్రమునకు పట్టుబడిన హనుమ లంకాధినేతతో హితవు చెబుతాడు. సీతమ్మని వదిలి శ్రీరాముని శరణువేడుకోమని, లేకపోతే నీతోబాటు లంకానాశనం తప్పదని చెబుతాడు. కానీ రావణుడు ఆంజనేయుడిని ఒక కోతిగా భావించి, హనుమతోకకు నిప్పంటిస్తారు. వెంటనే హనుమ అదే నిప్పతో లంకాపట్టణాన్ని కాలుస్తాడు. తర్వాత శ్రీరామచంద్రుడి వద్దకు వచ్చి, సీతమ్మ జాడను రామచంద్రునికి తెలియజేస్తాడు. సీతమ్మ ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి అందిజేస్తాడు, ఆంజనేయుడు. వానసైన్యంతో రామలక్ష్మణులు సముద్రం దగ్గరకు చేరతారు. అక్కడికి రావణుడి తమ్ముడు అయిన విభీషణుడు వచ్చి, శ్రీరాముని శరణు వేడుకుని, రాముని పక్షంలో చేరతాడు. అటు తర్వాత సముద్రంపై వానర సాయంతో నీలుడు ఆధ్వర్యంలో వారధిని నిర్మించి, శ్రీరామసేన అంతా సముద్రం దాటి లంకకు చేరతారు. రావణుడి సేనతో జరిగిన బీకర యుద్దంలో లక్ష్మణుడు మూర్ఛబోతే, వెంటనే హనుమంతుడు సంజీవిని పర్వతమునే ఆ యుద్ధభూమికి తీసుకువస్తాడు. ఆంజనేయుడు తెచ్చిన సంజీవిని సాయంతో లక్ష్మణుడు బతుకుతాడు. తరువాయి శ్రీరాముని చేతిలో రావణహతం జరగుతుంది.

అయోద్య సభలో ఆంజనేయ హృదయంలో శ్రీరామదర్శనం శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా

రావణ మరణం తర్వాత సీతసమేతంగా రామలక్ష్మణ, ఆంజనేయాదులు అయోద్యకు చేరతారు. అయోద్యలో శ్రీరామపట్టాభిషేకం అంగరంగవైభవంగా జరుగుతుంది. తర్వాత ఆంజనేయునికి సీతమ్మతల్లి ఒక హారమును కానుకగా ఇస్తుంది. అయితే ఆ హారములోని ముత్యములలో శ్రీరాముని రూపం వెతుకుతూ..ముత్యములను కొరికి పారేస్తాడు. అందరూ ఆక్షేపించగా రాముని రూపం ఏ ముత్యము రామభక్తునికి అక్కరలేదని అంటాడు. అప్పుడు అందరూ రామ రూపం అంతటా ఉంటే, నీ హృదయంలో చూపించు అని అంటారు. అందుకు సమాధానంగా హనుమ తన హృదయమును చీల్చి శ్రీరాముని రూపం చూపిస్తాడు. ఆ గాధను అంతా భీమసేనుడికి వివరించిన హనుమ, మరలా శ్రీరామ సంకీర్తనం చేస్తూ ఉంటాడు. ఆంజనేయ చరిత్ర ఎక్కువ భాగం రామునితో ముడిపడి ఉండడం చేత ఈ చిత్రంలో ఆంజనేయుని చరిత్రలో భాగంగా సీతాన్వేషణ నుండి రామ కధ అంతా మనకు కనిపిస్తుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం
కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి ఇస్తాడు. పరమశివుడు ఆ ఫలమును పార్వతికి ఇస్తాడు. పార్వతి మాత ఆయొక్క జ్ఙానఫలమును, తమ పిల్లలకు ఇవ్వడానికి నిశ్చయిస్తుంది. అయితే ఆదిదంపతుల కుమారులు ఇరువురు, ఆఫలము తమకు కావాలని అంటారు. అప్పుడు ఆ ఫలమును చెరిసగం చేసుకుని స్వీకరించమని, పార్వతిమాత సెలవిస్తుండగా, పరమశివుడు మాతకు మాటకు అడ్డుపడి, వలదు..వలదు… ఆఫలమును ఎవరో ఒకరే భుజించవలసి ఉంటుంది, అని పలుకుతాడు. అప్పుడు మాత పార్వతిదేవి, మహాదేవునితో ”మీరే పరిష్కారం చెప్పమనగా..” అప్పుడు శంకరుడు ”ఎవరైతే…ముల్లోకములకు ప్రదక్షిణ చేసి, ముందుగా కైలాసం వస్తారో…వారికే, ఈ జ్ఙాన ఫలము” అంటూ సమాధానం చెబుతాడు.

వెంటనే కుమారస్వామి..ఇప్పుడే ముల్లోకములకు ప్రదక్షిణ చేసి వచ్చెదనని కైలాసం నుండి బయలుదేరతాడు. అయితే వినాయకుడు కైలాసంలోనే ఉండి, మాతాపితలకు ప్రదక్షిణ చేస్తే, ముల్లోకములకు ప్రదక్షిణ చేసినట్టే, అని భావించి, విఘ్నేశ్వరుడు పార్వతి పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి, ఆఫలమును స్వీకరిస్తాడు. అయితే ముల్లోకములను చుట్టి తిరిగి కైలాసం వచ్చిన కుమారస్వామి, విషయం తెలుసుకుని, ఆగ్రహంతో మరలా కైలాసం వదిలి వెళతాడు. కైలాసం వీడి వెళుతున్న కుమారస్వామిని ఆపడానికి, ఆది దంపతులు ఇద్దరూ ప్రయత్నిస్తారు. అయినను వినక వెనుదిరగకుండా వెళుతున్న కుమారస్వామిని, ఆపడానికి ఒక అవ్వ ప్రయత్నిస్తుంది. కానీ విఫలం అవుతుంది. ఇక అప్పుడు జగన్నాత పార్వతిదేవి, కుమారస్వామి దగ్గరకు వచ్చి శివమహిమను తెలిపే, శివలీలలను చెప్పడం ప్రారంభిస్తుంది.

పాండ్యరాజు అంత:పురంలో తన రాణితో ఇష్టాగోష్టిలో ఉండగా అతనికి ఒక సందేహం వస్తుంది. స్త్రీకేశముల సువాసనను సహజంగా కలిగి ఉంటాయా? అనే సందేహం కలుగుతుంది. దానికి రాణి దగ్గర కూడా సమాధానం లేకపోయేసరికి, ఇదే విషయంలో సందేహం తీర్చినవారికి వేయిబంగారు నాణెముల నజరానతో కూడిన ప్రకటన తన పాండ్యరాజ్యంలో చేయిస్తాడు.

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

రాజ్యంలో ప్రకటించబడిన బహుమతికై ఆశతో ఎదురుచూసిన ధర్మి అనే ఒక పేద బ్రాహ్మణునికి, దేవాలయంలో శివుడే మారువేశంలో వచ్చి, ఆ సందేహ నివృత్తి కవితను ఇచ్చి వెళతాడు. దానితో ఆ పేద బ్రాహ్మణుడు ఆ కవితను తీసుకుని, పాండ్యరాజు గారి సభకు బయలుదేరతాడు. అక్కడ సభలో ఎవరూ ఆ సందేహ నివృత్తిని చేయగలిగేవారు లేకపోవడంతో రాజుగారు ఆశ్చర్యపడతారు. అప్పుడే శివానుగ్రహి అయిన ధర్మి బ్రాహ్మణుడు ఆ సభలోకి ప్రవేశిస్తాడు. ధర్మి తనకు శివుడు అందించిన తాళపత్రంలోని కవితను పాండ్యరాజుగారికి చదివి వినిపిస్తాడు. ఆ కవితకు మెచ్చినరాజు, ధర్మికి బహుమానం అందజేయబోతుండగా, అక్కడి ఆస్థాన పండితుడు అయిన నక్కీరుడు, ధర్మితో ఆ కవితను నీవే వ్రాశావా? అందులో దోషముంది అని చెబుతాడు. ఇక చేసేది లేక ధర్మి సభనుండి నిరాశతో నిష్క్రమించి, దేవాలయమునకు చేరి దు:ఖిస్తూ కూర్చుంటాడు. అక్కడకు మరలా వచ్చిన శివుడు సభలో జరిగిన విషయం చెప్పమని ధర్మిని ప్రశ్నిస్తాడు. ధర్మి నీవు వ్రాసిన కవితలో దోషముంది అని సభలో చెప్పినట్టుగా శివునితో చెబుతాడు. దానికి బదులుగా శివుడు అలా చెప్పినవారిని నాకు చూపించమని, ధర్మిని రాజుగారి సభకు తీసుకువెళతాడు. రాజుగారి సభలో నక్కీరుడు, పరమశివునితో కూడా మీరు కవితలో భావదోషముందని, ఆరోపిస్తాడు. ఆగ్రహించిన పరమశివుడు తన త్రినేత్రంతో నక్కీరుని దగ్ధం చేస్తాడు. తరువాయి రాజుగారి ప్రార్ధనతో పరమశివుడు, నక్కీరుడిని పునర్జీవునిగా చేస్తాడు. తరువాత ధర్మికి వేయి బంగారు నాణేములు బహుమతిగా లభిస్తాయి. ఇక్కడ ధర్మికి బంగారు నాణేములు, నక్కీరునికి పాండిత్యపరీక్ష రెండూ ఒకేసారి చేయడం శివలీలగా పార్వతి మాత కుమారస్వామికి వివరిస్తుంది.

Shiva leelalu gurinchi kumaraswamito

ఇంకా శివుని లీలలు గురించి కుమారస్వామితో మాట్లాడుతున్న పార్వతి మాత, తనను కూడా మహాదేవుని ఏవిధంగా పరీక్షించిందీ…ఆ వివరం కూడా చెప్పనారంభిస్తుంది.

లోకమాత అయిన దాక్షాయినికి, తన తండ్రి అయిన దక్షుడు చేస్తున్న యజ్ఙం గురించి తెలియవస్తుంది. ఆ యొక్క యాగమునకు వెళ్లాలని నిశ్చయించుకున్న దాక్షాయినిదేవి, పరమశివుని తన కోరికను తెలియజేస్తుంది. అప్పుడు మహాదేవుడు వలదని, నీవు నీపుట్టింటి మమకారంతో ఇప్పుడు దక్షుని యజ్ఙమునకు వెళ్లినచో అవమానం పొందుతావు అని వారిస్తాడు. కానీ జగన్మాత మహాదేవునితో వాదించి, శివుని అంగీకారం అడుగుతుంది. అప్పుడు పరమశివుడు విధి లోకమాతతో కూడా ఆడుకుంటుంది అని అనుకుంటూ, వెళ్లమని దాక్షాయినికి అనుజ్ఙ ఇస్తాడు. అప్పుడు లోకమాత దక్షయజ్ఙానికి బయలుదేరుతుంది.

నిరీశ్వర యాగానికి పరమశివుని పిలవకుండా చేయడం వలదని, మంత్రి సలహా ఇస్తాడు. అయినను దక్షుడు వినకుండా నిరీశ్వర యాగమునకు చేయడానికి పూనుకుంటాడు. అక్కడకు వచ్చిన జగన్మాత, తనకు తండ్రి అయిన దక్షునికి నచ్చజెప్పబోతుంది. కానీ దానికి దక్షుడు నిరాకరిస్తాడు. అవమాన భారంతో దాక్షాయిని మరలా కైలాసం చేరి, శివుని చేరుతుంది. కైలాసంలో శివునికి, పార్వతికి వాదం పెరిగి యుద్దమునకు దారి తీస్తుంది. ఆ యుద్ద ఫలితంగా శక్తి అయిన దాక్షాయిని దేహం దగ్గమవుతుంది. (గమనిక: దాక్షాయిని శరీరత్యాగం గురించి, పురాణ ప్రవక్తల మాటలు ప్రకారం అయితే దాక్షాయిని, దక్షయజ్ఙంలోనే ఆత్మార్పణం చేసుకున్నట్టుగా చెబుతారు.) తర్వాత దేవతల ప్రార్ధన మేరకు పార్వతిదేవిగా జగన్మాతకు తిరిగి శివుని చేరుతుంది. ఈ గాధను కూడా శ్రద్దగా ఆలకించిన కుమారస్వామికి ఇంకా మహాదేవి మరో శివలీల గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

Besta nayakudi kuturuga lokapavani

బెస్తనాయకుడి కూతురుగా పుట్టిన లోకపావని గంగా అను నామంతో యుక్తవయస్సులో ఉండగా తనతోటివారితో సముద్రపు ఒడ్డున ఆటాలాడుకుంటూ ఉంటుంది. అక్కడికి శివుడు కూడా ఒక బెస్తవాని రూపంలో వచ్చి, గంగను అల్లరి చేసి వెళతాడు. తర్వాత సముద్రంలోకి వెళ్లిన బెస్తవారు, అందరూ తిరిగి వెనుకకు రాలేకపోతూ ఉంటారు. ఎందుకంటే సాగరంలో ఉన్న తిమింగళం, సముద్రంలోకి వచ్చిన బెస్తవారిని తినేస్తూ ఉంటుంది.

దానితో బెస్త నాయకుడు సాగరంలో తిమింగళాన్ని చంపినవానికే, నాకూతురు గంగను ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు.బెస్తనాయకుడు కూతురు అయిన గంగ అక్కడి ఉన్న ధైర్యవంతులతో కూడి, సముద్రంలోకి వెళ్లడానికి బయలుదేరుతుంది. కానీ అక్కడికి బెస్తవాని వేషంలో వచ్చిన శివుడు తానే సముద్రంలోకి బయలుదేరతాడు. సముద్రంలో తిమింగళం బెస్తవాని వేషంలో ఉన్న శివునితో పోరాడి మరణిస్తుంది. అలా మరణించిన తిమింగళంతో బెస్తవాడు ఒడ్డుకు చేరతాడు. అలా బెస్తవారి వేషంలో ఉన్న పార్వతి, పరమేశ్వరులు ఒక్కటవుతారు. ఈ గాధను కూడా ఆలకించిన షణ్ముఖునికి, అమ్మ పార్వతిమాత ఇంకా ఒక అహంకారి సంగీత విద్వాంసుని విషయంలో శివలీలను వివరించడం ప్రారంభిస్తుంది.

హేమనాధ భాగవతులు పేరుగాంచిన గొప్ప సంగీత విద్వాంసుడు. సరస్వతీ కటాక్షం పొందిన హేమనాధ భాగవతులు ఎన్నో సత్కారాలు అందుకున్న పిదప, అతను పాండ్యారాజ్యానికి చేరతాడు. అక్కడ హేమనాధ భాగవతులకు, పాండ్యరాజే స్వయంగా స్వాగతం పలుకుతాడు. అహంకారం హెచ్చిన హేమనాధ భాగవతులు, తనకు స్వాగతం పలికిన పాండ్యరాజుతో చాలా గర్వంగా మట్లాడి, సభాప్రవేశం చేస్తాడు. సభలో హేమనాధుడు చేసిన గానకచేరికి, రాజు సంతోషించి, స్వయంగా హేమనాధుని దగ్గరకు వచ్చి, చాలా వినయంతో బహుమతులు సమర్పిస్తాడు. అయితే అహంకరించి ఉన్న హేమనాధుడు, నేను చాలా గొప్పవాడిని, నన్ను ఎవరైనా మీ సభలో ఓడించినచో, నేను పాండ్యరాజ్యానికి మొత్తం నాసంపదను దారాదత్తం చేస్తానని, లేకపోతే పాండ్యరాజ్యం మొత్తం నామాటకు దారాదత్తం కావాలని సవాలు చేస్తాడు. ఇంకా నేను గెలిచాక పాండ్యరాజ్యంలో ఎవరూ పాటలు పాడరాదని కూడా పలుకుతాడు.

pandyaraju

పోటికి సమ్మతించిన పాండ్యరాజు, పోటిని రేపు నిర్వహిస్తానని చెప్పి, హేమనాధుడికి అతిధి గృహంలో ఆతిధ్యం స్వీకరించమని చెబుతాడు. అటు తరువాయి తన ఆస్థాన పండితులను ”మీలో హేమనాధునితో పోటిపడేవారు ఎవరు?” అని అడుగుతాడు. కానీ వారిలో ఎవరూ ముందుకు రారు. పాండ్యరాజు సంకటంలో పడతాడు. అయితే పాండ్యరాజుకు మంత్రి ఒక సలహా ఇస్తాడు. అదేమిటంటే..”అహంకారం ఉన్న వ్యక్తికి, అనుగ్రహం ఉన్న వ్యక్తి చేతిలో ఓటమి తప్పదు” కాబట్టి దైవానుగ్రహం భాణబట్ట అనే సాధారణ గాయకుడిని తీసుకువచ్చి పోటిలో నిలబెడదాం అని చెబుతాడు. దానికి పాండ్యరాజు అంగీకరిస్తాడు. భాణబట్టుని, పాండ్యరాజు హేమనాధునితో పోటిపడవలసినదిగా ఆజ్ఙాపిస్తాడు. ఆయొక్క రాజాజ్ఙతో భాణబట్ట పరమశివుని ఆలయానికి వెళ్లి, నాకేమిటి ఈ పరీక్ష అంటూ శివుని వేడుకుంటూ, శివలింగం దగ్గరే పడి ఉంటాడు.

అప్పుడు శివుడు ఒక కట్టెలమ్ముకునేవాని వేషం ధరించి, ఆ నగరంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన పరమశివుడు (కట్టెలవాని వేషంలో) హేమనాధుడు విశ్రమించిన అతిధిగృహం దగ్గర ఉన్న ఒక మండపంపై కూర్చుని అద్భుతమైన గానం చేస్తాడు. ఆ గానం విన్న హేమనాధుడు బయటకు వచ్చి, ఆ అద్భుతగానం చేసిందెవరని వెతుకుతాడు. అక్కడే ఉన్న కట్టెలవానిని, ఇప్పుడు అద్భుతగానం చేసిందెవరని అడుగుతాడు. అప్పుడు కట్టెలవాడు, హేమనాధునితో నిద్రపట్టక నేనే ఏదో ఒక కూత కూశానని చెబుతాడు. దానికి ఆశ్చర్యపడిన హేమనాధుడు, నీవు ఈ పాట ఎవరిదగ్గర నేర్చుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కట్టెలవాడు, బాణబట్టు పేరు చెబుతాడు. దానితో దిమ్మతిరిగిన హేమనాధుడికి తన ఎంత అహంకరించినది..ఆలోచన చేసుకుంటాడు. తనతో పోటీపడబోయే శిష్యుని గానం ఇంత గొప్పగా ఉంటే, మరి ఆ బాణబట్టు గానం ఇంకెంత గొప్పగా ఉంటుందో అని ఊహించిన హేమనాధుడు ఊరి విడిచి వెళ్లిపోతాడు. వెళ్లేముందు, తన సంగీతం అంతా పాండ్యరాజ్యానికి ధారదత్తం చేస్తున్నట్టు వ్రాసిన తాళపత్రం కట్టెలవాని చేతికి ఇస్తాడు. ఆ పత్రాన్ని శివుడు శివాలయంలో ఉన్న బాణబట్టుకు అందజేసి, శివలింగంలోకి చేరతాడు. ఇలా లోకమాత కుమారస్వామికి శివలీలలు వివరించి, కుమారస్వామి మనసుని శాంతింపజేస్తుంది. శివుడు వినాయకునితో కలసి, కుమారస్వామి, పార్వతిమాత ఉన్న కొండకు వస్తారు.

ఏకొండపై కుమారస్వామికి లోకమాత శివలీలు వివరించిందో…ఆకొండే పళనిగా ప్రసిద్ది చెందుతుందని వరమిస్తారు. సినిమా సుఖాంతం అవుతుంది.

సాదారణంగా శివుని లీలలు గురించి వింటే, మాములు మనిషి మనసు శాంతిని పొందుతుంది. ఇక సాక్షత్తు మహాదేవుని కుమారుడు అయిన కుమారస్వామి మనసు ఇంకెంత శాంతిని పొంది ఉంటుంది. అంత శాంతిని పొందిన కుమారస్వామి వెలిసిన కొండ పళని కొండ. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?