Monthly Archives: July 2018

శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ

శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ. ఈయన దర్శకత్వంలో వచ్చిన శుభసంకల్పం మూవీలో కమలహసన్, ఆమని, ప్రియారామన్, కె విశ్వనాధ్ ప్రధాన పాత్రలుగా ఉంటే, రాళ్ళపల్లి, నిర్మల, గొల్లపూడి తదితరులు నటించిన ఈ చిత్రం శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్స్ పతాకంపై SP బాలసుబ్రహ్మణ్యం నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు, మూవీ సాంగ్స్ పాపులార్ అయ్యాయి.

శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ

రాయుడు (కె విశ్వనాధ్) సముద్రతీరాన నివాసం ఉండే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పెద్దమనిషి, అయన సంకల్పమే ఆచరణలో శుభసంకల్పంగా మన ముందుకి వచ్చింది. సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మత్యకారులకు పడవలు చేయించి ఇస్తూ, వారి మంచిచెడులను చూసుకునే పెద్దమనిషి. రాయుడుకి ఒక కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు, ఆమె మనుమరాలు తాతయ్య అంటే ప్రేమ కొద్ది, ఆ పల్లెకి వచ్చి వెళుతూ ఉంటుంది. ఇంకా రాయుడుకి ఒక దత్తపుత్రుడు ఉంటే అతను చెడు అలవాట్లకు బానిసగా మారతాడు.

సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మత్యకారులలో దాసు (కమలహాసన్) చాల తెలివైనవాడు. పేపర్ పెన్ను అవసరం లేకుండా ఎప్పటి లెక్కలు అయినా కావలసినప్పుడు చెప్పగలిగే జ్ఞాపక శక్తి కలిగిన వ్యక్తి, అయితే అతను ఏమాత్రం అక్షరజ్ఞానం లేని వ్యక్తి. దాసు అంటే రాయుడుగారికి ఎనలేని అభిమానం ఉంటుంది.

చెడు అలవాటులకు దగ్గరైన తన కొడుకుని డబ్బు వ్యవహారాలకు దూరంగా ఉంచడంతో చెడు అవసరార్ధం రాయుడు కొడుకు అయిన దత్తుడుజ, పట్నంలో ఒక వ్యక్తి దగ్గర (కోట శ్రీనివాసరావు) దగ్గర లక్షల కొద్ది అప్పు చేస్తాడు.

గంగా మహాలక్ష్మి దాసుల వివాహం – శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ

పడవలు తయారుచేసే ఒక తాగుబోతు కూతురు అయిన గంగామహాలక్ష్మి (ఆమని) దాసు ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ విషయం తెలిసిన రాయుడు వాళ్ళిద్దరికీ పెళ్ళిచేసి, మరలా దాసు – గంగామహాలక్ష్మికి పుట్టిన కొడుకుకి నామకారణం కూడా తన ఖర్చులతో చేయిస్తాడు.

పట్నంలో అప్పు చెల్లించవలసిన రాయుడు కొడుకు దత్తుడు, రాయుడు ఆఫీసులో లేని సమయంలో వచ్చి బలవంతంగా డబ్బు తీసుకుని వెళ్లిపోతుంటే, దాసు అడ్డుకుని ఆ లక్షల డబ్బుని తన ఇంట్లో దాస్తాడు. తరువాత విషయం ఊరిని నుండి వచ్చిన రాయుడికి వివరిస్తారు.

డబ్బుని దాసు ఇంటిలోనే ఉంచి, వ్యాపార వ్యవహారాలకు ఉపయోగించమని, మీ అందరికి తలా ఒకరికి ఒక ఇల్లు, ఒక పడవ సొంతంగా ఉండి, మీరు సంతోషంగా ఉండాలి అదే నా సంకల్పం అని రాయుడు అంటారు. తన సంకల్పానికి దాసుని సహకారంగా ఉండమని చెబుతారు. ఇక ఆ డబ్బు వ్యవహారాలు అన్ని దాసు గుడిసె నుండే జరుగుతూ ఉంటాయి.

ఒకరోజు దాసు వేటకి అని సముద్రంలోకి వెళ్తాడు, అదును కోసం చూస్తున్న రాయుడి కొడుకు మనుషులు దాసు ఇంటికి వచ్చి దాడి చేస్తారు. ఆ డబ్బుని కాపాడే క్రమంలో దాసు నాయనమ్మ ప్రాణాలు కోల్పోతుంది. గుడిసె నుండి డబ్బుని తీసుకుని గంగామహాలక్ష్మి పడవమీద సముద్రంలోకి వెళ్తుంది, వెంటాడిన మనుషులకు డబ్బులు దక్కకుండా ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతుంది.

వేటకు వెళ్ళి దాసు, గంగకు ప్రాణహాని

వేటకు వెళ్ళిన దాసుకి డబ్బు గంగా మహాలక్ష్మి వలలో చిక్కుతారు, అయితే గంగా మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయి, డబ్బుని రక్షిస్తుంది. దాసు నాయనమ్మ మరణం చూసిన రాయుడికి గుండెపోటు వస్తుంది. రాయుడి ప్రాణరక్షణార్ధం గంగామహాలక్ష్మి బ్రతికే ఉన్నట్టు అబద్దం చెబుతాడు దాసు.

హాస్పిటల్ నుండి గంగ కోసం ఎదురుచూసే రాయుడు, తిరిగిరాని లోకాలకు తరలిపోయిన తనభార్య క్షేమంగా వస్తుంది అని రాయుడికి అబద్దం చెబుతూ దాసు పాత్ర విబిన్నంగా కనిపిస్తుంది. అందరూ ఉండి కూడా దాసు తన భార్యకు తన కొడుకుతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు, రాయుడి ప్రాణ రక్షణకోసం. ఈ సన్నివేశాలు కంటతడిబెట్టిస్తాయి. చివరికి రాయుడికి గంగవిషయం తెలుస్తుంది, తరువాత రాయుడి కలల్ని దాసు నిజం చేస్తాడు.

నటన అంటే కమలహాసన్ చిత్రాలే సమాధానాలుగా చెబుతారు, అటువంటి నటనకి కె విశ్వనాధ్ గారి దర్శకత్వం తోడైతే ఆ చిత్రం నటన విశ్వరూపమే కనిపిస్తుంది. అటువంటి ఈ చిత్రం ఒక శుభసంకల్పాన్ని నెరవేర్చే పాత్రలో కమలహాసన్ నటన అద్బుతంగా ఉంటుంది. ఒక మంచి చిత్రం ఉంది అని చెప్పగలం కానీ ఆ మంచి చిత్రం గురించి గొప్పగా చెప్పడం కన్నా మంచి చిత్రాలే చూస్తేనే బాగుంటుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ

పవిత్రబంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబకదా చిత్రం. సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ మహిళల ఆదరణను పొందిన మంచి కుటుంబ కదా తెలుగు మూవీగా నిలిచింది.

మారుతున్నా సామజిక పరిస్థితిలో భాగం ఎక్కువమంది ఉన్నత కుటుంబంలో తమ పిల్లల్ని ఇతరదేశాలలో చదివించడం పరిపాటి.

అలా ఇతర దేశాలలో చదువుకుని ఇంటికి వచ్చి ఒక ఉన్నత కుటుంబ కుర్రాడుగా వెంకటేష్ నటిస్తే, సనాతన ధర్మం కల్గిన భారతదేశంలో సగటు మహిళగా, ఒక ఫాక్టరీలో ఉద్యోగిగా సౌందర్య చక్కగా నటించిన తెలుగు మూవీ , పవిత్రబంధం.

సకుటుంబ సపరివారంగా చూడదగిన తెలుగు చిత్రాలలో పవిత్రబంధం ఒకటిగా ఉండి, భారతీయ స్త్రీమూర్తి సహనం, పతిసేవా తత్పరతను తెలియజేసే తెలుగు పుల్ లెంగ్త్ మూవీ పవిత్రబంధం.

సెంటిమెంట్ మూవీస్ దర్శకులుగా పేరుపొందినవారిలో ముత్యాల సుబ్బయ్య గారు ఒకరు. గీతచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై పోసాని కృష్ణ మురళి కధ అందిస్తే, ఎంఎం కీరవాణి సంగీతం అందివ్వగా పవిత్రబంధం తెలుగుమూవీని వెంకట రాజు – శివరాజులు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నిర్మించారు.

విశ్వనాధ్(SP బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆస్తిపరుడైన అతనికి ఒక కొడుకు విజయ్(విక్టరివెంకటేష్) ఫారిన్లో చదువుపూర్తీ చేసుకుని స్వదేశానికి ఇంటికి వస్తాడు.

అలా ఇంటికి వచ్చిన విజయ్ తో విశ్వనాధ్ పెళ్లి చేసుకుని బిజినెస్ వ్యవహారాలు చూసుకోవలసినదిగా కోరతాడు. స్వేచ్చగా స్వదేశం వదిలి విదేశంలో తిరగడం అలవాటు పడిన విజయ్ కేవలం సంతోషకరమైన విషయాలతో సంతోషిస్తూ ఉంటాడు.

రాధ (సౌందర్య) మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈమె తన కుటుంబ పోషణార్ధం విశ్వనాధ్ ఆఫీసులో విశ్వనాధ్ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం చేస్తూ ఉంటుంది.

రాధ (సౌందర్య) కుటుంబంలో అన్న నిరోద్యోగిగా ఉంటూ ఉంటే, పెళ్ళైన ఆమె అక్క జబ్బుతో బాధపడుతూ ఇంటిలోనే ఉంటుంది. పెళ్లికావాల్సిన చెల్లెలు ఉంటుంది. కుటుంబ పోషణ మొత్తం రాదే చూసుకుంటూ ఉంటుంది.

విజయ్ ఇంటికి వచ్చాక పాశ్చాత్య ధోరణిలో ఉంటూ క్లబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పెళ్లి సంభందం గురించి మాట్లాడితే విజయ్ చెప్పిన మాటలకు విశ్వనాధ్ అవాక్కవుతాడు.

నేను పెళ్లిచేసుకుంటాను కానీ ఆమెతో సంవత్సరం కాపురం చేసాక మా ఇద్దరికీ ఇష్టంగా ఉంటే కాపురం కొనసాగిస్తాం, ఒకవేళ సంవత్సరం తరువాత అలా ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా విడిపోవటానికి అంగీకరించిన అమ్మాయి అయితే నాకు సరే అని చెబితే అవాక్కవ్వని తెలుగు తండ్రి ఉండడు.

ఆ విధంగా కొడుకు ప్రవర్తనకు కారణం తల్లిలేకుండా ఉండడం ఒకటి, విదేశ సంస్కృతిలో అలవాటు పడి ఉండడం ప్రధాన కారణం అని గ్రహించిన విశ్వనాధ్.

విజయ్ (విక్టరివెంకటేష్) రాధ(సౌందర్య) అగ్రిమెంట్ వివాహం

ఆఫీసులో తనకు పర్సనల్ సెక్రటరీగా చేస్తున్న రాధను చూసి ఈమె అయితే తన కొడుకు విజయ్నిమార్చగలదు అని భావించి, ఆమెకు తన కొడుకుని పెళ్లి చేసుకోవలసినదిగా కోరతాడు.

ఆత్మాభిమానం కలిగిన రాధ తన కుటుంబ కష్టాలు తీరాలంటే డబ్బు అవసరం, ఆ డబ్బు విశ్వనాధ్ గారి అబ్బాయి కండిషన్ తెలిసి, పెళ్లి తరువాత ప్రేమతో విజయ్ ని మార్చుకుంటాననే నమ్మకంతో ఆమె పెళ్ళికి ఒప్పుకుంటుంది.

అయితే విశ్వనాధ్ గారి బరోస వలననే ఆమె తనపై తనకు గల నమ్మకంతో విజయ్ ని పెళ్లి చేసుకుంటుంది రాధ.

పెళ్లికి ముందే అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు చేసుకుంటారు కాబోయే భార్య భర్తలు. తర్వాత రాధవిజయులు అన్యోన్యంగా కలిసి ఉండడం ముచ్చటగా ఉంటూనే, మరోప్రక్క విజయ్ అగ్రిమెంట్ ఆసక్తిగా కధనం సాగుతుంది. రాధ కుటుంబ కష్టాలు విశ్వనాధ్ గారు తీర్చుతారు.

రేచీకటితో బాధపడే సుధాకర్, బ్రహ్మానందం హాస్య సన్నివేశాలు మద్య మద్యలో వస్తూ ఉంటాయి.

సంవత్సరం గడిచేలోపు విజయ్ కి ఆక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో రాధ అతనికి సేవలు చేసి అతనిని కాపాడుకుంటుంది. ఆ క్రమంలో వచ్చే పాట అపురూపమైనది అమ్మ ఆడజన్మ అంటూ సాగే సాంగ్ చిత్రీకరణ కధలో భాగమై సాగుతుంది.

పాట పూర్తీ అయ్యేసరికి సంవత్సరం గడవడం అగ్రిమెంట్ ప్రకారం తనకు రాధపై ఫీలింగ్స్ లేవని వివాహం రద్దు చేసుకుందామని అంటే, విజయ్ తండ్రి బ్రతిమాలినా వినని విజయ్ విచిత్రంగా విడిపోవడానికి ఇష్టపడతాడు. విజయ్ ఇష్టప్రకారం రాధ తన పుట్టింటికి వెళుతుంది.

అలా పుట్టింటికి వెళ్ళిన రాధ లేని లోటు విజయ్ కి తెలిసి వచ్చి, ఆమెపై తనకి ఉన్న ప్రేమను గుర్తించి రాధ కోసం రాధ పుట్టింటికి వెళితే విజయ్ ని రాధ తిరస్కరిస్తుంది. ఎవరు చెప్పిన రాధ వినకుండా ఒంటరిగా ఉంటూ అందరి చేత మాటలు పడుతుంది.

అలా ఎందుకు రాధ చేసింది అనేది చిత్రం చూడడమే బాగుంటుంది. చివరికి ఇద్దరు ఒకటవటంతో తెలుగు మూవీ కధ ముగుస్తుంది. అయితే ఆద్యంతం కుటుంబ వాతావరణ సన్నివేశాలతో చిత్రం సాగుతుంది.

రాధ పాత్రలో సౌందర్య నటన అద్బుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ – సౌందర్యల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటే, విశ్వనాధ్ పాత్రలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగారి నటన సెంటిమెంట్ బాగా పండిస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన పవిత్రబంధం తెలుగు పుల్ మూవీ , చాల పవిత్రమైన బంధం విలువని తెలియజేస్తుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు

కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు ఏ కోదండరామిరెడ్డి, జంద్యాల, రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, ఈవివి సత్యనారాయణ, విజయబాపినీడు, వంశీ మొదలైన దర్శకులు అనేక తెలుగు చలనచిత్రాలకు దర్శకత్వం వహిస్తే వాటిలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకాభిమానాన్ని పొందితే, కొన్ని చిత్రాలు అవార్డులు పొందాయి.

ఏ కోదండరామిరెడ్డి కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు

సంధ్య తెలుగుచలనచిత్రంతో 1980 లో దర్శకుడుగా మొదలుపెట్టిన ఏకోదండరామిరెడ్డి తరువాతి సంవత్సరంలో వరుసగా రెండు తెలుగు చిత్రాలకు ఒక తమిళ చిత్రానికి దర్శకుడుగా పనిచేసారు. చిరంజీవి -రాధిక, జగ్గయ్య – శారద ప్రధాన పాత్రలతో దర్శకత్వం వహించిన న్యాయంకావాలి చిత్రానికి మంచిపేరు వచ్చింది. తరువాత చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ గా స్థిరపడి, వీరిద్దరి కాంబినేషన్ కి యండమూరి వీరేంద్రనాథ్ రచనలు తోడై ఎక్కువ చిత్రాలు ప్రజాదరణను పొందాయి. చిరంజీవి సినీ కెరీర్లో టర్నింగ్ పాయింట్ గా చెప్పే ఖైది చిత్రానికి ఏ కోదండరామిరెడ్డిగారే దర్శకులు.

ఏనార్, శోభన్ బాబు, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. న్యాయం కావాలి, అభిలాష, ఖైది, అనుభందం, దొంగ, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, వేట, దొంగమొగుడు, పసివాడి ప్రాణం, కిరాయిదాద, మరణమృదంగం, త్రినేత్రుడు, బలేదొంగ, నారి నారి నడుమ మురారి, చిట్టెమ్మ మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, నిప్పురవ్వ, ముఠామేస్త్రి, అల్లరి అల్లుడు, బొబ్బిలి రాజా వంటి ప్రజాదరణ పొందిన మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి కెరీర్లో మంచి హిట్ చిత్రాల ఇచ్చిన దర్శకులలో కోదండరామిరెడ్డి ఒకరు.

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు కుటుంబ కధ చిత్ర దర్శకులు

ముద్దమందారం చిత్రంతో దర్శకుడుగా వచ్చిన జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేక కుటుంబ కధలను హాస్య ప్రధానంగా తెలుగు ప్రేక్షకులకు అందించారు. నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో కామెడి చిత్రాలను అందించి తెలుగు వారి నోట నవ్వుల పండించిన దర్శకులు. మరీ ముఖ్యంగా ఈయన చిత్రాలలో సుత్తివేలు, సుత్తి వీరభద్రరావులతో చేయించే హాస్య సన్నివేశాలకు నవ్వని తెలుగుచిత్ర ప్రేక్షకులుండరు. బాలకృష్ణతో బాబాయ్ అబ్బాయ్, సీతారామ కళ్యాణం, చిరంజీవితో చంటబ్బాయి హాస్య చిత్రాలను తెరకెక్కించారు.

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో బాబాయ్ హోటల్, విచిత్రం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్, నరేష్, చంద్రమోహన్ కధానాయకులుగా చిత్రాలని డైరెక్ట్ చేసారు. నాలుగు స్తంబాలాట, రెండురెళ్ళు ఆరు, అహనాపెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, చంటబ్బాయి, సీతారామ కళ్యాణం, పడమటి సంధ్యారాగం, రెండు జళ్ళ సీత చిత్రాలు ప్రసిద్ది పొందాయి. బ్రహ్మానందం, సుత్తివేలు, వీరభద్రరావు లను అందించింది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారే.

అలాగే చిరంజీవి ఆపద్బందవుడు చిత్రంలో గొప్పింటి పెద్దగా నటించి మెప్పించారు. ఆనంద భైరవి, పడమటి సంధ్యారాగం, ఆపద్భాందవుడు  చిత్రాలకు ఉత్తమ రచయితగా, ఆనందభైరవి చిత్రానికి ఉత్తమ దర్శకులుగా నంది అవార్డులు అందుకున్నారు.  శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇంకా జర్నలిస్ట్ గా కూడా పలు అవార్డులు అందుకున్నారు.

రవిరాజా పినిశెట్టి కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు

చిరంజీవితో జ్వాలా చిత్రంతో దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న రవిరాజా పినిశెట్టి తరువాయి అర్జున్తో కోనసీమ కుర్రోడు, కళ్యాణ చక్రవర్తితో కృష్ణ లీల, చిరంజీవితో చక్రవర్తి, యముడికి మొగుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. యముడికి మొగుడు చిత్రం మంచి ప్రజాదరణ పొందింది, అటు తరువాత మంచి హిట్ చిత్రాలను దర్శకత్వం వహించి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ముత్యమంతముద్దు, రాజావిక్రమార్క, చంటి, బలరామకృష్ణులు, కొండపల్లిరాజా, బంగారుబుల్లోడు, పెదరాయుడు, మా అన్నయ్య వంటి మంచి ప్రజాదరణ పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మోహన్ బాబు సినీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం, విక్టరి వెంకటేష్ సినీ కెరీర్లో మ్యుజికాల్ హిట్ చిత్రం చంటి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే రవిరాజా పినిశెట్టి హిట్ చిత్రాలు కొన్ని రీమేక్ చిత్రాలుగా ఉంటాయి. అది పినిశెట్టి రవిరాజా పినిశెట్టి కుమారుడు.

ముత్యాల సుబ్బయ్య తెలుగు కుటుంబ చిత్ర దర్శకులు

నిర్మాతల దర్శకుడైన ముత్యాల సుబ్బయ్య కుటుంబ కదా చిత్రాలను చక్కటి సెంటిమెంట్ మేళవించి, కుటుంబసమేతంగా చూడదగిన చిత్రాలను తీసారు. మూడుముళ్ళభందం చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన ముత్యాల సుబ్బయ్య గారు, నవభారతం, సగటు మనిషి, ఇన్స్పెక్టర్ ప్రతాప్, మమతలకోవెల, నేతిచరిత్ర, మాఇంటికధ, మామగారు, కలికాలం, ఎర్రమందారం, బంగారుమామ, పల్నాటి పౌరుషం, అన్న, అమ్మాయి కాపురం, సోగ్గాడి పెళ్ళాం, పవిత్రభందం, హిట్లర్, గోకులంలో సీత, పెళ్లిచేసుకుందాం రా, స్నేహితులు, అన్నయ్య, ఆప్తుడు మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమునా, ఐశ్వర్య ప్రధాన పాత్రలుగా మామగారు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చిత్రంగా అందించారు. ఇందులో బాబూమోహన్ – కోటశ్రీనివాసరావు కామెడీ కాంబినేషన్ సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ – రాశి జంటగా గోకులంలో సీత  రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్రం రాజశేఖర్-విజయశాంతి లతో అరుణకిరణం, రాజేంద్ర ప్రసాద్ – యమునలతో ఎర్రమందారం, మహేశ్వరీ ప్రధాన పాత్రలో అమ్మాయికాపురం, వెంకటేష్ – సౌందర్యల కాంబినేషన్లో పవిత్రబందం చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. ఇంకా పలు పురష్కారాలు అందుకున్నారు.

ఈవివి సత్యనారాయణ కుటుంబ కధాచిత్ర తెలుగు దర్శకులు

జంధ్యాలగారి శిష్యుడు అయినా ఈవివి సత్యనారాయణ చెవిలో పువ్వు చిత్రంతో దర్శకుడుగా మారి, ప్రేమఖైది ప్రేమకదా చిత్రంతో ప్రేక్షకులను సినిమాహాలులో రెండున్నర గంటలపాటు ఖైదు చేసారు. అప్పుల అప్పారావు చిత్రంతో అందరిని హాస్యభరితంగా ఆనందింపజేసి సీతారత్నంగారి అబ్బాయితో కామెడీ-సెంటిమెంట్ సమపాళ్లలో చూపించారు. జంబలకిడిపంబ అంటూ హాస్యాన్ని అందరికి పంచారు. ఇలా ఈవివి సత్యనారాయణ కామెడీ, సెంటిమెంట్ కుటుంబ కధ చిత్రాలను ఎక్కువగా హస్యబరితంగానే తెరకెక్కించారు. చిన్నచిత్రాలకు పెద్ద చిత్రాలకు కూడా దర్శకత్వం వహించిన దర్శకుడు.

ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో రాజేంద్ర ప్రసాదుతో హాస్యం అందించిన ఈవివి వారసుడు, హలో బ్రదర్, ఆవిడా మా ఆవిడే చిత్రాలతో నాగార్జునతో హాస్యం పలికించారు. చిరంజీవితో అల్లుడా మజాకా, వెంకటేష్ తో అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మోహన్ బాబుతో అదిరింది అల్లుడు, కృష్ణతో తెలుగువీరలేవరా పలు హీరోలతో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈవివి సత్యనారాయణ సొంతబ్యానర్ పై చాలబాగుంది చిత్రం స్వీయ దర్శకనిర్మాన భాద్యతలు తీసుకుని విజయవంతమయ్యారు. రంభ, రచన, ఊహ, రవళి నాలుగు నటీమణులు ఈవివి చిత్రాలద్వారా తెలుగు చిత్ర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అలాగే తన కొడుకులు అయిన నరేష్, ఆర్యన్ రాజేష్ లను హీరోలుగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసి అందించారు. అల్లరి నరేష్ కామెడీ చిత్రాల హీరోగా విజయవంతం అయ్యారు.

విజయబాపినీడు

డబ్బు డబ్బు డబ్బు చిత్రానికి దర్శకుడు గా వచ్చిన విజయబాపినీడు పట్నంవచ్చిన ప్రతివ్రతలు చిత్రంలో చిరంజీవి మోహన్ బాబులతో దర్శకునిగా పనిచేసారు. రాజేంద్ర ప్రసాద్ పలు హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాకు పెళ్ళాం కావాలి, దొంగకోళ్ళు, జూలకటక, మహాజనానికి మరదలు పిల్ల హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. మెగాస్టారు చిరంజీవితో పట్నంవచ్చినప్రతివ్రతలు, మగమహారాజు, హీరో, మగధీరుడు, ఖైదినెంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

వంశీ

కుటుంబ హాస్యకదా చిత్రాలను అందించిన దర్శకులలో వంశీ ఒకరు. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా మంచుపల్లకి చిత్రం చిరంజీవి-సుహాసినిలతో తెరకెక్కించి దర్శకుడు అయ్యారు. మోహన్ – భానుప్రియలతో ఆలాపన చేయించి, కార్తిక్ భానుప్రియలతో అన్వేషణ చేసి, భానుప్రియను సితారగా మార్చి, రాజేంద్ర ప్రసాదుని లేడీస్ టైలర్ చేసారు. తరువాత పలు హాస్య చిత్రాలను కుటుంబ కదా చిత్రాలను అందించారు. చెట్టుకింద ప్లీడర్, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, ఏప్రిల్ 1 విడుదల, లింగబాబు లవ్ స్టొరీ, జోకర్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, దొంగరాముడు అండ్ పార్టీ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు

ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు… ఎందరో తెలుగు దర్శకులు మనకి మంచి చిత్రాలను అందించి అందరిని అలరించారు, ఎన్నోన్నో చిత్రాలలో మనోల్లాసం కలిగించే కధలను వెండితెరపై చూపించారు. మరెన్నో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. సామజిక అంశాలలో సాంఘిక సూచనలు కలిగిన చిత్రాలను అందించారు. కుటుంబ విలువలను తెలిపే చిత్రాలు, కొందరు అందిస్తే ప్రేమ కావ్యాలు కొందరు తెరకెక్కించారు. ఇలా వివిధములైన విషయలలో అంశాలలో తెలుగు చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మి బుల్లి బుల్లి తెరలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్ష్యం అవుతున్నాయి. వారిలో కొంతమంది దర్శకులు కె విశ్వనాధ్, దాసరి నారాయణరావు, ఏ కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, కే రాఘవేంద్రరావు, రవిరాజా పినిశెట్టి, జంద్యాల, ముత్యాల సుబ్బయ్య, ఇవివి సత్యనారాయణ, ముప్పలనేని శివ, విజయ బాపినీడు, వంశీ, టి కృష్ణ, సింగీతం శ్రీనివాసరావు, బాపు, బి గోపాల్, సాగర్, రేలంగి నరశింహారావు, ఎస్వి కృష్ణారెడ్డి, శరత్, క్రాంతి కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, ఏ మోహన్ గాంధీ, విజయభాస్కర్ మొదలైనవారు

కె విశ్వనాధ్ – ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు

కె విశ్వనాధ్ గారి పేరు చెబితే ఉత్తమ చిత్రాలకు దర్శకులుగా చెబుతారు. కళాతపస్వి అనే బిరుదనామం కూడా ఆయనికి చెబుతారు. మూగమనసులు చిత్రంకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కె విశ్వనాధ్ గారు ఆత్మగౌరవం చిత్రానికి దర్శకత్వం వహించారు, ఆ చిత్రం ఒక నంది అవార్డు గెలుచుకుంది. ప్రైవేటు మాస్టర్, కలోసిచ్చిన అదృష్టం, ఉండమ్మాబొట్టుపెడతా, ఓ సీతకధ, చెల్లెలి కాపురం, నిండు దంపతులు,  జీవనజ్యోతి, సిరి సిరి మువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, సూత్రదారులు, స్వాతికిరణం, శుభసంకల్పం, ఇంకా పలు తెలుగు చిత్రాలతో బాటు తమిళ్ హిందీ భాషలలో దర్శకత్వం వహించారు.

యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహిస్తే, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు, ఇంటర్నేషనల్ హానర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, నంది అవార్డ్స్ ఇంకా ఫిలిం ఫేర్ అవార్డ్స్ మొదలైన పలు అవార్డ్స్ గెలుచుకున్నారు. మానవ సంభందాలు – సామజిక అంశాలుపై మేలుకొల్పు చిత్రాలుగా తీసారు. క్లాసికల్ హిట్ చిత్రాల దర్శకులుగా ప్రఖ్యాతి గాంచిన మహనీయ దర్శకులు. అనవసరపు హంగులు లేకుండా అవసరమైన్ కధలను సామజిక అంశాలు మానవతా విలువలపై సందేశాత్మక చిత్రాలుగా మలచడం కె విశ్వనాధ్ గారి గొప్పతనం.

భారతీయ సాంప్రదాయ సంగీత గొప్పతనం కె విశ్వనాధ్ గారి చిత్రాల వలన ఇంకా ఎక్కువమందికి తెలిసేలా జరిగింది. సంగీతం ప్రధాన అంశంగా శంకరాభరణం, శ్రుతిలయలు, సాగర సంగమం, సిరివెన్నెల, స్వర్ణ కమలం స్వాతి కిరణం చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా కొన్నిచిత్రాలు నటించారు.

దాసరి నారాయణరావు – ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు

1972 సంవత్సరంలో తాతామనవడుకి దర్శకత్వం ప్రారంభించిన దాసరి నారాయణరావుగారు 2014 సంవత్సరంలో ఎర్రబసు చిత్రంతో కలిపి 140 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా చాలా చిత్రాలలో కనిపించి అలరించారు. కొన్ని చిత్రాలకు రచయితగా, కొన్ని చిత్రాలను నిర్మించారు. ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు. మొదటి చిత్రం తాతమనవడు చిత్రానికి అవార్డు అందుకోగా తరువాత స్వరం-నరకం, మేఘసందేశం లాంటి చిత్రాలకుకూడా అవార్డ్ అందుకున్నారు. ఇంకా మామగారు తెలుగుచలనచిత్రంలో దాసరి గారి నటన అంటే ఇష్టపడిన తెలుగు వారుండరు.

కన్న తల్లిదండ్రులను విడిచి, తన విలాసాల కోసం డబ్బుకి అంతస్తులకి లొంగిన కొడుకుని కన్నందుకు సిగ్గుపడి, బాధపడి అఖిరికి కోర్టులో కొడుకుని నిలబెట్టిన సూరిగాడు చిత్రంలో దాసరి నటన ప్రశంసనీయం. అడవి పల్లెల అడపడుచులపై చేసే ఆకృత్యాలని చిత్రంలో దర్శకుడుగా తెరకెక్కించి తానూ ఒక పాత్రను పోషించిన ఒసేయ్ రాములమ్మ చిత్రం ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఇంకా తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్నారు. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, మాటలు-పాటలు ఇలా ఒకే వ్యక్తి ఎక్కువ చిత్రరంగాల్లో రాణించిన వ్యక్తి దాసరిగారే ఉంటారు. 2017 మే 30 న సికింద్రాబాద్లో కిమ్స్లో కన్నుమూసారు.

కోడి రామక్రిష్ణ – ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు

100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు, చిరంజీవి హీరోగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో దర్శకుడు పరిచయమయ్యారు. అయితే కోడిరామకృష్ణ ముందుగా దాసరి నారాయణరావు గారి దర్శకత్వ శాఖలో పనిచేసారు. చిరంజీవితో ఇంకా ఆలయశిఖరం, సింహపురి సింహం, గూడచారి నెం1, రిక్షావోడు, అంజి చిత్రాలకు దర్శకులుగా వ్యవహరించారు. నందమూరి తారక రామరావుగారి బాలకృష్ణకు సోలో హీరోగా విజయంతమైన చిత్రం మంగమ్మగారి మనవడు చిత్రానికి కోడి రామకృష్ణే దర్శకులు. తరువాత బాలకృష్ణతో పలు తెలుగుచిత్రాలు ముద్దులకృష్ణయ్య, ముద్దులమావయ్య, మువ్వగోపాలుడు, ముద్దులమేనల్ల్దుడు, బాలగోపాలుడు దర్శకత్వం వహించారు.

తెలుగులో గ్రాఫిక్స్ కలిగిన చిత్రాలు ఎక్కువగా దర్శకత్వం వహించడంతో భారి చిత్ర నిర్మాణ వైభవం కోడి రామకృష్ణగారి దర్శకత్వంలోనే ఎక్కువ ఉండేవి. అమ్మోరు, దేవిపుత్రుడు, అంజి, దేవి, అరుందతి వంటి చిత్రాలతో గ్రాఫిక్స్ ఎక్కువగా వాడి తెలుగువారికి అద్బుత చిత్రాలను అందించారు. కోడి రామకృష్ణగారి చిత్రాలు మద్యతరగతి సంసార ఇతిభాదలు, కుటుంబ బంధాలు ప్రధాన అంశంగా కొన్ని చిత్రాలు ఉంటాయి. ఆవిడే శ్యామల, ఆస్తిమూరెడు ఆశబారెడు, ఆలయశిఖరం, పెళ్లి, పెళ్ళాం చెబితే వినాలి, పెళ్లిపందిరి, పుట్టింటికి రా చెల్లి, ముక్కుపుడక, పంచదార చిలక మొదలైన చిత్రాలు ఉంటే కోడి రామకృష్ణ కొన్ని చిత్రాలలో నటించారు. చిన్నపిల్లలతో భక్తి యాత్ర చేయించి దేవుళ్ళ గురించి మహిమల గురించి తెలియజెప్పారు.

కె రాఘవేంద్ర రావు

దర్శకేంద్రుడు అని శతచిత్ర దర్శకులైన రాఘవేంద్రరావు గారిని అంటారు. తెలుగు చిత్ర సీమలో NT రామారావు గారి నుండి మంచు మనోజ్ వరకు చాల మంది హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిన్న మొన్నటి తెలుగు అగ్రతారలు రామారావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విక్టరి వెంకటేష్ తొలిచిత్రం కలియుగ పాండవులు రాఘవేంద్రుడి దర్శకత్వంలోనే వచ్చింది. మహేష్ బాబుని రాజకుమారుడు చిత్రంతో, అల్లుఅర్జున్ని గంగోత్రి చిత్రంతో హీరోలుగా నేటి తరం అగ్రహీరోలను తొలిపరిచయం చేసింది రాఘవేంద్రరావు గారే.

తెలుగు అగ్రహీరోలకు బిగ్గెస్ట్ హిట్ చిత్రాలను అందించింది కె రాఘవేంద్రరావు గారే, పదహారేళ్ళ వయసు, వేటగాడు, గజదొంగ, కొండవీటిసింహం, త్రిశూలం, దేవత, అడవిదొంగ, అగ్నిపర్వతం, పట్టాభిషేకం, జానకిరాముడు, కొండవీటిదొంగ, ఆఖరిపోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి, సుందరకాండ, అల్లుడుగారు, ఘరానామొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరిప్రియుడు, పెళ్లిసందడి, ముద్దులప్రియుడు, రాజకుమారుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు దర్శకత్వం వహించారు. పాటలచిత్రీకరణలో పళ్ళుపూవులు నటుల అందాలతో అందంగా తీయడం రాఘవేంద్రరావుగారి తరువాతే.

సాంఘిక చిత్రాలలో అనేక విజయాలను అందుకున్న రాఘవేంద్రరావుగారు భక్తిరస చిత్రాలలోనూ మంచి విజయాలు సాధించారు. అన్నమయ్య చిత్రంతో నాగార్జునని ఓకే భక్తుడిగా సుమన్ వేంకటేశ్వరస్వామిగా చూపించి అందరి ప్రశంశలు అందుకున్నారు. తరువాత చిరంజీవిని శివుడిని చేసి అర్జున్ని భక్తుడిగా శ్రీమంజునాధ చిత్రంతో మళ్ళి ఒకసారి భక్తుల మన్ననలను అందుకున్నారు. మరలా భక్తిచిత్రాలతోనే నాగార్జున హీరోగా శ్రీరామదాసు కధని, షిర్డీ సాయిబాబా కధని వెండితెరపై ప్రసరింపచేసారు. సాంఘిక చిత్రమైన భక్తిచిత్రమైన ప్రేక్షకులకు అర్ధం అయ్యేరీతిలో తీయడం, ప్రేక్షక హృదయాలని రంజింప చేయడంలో దిట్ట. ఈతరం ప్రసిద్ద దర్శకులలో జక్కన రాజమౌళి రాఘవేంద్రరావు గారి శిష్యుడే.

కెఎస్ఆర్ దాస్, KSR Das

యాక్షన్ తరహాలో నేరవిభాగంలో సాగే అంశాల చిత్రాలు తీయడంలో సిద్దహస్తులు. నేరస్తులను వెంటాడే పోలీసులు, నేరస్తులను పట్టుకోవడంలో ప్రత్యేక ఏజెంట్స్ నిర్వహించే ఆపరేషన్స్ వంటి చిత్రాలను తెరకేక్కించడంలో ఘనాపాటిగా చెబుతారు. తెలుగుతో బాటు కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తం మీద 100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులలో కెఎస్ఆర్ దాస్ ఒకరు.

శోభన్ బాబు కధానాయకుడుగా నేరగాళ్ళను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో లోగుట్టుపెరుమాళ్ళకెరుక చిత్రం దర్శకత్వం వహించారు. తరువాత కృష్ణతో అనేక సాహాస చిత్రాలు తీసారు, టక్కరిదొంగ చక్కనిచుక్క, మోసగాళ్ళకు మోసగాడు, అన్నదమ్ముల సవాల్, ఏజెంట్ గోపి, దొంగలవేట, మాయదారి అల్లుడు, రహస్యగూడచారి, దొంగలు బాబోయ్ దొంగలు, దొంగలకుసవాల్ వంటివి ఉన్నాయి. కృష్ణంరాజు – చిరంజీవి హీరోలుగా పులి బెబ్బులి, కృష్ణ-రజనికాంత్ హీరోలుగా ఇద్దరూ అసాధ్యులే  వంటి మల్టీస్టారర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా కృష్ణతో చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

సందేశంతో జనతా గారెజ్ తెలుగు

సందేశంతో జనతా గారెజ్ తెలుగు మూవీ…. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఓకే కుటుంబ కథ! జనతా గారేజ్ తెలుగు చలన చిత్రం. యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు కధానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో సమంతా, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే కుటుంబ పెద్దగా మోహన్ లాల్ నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిచిన ఈ చిత్రానికి నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్.

చంద్రశేఖర్ (సాయి కుమార్) శివ (రహమాన్) ఇద్దరు స్నేహితులు హైదరాబాదులో ఉంటారు. అయితే చంద్రశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. రహమాన్ ఊరిలో ఉన్న తన అన్న సత్యం (మోహన్ లాల్)ని కుటుంబంతో సహా హైదరాబాదుకి తీసుకువచ్చి అక్కడ అతనికి ఒక వర్క్ షాప్ పెట్టిస్తాడు. అయితే ఆ గారేజ్ ఒక స్థాయిలో వెళుతుంది.

సందేశంతో జనతా గారెజ్ తెలుగు మూవీ కధ

సత్యం (మోహన్ లాల్) అన్యాయం జరిగిందంటూ ఎవరు వచ్చి అడిగి సహాయం చేయమన్న వెళ్లి సహాయం చేస్తూ ఉంటాడు. కొద్దిరోజులుగా తన షెడ్లో పనిచేసే పెద్దాయన రాకపోతే ఆయనింటికి వెళ్లి విషయం అడుగుతారు జనతా గారేజ్ పెద్ద మరియు అక్కడ పనిచేసే అతని గ్యాంగ్. తన కూతురిని మానభంగం చేసి చంపేశారని వాపోతాడు ఆ పెద్దాయన. ఈ విషయం గురించి జనతా గారేజ్ వ్యక్తులు అంతా కలిసి DSP చంద్రశేఖర్ (సాయికుమార్) దగ్గరికి వెళ్లి అడుగుతారు. నగరంలో ఒక పెద్దమనిషికి సంభందించిన వారు సాక్ష్యం లేకుండా ఆ తప్పు చేశారని, ప్రస్తుతం పోలీసులు చేతిలో ఏమి లేదని చెబుతారు.

పోలీసుల సమాధానం విన్న జనతా గారేజ్ మనుషులు పెద్దాయన కూతుర్ని మానభంగం చేసిన నలుగురుని ఆక్సిడెంట్ గా చూపి చంపుతారు. ఇక ఆ సంఘటన తరువాత సిటీలో ఎవరికీ ఏ సమస్య వచ్చిన జనతా గారేజ్ వైపు చూడడం, వారికి వచ్చి విన్నవించుకోవడం జరుగుతూ ఉంటే, జనతా గారేజ్ గాంగ్ తమకు చెప్పిన సమస్యలను సరిచేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే సత్యం (మోహన్ లాల్) తమ్ముడుకి పెళ్లి సంభందం వస్తుంది, పెళ్లి చేసుకుని ముంబై వచ్చేయమని (సురేష్ అనుయాయులు) పెళ్ళివారు అడిగినా రహమాన్ పెళ్లిచేసుకుని హైదరాబాదులో అన్నదగ్గరే ఉంటాడు. కొన్నాళ్ళకు వారికి ఒక బిడ్డకలుగుతాడు. అయితే జనందృష్టి ఎలా పడితే అలా ఎదగడం ఉండే సామజిక పరిస్థతిలో జనతా గారేజ్ గ్యాంగ్ అంటే మంచి చేసే గ్యాంగ్ గా పేరు గడిస్తుంది, అలాగే సిటీలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో శత్రుత్వం కూడా సంపాదించుకుంటుంది. ఒకరోజు వారు గుడికి వెళుతుంటే జనతా గారేజ్ శత్రువులు కొందరు సత్యం (మోహన్ లాల్) తమ్ముడు రహమాన్ దంపతులపై దాడి చేసి చంపుతారు, వారి కొడుకు బతుకుతాడు.

ఆ ఇన్సిడెంట్ తరువాత DSP చంద్ర శేఖర్ వచ్చి ఈ పనులు మానేయమని ఇంతకుముందు మీకు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను అని చెబుతాడు. ముంబై నుండి వచ్చిన తమ్ముడు బావమరిది సురేష్ కి తమ్ముడి కొడుకుని వారికి ఇచ్చేసి మేమనే బందువులు ఉన్నట్టు చెప్పకుండా పెంచుకోండి, అని చెబుతాడు. అలా ముంబైకి చేరిన పిల్లవాడు ప్రకృతిపై అమితమైన ప్రేమను పెంచుకుంటూ ఉంటాడు. పిల్లవాడు మేనమామ అయిన సురేష్ కి ఒక పాప, ఇద్దరు పిల్లలు కలిసి పెరుగుతారు. అమ్మానాన్న గురించి అడిగితే మీ అమ్మ నాలాగా మీ నాన్న నీలాగా ఉంటుంది అని మాత్రమే సమాధానం చెబుతాడు సురేష్. పెరిగిన పిల్లవాడు ఆనంద్ (నందమూరి తారక రామారావు jr.), పాప బుజ్జి (సమంత).

NTR & Mohanlal సందేశంతో జనతా గారెజ్ తెలుగు

కధానాయకుడి పరిచయ పాటలో అతని వ్యక్తిత్వం ప్రతిబింబించేలా ప్రకృతిని గురించి కధానాయకుడి ప్రణామం పాట చక్కగా ఉంటుంది. ప్రకృతిని ఇష్టానుసారం వాడుకునే వారు, పద్దతిగా వాడుకునేవారు ఎవరైనా పాటను వింటే ప్రకృతిపై ఇంకా గౌరవం పెరుగుతుంది.

వాతావరణ కాలుష్యం గురించి ఆనంద్ (నందమూరి తారక రామారావు Jr.) ఎప్పుడు ఆలోచన సాగిస్తూ, ప్రకృతిని కాపాడుకోవాలి అని చూస్తూ ఉంటాడు. సురేష్ అప్పుడు ఆనంద్ జనతా గారేజ్ గ్యాంగ్ ఆలోచన చేసినట్టే ఆలోచన చేస్తున్నాడని అర్ధం అవుతుంది. తండ్రి కుటుంబ ఆలోచనలు ఇతనిలోను సాగుతాయి. ఆనంద్ ఆలోచనలు పెదనాన్నసత్యం(మోహన్ లాల్)లాగ సాగితే, సత్యం కొడుకు మాత్రం జనతా గారేజ్ విరోధితో చేతులు కలిపి తండ్రి దారి నుండి తప్పుకుని చెడు దారిలో ఆలోచనలు సాగుతూ ఉంటాయి.

సత్యం అతని అనుయాయులు ఎవరికీ ఏ సమస్య ఉందని జనతా గారేజ్ దగ్గరికి వచ్చిన వారి వారి సమస్యలను తీర్చుతూ సహాయపడుతూ ఉంటారు. అలా జనతా గారేజ్ వాహనాలను మనుష్యులను కూడా రిపేర్ చేయడం కొనసాగిస్తూ ఉంటుంది. సిటీలో ఉన్నా పేదవారి గుడిసెలు కలిచేసి హోటల్ కాంప్లెక్స్ కట్టి అభివృద్ధి చేసి పేదలకు కూడా వేరేచోట ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ తెస్తారు. సత్యం (మోహన్ లాల్) తిరస్కారంతో ఆ స్లం ప్రాజెక్ట్ ఆగిపోతుంది. జనతా గారేజ్ ఏమని చెప్పినా అదే కరెక్ట్ అనే అభిప్రాయం జనాలలో పెరుగుతుంది.

ప్రకృతిపై ప్రేమ కలిగిన ఆనంద్ ముంబైలో ప్రకృతిని పరిరక్షణకోసం అన్నట్టు చేసే ప్రయత్నంలో నిత్యమీనన్ పరిచయం అవుతుంది. బుజ్జి(సమంత), ఆనంద్ (నందమూరి తారక రామరావు Jr.)లు షాపింగ్ మాల్లో కలిస్తే చూసిన నిత్య ఎప్పుడు ప్రకృతి అని నసపెట్టే అతనితో ఏం ఫన్ ఉంటుంది, అంటే. డానికి ఆనంద్ నాతోరా అని నిత్యని తీసుకువెళతాడు ఎప్పుడూ తాను ఆనందంగా గడిపే ప్రదేశాలకి. మనకి ఆనందాన్ని ఇచ్చే ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనే ప్రధాన ఉద్దేశ్యమే ఆనంద్లో ప్రస్పుటం అవుతుంది.

జనతా గారేజ్ యజమాని సత్యం (మోహన్ లాల్)కి ఆక్సిడెంట్ అవుతుంది, హాస్పిటల్ జాయిన్ అవుతాడు. ఆ ఆక్సిడెంట్ జనతా గారేజ్ శత్రువులే చేయించారని జాగ్రత్త అని DSP చంద్ర శేఖర్ మరలా హెచ్చరిస్తారు. ముంబైలో ఆనంద్ ఒక పార్క్ తీసీవేయలనుకున్న ఒక ఎంఎల్ఏ దేశ్ పాండేతో గొడవపడతాడు. ఒకసారి నేను హైదరాబాదు పరిశోదన నిమిత్తం వెళతాను అని అడిగిన ఆనంద్ని వద్దని ఆపేసిన (ఆనంద్ మావయ్య)సురేష్, ఇప్పుడు నీవు హైదరాబాదు వెళ్లి పరిశోదన చేసుకో అని చెప్పి హైదరాబాదుకి పంపించేస్తాడు.

సందేశంతో జనతా గారెజ్ తెలుగు

అయితే హైదరాబాదులో జనతా గారేజ్ యజమాని సత్యంగారికి ఆరోగ్యమ బాగా ఉండకపోవడం వలన వారి మంచి కార్యకలాపాలు కొంచెం తగ్గుతాయి. జనతా గారేజ్లో మిగిలినవారు సత్యంగారి ఆరోగ్యదృష్ట్యా సమస్యలు చెప్పుకునే వారు వచ్చిన కాదని వారిని పంపించేస్తూ ఉంటారు. జనతా గారేజ్ భాద్యతని తన కొడుకుని తీసుకోమని సత్యం(మోహన్ లాల్) అడిగితే కొడుకు కాదంటాడు. అంతే కాకుండా కొడుకు జనతా గారేజ్ విరోధి కూతుర్ని పెళ్లిచేసుకుని, అతని చేతిలో కీలుబొమ్మగా మారతాడు.

సత్యం(మోహన్ లాల్)గారి కొడుకు వలన హైదరాబాదులో ఒక చోట పర్యవరణం కాలుష్యం జరుగుతుంటే, జనతా గారేజ్ యజమాని కొడుకు అని ఎవరు ఆ విషయం జోలికి వెళ్ళరు, కానీ పరిశోదన నిమిత్తం అక్కడికి వచ్చిన ఆనంద్ వారిని కారణం అడిగి తెలుసుకుని, సత్యం(మోహన్ లాల్)గారి కొడుకుని అతని మనుషులతో గొడవపడతాడు. ప్రకృతిలో మనం ఒక బాగంగా వచ్చాము అద్దెకు వచ్చినట్టు, శుభ్రంగా వాడుకోవాలి కానీ, ఎలాపడితే అలా వాడి పర్యావరణం పాడుచేయకూడదు అనే కధానాయకుడి భావన ఒక సద్భావనగా ఉంటుంది.

సత్యం (మోహన్ లాల్) గారు తన కొడుకుతో గొడవపడ్డ ఆనంద్ని జనతా గారేజ్ కి తీసుకువచ్చి వాళ్ళ అబ్బాయి విషయంలో తగువు ఎందుకు అని తెలుసుకుంటాడు. తరువాత ఆనంద్ దగ్గరకి వెళ్లి చాన్నాళ్ళుగా ఈ జనతా గారేజ్ జనాలా సమస్యలు తీర్చింది, ఇప్పుడు నా వయస్సు మీరడం వలన సమస్యలు చెప్పి బాధపెట్టడం ఎందుకు అని వెనుతిరుగుతున్నారు, అందుకు నాకు చాల బాధగా ఉంది. నీవు వచ్చి జనతా గారేజ్ భాద్యతని తీసుకుని నడిపించమని అడుగుతారు, నీపైనే నమ్మకం ఉంది అని అంటారు. సుదీర్ఘ ఆలోచన తరువాయి జనతా గారేజ్ భాద్యతని ఆనంద్ స్వీకరిస్తాడు.

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram

సహాయం అడిగిన మంచివారికి సహాయం చేసే గుణం సత్యం గారికి, ప్రకృతి అమితమైన ప్రేమతో పర్యావరణ పరిరక్షణకు పూనుకునే తమ్ముడి కొడుకు ఆనంద్ కలయిక జనతా గారేజ్. కార్ల రిపేర్ తో బాటు మరలా మనుషుల రిపేర్ మొదలవుతుంది. జనతా గారేజ్ సహాయం కోసం వచ్చి వెనుతిరిగిన మొదటి వ్యక్తితో ఆ రిపేర్ మొదలవుతుంది. అలా వెళ్ళినా మొదటి వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి వికాస్. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చేఅధికారిగా వికాస్ (రాజీవ్ కనకాల) GHMCలో పనిచేస్తున్న ఉద్యోగిని డాకుమెంట్స్ సరిగా లేని బిల్డింగ్ అప్రూవల్ కోసం ఒక వ్యాపారస్తుడి మనుషులు బెదిరిస్తారు.

ఆనంద్ ఆ ఉద్యోగి వికాస్ ని జనతా గారేజ్ పిలిపించి అడిగినప్పుడు తన సమస్యను చెబుతారు, GHMC ఉద్యోగి(రాజీవ్ కనకాల). అప్పుడు ఆనంద్ (నందమూరి తారక రామారావు jr.) సంతకం పెట్టడానికి రేపు వారు గడువు ఇచ్చారని అంటున్నావు, ఈరోజు మేము మీతో మాట్లాడకుండా ఉండి ఉంటే రేపు మీరేం చేసేవారని అడుగుతాడు. డానికి బదులుగా రేపు ఆఫీసుకి వెళ్ళే లోపులోనే సూసైడ్ చేసుకునే వాడిని అని బదులిస్తారు. ఆ సన్నివేశంలో ఒక ఇద్దరు పిల్లలు, భార్య కలిగిన సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగి భావన ఆనంద్కి కనిపిస్తుంది వికాస్ ముఖంలో.

మరునాడు GHMC ఆఫీసులో ఆనంద్ మాటలు అక్కడి ఉద్యోగస్తులని కదిలిస్తాయి. అలాగే అక్కడికి ప్రభుత్వ ఉద్యోగి వికాస్(రాజీవ్ కనకాల) బెదిరింపుతో వచ్చిన మనుషుల్ని ఆనంద్ కొట్టి పంపిస్తాడు. అలా మొదలైన జనతా గారేజ్ అన్ని రిపైర్లు విజయవంతం అవుతాయి. మరలా DSP చంద్రశేఖర్ ఆనంద్ని కూడా హెచ్చరిస్తాడు, ఇలాంటి పనుల వలన సమస్యలు వస్తాయని. డానికి బదులుగా జననానికి జనతా గారేజ్ తో పనిలేకుండా మీరు హామీ ఇవ్వండి మేము మానేస్తామని చెప్పి, ఆనంద్(నందమూరి తారక రామారావు Jr.) జయహో జనతా గారేజ్ అనుకుంటూ తన బాద్యతను తను నిర్వహిస్తూ ఉంటాడు.

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram

అయితే DSP చంద్రశేఖర్ ఆనంద్ ఫ్యామిలీ గురించి ఎంక్వయిరీ చేసి, సత్యం (మోహన్ లాల్)బావమరిదిని సత్యంగారి ఇంటికి తీసుకువస్తాడు. అప్పటిదాక సత్యం (మోహన్ లాల్) గారికి ఆనంద్ తన తమ్ముడి కొడుకు అని, ఆనంద్కి సత్యంగారు పెదనాన్న అన్న విషయం తెలియదు. అయితే ఆనంద్ని ఇంటికి రప్పించడానికి మేనమామ నా కూతురు కావాలా? జనతా గారేజ్ కావాలా ? అని కండిషన్ పెడితే ఆనంద్ కూడా తన తండ్రిలాగానే జనతా గారేజ్ బాద్యతనే ఎంచుకుంటాడు.

ఎప్పుడు జనతా గారేజ్ గ్యాంగ్ ని మీ పనులు మానివేయండి అని సలహా చెప్పే DSP చంద్రశేఖర్ కూడా జనతా గారేజ్ కొచ్చి సమస్యను తీర్చమనే స్థితికి పోలీసులు రావడం, అలా జనతా గారేజ్ నడిపించే ఆనంద్ జనతా గారేజ్ ని వ్యతిరేకిస్తూ ఉండే మూల వ్యక్తిని మట్టుపెట్టడంతోనూ,ఎంత చెప్పినా వినకుండా చెడుమార్గంలో నడిచిన కొడుకుని సత్యంగారు మట్టుపెట్టడంతో, కధ సుఖాంతం అవుతుంది. సాదారణ మనిషి కష్టాలు విని వారి కష్టాలను పోగొట్టే వ్యక్తిగా సత్యం పాత్రలో మోహన్ లాల్ పాత్ర కధకి ఆయువుపట్టు. కొనసాగింపుగా ఆనంద్ పాత్రలో నందమూరి తారక రామారావు చాల బాగా నటించారు. ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడాలి అనే ఆలోచనతోనే ఉండడం దానికోసం ఏమైనా చేయడం చిత్రం మంచి సందేశాత్మక చిత్రంగా ఉంటుంది.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

దైవం వాడుక భాషలో సంభాషణలు కొనసాగించడం అది ఆదిదేవుడు మహాదేవుడు అయిన పరమశివుడు వాడుక బాషలో మాట్లాడడం ఈచిత్రం ద్వారా గ్రాంధిక భాష సరిగా తెలియనివారికి కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు. దైవము-భక్తులుగా మెప్పించిన శ్రీమంజునాధ తెలుగు భక్తి చిత్రం.

ఓం శ్రీ మంజునాదాయ నమః శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

చిరంజీవి శివుడుగా నాట్యం చేసిన చిత్రం అర్జున్ భక్తుడిగా మెప్పించిన చిత్రం శ్రీ మంజునాధ తెలుగు భక్తి చలనచిత్రం. జెకె భారవి రచించిన భక్తి కధ ఆధారంగా చిరంజీవి శివుడిగా మీనా పార్వతి దేవిగా, అర్జున్ భక్తుడిగా అతని భార్యగా సౌందర్య నటించిన భక్తిరస తెలుగు చలన చిత్రం శ్రీ మంజునాథ. కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించడం విశేషం అయితే హంసలేఖ సంగీతం అందించారు, నారా జయదేవి నిర్మించారు.

శ్రీమంజునాధ తెలుగు భక్తిరస సినిమాను యూట్యూబ్ ద్వారా చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి లేక నొక్కండి.

భూదేవి భూమిని చీల్చుకుంటూ పైకి వస్తే, ఒక రాక్షసాకారాలు ఆమెను తరుముతూ ఉంటుంది ప్రారంభ సన్నివేశంలో.  అప్పుడు భూదేవి శ్రీమంజునాథ(SriManjunatha) అంటూ ఆర్తనాదం చేయడంతో కైలాసంలో ధ్యానం ఉన్న కైలసవాసి కనబడతారు. అప్పుడు పార్వతి దేవి శివయ్యని అడుగుతుంది ఏమిటి స్వామి భూమాత అక్రోసిస్తుంది, ఏమిటి వైపరీత్యం అంటే అప్పుడు, పరమేశ్వరుడు పార్వతితో కలికాలం కదా భూలోకంలో కామ క్రోధ, లోభ, మద, మాచ్యర్యాలు జనులు లోనవుతూ ఉంటారు అని సెలవిస్తారు.

ధర్మోరక్షిత రక్షితః అనే సూత్రంతో మనిషే మహనీయుడు అవుతాడని అంటే, అటువంటి మానవుడు ఎవరని అడిగితే మంజునాధుడు భూలోకంలో రుద్రుడుని దూషిస్తూ కనబడే వ్యక్తిని చూపిస్తారు. అతనే భూలోకంలో ధర్మరక్షణకు పూనుకునే భక్తుడుగా మారతాడని మంజునాధుడు సెలవిస్తారు. ఇక శివదూషణ సాగే పాటలో మరో భక్తురాలు కాత్యాయని శివస్తుతి చేస్తూ కనబడుతుంది. తరువాయి ఇంటికి విచ్చేసిన మంజునాధుడుని తండ్రి మందలిస్తాడు.

గ్రామపెద్ద ఒక తప్పుడు తీర్పు ఇస్తుండడంతో మంజునాధ అక్కడికి వచ్చి ఆ గ్రామ పెద్దకి బుద్ది చెబుతాడు. అక్కడే ఉన్న కాత్యాయని (సౌందర్య) మంజునాధ(అర్జున్)ని చూసి ఇష్టపడుతుంది. శివాయలంలో ప్రసాదం పెట్టని పూజారిని ఎదురించి మంజునాధ ఆ అన్నార్తికి ప్రసాదం పెడతాడు. శివుడు సంతోషిస్తాడు, ఆకలితో ఉన్నవాడి ఆకలి తీర్చినందుకు. మరలా మంజునాధ, కాత్యాయని గుడిలో కలిసే పరిస్థితి వస్తుంది. ఊరి పెద్దలంతా భక్త మంజునాధపై ఆగ్రహంగా ఉంటారు. అన్యాయాన్ని ఎదిరించే గుణం కలిగిన మంజునాధుడు కనిపించకుండా ఉంటూ అన్యాయాన్ని ఆపని భగవంతుడిపై కోపంగానే ఉంటూ ఉంటాడు.

భక్తుడు మంజునాధ-కాత్యయనిల వివాహం వారికి సంతానం

శ్రీ మంజునాధ చరితం నీ శ్రీ మంజునాధ అంటూ సాగే పాట పాడుతూ శివ మహిమలు గురించి చెప్పే పాటలో ఆ ప్రాంత అంబికేశ్వర మహారాజ దంపతులు కనబడతారు. శివుడు హాలాహల భక్షణం, గంగావతరణ, శివపార్వతుల అర్ధనారీశ్వర స్వరూపం గురించి ఈ పాటలో చక్కగా చూపుతారు. ఆ మహారాజుకి మంజునాధుడి అనుగ్రహంతో ఎదుటివారి నుదుటి వ్రాతలు చదివే విద్య అతని సాధన వలన వస్తుంది.

మంజునాధుడు(శివుడి) అనుగ్రహంతో కాత్యాయని మంజునాధు(అర్జున్)లకు వివాహం జరుగుతుంది. కాత్యయనిని దేవదాశిగా మారుస్తుంటే భరించలేని మంజునాధు(అర్జున్)డు ఊరి పెద్దల మద్య తాళి కడతాడు. ఇంటికి వచ్చిన మంజునాధ-కాత్యాయనిలను ఇంట్లోని వారు కాత్యాయనికి శివుడిపై ఉన్న భక్తి కారణంగా వారిని ఇంటిలోనే ఉండనిస్తారు. శివుని పేరు చెబితే చిరాకు పడే మంజునాధుడి భార్య కాత్యాయని శివుడిని సంతానం కోసం పూజిస్తూ ఉంటుంది. భక్తురాలి కాత్యాయని భక్తికి భగవంతుడు శివుడు కట్టుబడడం ఈ సన్నివేశంలో కనిపిస్తుంది.

సంతానం కోసం మౌనవ్రతం చేస్తూ ఉండే కాత్యాయనికి శివుడు మారువేషంలో వచ్చి మూలికను ఇచ్చి వెళతాడు. తత్పలితంగా వారికి ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి సిద్ధూ అని నామకరణం చేస్తారు. కానీ ఆ పుత్రుడు పూర్తిగా శివుని భక్తుడిగా ఉంటాడు. అది మంజునాధుడి(అర్జున్)కి నచ్చదు అయితే అతను తన తల్లిదండ్రులతో వాదించి ఇకపై దైవ ప్రస్తావన తీసుకురావద్దని చెబుతాడు.

దైవ మంజునాధుడు మానవ మంజునాధతో వివిధ రూపాలలో హితబోధ చేయడం

శివుడు లేడని ఒప్పుకో మీ నాన్నని భాదపెట్టకు అని సిద్ధుకు మంజునాధుడి స్నేహితులు చెబుతుంటే, అప్పుడు సిద్ధూ శివుడి గురించి వివరిస్తూ ఉండగా తండ్రి వచ్చి సిద్ధూని చెంపపై కొట్టి ఇంటికి తీసుకువెళతాడు. కానీ మంజునాధ(అర్జున్)కు నిద్రరాకుండా కలలే వస్తూ ఉంటాయి. లేచి ఊరికి దూరంగా కొండలలో కూర్చున్న మంజునాధ(అర్జున్) దగ్గరికి శివుడైన మంజునాధుడు మారువేషంలో వస్తారు. అలా వచ్చిన మంజునాధుడు మానవ మంజునాధుడికి హితబోధ చేస్తే ఆలోచనలో పడతాడు మంజునాధుడు(అర్జున్). అలా ఆలోచనలో ఉన్న మంజునాధుడు దగ్గరికి వాళ్ళ అమ్మ వేషంలో దైవ మంజునాధ వచ్చి మాట్లాడి వెళుతుంది. ఇంకా ఆలోచనలో సాగుతుండగా మళ్ళి మంజునాధుడు సిద్దుడి వేషంలో వచ్చి మాట్లాడి వెళతాడు.

నిరంతర ఆలోచనల నుండి బయటపడిన మంజునాధుడు(అర్జున్) ఇంటికి వస్తాడు. అలా వచ్చిన మంజునాధ (అర్జున్)ని ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు అని అడిగితే ఆశ్చర్యపడతాడు మంజునాధుడు (అర్జున్). అప్పుడు ఇంట్లో వారిని అడుగుతాడు మీరు ఇంతకముందు నాదగ్గరికి వచ్చారు అని అడిగితే, కుమారుడు సిద్ధూ వచ్చి నీదగ్గరికి మా రూపాలలో వచ్చింది దైవం మంజునాధుడు(శివుడు) అని చెబుతాడు. ఇంటిలో ఉన్న మంజునాధుడు శివభక్తుడుగా మారతాడు. ఆ సన్నివేశంలో ఒక్కడే మంజునాధుడు ఒక్కడే మంజునాధుడు ఒక్కడే అని సాగే పాట భక్తిప్రదాయకంగా సాగుతుంది. హరుడు ఒక్కడే, శివుడు ఒక్కడే, మంజునాధుడు ఒక్కడే, గంగాధరుడు ఒక్కడే అంటూ మానవ మంజునాధ భక్తమంజునాధగా మారుతాడు.

భక్తుడు అయిన మంజునాధ తన కుటుంబంతో ధర్మస్థల దైవ దర్శనానికి దేవాలయానికి వెళతాడు. అదే ఊరికి అంబికేశ్వర మహారాజు దేవాలయానికి వస్తాడు. అప్పటికీ భక్త మంజునాధ అంటే గిట్టని కొందరు అక్కడికి వస్తారు. అదే సమయంలో సుడిగాలి రావడం దేవాలయంలో దీపాలు ఆరిపోతాయి. సుడిగాలి వచ్చి దీపాలు ఆరిపోయాయి అంటే నాస్తికుడు దేవుడిని నమ్మని మంజునాధ (అర్జున్) దేవాలయానికి రావడమే కారణం అని మహారాజుతో చెబుతారు. అప్పుడు మహారాజు భక్త మంజునాధకి ఆలయప్రవేశం చేయాలంటే మీ భక్తితో ఆరిపోయిన దీపాలు వెలిగించండి అప్పుడు దైవాన్ని దర్శించుకోండి అని ఆజ్ఞాపిస్తాడు.

భక్తిగానంతో దేవాలయ దీపాలు వెలిగించే భక్త మంజునాధ

ఓం మహా ప్రాణదీపం, శివం శివం మహా ఓంకార రూపం అంటూ అందుకునే పాట గుక్కతిప్పకుండా సాగుతుంది. పాట పూర్తయ్యేసరికి గుడిగంటలు లక్ష గుడిదీపాలు వెలగడం మంజునాధ దైవమహిమ, మంజునాధ భక్తి తేట తెల్లమవుతుంది మహారాజుకి. మహారాజు తనతో రాజ్యానికి వచ్చేయమని భక్తమంజునాధని కోరితే, నేను అహంకారంతో అజ్ఞానంతో కోటిసార్లు దైవ దూషణ చేశాను కాబట్టి కోటిలింగ ప్రతిస్థాపన చేస్తాను అని బడులిస్తాడు భక్త మంజునాధ.

కోటిలింగాల ప్రతిస్థాపనకు మహారాజుకూడా వచ్చి వెళతాడు. ఆ మహాకార్యం పూర్తయ్యాక పార్వతి పరమశివులు చాల సంతోషిస్తారు. అనుగ్రహించదలచిన పరమేశ్వరుడు మంజునాధుడు భక్త మంజునాదని అనుగ్రహించడానికి ఒక వృద్ద వేషంలో వస్తారు. అయితే అతిదిగా భోజనానికి వచ్చిన ఆ వృద్ధుడు భక్త మంజునాధని పరీక్షించడానికి తననితనే దూషిస్తాడు, కోపగించిన భక్త మంజునాధ వచ్చింది పరమశివుడు అని గుర్తించక స్వామి ఇంటినుండి గెంటివేస్తాడు. ఆ సమయంలో మౌనవ్రతంలో ఉన్న కాత్యాయనికి వచ్చింది శివుడు అని తెలిసిన భర్తకు చెప్పలేని అపస్మారక స్థితిలో ఉంటుంది.

శివయ్య ఇంటినుండి వెళ్ళిపోయాక స్పృహలోకి వచ్చిన కాత్యాయని మాట్లాడి స్వామిని అడుగుతుంది. కానీ మౌనవ్రతం చేస్తున్న కాత్యాయని మాట్లాడం విని మంజునాధ అడిగితే, వచ్చింది సాక్షాత్తు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అయిన మంజునాధుడు అని బదిలిస్తుందే. భక్త మంజునాధ మరలా వృద్ద రూపంలో వచ్చిన మంజునాధుడిని వెతుకుతూ వెళతాడు. పరిక్షలు పెట్టవాడు దొరికితే పకృతి ఒప్పదనే ఏమో భక్తుడిని పరీక్షిస్తూ భగవానుడు కూడా భాదపడుతూ ఉంటాడు.

పార్వతిమాత కోయి రూపంలో వచ్చి అన్నదానం చెయ్యమని సూచన చెప్పి వెళుతుంది. ఆ సూచనతో అన్నదాన కార్యక్రమానికి పూనుకుంటారు ఆ పుణ్యదంపతులు. అయితే సిద్ధూ స్నానం చేస్తుండగా పాము కరిచి చనిపోతాడు. అయితే అన్నదాన కార్యక్రమం ఆగకూడదని, ఆ విష విషయాన్ని మనసులో దిగమింగుకుని, అన్నదాన కార్యక్రమం చేస్తారు. గుడిలో దీపాలు పాటపాడి వెలిగించినట్టు మీ భక్తితో నా బిడ్డ ప్రాణాలు బతికించమని అడుగుతుంది, కాత్యాయని. అప్పుడు మంజునాధ భక్తుడు ఊళ్ళోకి చావులేని ఇంటినుండి పిడికెడు ఆవాలు తెమ్మని చెబుతారు. తిరిగివచ్చిన కాత్యాయనికి చావు తప్పదని అర్ధం అయిన కాత్యాయని మౌనం వహిస్తుంది.

ఇక ఇంట్లో శవం పెట్టుకుని అన్నదానం చేయడం అధర్మం అని మంజునాధని మహారాజు దగ్గరదోషిగా నిలబెడతారు. నేరం ఆరోపింపబడి సభలో మౌనంగా ఉన్న మంజునాధని రక్షించాడానికి పైన నుండి మంజునాధుడే అఘోర రూపంలో వస్తాడు. అలా వచ్చిన మహాస్వామి భక్త మంజునాధని పరీక్షపెడితే, ఆ అగ్నిపరీక్షలో మంజునాధకి ఏమి జరగకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మంజునాధ మహాభక్తుడు అని అఘోర రూపంలో వచ్చిన భగవానుడు తీర్మానించి సభనుండి నిష్క్రమిస్తారు.

యముడు పనిని మంజునాధుడు చేయడం – శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

మహారాజుతో కలిసి ధర్మజ్యోతి కార్యక్రమం నిర్వహిస్తున్న మంజునాధ వలన అంతా సంతోషిస్తూ ఉంటారు. అయితే, కైలాసంలో సంతోషిస్తున్న పరమశివుడు దగ్గరకి యమధర్మరాజు వస్తారు. అలా వచ్చిన యముడు చెప్పిన విషయాన్ని విని దిక్కులకు నాధుడు అయిన మంజునాధుడు దిగ్బ్రాంతికి గురి అయ్యినట్టు కనబడడం జరుగుతుంది. యముడు పాశాన్ని మంజునాధుడికె ఇచ్చేసి కైలాసం నుండి మరలుతాడు. భక్త మంజునాధ నుదుటిని ఒకరోజు రాజు చదివి, విషయం భక్తమంజునాధకి చెబుతాడు. తన మరణం తద్యం అని తెలుసుకున్న భక్త మంజునాధ ఇంటికి తిరిగి వెళతాడు.

ఇంటికి వస్తున్న భక్త మంజునాధని అతనంటే పడనివారు కత్తితో గాయాలు చేస్తారు. గాయాలను పైకి కనబడకుండా ఇంటికివచ్చిన భక్త మంజునాధ ఇంటిలోనివారిని గుడికి పంపించి మృత్యువుకోసం ఎదురుచూస్తూ ఉంటాడు. మరణం అంటే భయముండే మనిషి మృత్యువు కోసం ఎదురు చూడడం, జననమరణాలు ఆటగా ఆడుకునే ఆ ఆటగాడు ప్రాణాలు తీసుకువెళ్ళడానికి దుఖించడం బహుశా ఈ భక్తిచిత్రంలోనే కనబడుతుంది.

భక్త మంజునాధకి దైవ మంజునాధకి జరిగే పతాక సన్నివేశం కంటతడి బెట్టిస్తుంది. చివరికి మంజునాధ దంపతులు కైలాస మంజునాధుడిలో కలిసి పోవడంతో ఈ తెలుగు చిత్రం ముగుస్తుంది.

ఆద్యంతం భక్తుడి యోగక్షేమాలు కోసం తపించే దైవంగా కైలాస మంజునాధుడు కనిపిస్తే, కైలాస మంజునాధుడిని దూషిస్తూ, చివరికి కైలాస వాసి పాదాలు కోసం తపించే భక్తుడిగా భూలోక మంజునాధుడు కనిపిస్తాడు. ఇద్దరి వలననే ధర్మస్థలం కోటిలింగాల క్షేత్రంగా వెలసినట్టుగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. శివానుగ్రహం వలన జీవితాలు ఎలా ఉద్దరింపబడుతాయో ఈభక్తిచిత్రం తెలియపరుస్తుంది. నమ్మిన భక్తుడి యోగక్షేమాల కోసం భగవానుడు తాను విధించిన నియమయాలకు తాను విలపించే భగవంతుడి హృదయం శ్రీమంజునాధచిత్రంలో కనిపిస్తుంది.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

కంచి కామాక్షి తెలుగు టైటిలుతో భక్తి చలనచిత్రం తమిళం నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన భక్తి మూవీ. జెమినిగణేషన్, సుజాత తదితరులు నటించిన చిత్రం కంచి కామాక్షమ్మ తల్లి గురించి తెలియజేస్తూ అమ్మ మహిమలను చూపుతుంది. జెమినీ గణేషన్ సుజాత జంటకి పుట్టిన ఇద్దరు కవలలో ఒకరిని మీనాక్షి అమ్మకు సమర్పించేయడం మీనాక్షి అమ్మవారి ఆ పిల్లవాడి అలానపాలన చూడడం, గుడి సన్నివేశం చాల చక్కగా దైవనిదర్శనంగా శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం ఉంటుంది.

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

ఆదిశంకరాచార్య కంచికి వచ్చి అమ్మ అనుగ్రహం సంపాదించడం, అలాగే కంచి కామకోటి పీఠం నెలకొల్పమని కామాక్షి అమ్మవారు చెప్పడం, ఒక అమాయక పిల్లను కామాక్షి అమ్మ అనుగ్రహించి ఆమె నోటపలికిన మాటను వాస్తవం చేసే శక్తిని ప్రసాదించడం, ఇంకా మరిన్ని భక్తి సన్నివేశాలు ఈ  కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రంలో కనిపిస్తాయి.

జనని సినీ ప్రొడక్షన్స్ పతాకం పై కంచి కామాక్షి తెలుగు భక్తి చిత్రం జెమిని గణేషన్, సుజాత, శ్రీప్రియ, వై విజయ, శ్రీకాంత్, శ్రీవిద్య, రాజసులోచన తదితరులు నటించిన చిత్రానికి సంగీతం కెఎస్. రఘునాథన్, దర్శకత్వం కెఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం తెరకెక్కింది.

కాంచీపురం చుపుస్తూ కంచి గురించి చెబుతూ అమ్మవారి ఆలయం గురించి చూపుతూ అమ్మగురించి చెప్పడం చిత్ర ప్రారంభ సన్నివేశం. కంచి కామాక్షి గుడిలో అమ్మవారికి ఆలయ ధర్మకర్త వచ్చి పూలు పలహారాలు తెస్తే, అక్కడే ఒక స్వర్ణపుష్పంతో నిలబడి ఉన్న సిద్ధుడు, ఆ స్వర్ణపుష్పాన్ని అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి పూజించి ఇవ్వమని చెబుతారు. ప్రధాన అర్చకులు ఆ స్వర్ణపుష్పాన్ని అమ్మవారి పాదాలు దగ్గరపెట్టి పూజ చేసి ఆ సిద్దుడికి ఇస్తే, సిద్దుడు అక్కడ నిలబడి ఉన్నఆడువారిలో ఒకామెకు స్వర్ణపుష్పం ఇచ్చి వెళ్ళిపోతారు.

ఆమె ఆ స్వర్ణపుష్పం తీసుకుని వెళ్లి తన భర్తకు ఉన్న కుష్టిరోగాన్ని పోగొడుతుంది. ఆ తరువాత ఒక సాధు కొన్ని శక్తులతో మహిమలు చూపుతూ నేనే భగవంతుడిని నన్నే కొలవండి అని ప్రగల్భాలు పలుకుతుంటే, కంచి కామాక్షి గుడిలో స్వర్ణపుష్పానికి అర్చన చేయించిన సిద్దుడు అక్కడికి వస్తాడు. అక్కడ ఆ సాదువుకి తన మహిమ చూపి అతనికి బుద్ది చెబుతారు సిద్దుడు. అక్కడికి కామాక్షి గుడిలో సిద్దుడి దగ్గర స్వర్ణపుష్పం పొందిన మహిళ రోగం తగ్గించుకున్న తన భర్తతో సిద్ధుడు దగ్గరికి వస్తుంది. అలా వచ్చిన ఆ దంపతులు తమను కంచి కామాక్షే మాకు మీరు వస్తారని చెప్పారని అందుకు మీరు ఎవరో చెప్పమని సిద్దుడిని ప్రాదేయపడతారు. సిద్దుడు అమ్మవారిని తలచుకుని స్పృహ తప్పితే, అక్కడకు మధుర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆ సిద్దుడు గురించి నాకు తెలిసినది చెబుతాను అని చెప్పడం మొదలుపెడతాడు.

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

ఆ సిద్దస్వామి పేరు బాల శివానందం అని, మీనాక్షి దూతగా అందరికి తెలుసనని చెబుతూ అతని పుట్టుక గురించి వివరిస్తుండగా, కంచి కామాక్షి చిత్ర సన్నివేశం మారుతుంది. స్వామి తల్లిదండ్రులు(జెమిని గణేషన్-సుజాత) కంచి కామాక్షి గుడిలో నలభై ఒక్కరోజులు దీక్ష చేసిన తరువాత ఒకరోజు కంచి కామాక్షి గుడిలో పడుకుని ఉన్న సుజాతకు కలలో అమ్మవారు కనబడి, “నీవు బిడ్డకోసమే కదా నా సన్నిధికి వచ్చింది, అలాగే మధుర మీనాక్షికి పార్వతి మాతలాగా కూడా ఒక బిడ్డకు ఆలనాపాలనా చూడాలని కోరికగా ఉందట, నీవు నీ భర్తతో కలిసి మధురకు చేరుకో అక్కడ మధురమీనాక్షి కోరిక నీ కోరిక తీర్చుతానని చెప్పి అంతర్ధానం అవుతుంది.” మెలుకువ వచ్చిన సుజాత లేచి జెమినీ గణేషన్ని లేపి విషయం చెప్పి ఇద్దరు దంపతులు మధుర మీనాక్షి అమ్మవారి గుడికి వెళతారు.

అలా మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించిన ఆ దంపతులు మాకు పుట్టిన బిడ్డని నీ పాదాలు దగ్గరే వదిలేస్తాను నీకోసం అని మొక్కుకుని అనుగ్రహించమని వేడుకుంటారు. కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం వలన ఆమెకు మగ కవలలు జన్మిస్తారు. అప్పుడు ఆ దంపతులు ఇద్దరినీ తీసుకుని మధుర మీనాక్షి గుడిలో మీనాక్షి అమ్మవారి దగ్గర పెడితే, ఒక పిల్లవాడు అమ్మవారువైపు మళ్ళితే, మరొకరు అమ్మవైపు మళ్లుతారు. ఆ సన్నివేశం చాలా చక్కగా భక్తిప్రదాయకంగా ఉంటుంది. ఆ పిల్లవాడిని మీనాక్షి అమ్మవారు రమ్మని ఆహ్వానించడం ఆ పిల్లవాడికే కనిపిస్తుంది.

అక్కడ నుండి ఆ దంపతులు వెనుదిరుగుతుంటే ఆలయధర్మ కర్త, పూజారి దంపతులను అడ్డుకుని పిల్లవాడిని తీసుకువెళ్లమంటారు. సుజాత, జెమినీ గణేషన్ దంపతులు మేము ఆ పిల్లవాడిని అమ్మవారికి అప్పగించేశాం, ఇక ఆ పిల్లవాడి భాద్యత మీనాక్షి అమ్మే చూసుకుంటుంది అని చెప్పి వారు ఇంటికి వెళతారు. గుడి ధర్మకర్త ఆలయఅర్చకులు ఎంత ప్రయత్నం చేసినా గుడి తలుపులు తెరుచుకోవు, తాళం రంద్రంలో నుంచి అమ్మవారి స్వరూపం చూసి భయపడతారు వారు.

ఇంటికి చేరిన జెమిని గణేషన్-సుజాత దంపతులు ఆ పిల్లవాడిని అమ్మవారు దగ్గరే పూజారులు ఉంచారా బయట పడవేశారా అని సందేహం దిగులు చెంది, తెల్లవారగానే గుడికి చేరుకుంటారు. పూజారులకు ఎంత ప్రయత్నం చేసిన తెరుచుకొని గర్భగుడి తలుపులు ఆమె తీయగానే తెరుచుకుంటాయి. అమ్మవారి గర్భాలయంలో ఆడుకుంటున్న పిల్లవాడు కనబడతాడు, అమ్మవారి ముక్కు పుడక, బంగారు ఉగ్గుగిన్నె పిల్లవాడి చేతిలో ఉంటాయి. ఇదంతా మీనాక్షి అమ్మవారే మహిమ ఆ తల్లి పిల్లవాడి ఆలనాపాలనా చూసుకుంటుంది అని భావించి వారు వెనుతిరుగుతారు. ఆ పిల్లవాడే ఈ సిద్దుడు అని మధుర నుండి వచ్చిన వ్యక్తి కామాక్షి గుడిలో స్వర్ణపుష్పం గ్రహించిన దంపతులకు చెబుతారు.

మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్ల గురించి

ఈలోపు తేరుకున్న ఆ సిద్దుడు నా గురించి కాదు చెప్పుకోవలసింది, మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్ల గురించి చెప్పుకుంటే, పుణ్యం పరమార్ధం అని కంచి కామాక్షి అమ్మవారి గురించి చెప్పడం మొదలు పెడతారు.

బండాసురుడు తప్పస్సు చేసి బ్రహ్మను మెప్పించి, భూలోకంలో మానుష జాతిలో అడామగ కలవకుండా ఐదేళ్ళ బాలిక పుట్టాలి, ఆ విధంగా బాలిక పుడితే ఆ బాలిక చేతిలో మాత్రమే మరణం ఉండాలి అని వరం కోరుకుంటాడు. వరబలంతో బండాసురుడు దేవతలను హింసిస్తూ ఉంటే, అందరూ దేవతలు కలిసి కైలాసం పరమశివుడి దగ్గరికి వెళతారు. కైలాసం నుండి పరమశివుడు సలహాపై జగన్మాతని ప్రార్ధించడానికి కంచికి చేరుకుంటారు.

కంచిలో సర్వదేవతలు జగన్మాతని ప్రార్ధన చేయడం వలన ప్రకృతి మరియు సర్వదేవతల శక్తి నుండి ఒక ఐదేళ్ళ పాప ఉద్బవిస్తుంది. బండాసురుడు ఆ పాపతో యుద్ధం చేసి మరణిస్తాడు. బండాసురుడుని అంతుతేల్చిన ఆ బాలిక త్రిమూర్తుల దగ్గరికి వచ్చి నాకు గుడికట్టండి అని చెబితే, మయుడు శివుని అజ్ఞా మేరకు కంచిలో ఆలయం నిర్మిస్తారు. మరుసటి ఉదయం దేవతలంతా గుడికి చేరితే ఆ పాప అమ్మవారుగా గర్భగుడిలో దర్శనం ఇస్తుంది. బాలగా అవతరించి బండాసురుడుని అంతం చేసి, కన్యగా గర్భగుడిలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని చూసి పరమశివుడు ఆదిపరాశక్తి అని పిలిస్తే, ఆ తల్లి నేను  కామాక్షిని, అలాగే అందరిని అనుగ్రహిస్తాను అని బదులిస్తుంది. ఆ విధంగా సిద్దుడు వారికి ఇంకా కామాక్షి అమ్మవారి మహిమలు చెప్పడం కొనసాగిస్తూ ఉంటారు.

భద్రయ్య అను భక్తుడిని అనుగ్రహించిన Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram

తిరువాయూర్లో ఒక అమ్మవారి భద్ర అనే భక్తుడికి సిద్దుడు “ఒక శుబ్రపరిచిన గదిలో 101 భోజనం చేసే ఆకులు పరచి 100మంది కన్యలను లోపలి పంపించు, భోజనాలు పెడుతూ ఉండు, రోజు 100 ఆకులు మాత్రమే భోజనం చేసి ఉంటాయి, కానీ ఏరోజు అయితే 101 ఆకులు భోజనం చేస్తున్నట్టు కనిపిస్తుందో, ఆ రోజు అమ్మవారు వచ్చి భోజనం చేసినట్టు, అలాగే భోజనం పూర్తయిన తరువాత వారికి 101 రవికలు పంచిబెట్టు, ఏరోజు 101 ఆకులు భోజనం ముగింపు ఉంటుందో ఆరోజే 101 రవికలు సరిపోతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు”.

కామాక్షి గుడి ఊరిమధ్యలో ఉండకూడదు, నేను ఆ మండపాన్ని తీసివేసి, కోర్ట్ కడతాను అని ఆంగ్ల కలెక్టర్ అమ్మవారి భక్తుడు అయిన భద్రయ్యతో గొడవపతాడు, కలెక్టర్ వాళ్ళ అమ్మగారి మాట మీద గుడి దగ్గరి నుండి వెళ్ళిపోతాడు. అదే ఊళ్ళో మిడతంబొట్లు అనే వ్యక్తి అమ్మవారి గుడికి ధర్మకర్తగా ఉంటూ వడ్డీవ్యాపారం చేస్తూ, అమ్మవారి గుడిలో కానుకలు కూడా ఇంటికే తీసుకుపోతూ ఉంటూ ఉంటాడు. సిద్దుడు చెప్పిన భద్రయ్య భక్తుడు అదే వ్యాపారి దగ్గర తన ఆస్తి పత్రాలు మిడతం బొట్లు దగ్గర కాళీనోటు పేపర్ పై వేలుముద్రలు వేసి, డబ్బు అప్పు తీసుకుని క్రమంగా 101 విస్తర్లు వేసి 100 మందికి భోజనం పెడుతూ భక్తిగా అమ్మవారిపై నమ్మకం ఉంచుతాడు.

ఒకరోజు మిడతం బొట్లు భద్రయ్య ఇంటికి వచ్చి ఉన్నపళంగా ఇల్లు కాళీచేసి వెళ్ళమంటాడు, ఎందుకు అని అడిగితే నీవు చేసిన అప్పు చాల వుంది అని చెప్పి దొంగపత్రాలు పట్టుకుని కోర్టుకి వెళతాడు. అమ్మవారుపై నమ్మకం ఉంచిన భక్తుడు అయిన భద్రయ్య కామాక్షి అమ్మే వచ్చి తనవైపు సాక్ష్యం చెబుతుంది అని కోర్టులో వాదిస్తాడు. మోసపూరిత పత్రాలను బట్టి ఆంగ్ల కలెక్టర్ భద్రయ్యపై తీర్పు మరుసటి రోజుకి వాయిదా వేస్తాడు. అయితే తరువాయి తీర్పు వ్రాసే సమయంలో కలెక్టర్ కలం కదలదు, ఎంతా ప్రయత్నం చేసిన కలం కదలదు. అమ్మవారు కలెక్టర్ అమ్మరూపంలో వచ్చి తీర్పు భక్తుడు అయిన భద్ర నిరపరాధి వ్రాయి అది నిజం అయితే, నీ కలం కదులుతుంది. అని చెబుతుంది. అలా భద్రయ్య అయిన అమ్మవారి భక్తుడిని నిర్దోషిగా తీర్పు వ్రాసిన కలెక్టర్, అమ్మవారి గుడిలో ఉన్న భక్తుడి దగ్గరికి వస్తాడు.రేపు భోజనాలు 101 విస్తర్లలో 100 మందికి పెట్టే చోటకి అమ్మ కామాక్షి వచ్చి భోజనం చేస్తుంది. రేపు 101 విస్తర్లలో భోజనం పూర్తవుతుంది అని చెప్పి సిద్దుడు, కలెక్టర్ భద్రయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయం చేసుకుంటారు.

భద్రయ్య ఇంటిలో 100 మంది కన్యలతో కలిసి భోజనం చేసిన Kanchi Kamakshi అమ్మవారు.

తరువాత సిద్దుడు చెప్పగా ఒక శుబ్రపరిచిన గదిలో 101మందికి విస్తర్లు వేసి 100 కన్యలను గదిలోకి పంపించి భోజనాలు పెడతారు. అప్పుడు ఆంగ్ల కలెక్టర్, సిద్దుడు, భద్రయ్య గమనించగా 101 మంది భోజనం చేస్తూ కనబడతారు. భోజనాలు పూర్తయ్యాక 101 రవికలు పంచిబెడితే, ఒక రవికపై కలెక్టర్ సైన్ చేస్తారు. తరువాత గుడికి వెళ్లి చూస్తే, కలెక్టర్ సంతకం చేసిన వస్త్రం అమ్మవారి మెడలో కనిపిస్తుంది. అందరు అమ్మవారి మహిమను కీర్తిస్తారు. ఇంకా సిద్దుడు కంచి కామాక్షి అమ్మవారి గురించి మహిమలు చెప్పడం కొనసాగిస్తూ ఆదిశంకరాచార్యులు కంచికి వచ్చి, అర్చించి అమ్మని మెప్పించన వైనం చెబుతారు.

కంచిలో ఒక క్షుద్ర పూజలు చేసే వ్యక్తి భక్తులను నమ్మించి అమ్మవారికి బలులు ఇవ్వాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రకృతిలో హింస, అధర్మం పెరిగితే, దైవశక్తి నిమ్మకుండడం ప్రకృతి ప్రకోపించడం సాదరణమే కదా. ఆది శంకరాచార్యులు కంచికామాక్షి గుడికి వచ్చి అమ్మవారికి బలులు ఇవ్వవద్దని చెప్పి అమ్మవారిని స్త్రోత్రం చేస్తే, అమ్మ వర్షం కురిపిస్తుంది. అది చూసిన ఊరిప్రజలు, ఆ క్షుద్ర వ్యక్తి ఆదిశంకరాచార్యులు పాదాలపై పడతారు. అమ్మవారు ఆది శంకరచార్యులకు ప్రత్యక్షం అయ్యి, కంచి కామకోటి పీఠం కంచిలో స్థాపించి, ఆ పీఠం నీవు  అధిష్టించి కీర్తిని గడిస్తావు అని చెబుతుంది.

కంచి కామాక్షి ఆలయ కోశాధికారి సుబ్రహ్మణ్య శాస్త్రికి ఒకసారి చిన్నపాప కనిపిస్తే ఇంటికి తీసుకువచ్చి తన మనుమరాలుగా పెంచుకుంటూ ఉంటాడు. అయితే ఆ పాప(మహాలక్ష్మి) పెరిగాక తన తల్లిదండ్రుల గురించి అడిగితే, నీ అమ్మ ఆ కామాక్షి అని చెప్పి, నీ తండ్రి హిమాలయాల్లో వైద్యం చేయించుకుంటున్నట్టు చెబుతాడు. అయితే అమ్మని చూపించమంటే ఆ పూజారి ఆ పాప మహాలక్ష్మికి గుడిలో కామాక్షిని చూపి నీతల్లి అని చెబితే, అప్పటినుండి ఆపాప అమ్మనే చూస్తూ ఉంటూ ఉంటుంది.

అక్షరజ్ఞానం లేని పాపను అనుగ్రహించిన కంచి కామాక్షి అమ్మవారు. Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram

ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్త దుర్బుద్ధి తెలుసుకుని, ఇన్నాళ్ళు నేను ఒక పాపపు సొమ్ము తిని పెద్దపాపం చేశాను కాశికి వెళ్లి ఆ పాపం పోగొట్టుకుంటాను అని చెప్పి ఆ పాప మహాలక్ష్మితో కాశికి బయలుదేరతాడు. అలా బయలుదేరుతున్న సుబ్రహ్మణ్య శాస్త్రిని ఆ ప్రక్కనే ఉంటున్న ఇద్దరు దంపతులు పాపను కాశికి తీసుకువెళ్ళడం ఎందుకు మేము ఆపాపను చూసుకుంటాం అని చెప్పి, పాపను సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర నుండి తీసుకుంటారు. మహాలక్ష్మి పాపకు శక్తులు ఉన్నాయి అందుకే పాప ఎప్పుడు అమ్మవారి ఆలయంలో ఉంటుంది అని చెప్పి ఆ పాపను తీసుకున్న దంపతులు ప్రచారం చేస్తారు.

మహాలక్ష్మి పాపపై ప్రచార మహిమలు గురించి విన్న భక్తలు పాపదగ్గరికి వస్తారు. అప్పుడు ఆ దంపతులు పాపతో ఒక ఇల్లాలితో ఆమె భర్త పదిరోజులలో చనిపోతాడని అబద్దం బలవంతంగా పాపతో చెబుతారు. పది బంగారు కాసులు తెస్తే కాపాడతానని కూడా ఆ పాపతో చెప్పిస్తారు. ఆ ఇల్లాలు రోదిస్తూ వెళ్ళిపోతుంది. నిద్రపట్టని పాప మహాలక్ష్మి అబద్దం చెప్పినందుకు మనోవేదనకు గురి అయ్యి అమ్మవారి పాదాలపై తలకొట్టుకుని చనిపోదామని నిశ్చయించుకుని బయలుదేరుతుంది.

పాప అంతరంగం గ్రహించిన కంచి కామాక్షి అమ్మవారు అనంతలక్ష్మితో కలిసి గర్భాలయం వెలుపలికి వచ్చి పాపను ఆపి, ఆ పాపతో నేనే నీ తల్లిని అని చెప్పి పాప మహాలక్ష్మి నాలుకపై తన నాలుకతో బీజాక్షరాలు వ్రాస్తుంది. తరువాత పాప మహాలక్ష్మితో నీనోటితో ఏది పలికితే అది జరుగుతుంది అని చెప్పి పాపను గుడిలోనే పడుకో బెడుతుంది అమ్మవారు. అలా అమ్మ అనుగ్రహం పొందిన ఆ పాప మహాలక్ష్మి మహిమలు చూపించి, దుష్ట బుద్దితో ఉన్న దంపతులకి పాప మహాలక్ష్మి వారికి బుద్ది చెప్పుతుంది. తరువాత కంచి మహారాజు అయిన పల్లవరాజుకి చాళక్యరాజుపై విజయాన్ని కూడా కట్టబెడుతుంది.

అమ్మని మనసారా నమ్మితే, అమ్మ అనుగ్రహానికి ఎదురులేదని ఈ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram ద్వారా తెలియవస్తుంది.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ గురు స్వరూపంగా దత్తాత్రేయడు. ప్రకృతిధర్మం ఆచరించిన ఋషి దంపతులకు సంతానంగా వచ్చిన పరబ్రహ్మ స్వరూప భక్తిమూవీకధ.

తెలుగు సినిమా నిర్మాణ బ్యానర్: శ్రీదత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్

తెలుగు మూవీ పేరు : శ్రీ దత్త దర్శనము భక్తిమూవీ

నటినటులు: రంగనాథ్, శివకృష్ణ, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, రమణమూర్తి, వీరభద్రరావు, ద్వారకానాథ్, ఆచంట వెంకటరత్నం నాయుడు, మాస్టర్ గురుప్రసాద్, K.R. విజయ, ప్రభ, జయంతి, కాంచన, చలపతిరావు, ఈశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ, శివాజీ, జ్యోతిర్మయి, జయలలిత, జయవాణి, నిర్మల, సిల్క్ స్మిత తదితరులు నటించారు.

తెలుగు పాటలు: వేటూరి

తెలుగు సినిమా పాటలు గానం: SP బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, సుశీల, వాణిజయరాం, మంగళంపల్లి బాలమురళి కృష్ణ.

తెలుగు సినిమా సంగీతం: K.V. మహదేవన్

శ్రీదత్త దర్శణం తెలుగు మూవీ నిర్మాత: K.C. తల్వార్

శ్రీదత్త దర్శణం తెలుగు సినిమా దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ కథ

శ్రీదత్తయంత్ర దర్శనంతో భక్తిమూవీ ప్రారంభం ఉంటుంది. ప్రారంభ సన్నివేశంలో మునిదంపతుల తపోదీక్షకు లోకాలు తల్లడిల్లుతుంటే నారద మహర్షి కంగారుగా నారాయణ మంత్రం జపిస్తూ వైకుంఠము వెళ్ళడం, అక్కడ త్రిమూర్తులు ఒకేచోట నారద మహర్షికి దర్శనం ఇస్తారు. అయితే అలా తపస్సు చేసే మునిదంపతుల పేర్లు అత్రి-అనసూయ వారికోరిక త్రిమూర్తల స్వరూపమే పుత్రసంతానంగా పొందాలని.

నారద సూచన తరువాత త్రిమూర్తులు అత్రిమహర్షి తపస్సు చేసే చోటకి వచ్చి, అత్రిని పిలుస్తారు. అత్రివారిని స్తుతించిన తరువాయి త్రిమూర్తులు అత్రికోరిక తీర్చడం కోసం ముగ్గురు మూర్తులు ఒక బాలమూర్తిగా మారి అత్రికి దర్శనం ఇస్తారు. అయితే అత్రి మహర్షి అంతర్యం గ్రహించిన ఆ బాలమూర్తి కొంతకాలం వేచిచూడండి నేను మీ కడుపునా పుడతాను అని చెప్పి అంతర్ధానం అవుతాడు.

తరువాయి సన్నివేశంలో ప్రతిరోజూ జరిగే సూర్యోదయం ఆరోజు జరగదు, మునులు, సాధువులు, సంసారులు నిత్యకర్మలకు ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు నారదాది మునులు అంతా కలసి అత్రి మహర్షి భార్య అయిన అనసూయ దగ్గరికి వస్తారు. జగమంతా అంధకారం అయ్యింది, ప్రకృతి అల్లాడుతుంది, ఈ ఘోరం నుండి కాపాడేవారు ఎవరూ లేరు తల్లి నీవే దిక్కు అని అంటారు. అప్పుడు అనసూయ ఆలోచన చేస్తుంది, సూర్యుని క్రమాన్నే కట్టడి చేసిన ఆ సాద్వి ఎవరు అని.

సుమతి కధలో అనసూయ మహిమ – త్రిమూర్తలు వరప్రసాదంగా గురుదత్త జననం

అప్పుడే మనకి మహా ప్రతివ్రత అయిన సుమతి కధ ప్రారంభం అవుతుంది, ఈ మూవీలో కుష్టి వ్యాదిగ్రస్తుడైన భర్తకు సుమతి సేవలు చేస్తూ ఉంటుంది. భర్త చీదరించిన, ఆదరించిన భర్తే దైవంగా సేవలు చేస్తూ ఉంటుంది. వ్యాదిగ్రస్తుడైన కౌశికుడు ఒకవేశ్యను చూసి మోహించి, ఆ వేశ్య పొందు కావాలని తన భార్య సుమతితో పట్టుబట్టి చెబుతాడు. ఆ సూర్యాస్తమయం తరువాత తన భర్తను ఒక తట్టలో నెత్తిమీద పెట్టుకుని భర్తను వేశ్యవద్దకు తీసుకుపోవడానికి బయలుదేరుతుంది.

అదే దారిలో ఒకచోట మాండవ్య ముని కొరతవేయబడి ఉండి, మౌనంగా తపస్సు చేస్తూ ఉంటాడు, భర్తను నెత్తిన మోస్తున్న సుమతి అటుగా నడుస్తూ ఉండగా కౌశికుడు కాళ్ళు కదల్చుతూ ఆ మాండవ్యమునిని తన్నడంతో, మునికి భాద ఎక్కువై, ఆ కౌశికుడిని సూర్యాస్తమయం లోపు మరణిస్తాడని శాప వాక్కు ఇస్తాడు. అయితే సుమతి సూర్యోదయం కాకూడదని ప్రకృతిని శాసిస్తుంది, తనప్రాతివత్య శక్తితో.

విషయం గ్రహించిన అనసూయ, నారదాది మునులు సుమతి ఇంటికి వచ్చి, సుమతిని వేడుకుంటారు, సూర్యోదయానికి అనుమతిని ఇమ్మని. సుమతి తనభర్తకు ఉన్న శాపం గురించి అనసూయతో చెబుతుంది. అనసూయ ఆమె భర్త గురించి హామీ ఇవ్వగానే, సుమతి సూర్యోదయానికి అనుమతిస్తుంది, వెంటనే ఆమె భర్త మరణిస్తాడు, వెంటనే సుమతి క్రింద పడిపోతుంది. అప్పుడు అనసూయ మహాసాద్వి ప్రాతివత్య శక్తితో కౌశికుడుని బ్రతికిస్తుంది. దేవతలు సంతషించి అనసూయను మాతా అని సంభోదిస్తారు, త్రిమూర్తులు వచ్చి వరం కోరుకో అంటే, అనసూయ మహాసాద్వి కూడా పుత్రసంతానం అడుగుతుంది. త్రిమూర్తులు తదాస్తు పలికి అంతర్ధానం అవుతారు. అత్రిమహాముని నిశ్చయించిన శుభముహూర్తాన దత్తుడు జన్మిస్తాడు.

ఇంద్రుడికి శ్రీదత్త దర్శనం

త్రిమూర్తుల అంశతో జన్మించిన దత్తాత్రేయుడు సహజంగా జ్ఞానసంపన్నుడుగా ఉంటాడు. ఒకచోట చిన్నపిల్ల చనిపోయి ఏడుస్తున్న తల్లిని చూసి దత్తాత్రేయుడు ఆ పిల్లను పిలిచి బ్రతికిస్తాడు. ఒక చోట ఒక సాధువు తపస్సుకు ప్రయత్నిస్తూ ధ్యానంలో నిమగ్నం కాలేక సతమతం అవుతూ ఉంటాడు, పదేళ్ళ నుండి. అప్పుడు అటుగా వస్తున్న దత్తాత్రేయుడు ఆ సాధువు దగ్గరకొచ్చి విషయం తెలుసుకుని, ఆ సాధువు నుదురుపై ముట్టుకోగానే ఆ సాధువు సమాదిస్థాయిలో ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అలా మహిమలు చూపుతూ శ్రీదత్తాత్రేయుడు తపస్సులోనే పెరుగుతాడు. తపస్సులోనే సమాధి స్థితిని పొంది, బ్రహ్మజ్ఞానిగా నిలబడతాడు.

అత్రి ఆశ్రమంలో అనసూయ పుత్రునిపై ఆలోచనలో ఉండగా దత్తాత్రేయుడు అమ్మా అంటూ వస్తాడు. లోనికి ఆహ్వానించిన అమ్మని సహ్యాద్రి పర్వతాలపై ఉండేందుకు అనుమతి భిక్ష అడుగుతాడు. అంగీకరించని అమ్మకి ఆత్మలేని దేహస్థితిని చూపి, అమ్మ దగ్గర అనుమతిని పొంది, గురుదత్తగా తండ్రిదగ్గర కూడా అనుమతి తీసుకుని సహ్యాద్రి పర్వతాలకు పయనం అవుతాడు, దత్తాత్రేయుడు.

జంబాసురుడు దండయాత్రకు తల్లడిల్లిన ఇంద్రుడు బ్రహ్మలోకం బయలుదేరితే, మధ్యలో నారదుడు ఇంద్రుడిని ఆపి జంబాసురుడిని త్రిమూర్తులు ఏమి చేయలేరు. అటువంటి వరాలు జంబాసురుడికి ఉన్నాయి, నీవు  సహ్యద్రిలో ఉన్న దత్తాత్రేయస్వామిని దర్శించమని సూచిస్తాడు. అయితే దత్తాత్రేయుడు కఠిన పరిక్షలు ఎదుర్కుంటేనే దర్శనం ఇస్తాడు, సులభంగా దత్త దర్శనం కాదు అని సమాచారం ఇస్తాడు.

దత్తాత్రేయస్వామి ఆశ్రమానికి వచ్చిన ఇంద్రుడికి దత్తాత్రేయుడు కొంతమంది మహిళలతో మద్యం సేవిస్తూ కనిపిస్తాడు. కానీ ఇంద్రుడు ఆయనని దత్తాత్రేయుడు అని భావించి, శ్రీదత్తుడి పాదాలు వదలడు. అనఘాదత్తాత్రేయులను స్తుతించి అనుగ్రహం సంపాదిస్తాడు. జంబాసురుడి గురించి వివరించగా, దత్తాత్రేయుడు, నేను సహ్యాద్రి విడిచి రాను అతన్ని ఇక్కడికి తీసుకురా, అంతం చేస్తాను అని చెబుతాడు.

ఇంద్రుడు జంబాసురుడిని సహ్యాద్రి పర్వతలవైపు, శ్రీదత్తుడి ఆశ్రమం దగ్గరికి తీసుకువస్తాడు. సహ్యాద్రికి వచ్చిన జంబాసురుడు అమ్మని అనఘాదేవినే కోరి తన నాశనం తానే కొనితెచ్చుకుంటాడు. అమ్మఅనఘాదేవి జంబాసురుడి తలపై నృత్యం చేయడం, అతను అంతం అవ్వడం జరుగుతుంది. తరువాత దేవేంద్రులకు శ్రీదత్తదర్శన భాగ్యం కలుగుతుంది.

విష్ణుదత్తుడిపై దత్తాత్రేయుల అనుగ్రహం

విష్ణుదత్తుడు ఒక సద్బ్రాహ్మనుడు ఒకరోజు ప్రసాదం చెట్టుకింద పెట్టి లోపాలకి వెళుతుంటే, ఆ చెట్టుపైన ఉన్న రాక్షసుడు విష్ణుదత్తుడిని పిలుస్తాడు. కంగారుపడిన విష్ణుదత్తుడితో నీవు నాకు ఉపకారం చేసావు, నీకు ప్రత్యుపకారం చేస్తాను అని అంటాడు ఆ బ్రహ్మరాక్షసుడు. కానీ నిత్యతృప్తుడైన విష్ణుదత్తుడు తనకి ఏకోరిక లేదని చెబుతాడు, కానీ పట్టువదలని ఆ బ్రహ్మరాక్షసుడిని శ్రీదత్తదర్శనం చేయించమని అడుగుతాడు. బ్రహ్మరాక్షసుడు కంగారుపడతాడు. మేము రాక్షసులం దత్తాత్రేయుడు అంటే మాకు భయం ఇంకేదైనా కోరిక కోరుకో అంటే మాకు ఇంకా ఏ కోరిక లేదని చెబుతారు విష్ణుదత్త దంపతులు. మాట ఇచ్చాను కాబట్టి దూరం నుండి మూడుమార్లు నీకు దత్తాత్రేయులవారిని చూపుతాను కానీ ప్రసన్నం చేసుకోవలసినది మాత్రం నీ భాద్యతే అని చెప్పి శ్రీదత్తదర్శనానికి బయలుదేరతారు.

దత్తాత్రేయ నివాసం దగ్గరికి విష్ణుదత్తుడిని తీసుకువెళతాడు బ్రహ్మరాక్షసుడు, అక్కడ దత్తాత్రేయుడు ఒక త్రాగుబోతుగా ప్రవర్తిస్తూ ఉంటే, విష్ణుదత్తుడు దత్తాత్రేయుడుని సంశయంతో చూస్తాడు. శ్రీదత్త దర్శనం జరగదు. రెండవమరు మళ్ళి బయలుదేరతారు శ్రీదత్త నివాసానికి, కానీ అక్కడ స్వామి కాటికాపరిగా ఉంటాడు. సంశయంతో భయంతో విష్ణుదత్తుడు శ్రీదత్తుడి పాదాలుపై పడితే, చేతిలో ఉన్న ఎముకతో కొట్ట్గాగానే క్రిందపడ్డ విష్ణుదత్తుడు స్వామిని ఆరూపంలో చూసి భయపడి పలాయన బాటపడతాడు.

మూడవమారు శ్రీదత్తదర్శనానికి బ్రహ్మరాక్షసుడు, విష్ణుదత్తుడు బయలుదేరతారు. దత్తత్రేయులు తననివాసంలో మరలా త్రాగుబోతుగా మద్యం సేవిస్తూ కనబడతాడు. వెంటనే విష్ణుదత్తుడు దత్తాత్రేయులవారి పాదాలుపై పడతాడు. స్వామి కొట్టినా, విదిల్చినా, తన్నినా పట్టువదలని విష్ణుదత్తుడిని శ్రిదత్తుడు అనుగ్రహించి దర్శనం ఇస్తాడు. స్వామిని చూసి పొంగిపోయిన విష్ణుదత్తుడు స్వామిపాదాలపై మరలా పడితే, వరం కోరుకో అని విష్ణుదత్తుడుని అడుగుతాడు శ్రీదత్తుడు. అప్పుడు తనతండ్రి పితృకర్మకు భోక్తగా రావలసినదిగా శ్రీదత్తాత్రేయులవారిని కోరతాడు.

విష్ణుదత్తుడి ఇంటికి శ్రీదత్తాత్రేయులవారు భోక్తగా వెళతారు. రెండవభోక్తని పిలవడం మరిచిన విష్ణుదత్త దంపతులు స్వామివారు గుర్తుచేసాక, విష్ణుదత్తుడి భార్య సుశీల ప్రార్ధనతో వాయుదేవుడు స్వరూపం రెండవభోక్తగా వస్తారు. మరల సుశీలమ్మ ప్రార్ధనతో విష్ణుస్థానంలో మూడవభోక్తగా అగ్నిదేవుడు వస్తారు. శ్రీదత్తాత్రేయులవారు ఇద్దరు బ్రాహ్మణులు భోజనం చేసాక వరం కోరుకోండి అంటే, బ్రహ్మరాక్షసుడుకి రాక్షసత్వం నుండి ముక్తిని ఇమ్మంటారు, డానికి నీకు అతను చేసిన సహాయం వలన ఆ రాక్షసుడు బ్రహ్మలోకం చేరాడు, కాబట్టి నీవు వరంకోరుకో అని అంటారు, శ్రీదత్తాత్రేయులవారు. విష్ణుదత్తుడి ఇతరకోరికలు లేకపోవడం వలన, స్వామియే అతని పూర్వీకులకు బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించి, విష్ణుదత్తుడిని అనుగ్రహిస్తారు. తనవిశ్వరూప దర్శనం విష్ణుదత్త దంపతులకి దక్కడం విశేషం.

కార్తవీర్యార్జునుడికి అనఘాదత్తాత్రేయుల దర్శనం

చేతులు సరిగా లేని రాజుని సింహాసనం అధిష్టించవలసినదిగా ఆ రాజ్య గురువులు కోరతారు, నేను సర్వశక్తిమంతుడైనతేనే సింహాసనం అధిష్టిస్తాను కానీ ఇలా పరాధీన అవస్థలో కాదు అనిఅంటాడు. అప్పుడు గురువులు ఆ రాజుకి శ్రీదత్తాత్రేయ స్వామి గురించి, స్వామి పెట్టే పరిక్షలు వివరించి, శ్రీదత్తదర్శనం చేసుకోమని చెబుతారు.

శ్రీదత్తదర్శనానికి వెళ్ళిన రాజుకి స్వామివారు మద్యం సేవిస్తూ త్రాగుబోతుగా కనిపిస్తారు. దగ్గరికి వచ్చిన రాజుని కొట్టినా తన్నినా పట్టువదలకుండా రాజు స్వామి పాదాలపై పడతాడు. శ్రీదత్తాత్రేయస్వామి ఆరాజుని అనుగ్రహించి వరం కోరుకో అని అంటే, ఆ రాజు అయిన కార్తవీర్యుడు తనకి తిరుగులేని శక్తులు ప్రసాదించమంటే, స్వామి అనఘా వ్రతాన్ని బోధించి ఆచరిస్తే, నీ కోరిక తీరుతుంది అని చెబుతారు. అప్పుడు కార్తవీర్య అర్జునుడు అనఘా వ్రతం చేసి, అనఘాదత్తదర్శనంతో సర్వశక్తిమంతుడు అవుతాడు. సహస్రబాహువులతో పాటు, తన రాజ్యంలో ఎవరిమనసులో ఏమి అనుకున్న తనకు తెలిసే వరం, మూడులోకాల్లో విహరించగలిగే శక్తిని, నీ స్వరూపమైన శక్తివంతుడి చేతిలో వీరమరణ వరం పొందుతాడు.

అనఘా వ్రతం రాజ్యంలో అందరూ ఆచరించి తరించాలని కార్తవీర్యార్జునుడు శాశనం చేస్తాడు. అయితే ఆ రాజ్యంలో రాములు అనే చెప్పులుకుట్టుకునే దంపతులకు అనఘావ్రతం చేసుకుందాం అని అనుకుంటారు. ఆ ఊరి పురోహితుడుని ఆ వ్రతం చేసుకుంటాం అని అంటే, మీలాంటివారు వ్రతం కాదు అని చెప్పి పంపించేస్తారు. ప్రజలు మనోభావాలు తెలుసుకునే శక్తిగలిగిన కార్తవీర్యార్జునుడుకి ఈ విషయం అవగతమవుతుంది.

ఒక పేదవానికి దత్తాత్రేయులవారే పూజచేయించడం

ఆ రాములు దంపతుల ఇంటివైపు ఒక బ్రాహ్మణస్వామి వస్తూ ఆ దంపతులకి కనబడితే, వారు ఆ స్వామివారిని అనఘా వ్రతం చేయించమని వేడుకుంటారు. బ్రాహ్మణాస్వామిగా వచ్చిన దత్తాత్రేయులవారు తనమహిమతో వట్టిపోయిన గోవునుండి కూడా పాలు వచ్చేలా చేసి, అనఘా వ్రతం ఆ దంపతులచేత పూర్తీచేయిస్తారు.  ఆ సమయంలోనే ఆ ఊరి పురోహితులు అటుగా వచ్చి, ఆ బ్రాహ్మణస్వామితో గొడవకు దిగితే, మహారాజు కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చి స్వామిని ప్రార్ధించి, క్షమాపణ కోరతాడు. స్వామి అనుగ్రహించి నిజదర్శనం కనబడతారు.

వరప్రభావంతో కార్తవీర్యార్జునుడు ఆకాశవీధిలో వెళుతూ, ఇంద్రుని చూసి అతని ప్రవర్తనను తక్కువగా చూసి వెళతాడు. ఆగ్రహించిన ఇంద్రుడు కార్తవీర్యార్జునుడి సభలోకి అగ్నిదేవుడిని బ్రాహ్మణుడిగా పంపి, ఆకలి తీర్చమని అడగమంటాడు. అందుకు ఒప్పుకున్నా కార్తవీర్యార్జునుడి పర్యవేక్షణలో అగ్ని కొన్ని ఇళ్ళను, ఆశ్రమవాసులను దహిస్తుంటే, చూసిన వశిష్టముని ఆగ్రహించి, ఒక ముని కుమారుని చేతిలో నీకు మరణం సంభవిస్తుంది అని శాపం ఇస్తాడు. అయితే ఎంతవారు అయినా కాలంలో అహంకారం వస్తుంది అని కార్తవీర్యార్జునికి వస్తుంది.

పరశురాముడు కార్తవీర్యార్జునుల యుద్ధం

జమదగ్ని ముని ఆశ్రమంలో ఆతిద్యం స్వీకరించిన కార్తవీర్యార్జునుడు, పంచబక్ష్య భోజనాలు రాజు, రాజపరివారానికి సృష్టించిన సురభి గోవుని చూసి, ఆ గోవుని తనవెంట తీసుకువెళ్లాలని అనుకుంటాడు. జమదగ్నిమునిని అడిగితే ముని ఆవు దైవదత్తమని, ఇవ్వడం సబబు కాదని హితవు చెబుతాడు. కానీ వినని ఆ మహారాజు సురభిగోవుని రాజధానికి తోడ్కుని వెళతాడు. గోవు కంటతడి పెడుతుంది. అదే అతని పతనానికి పెద్ద కారణం అవుతుంది. వరబలం కూడా అహం పెంచుతుంది అని ఇక్కడ తెలియపరుస్తుంది.

జమదగ్నిముని కుమారుడు అయిన భార్గవరాముడు గండ్రగొడ్డలితో కార్తవీర్యార్జునుడిపైకి యుద్దానికి వస్తాడు. సుదర్శన చక్రం గర్విస్తే శాపవశాన కార్తవీర్యార్జునిడిగా జన్మించిన ఆ మహారాజుకి గతం గుర్తుకు వచ్చి భార్గవరాముని చేతిలో మరణిస్తాడు. తిరిగి సుదర్శన చక్రంగా శ్రీమహావిష్ణువు చేతిలోకి వెళతాడు. కార్తవీర్యార్జునుడి కుమారులు వచ్చి జమదగ్ని తలను నరికి వెళ్ళిపోతారు. అప్పుడు జమదగ్ని భార్య రేణుకామాత రామ రామ రామ రామ అంటూ 21 మార్లు అరుస్తూ ఉంటుంది. అన్నిమార్లు భూమండలం అంతా గర్వం కలిగిన రాజులందరిని చంపుతానని ప్రతిజ్ఞా చేస్తాడు.

తల్లిదండ్రులను కావిడిలో పెట్టుకుని ఆ కావిడిని భుజానికెత్తుకుని భార్గవరాముడు బయలుదేరతాడు. మధ్యలో ఆకాశవాణి పిలుపు వినపడిన చోట తల్లిదండ్రులను పెట్టి, భార్గవరాముడు శ్రీదత్తదర్శనానికి వెళతాడు. అక్కడ శ్రీదత్తుడు శునకాలతో ఆడుకుంటూ ఒక అంటారని వ్యక్తిలాగా కనిపిస్తాడు. కానీ భార్గవరాముడు స్వామిగురించి తనతండ్రి నోట విని ఉండడం వలన సందేహం లేకుండా ఆ స్వామినే ప్రార్ధిస్తాడు. దత్తాత్రేయుల వారు భార్గవరాముడిని అనుగ్రహింఛి తల్లి రేణుకమాతా దర్శనం కోసం వెళతారు, స్వామి దత్తాత్రేయులు. రేణుకాజమదగ్ని దంపతుల దహన సంస్కారం తరువాయి, పరశురాముడుగా తన ప్రతిజ్ఞా నేరవేర్చుతాడు.

భార్గవరాముడు పరశుని చేపట్టి అనేకమంది రాజులను చంపడం వలన పరశువుతో పాపం మూటకట్టుకున్నట్టు ఆకాశవాణి ద్వారా నీవు పరశురాముడిగానే మిగిలిపోతావు అని మాటలు వినబడతాయి. తత్ఫలితంగా తన స్థితిని గుర్తించిన పరశురాముడు మరలా శ్రీదత్తదర్శనం పొంది, దత్తాత్రేయుల ద్వారా తత్వబోధ అనంతరం భార్గవరాముడు శాంతిని పొందుతాడు. శ్రీదత్త విశ్వరూప దర్శనంతో చిత్రం సుఖాంతం అవుతుంది.

శ్రీదత్తదర్శనం అంటే పరమాత్మదర్శనంగానే ఉండడం ఈ భక్తి మూవీ యొక్క పరమార్ధంగా కనిపిస్తుంది.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ

స్వామియే శరణం అయ్యప్పా.. అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ. స్వామి అయ్యప్ప దివ్యచరితము, అయ్యప్పమాల దీక్ష మహిమలు చూపే తెలుగుమూవీ. గోదావరి తీరాన అయ్యప్ప దీక్ష తీసుకుని నియమాలను ఆచరించిన భక్తులను అనుగ్రహించే మహిమలు చక్కగా చూపిస్తారు. శబరిగిరి యాత్ర, మధ్యలో విశేషాల వివరణలు ఆద్యంతం భక్తిలోకి తీసుకువెళుతుంది ఈ భక్తిమూవీ.

Banner/బ్యానర్: జానకి ఆర్ట్ పిక్చర్స్
అయ్యప్పస్వామి మహత్యం తెలుగు భక్తి మూవీ
నటినటులు: శరత్ బాబు, షణ్ముఖ శ్రీనివాస్, చంద్రమోహన్, గిరిబాబు, జె.వి. సోమయాజులు, ఈశ్వరరావు, ఆహుతి ప్రసాద్, విద్యాసాగర్ తదితరులు.
దర్శకత్వం: కె. వాసు
నిర్మాత : మాగంటి ప్రసాద్

అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ

అయ్యప్ప చరితమును మహిమలను దీక్ష నియమాలను చక్కగా తెలియజెప్పే తెలుగు మూవీ. శరత్ బాబు ముఖ్యపాత్రలో ఈ భక్తిమూవీ సాంతం అయ్యప్ప దీక్ష మహిమను తెలియపరుస్తుంది.

అయ్యప్పస్వామి మహత్యం చిత్ర కధ

చిత్రప్రారంభం శరత్ బాబు మునిస్వామి స్వామిమాలదీక్షాకాలంలో నియమనిష్టలతో అనుసరిస్తున్నవిధానంలో టైటిల్స్ వస్తూ ఉంటాయి. టైటిల్స్ పూర్తవగానే ఇద్దరు చిన్నారులకు శరత్ బాబు మునిస్వామిగా వారికి అయ్యప్పమాల దీక్ష ఇవ్వడం చూపుతారు. అలాగే ఇంకొక వ్యక్తి మరోప్రక్క డబ్బులు తీసుకుని ఏమాత్రం దీక్ష నియమాలు పాటించకుండా ఉంటూ, ఇతరులకు దీక్ష ఇచ్చే గురుస్వామిగా చెలామణి అవుతూ ఉంటాడు.

అయ్యప్పస్వామి మహత్యం తెలుగు సినిమా యూట్యూబ్ ద్వారా చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి లేక క్లిక్ చేయండి

శరత్ బాబు గురుస్వామిగా మాలలో దీక్షగా చేయవలసిన నియమాలు సక్రమంగా ఆచరిస్తూ, తనతోటి స్వామిలతో ఆచరింపచేస్తూ ఉంటారు. స్వామి మాల పవిత్రతను తెలియజేస్తూ నిత్యదీక్షాపరాయణుడై ఇతరస్వాములకు మార్గదర్శకంగా ఉంటారు. ఆ క్రమంలో తోటి స్వాముల సందేహాలు తీరుస్తూ ఉంటూ ఉండగా, ఒకరు అయ్యప్ప చరిత్రను అడిగితే, తానూ దీక్ష ఇచ్చిన ఇద్దరి చిన్నారులతో పాట రూపంలో వినిపించడంతో అయ్యప్ప దివ్య చరితను మనము చూడగలుగుతాం ఈ భక్తి మూవీ ద్వారా…

చిన్నారుల గానంతో అయ్యప్ప జన్మ వృత్తాంతం

త్రిమూర్తుల భార్యలు అయిన పార్వతి, లక్ష్మి, సరస్వతిల కోరిక మేరకు అత్రిమహర్షి భార్య అయిన అనసూయ ప్రాతివత్య మహత్యాన్ని పరిక్షించదలచి, త్రిమూర్తులు అత్రి ఆశ్రమానికి భిక్షుల వేషంలో వెళతారు. వారిని చూడగానే అత్రిముని వారికి ఏమికావాలని అడిగితే నీ భార్య నగ్నంగా మాకు వడ్డిస్తే, మేము మీ ఇంట భిక్ష స్వీకరిస్తాం అని అంటారు. సంకటంలో పడిన మహర్షి, తన భార్యను అడిగితే, అలాగే ఒప్పుకోండి అని బదులివ్వడంతో భిక్షులు రూపంలో ఉన్న త్రిమూర్తులు ఆశ్రమం లోనికి వెళతారు.

ఆశ్రమంలో భిక్షకు వచ్చింది, త్రిమూర్తులు అని గ్రహించిన అమ్మ అనసూయ వారిని తన ప్రాతివత్య మహిమతో చిన్నారులుగా మార్చివారికీ పాలిస్తుంది. అలాగే వారిని ఊయలలో వేసి ఆడిస్తుంది, సృష్టి, స్థితి, లయకారుకులైన త్రిమూర్తులను చిన్నపిల్లలుగా మార్చివేయగల శక్తి కేవలం భర్తను అనుసరించడం వలన వచ్చింది. తనను అనుసరించడం వలన తన భార్యకు త్రిమూర్తులను చిన్నపిల్లలుగా మార్చగల తపఃఫలం వచ్చేంత గొప్పగా ధర్మాలు తెలిసి ఉండడం, ధర్మంపై కట్టుబడి ఉండడం అత్రి మహర్షి గొప్పతనంగా కనిపిస్తుంది.

అయితే త్రిమూర్తల భార్యలు వచ్చి అనసూయ అమ్మని ప్రార్ధిస్తే, మళ్ళి తన ప్రాతివత్య్త మహిమచేత ఆ చిన్నారి శిశువులను తిరిగి త్రిమూర్తులుగా మారుస్తుంది. అనసూయ ప్రాతివత్య గొప్పతనానికి సంతసించిన త్రిమూర్తులు వరం కోరుకోమంటే, బిడ్డలు లేని తమకు బిడ్డలను ప్రసాదించమని అడుగతారు అనసూయ-అత్రి దంపతులు. అప్పుడు వారికీ త్రిమూర్తి అంశతో కలిగే సంతానంలో దత్తాత్రేయులు ఒకరు.

దత్తాత్రేయులు తన భార్యతో గొడవపడి ఇద్దరు ఒకరినొకరు శాపాలను ఇచ్చుకోవడంతో ఆమె భార్య మహిషి అనే రాక్షసిగా జన్మిస్తుంది. రాక్షసిగా మారినా మహిషి, శుక్రాచార్య ముని సూచనమేరకు బ్రహ్మదేవుల కోసం తపస్సు చేస్తుంది. మహిషి తపస్సు చెడగొట్టే ప్రయత్నం ఇంద్రుడు చేసి సఫలం కాలేడు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు మహిషిని వరం కోరుకోమంటే, ఆమె తనకు చావులేని వరం ఇమ్మంటుంది. పుట్టినవారు మరణించడం, మరణించినవారు పుట్టడం ప్రకృతి లక్ష్మణం దాన్ని ఎవరు మార్చలేరు. అంటే మహిషి తెలివిగా హరిహరులు (శివుడు-విష్ణువు)లకు ఎవరైనా సంతానం కలిగితే ఆ సంతానం చేతిలో మాత్రమే చనిపోయే వరం అడుగుతుంది. బ్రహ్మదేవులు వరం అనుగ్రహిస్తారు, ఇక మహిషి అందరి రాక్షసుల మాదిరి దేవతలను, సజ్జనులను పీడించడం మొదలుపెడుతుంది.

అయ్యప్ప స్వామి జననం

ప్రకృతి నియమాలు, వాటిని పాటించి సదా మంచినే కాంక్షించే వారిని ఇబ్బంది పెడితే, ఆ పరమాత్మా ఎప్పుడు ప్రకృతిలోకి వచ్చి ఆఅడ్డుని తొలగించడం పరిపాటి, స్థితినినిలబెడతాడు. ఇప్పుడు స్థితి స్త్రీ రూపం ధరిస్తే, లయం పురుషత్వంతో స్త్రీని సృజించి, ఒక కారణపురుషునికి జన్మకు కారణం అవుతారు. అలా జన్మించిన బాలుడే మణికంఠగా పెరిగి అయ్యప్ప అయ్యి ఇప్పుడు అందరిని అనుగ్రహిస్తున్న శబరిమల స్వామి. పద్మదళ రాజ్యాధినేత వేటకు అడవికి వచ్చిన రాజు అమందాత కొండలలో శిశువు రోదన విని వెతికితే కనిపించిన బాలుడిని దైవప్రసాదంగా భావించి, అంతఃపురానికి తీసుకువెళ్ళి పెంచుతాడు. ఆ బాలుడికి మణికంఠగా పెరిగి, గురుకులానికి వెళ్ళి సకల విద్యలు అభాసిస్తారు స్వామి అయ్యప్ప. విధ్యాబ్యాసం పూర్తయిన తరువాత గురువుగారికి గురుదక్షిణగా ఆయన పుత్రుడికి దృష్టి, వాక్కు ప్రసాదిస్తారు మణికంఠ.

విధ్యాబ్యాసం పూర్తీ అయ్యి అంతఃపురం చేరతారు స్వామి మణికంఠ, తరువాయి ఇంద్రుడు ఎలాగైనా మణికంఠ జన్మరహస్యం చెప్పి మహిషిని అంతం చేయించాలని తలచి, మణికంఠ పెంచిన తల్లికి శిరోభారం కలిగేల చేస్తాడు. ఇంద్రుడే వైద్యుడుగా వచ్చి రాజుతో రాణి శిరోభారం తగ్గాలంటే పులిపాలు కావాల్సిందే అని చెబుతారు. మణికంఠ పులిపాల కోసం అడవికి బయలుదేరితే అక్కడ మణికంఠకి ఇంద్రుడు తన జన్మరహస్యం, జన్మకారణం చెప్పి మణికంఠని మహిషిపై యుద్దానికి ప్రోత్సహిస్తారు. మణికంఠకి, మహిషి మధ్య జరిగిన ఘోరయుద్దంలో మహిషిని మట్టికరిపిస్తాడు మణికంఠ. తరువాయి మణికంఠ అంతఃపురానికి ఇంద్రుడినే పులిగా తీసుకునివెళతాడు. అప్పటికే ఇంద్రమాయ వలన కలిగిన శిరోభారం తొలగిపోతుంది. పులిగా ఉన్న ఇంద్రుడు నిష్క్రమించాక, మణికంఠ తన తల్లిదండ్రులతో నేను తపస్సుకు వెళతానని వెల్లడి చేస్తాడు.

మణికంఠ నిర్ణయాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులకు, మణికంఠ జ్ఞానబోధ చేస్తే, తండ్రి ఒక కోరిక కోరతాడు. నీ పట్టాభిషేకానికి అని చేయించిన నగలు ఒకసారి ధరించి మాకు దర్శనం కలగజేయి అని తండ్రి మణికంఠని అడిగితే, అందుకు బదులుగా మణికంఠ నేను త్వరలో ప్రతి సంవత్సరం మకరసంక్రాంతి రోజున మీరు తెచ్చే నగలను ధరిస్తాను. ఇప్పుడు నేను సంధించి వదులుతున్న బాణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాకు ఆలయం కట్టించమని చెప్పి, విల్లుతో బాణం విడిచిన మణికంఠ తపస్సుకు బయలుదేరతాడు. అలా తండ్రి కట్టించిన ఆ ఆలయం శబరిమలై భక్తులను అనుగ్రహిస్తున్న అయ్యప్పకి నిలయం అయింది.

మణికంఠను అయ్యప్ప అని మొదట పిలిచినా తల్లిదండ్రులు

స్వామికి అయ్యప్ప పేరు ఎలా వచ్చింది అంటే ! తపస్సుకు బయలుదేరే సమయంలో తల్లిదండ్రులు మణికంఠని తండ్రి అయ్యా అని తల్లి అప్పా అని సంభోదిస్తారు. అలా తల్లిదండ్రులు సంభోదించిన రెండు పేర్లు ఒకటిగా అయ్యప్పగా అయ్యి అందరిని అనుగ్రహిస్తున్నాడు మణికంఠ స్వామి. అలా అయ్యప్ప చరితమును పిల్లచే గానం చేయించిన శరత్ బాబు గురుస్వామి మిగిలిన స్వాములకు పూజవిధానాలు, దీక్షనియమాలు, శబరిమలలో జరిగే సహస్రకలశాబిసేకం వంటి విశేషాలు చూపిస్తూ మాలదీక్షలో మార్గదర్శకంగా నిలుస్తాడు.

అయ్యప్పస్వామి మాలనియమాలు మండలం రోజులు ఆచరించి, శబరిమాల యాత్ర గురుస్వామి శరత్ బాబు మార్గదర్శకత్వంలో సాగడంతో పాటు మధ్యలో భక్తులపై అయ్యప్పస్వామి మహిమలు నిదర్శనంగా మారడం ఈ చిత్రం ఆద్యంతం భక్తిని పండిస్తూ ఉంటుంది. యాత్రలో స్వామిపై, మాలనియమాలపై పాటలు అందరిని అలరిస్తాయి. హరిహర పుత్రుడైన అయ్యప్పదీక్ష భక్తిశ్రద్దలతో ఆచరించి శబరిమల యాత్రను చేస్తే పూర్తీఫలితం ఉంటుంది అని తెలియజెప్పే భక్తిమూవీ. అలాగే తెలిసి తప్పులు చేస్తూ, స్వామి పేరు చెప్పి ఇతరులను మోసం చేసేవారిని స్వామి ఎలా శిక్షిస్తారో ఈ చిత్రం చూపుతుంది.

అందరు దేవతలు అవతరించి అవతార ప్రయోజనం తీరాక భూలోకంలో ఉండరు కదా మరి అయ్యప్ప ఎందుకు శబరిమలలోనే ఉండినట్టు అని శబరిమలయాత్రలో గురుస్వామిని మరో స్వామి ప్రశ్నిస్తారు. అప్పుడు గురుస్వామి స్వామి ఆంజనేయులకు అయ్యప్ప మాట ఇచ్చినవైనం, అలాగే పరబ్రహ్మ భక్తురాలైన శబరికి అయ్యప్పస్వామి ఇచ్చిన వరం గురించి, అయ్యప్ప గుడికట్టమని సందేశం తన తండ్రికి పంపించడం వివరిస్తారు. మణికంఠతండ్రి శబరిగిరిపై కట్టించిన ఆలయం శబరిమలై విరాజిల్లుతుంది. గోదావరి తీరాన ఉన్న ర్యాలీ గ్రామవాసి పరమేశ్వరశాస్త్రి ప్రధాన అర్చకులుగా తంత్రితో  శబరిగిరిపై అయ్యప్ప పూజలు ప్రారంభం అవుతాయి. పరమేశ్వర శాస్త్రి గారి వంశీకులు అర్చకులుగా ఇప్పటికి అయ్యప్ప పూజలు అందుకుంటూ ఉన్నాడు.

యాత్రకు బయలుదేరిన స్వాములకు గురుస్వామి మకరజ్యోతి గురించి వివరిస్తూ శబరిమాల చేరి అయ్యప్ప స్వామి దర్శనం పొందడంతో అయ్యప్ప స్వామి మహత్యం భక్తి

మంచి భక్తి సినిమాలగా అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ ఉంటంది, మాలధారణ, దీక్ష నియమాలు, శబరిమాల యాత్ర విశేషాలను మనకి స్క్రీనుపై చూపుతుంది.

స్వామియే అయ్యప్ప శరణం అయ్యప్పా శబరిమల అయ్యప్ప శరణం అయ్యప్ప, హరిహరతనయ అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద తెలుగు బాలభక్తుడి సినిమా. తన్మయమైన భక్తితో దైవాన్ని రప్పించిన భక్తిరసకరమైన చలనచిత్రం. భక్తుడు పరమాత్మ తత్వంతో తన్మయత్వం చెందుతూ ఉంటే, ఆ భక్తికి భక్తులు, భగవంతుడు పరవసిస్తే, మరి చిన్నారి బాలుడు పరబ్రహ్మంతో తన్మయుడై హరిభక్తిని చాటుతుంటే, శ్రీహరి ఉగ్రనారసింహ అవతారం ఎత్తించిన భక్తిరసభరిత తెలుగు మూవీ.

అమ్మకడుపులోనే భగవతత్వం గురించి తెలియబడడం వలన, చిన్ననాటి నుండే నారాయణ మంత్రంతో మనసుని నింపేసుకున్నబాలుడి భక్తి తత్పరత చాల భక్తిభావాన్ని పెంచుతుంది.

భక్తప్రహ్లాద తెలుగు భక్తి మూవీలో భగవంతుడిగా హరనాథ్ నటిస్తే, బాల భక్తుడిగా రోజారమణి చాల చక్కగా నటించారు. చిన్నారి భక్తుడి తండ్రి హిరణ్యకశిపుడుగా ఎస్వి రంగారావు (SV Rangarao) నటిస్తే, హిరణ్యకశిపుడు భార్య లీలావతిగా అంజలిదేవి నటించారు. చిన్నారి భక్తుడికి  గురువులుగా రేలంగి నరసింహారావు, పద్మనాభంలు నటించారు. నారదుడుగా బాల మురళి కృష్ణ నటించారు.

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద సాంకేతిక వర్గం

Banner/బ్యానర్: AVM Productions/ఏవిఎం ప్రొడక్షన్స్
Direction/దర్శకత్వం:Ch Narayana murthy సిహెచ్. నారాయణమూర్తి
Actor Actress/నటినటులు: SV Rangarao/ఎస్వి రంగారావు, Balamurali Krishna/బాల మురళి కృష్ణ, Relangi/రేలంగి, Padmanabham/పద్మనాభం, Haranath/హరనాథ్, dhoolipala/ధూళిపాళ, Ramana Reddy/రమణారెడ్డి, Nagaiah/నాగయ్య. AnjaliDevi / అంజలీదేవి, Jayanti/జయంతి, Baby Rojaramani/బేబీ రోజారమణి, L Vijayalakshmi/ఎల్ విజయలక్ష్మి, Geetanjali/గీతాంజలి, Vanisri/వాణిశ్రీ, Nirmala/నిర్మల తదితరుల్ Bhakta Prahlada/భక్తప్రహ్లాద చిత్రంలో నటించారు.
Story/కధ: DV Narasaraju/నరసరాజు
Sangitam/సంగీతం: S Rajeswara Rao/ఎస్ రాజేశ్వరరావు

జయ విజయులకు మునుల నుండి శాపం భక్తప్రహ్లాద మూవీలో

వైకుంఠములో ద్వారాపాలకులుగా జయవిజయులు వైకుంఠద్వారం దగ్గర నిలబడి ఉంటారు. సనకసనంద మహర్షులు వైకుంఠములోనికి ప్రవేశించబోతే, వారిని జయవిజయులు అడ్డుకుంటారు.

మహర్షులు తమకు శ్రీమహావిష్ణువు దర్శనం అత్యవసరం అన్నా అడ్డుకుంటారు, శ్రీహరి లక్ష్మీసమేతులై ఏకాంతంగా ఉన్నారని లోనికి ఎవరిని అనుమతించం అని అడ్డుకుంటారు. శ్రీహరి భక్తవత్సలుడు భక్తులకు, శ్రీహరికి ఎవరూ అడ్డుకాకూడదు మీరు అడ్డుతోలగమని చెప్పినా జయవిజయులు సనకసనంద మహర్షులను అడ్డుకుంటారు.

కోపగించిన మహర్షులు రాక్షసులై భూలోకంలో జన్మించమని జయవిజయులకు శాపానుగ్రహం ఇస్తారు. జగన్నాటక సూత్రదారి వచ్చి జరిగిన విషయం గ్రహించి, జయవిజయులు చేసింది తప్పు దానికి మీరు శిక్ష అనుభవించాలంటే, జయవిజయులు శ్రీహరిని ప్రార్ధిస్తారు.

అప్పుడు శ్రీమహావిష్ణువు జయవిజయులు శాపఫలం అనుభవించాక, వారు తిరిగి వైకుంఠము వచ్చేలా అనుమతి ఇవ్వవలసినదిగా తాపసులను కోరితే, బదులుగా సనకసనంద మహర్షులు దానికి మేమంతవారము నీవెట్లా అనుగ్రహించిన మాకు సమ్మతమే అని చెబుతారు.

నాకు విరోధులుగా మూడు జన్మలు ఎత్తి తరువాత వైకుంఠము చేరతారా ? నాకు భక్తులుగా ఏడు జన్మలు ధరించిన తరువాత వైకుంఠము చేరతారా ? అని జయవిజయులకు శ్రీహరి చెబితే. బదులుగా జయవిజయులు స్వామి నీకు దూరంగా ఏడు జన్మల కాలం మేము ఉండలేము, విరోధులుగా మూడు జన్మలకాలం తరువాత వైకుంఠప్రాప్తిని అనుగ్రహించమని వేడుకుంటారు. అలా జయవిజయులు మూడు జన్మలు శ్రీహరికి శత్రువులుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

మొదటి జన్మలో దితి కడుపునా హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా రెండవ జన్మములో రావణ, కుంభకర్ణులుగా మూడవ జన్మములో శిశుపాల, దంతవర్తులుగా భూలోకములో జన్మించి, నన్ను విరోధించినా, నిరంతరం నాపై ధ్యాసనే కలిగి ఉండి, తదుపరి వైకుంఠము చేరగలరని శ్రీహరి సెలవిస్తారు.

హిరణ్యాక్షమరణం, హిరణ్యకశిపుడు తపస్సు, ప్రహ్లాద జననం

తరువాయి సన్నివేశంలో కశ్యప ప్రజాపతి సంద్యాసమయంలో తన ఆశ్రమంనందు ధ్యాననిమగ్నుడై ఉండగా, అయన భార్య అయిన దితి అక్కడికి వస్తుంది. వసంతకాలం ప్రకృతి ప్రభావరిత్యా ఆమె కామప్రభావానికి లోనై కశ్యపప్రజాపతి చెంతచేరుతుంది, విరహభావంతో.

కశ్యప ప్రజాపతి ఆమెను వారించగా ఆమె తిరస్కార వైఖిరికి ఆమె కోరికను తీర్చుతారు. తత్ఫలితంగా అనతికాలంలో ఆ దంపతులకు ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. వారికీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు నామకరణం చేసిన కశ్యప ప్రజాపతి, వారు రాక్షసులై లోకకంటకులుగా శ్రీహరి విరోధులు అవుతారని చెబుతారు. దానికి దితి దుఃఖిస్తే, నీ మనుమడు మాత్రం శ్రీహరి భాక్తాగ్రేసుడై కీర్తిని సముపర్జిస్తాడని ఆమెను ఊరడిస్తారు.

దైత్యుడైన హిరణ్యాక్షుడు ప్రజలను పీడిస్తూ, సాదుజనులను హింసిస్తూ, భూమాతను కూడా హిరణ్యాక్షుడు హింసిస్తూ, భూమిని రక్షించడానికి శ్రీహరి ఆదివరాహఅవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి, శిష్టరక్షణ చేస్తారు.

విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఇదంతా శ్రీహరి వలననే జరిగింది, అందుకు శ్రీహరిపై విరోధం ఇంకా పెంచుకుంటాడు. ఎలాగైనా శ్రీహరిని ఓడించాలని శ్రీహరిపై యుద్దానికి సంసిద్ధుడు అవుతుంటే, గురువు బోధనచేత యుద్దకాంక్ష పక్కనపెట్టి, తపస్సు చేయడానికి బయలుదేరతాడు.

బ్రహ్మదేవుడి గురించి ఘోరతపము ప్రారంభిస్తాడు, బ్రహ్మ ప్రత్యక్ష్యం అయ్యేదాకా కఠోర తపము చేస్తే, బ్రహ్మగారు హిరణ్యకశిపుడు తపస్సునకు మెచ్చి, వచ్చి వరం కోరుకో అంటారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏడేడు పదునాలుగు లోకాలలో గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, అస్త్ర, శస్త్రాలతో, దిక్కులలో, పగలు, రాత్రి, ఇంటా, బయటా, పైన, క్రింద, జంతువులు, మనుషులు, దేవతలు, కిన్నెర, కింపుర్శ, గంధర్వులు, అన్ని వస్తువుల ద్వారా మరణం లేని వరం అడిగితే, బ్రహ్మగారు అనుగ్రహిస్తారు.

హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం తపము చేస్తున్న సమయంలో గర్భిణిగా ఉన్న లీలావతిని ఇంద్రుడు చెరపట్టి తీసుకువెళుతుంటే, నారద మహర్షి అడ్డుపడి, ఆమెగర్భంలో ఉన్నది రాక్షస జాతి బాలుడే అయినా మహాభక్తుడు కాగలడు, కావునా ఆమెను విడిచిపెట్టమని వారిస్తాడు. తదుపరి లీలావతిని నారదమహర్షి తన ఆశ్రమంలోకి తీసుకువెళతారు.

ఆ ఆశ్రమంలో గర్భిణిగా ఉన్న లీలావతితో నారద మహర్షి బ్రహ్మజ్ఞానం భోదిస్తుంటే, ఆమె నిదురిస్తుంటే, ఆమె గర్భంలో ఉన్నఆ నెలల బాలుడు ఆ జ్ఞానసారాన్ని గ్రహిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకు లీలావతి ప్రసవిస్తే, సుపుత్రుడిగా తపస్సు పూర్తిచేసుకుని వచ్చిన హిరణ్యకశిపుడుకి పరిచయం చేస్తారు. లీలావతి మరియు నారదులు. ఆ బాలుడికి ప్రహ్లాదుడిగా నామం నారద మహర్షే సూచిస్తారు.

వరగర్వం వలన హిరణ్యకశిపుడు ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతుంది. సర్వసాదులను హింసిస్తూ, ప్రజలందరినీ నన్నే దేవుడుగా కొలవవలసినదిగా ఆజ్ఞలు జారి చేస్తాడు. ఇంద్రుడిని జయించి, స్వర్గాన్ని ఆక్రమించి ముల్లోకాలకు ప్రభువుగా ప్రకటించుకుంటాడు. సాధువులు, మునులు శ్రీహరిని వేడుకొనగా అందుకు శ్రీహరి హిరణ్యకశిపుడు సుపుత్రుడు నాకు మహాభక్తుడై ఉంటాడు, అందువల్లే హిరణ్యకశిపుడు అంతం కూడా అవుతుంది అని చెబుతారు.

భక్తప్రహ్లాద హరిభక్తి నివారణ ప్రయత్నం చేసే హిరణ్యకశిపుడు

నారాయణనామం పలుకుతుంటే ఎంతమధురంగా ఉంటుందో పలికేవారికీ తెలుస్తుంది అంటారు, కానీ ఈ మూవీలో నారాయణనామం గొప్పతనం కనబడుతుంది. నారాయణనామం యొక్క రుచి ప్రహ్లాద త్రాగినట్టుగా ఈ మూవీ కల్పిస్తుంది. నారాయణనామజపం వలన మరణ భయంపొందని దృఢమైన మనస్సుని పొందిన బాలుడు భక్తి భావన ముగ్ధమనోహరంగా కనిపిస్తుంది, ఈ భక్తప్రహ్లాద మూవీలో. నారాయణమంత్రం తల్లి కడుపులో ఉండగానే నారద మహర్షిచే బోధించబడుతుంది.

మదిలో భక్తిభావనలు పెంపొందించుకోవడానికి భక్తప్రహ్లాద చిత్రం ఒక చక్కటి అవకాశంగా ఉంటుంది. భక్తి ధ్యాసలో భవభందాలా భయం లేదని చాటి చెప్పే చిత్రం, చూస్తున్నవారిలో కూడా నారాయణ నామంపై మమకారం పెంచుతుంది. భక్తుడి భక్తి తత్పరతతో రాతిస్థంభం నుండి కూడా భగవంతుని రప్పించవచ్చని చాటి చెప్పే తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద .

అధర్మ కర్మవలననే ప్రజాపతి సంతానం ద్రుష్టబుద్దితో పుడితే, ధర్మపరివర్తనతో లీలావతి వలన ద్రుష్ట రాక్షసుడికి సుపుత్ర సంతానం కలిగింది. అంతటా హరినామం నిషేదిస్తే, నిషేదించిన ఇంటే హరినామ కీర్తన జరగటం జగన్నాటక సూత్రదారి మాయ ఎంతగొప్పదో అర్ధం అవుతుంది.

నారదుల ఆశ్రమం నుండి ఇంటికి వచ్చిన బాలుడు ఎప్పుడు శ్రీహరి ధ్యాసలోనే ఉండి, ధ్యానం చేస్తూ ఉంటాడు. ముల్లోకాలు జయించిన హిరణ్యకశిపుడుకి కంటిమీద కునుకు లేకుండా చేసేది, తన సుపుత్రుడు భక్త ప్రహ్లాద ప్రవర్తన. రాక్షస బుద్దులు రాకుండా ప్రసన్నంగా ఉండడం దానవాగ్రేసురుడుకి అసలు నచ్చదు. అలా ఉన్న ఆ బాల ప్రహ్లాదుడిని గురుకులంలో విద్యాబుద్దులకోసం చండామార్కుల ఆశ్రమంకు పంపుతారు.

గురుకులంలో ప్రహ్లాదుడి హరిభక్తి కీర్తనలు

గురుకులంలో చేరిన ప్రహ్లాదుడు గురువుల దగ్గర అన్ని విద్యలు, వేదపాటాలు నేర్చుకుంటాడు, కానీ హరిభక్తిని మరువడు. వేదవిద్యలు ఇట్టే పట్టిన ప్రతిభను చూసి ముచ్చటపడి, ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు వద్దకు తీసుకువెళతారు.

హిరణ్యకశపుడు పుత్రుడిని తనతొడపై కూర్చొనబెట్టుకుని, ప్రహ్లాదుడుని నీవు నేర్చుకున్న విద్యలలో సారం ఏమిటో చెప్పమని అడిగితే, తండ్రి తొడపై కూర్చోని ప్రహ్లాదుడు వేదసారమైన పరమాత్మ తత్వాన్ని శ్రీహరిపై పొగుడుతూ పద్యం చెబుతాడు. శ

్రీహరి మాట తనపుత్రుని నోట విన్న హిరణ్యకశిపుడుకి కోపం వస్తుంది. హరిభక్తి మనకు తగదని చెప్పినా, హరి భక్తితత్పరుడైన బాలుడు దృఢమైన మనసుతో శ్రీమహావిష్ణువునే స్తుతిస్తాడు.

తనపుత్రుడికి రాక్షసజాతికి అవసరమైన శాస్త్రవిద్యలు సరిగా బోధించమని మరలా గురుకులానికి ప్రహ్లాదుడిని పంపిస్తారు. తిరిగి గురుకులం చేరిన ప్రహ్లాదుడు, అక్కడి ఉన్నవారందరికీ హరిభక్తి భోదిస్తూ ఉంటాడు.

అది చూసిన చండామార్కులవారు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపునికి అప్పజెప్పి, ప్రహ్లాదుడిని మార్చడం మావల్ల కాదు అని చెబుతారు. హరిభక్తి మానతవా లేదా అని కఠినంగా అడిగినా ప్రహ్లాదుడు హరిభక్తి మానలేను అంటాడు. ఇక ప్రహ్లాదుడిని చంపమని, భటులకు అజ్ఞా ఇస్తాడు, హిరణ్యకశిపుడు.

ఏనుగుతో తొక్కించినా, ఎత్తైన కొండలపై నుండి తోసివేసినా, పాములతో కరిపించినా ఎలా ప్రయత్నించిన శ్రీహరి అనుగ్రహంతో బ్రతికే ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలకు మరణం దరిచేరని ప్రహ్లాదుడిని చూసి, హిరణ్యకశిపుడు తన పుత్రుడిని నిలదీస్తాడు.

నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో చూపించు అని, ప్రహ్లాదుడి భక్తికి పరవశిస్తూ ఉండే, శ్రీమహావిష్ణువు, ప్రహ్లాదుడు చూపించిన రాతికట్టడమైన స్థంభం నుండి పై సగ భాగం సింహంగా, క్రింద భాగం నరుడుగా కలిగి నృసింహస్వామిగా  ఉద్భవించి, పగలు, రాత్రి కానీ సంద్యా సమయంలో ఇంటా బయటా కానీ గడపపై ప్రాణం లేని గోళ్ళతో హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. చివరగా భక్తప్రహ్లాద (BhaktaPrahlada) స్త్రోత్రంతో తృప్తిపడి, ప్రహ్లాదునికి వరాలు ఇస్తాడు.

ఇందుకలడని అందుకలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే కలడు శ్రీహరి అని పడే ప్రహ్లాద పద్యం చక్కగా ఉంటుంది.

భక్తిమార్గం సులభమార్గం అని అదే చివరివరకు తోడు అని భక్త ప్రహ్లాదుడి చరితను చెబుతారు. ఈ భక్తి మూవీ అదే చూపుతుంది.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా

శ్రీరాముడు రాశిభూతమైన ధర్మము అంటారు. ధర్మము పూర్తి మానవుడుగా మారి, చక్రవర్తి అయితే ఆయనే శ్రీరామచంద్రమూర్తి అంటారు. సీతమ్మ తల్లి రామయ్యను అనుసరించిన మహాసాద్వి. సీతారాముల గురించిన సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ గురించి…

బ్యానర్ : లక్ష్మి ఎంటర్ ప్రైజెస్
చిత్ర తారాగణం : శోబన్ బాబు, ఎస్వి రంగారావు, చంద్రకళ తదితరులు
సంగీతం : కేవి మహదేవన్
నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
దర్శకత్వం: బాపు

తెలుగు భక్తి మూవీలో శోభన్ బాబు శ్రీరామచంద్రమూర్తిగా నటించారు. రామచంద్రమూర్తి భార్య సీత పాత్రలో చంద్రకళ నటించారు. శ్రీరామాయణంలో అసురుడు అయిన రావణాసురుడు పాత్రలో ఎస్వీ రంగారావు నటించారు. సంపూర్ణ రామాయణం తెలుగు భక్తి మూవీకి బాపు దర్శకత్వం వహించారు.

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ

అలనాటి పాత తెలుగు సినిమాలు మంచి సందేశం కలిగి ఉంటే, భక్తి సినిమాలు అంటే పరమధర్మమునే తెలియజేస్తాయని అంటారు. భక్తి మూవీస్ వాచ్ చేయడం వలన భగవానుడిపై భక్తిని పెంచుకోవడానికి మనసుకు మంచి ఆలంబనం అవుతుంది.

పుస్తకం చదువుతూ ఉంటే ఒక ఊహాశక్తి మనసులో మెదులుతుంది. సినిమా చూస్తుంటే, చూస్తున్న మూవీ సీన్స్ మనసులో కదలాడుతూ ఉంటాయి. మంచి సీన్స్ మనసులో ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటారు.

శ్రీమహావిష్ణువు తదితర దేవతల అవతార సన్నివేశం సంపూర్ణ రామాయణం భక్తి .

వైకుంఠములో లక్ష్మినారాయణులు ఆదిశేషుని కొలువుతీరి ఉండగా దేవతలు అంతా వచ్చి రావణ రాక్షస అకృత్యాలపై మొరపెట్టుకుంటారు. ద్రుష్ట శిక్షణ చేయడానికి నేను నరుడిగా అవతరిస్తాను. మీరు మీ మీ అంశలతో వానరాలుగా అవతరించండి, అని శ్రీమహావిష్ణువు వెల్లడి చేస్తారు.

ఎందుకంటే రావణుడు మనుషులపై చులకన భావంతో మనుషులు, వానరులు తప్పించి మిగిలిన వారితో మరణం లేని వరం కలిగి ఉంటాడు. వేరొక సన్నివేశంలో రావణాసురుడు వేదవతిని వేదిస్తుంటే, ప్రతిగా వేదవతి నేను మరో జన్మలో నీ మరణానికీ కారణం కాగలనని రావణుడిని శపించి ఆత్మాహుతి చేసుకుంటుంది.

దేవతలు వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు మొదలైనవారు అవతరిస్తే, శ్రీమహావిష్ణువు రామునిగా, రాముని తమ్ములుగా శంఖు, చక్ర, గదలు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా దశరద మహారాజుకి జన్మిస్తారు.

తనఇంట రావణుడు శివ పూజ చేస్తుండగా, పూజ పుష్పం నుండి ఒక బాలిక ఉద్బవిస్తుంది. ఆ శిశువుని రావణాసురుడు పారవేయమని చెబుతాడు. అలా రావణాసురుని ఇంట ఉద్బవించిన శిశువు పొలం దున్నుతున్న జనక మహారాజుకి దొరుకుతుంది.

అలా జనకమహారాజుకి దొరికిన బాలికకు సీత అను పేరు పెడతారు. సీత జగదేక ప్రసిద్ది పొందుతుంది అని జనకమహారాజు గురువులు శతానందులు సెలవిస్తారు.

అయోధ్యలో రామయ్య కౌసల్య – దశరదుల వద్ద అల్లారుముద్దుగా పెరిగి, గురువుల దగ్గర విద్యాభ్యాసం పూర్తీచేసుకుంటాడు.  జనకమహారాజు స్వగృహంలో పెరుగుతున్న సీతమ్మ ఒకరోజు అటాడుకుంటూ ఉండగా బంతి ఒక ధనుస్సు ఉన్న బాక్స్ క్రిందకు వెళుతుంది.

అప్పుడు సీతమ్మ తల్లి a పెట్టెని ఇట్టే జరిపి ఆ పెట్టే కింద ఉన్న బంతిని తీసుకుని మరలా ఆటలోకి వెళుతుంది. అది గమనించిన జనక మహారాజు, వారి గురుదేవులు ఆశ్చర్యచకితులు అవుతారు. వేలమంది తోస్తేకాని జరగని ఆ ధనుస్సు కలిగిని పెట్టెని, ఇట్టే జరిపిన సీతమ్మతల్లికి స్వయంవరంలో ఎవరైతే శివదనుస్సుని ఎక్కుపెడతారో వారికే ఇచ్చి వివాహం జరిపిస్తానని అంటారు.

రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట కానలకు వెళ్ళడం, శ్రీరామాయణం తెలుగు భక్తి మూవీ

ఒకరోజు సభలో దశరధ మహారాజు గురువు వసిష్ఠ మహర్షితో కొలువు దీరి ఉండగా, అక్కడకు విశ్వామిత్ర మహర్షి కూడా వస్తారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాకకు కారణం వివరిస్తూ, రామ చంద్రుని తనతో అడవులకు పంపమని దశరధుని విశ్వామిత్ర మహర్షి అడుగుతారు.

దానికి దశరధ మహారాజు సంశయిస్తే, అప్పుడు వసిష్ఠ మహర్షి నచ్చచెప్పడంతో దశరధ మహారాజు రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి వెనుక పంపడానికి అంగీకరిస్తే, అక్కడికి వచ్చిన రామలక్ష్మణులు తండ్రి అజ్ఞాపాలన మేర విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

విశ్వామిత్రుని వెనుకు రామలక్ష్మణుల నడక సాగుతుండగా తాటక రాక్షసి కనిపిస్తుంది, ఆ రాక్షసి వారి ముగ్గురిపై రాళ్ళతో దాడి చేస్తుంటే, విశ్వామిత్ర మహర్షి అజ్ఞా మేరకు, రాముడు తాటకిని సంహరిస్తాడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు కొన్ని శక్తి అస్త్రశస్త్రాలను ఉపదేశిస్తారు.

విశ్వామిత్ర మహర్షి మరియు ఇతర మునులు జరుపుతున్న యజ్ఞం భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సుబహువు రాక్షసుడుని రాముడు అంతమొందించి, మారీచుడుని రామ బాణంతో కొన్ని యోజనాల దూరంలో పడేటట్టు చేస్తాడు. యాగం సంపూర్తి అవుతుంది.

నారద మహర్షి కూడా అక్కడకు వచ్చి రామచంద్రుడిని దర్శించుకుని, విశ్వామిత్ర మహర్షితో సీతాస్వయంవరం గురించి వివరిస్తారు. అదేవిధంగా ఆ విషయం రావణుడి చెవికి చేరవేస్తాడు. రావణుడు సీతాస్వయంవారానికి బయలుదేరితే, రామలక్ష్మణులు ఇద్దరూ గురువు విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

దారిలో అహల్యకు శాపవిమోచనం కావించి, రామలక్ష్మణ మహర్షులు జనకమహారాజు సభకి చేరుతారు. స్వయంవరానికి విచ్చేసిన మహావీరులందరు ప్రయత్నించి విఫలమైతే, రావణాసురుడుకి కూడా గర్వభంగం అవుతుంది. ఇక గురువు విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదంతో రామచంద్రులు శివధనుస్సు ఎక్కుపెట్టగానే, ధనుస్సు విరుగుతుంది.

సీతారాముల వివాహం అంగరంగవైభవంగా ఇరువురి బంధుమిత్ర సపరివారం మద్య జరుగుతుంది. శివధనుస్సుని విరిచింది ఎవరు అంటూ వచ్చి, అంతకు వేయిరెట్లు అధిక శక్తి కలిగిన హరివిల్లుని కూడా ఎక్కుపట్టమని పరశురాముడు చెబితే, ఆ హరివిల్లుని కూడా ఎక్కుబెట్టిన రాముడు, పరశురాముడుకి శ్రీమహావిష్ణువుగా దర్శనం అయ్యి అక్కడ నుండి నిష్క్రమిస్తారు.

శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తంలో సీతారామలక్ష్మణులు అడవులకు

తరువాతి సన్నివేశంలో భరత, శత్రుఘ్నుడు ఇద్దరు వారి మావగారి గృహానికి వెళతారు. మరొక సందర్భంలో  దశరధ మహారాజు తన సభలో పెద్దలు, ప్రజలు, గురువుగార్ల సమక్షంలో నేను వృద్దుడిని అవుతున్న కారణంగా శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తానని అనగానే అందరు హర్షిస్తారు.

శ్రీరాముడు కేవలం నా పెద్దకుమారుడు కావడం మాత్రమే కాకుండా శ్రీరామునికి చాలా మంచి గుణాలు ఉన్నాయని అందుకే పట్టాభిషేకం చేస్తానని అంటే సభ మరొకసరి సంఘీభావం తెలియజేస్తే, అక్కడికి వేంచేసిన శ్రీరామునికి పట్టాభిషేక విషయం వివరించి, రేపటి పట్టాభిసేకనికి సంసిద్దుడివి కమ్మని చెబుతాడు.

మరుసటి రోజు అయోధ్య అంతా సంబరాలు జరుపుకుంటూ ఉంటే, కైకేయి మందిరానికి వచ్చిన మందర నూరిపోసిన వాక్కుల వలన కైకేయి మనసు చెదిరి, దశరధ మహారాజుని వరాలు అడగడంతో శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి, అదే సమయానికి సీతారామ లక్ష్మణులు అడవులకి బయలుదేరవలసి వస్తుంది.

అంతా ఈశ్వరేచ్చ అని భావించి, సీతారామలక్ష్మణులు అడవులకి వెళతారు, అలా రధంలో బయలుదేరిన రాముని ఎడబాటు భరించలేని దశరధ మహారాజు మరణిస్తారు. తదుపరి వచ్చిన భరతుడు విషయం గ్రహించి తల్లిని మందలించి అన్నగారి వద్దకు అడవులకి బయలుదేరతాడు.

అడవిలో సీతారామలక్ష్మణులు నార దుస్తులు ధరించి ముని ఆశ్రమంలో ఉండగా, భరతుడు సపరివార సైన్యంతో రావడం చూసి లక్ష్మణుడు భారతునిపై సందేహం వెలిబుచ్చుతాడు. కానీ భరతుడు అన్నగారు అయిన శ్రీరామచంద్రుడినే రాజ్యం స్వీకరించాలని, తనతల్లి చేసిన తప్పుకు తానూ ఈ శిక్ష భరించలేనని అంటాడు.

అలాగే కైకేయి తదితర వారంతా శ్రీరాముని అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేయవలసినదిగా కోరితే, శ్రీరాముడు తాను తండ్రికి మాటకు మచ్చ రానివ్వను అంటూ రాజ్యభారం ప్రస్తుతం భరతుడే నిర్వహించవలసినదిగా చెబుతారు. శ్రీరామ పాదుకలు తీసుకుని భరతుడు ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి పాలిస్తానని, గడువు ముగిసే సమయానికి నీవు రాకపోతే, నేను ప్రాయోపవేశం చేస్తానని చెప్పి అయోధ్యకు వెనుతిరుగుతాడు.

రావణుడు సీతాపహరణం చేయడం… సంపూర్ణ రామాయణ తెలుగు భక్తి మూవీ

మరొక సన్నివేశంలో రామలక్ష్మణులను చూసిన శూర్పణఖ మోహితురాలై వారి వెంటబడితే, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కొస్తే, ఆమె రావణ సభకి వెళ్లి మొరపెట్టుకుంటుంది. అంతేకాకుండా సీత అందచందాలు పొగిడేసరికి, రావణుడిలో దుర్బుద్ధి పెరిగి సీతాపహరణకు పధకం వేస్తాడు.

పధకం ప్రకారం మారీచుడు బంగారు లేడి వేషంలో సీతారామలక్ష్మణుల ఆశ్రమం ఆవరణలో తిరుగుతూ ఉంటుంది. ఆ బంగారులేడిని చూసిన సీతమ్మ ఆ లేడిని తనకు తెచ్చి ఇవ్వవలసినదిగా రాముని కోరితే, రాముడు బంగారులేడి వెనుక వేట బాణాలతో బయలుదేరతారు. కొంచెంసేపటికి రాముని ఆర్తనాదం విన్న సీతమ్మ లక్ష్మణుడిని కూడా రాముని బాట పట్టిస్తుంది.

ఇక మారువేషంలో వచ్చిన రావణాసురుడు సీతను అపహరిస్తాడు. ఆకాశమార్గంలో సీతమ్మని తీసుకునిపోతున్న రావణుడిపై జటాయువు పోరాటం చేసి రెక్కలు పోగొట్టుకుంటాడు.

తిరిగి వచ్చిన రాముని దుఃఖానికి హద్దు ఉండదు. లక్ష్మణ ఓదార్పుతో తేరుకుని శ్రీరామలక్ష్మణులు సీతమ్మని వెతుక్కుంటూ బయలుదేరతారు. మధ్యలో కనిపించిన శబరి ఆతిద్యం స్వీకరించాక, శబరి మాటల ప్రకారం వారిరువురు ఋష్యమూక పర్వతం చేరుకుంటారు.

వాలితో ఉన్న తగువు కారణంగా రాజ్యానికి దూరంగా నివసిస్తున్న సుగ్రీవుడు ఆ పర్వతంవైపు వస్తున్న శ్రీరామలక్ష్మణులను చూసి, తనమంత్రి అయిన హనుమతో వాళ్ళెవరో వివరాలు తెలియగోరతాడు.

అప్పుడు ఆ అంజనిపుత్రుడు శ్రీరామలక్ష్మణుల వద్దకు కామరుపంలో వెళతాడు. కానీ కామరుపంలో ఉన్న హనుమని శ్రీరామచంద్రుడు గుర్తించగా, లక్ష్మణుడు తమ వివరాలు చెప్పగా మళ్ళి రాముడు హనుమ సంభోదిస్తే, హనుమ తన నిజ స్వరూపంతో స్వామిని ఋష్యమూక పర్వతంపైకి తీసుకువెళతాడు.

ఋష్యమూక పర్వతంపై శ్రీరామసుగ్రీవుల స్నేహం కుదురుతుంది. సీత గురించి చెబితే, హనుమ సీతమ్మవారి నగలు తెచ్చి రామునికి ఇస్తాడు. నగలు సీతమ్మవే అని గుర్తించి మరల శ్రీరాముడు దుఃఖిస్తాడు. తరువాత సుగ్రీవుడు తన కధని శ్రీరామునికి చెపుతాడు.

అధర్మంగా సుగ్రీవుని రాజ్యబహిష్కరించి, సుగ్రీవుని భార్య అయిన రుమని వాలి అనుభవించడం విన్న శ్రీరామచంద్రమూర్తి వాలిని చంపడానికే నిశ్చయిస్తాడు. వాలి సుగ్రీవుల ద్వంద్వ యుద్దంలో పూలమాల లేని వాలిని శ్రీరాముడు చెట్టు చాటునుండి బాణంతో కొడతాడు. రామబాణం తగిలిన వాలి రాముని చూసి ఇదేమి ధర్మం చెట్టు చాటునుండి బాణప్రయోగం ఏమిటి ? అని అడిగితే.

దానికి రాముడు వ్యన్యమృగాలను చెట్టు చాటునుండి కొట్టడం ధర్మమే, అందులోను నీవు అధర్మం వైపు ఉన్నావు కాబట్టి ఈ విధంగా శిక్షించాను అని చెబుతాడు. అంగదుడుని సుగ్రీవునికి అప్పగించి వాలి మరణిస్తాడు.

సీతాన్వేషణకు హనుమ, జాంబవంత, అంగద తదితర వానరులు బయలుదేరడం…

సుగ్రీవ పట్టాభిషేకం తరువాయి సుగ్రీవుడు రాజ్యభోగాలలో ఉండి, సీతాన్వేషణ విషయం రాముని విషయం మరుస్తాడు. లక్ష్మణస్వామి ఆగ్రహించి సుగ్రీవుని వద్దకు వస్తే, తార మాటలతో చల్లబడ్డ లక్ష్మణస్వామితో సుగ్రీవుడు క్షమాపణ వేడుకుని, రాముని వద్దకు చేరి, సీతాన్వేషణకు వానరాలను నలుదిశలకు పంపుతాడు.

హనుమతో కూడిన అంగద, జాంబవంతుడు మొదలైన వానరులు దక్షిణంవైపు వెళతారు. అయితే హనుమ రాముని నుండి గుర్తుగా ఉంగరం పొంది ఉంటాడు. అలా దక్షిణదిక్కులో ఉన్న సముద్రం దాటే విషయమై వానరులు అందరూ తర్జనబర్జన పడి, చివరికి హనుమనే వేడుకుని, ఆంజనేయస్వామి శక్తిని వేనోళ్ళ పొగుడుతారు.

ఇతరులు గుర్తుచేస్తేకానీ తనశక్తిని గుర్తించలేని మునిశాపం నుండి విముక్తుడై సీతాన్వేషణకు రామబాణంలా సముద్రం దాటుతాడు, హనుమ.

హనుమ లంకలో కావలి కాస్తున్న లంకిణిని ఓడించి, లంకలో ప్రవేశిస్తాడు. అప్పటికి లంకలో రావణుడు సీతమ్మకి రెండూ మసాల గడువు విదించి వెళతాడు. దుఃఖితరాలుగా సీతమ్మ కూర్చుని ఉన్న చెట్టుపై ఉన్న హనుమ రామకధ వినిపించి, అయిన రాక్షస మాయేమో అని శంకించిన సీతమ్మకి రామచంద్రుని ముద్రికను సీతమ్మకి చూపుతాడు.

తనబుజాలపై కూర్చోతల్లి రాముని చెంతకు చేర్చుతాను అని హనుమ పలికితే, సీతమ్మ రాముడే తనభార్యని అయిన నన్ను యుద్దంలో రావణుడిపై గెలిచి తీసుకువెళ్లాలని చెప్పి, తన చూడామణిని హనుమకి ఇచ్చి పంపుతుంది.

వెనుకకు వెళ్తూ హనుమ వనమంతా చెట్ల కొమ్మలు విరిచి కొంతమంది రాక్షసులను నిర్జిస్తాడు. ఇక రావణుడు కొడుకు బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి, పట్టుబడతాడు, హనుమ. సభలో ఆంజనేయస్వామి తన శక్తిని చూపి రామచంద్రుని శరణువేడుకో అని హితవు చెప్పగా, దానికి బదులుగా రావణుడు ఆంజనేయస్వామితోకకి నిప్పంటించమని చెబుతాడు.

ఎవరు అంటించిన నిప్పు వారినే తగలబెట్టినట్టు, ఆంజనేయ స్వామి తనతోకతో లంకలో కొన్ని భవంతులను కాల్చి మరీ రాముని చెంతకు వెళతాడు.

రామరావణ యుద్ధం – శ్రీరామ పట్టాభిషేకం సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ

సీతమ్మ ఇచ్చిన చూడామణి చూసి రామలక్ష్మణులు, సుగ్రీవాది వానరులతో కలిసి యుద్దానికి బయలుదేరతాడు. సముద్రుడు సహకారంతో సముద్రంపై వారధి ఏర్పరచుకుని రామలక్ష్మణులు యుద్ద సైన్యం అంతా లంక చేరతారు.

యుద్ధం మొదలై అనేకమంది వానర యోధులు యుద్ద విన్యాసాలు, లక్ష్మణస్వామి యుద్దనైపుణ్యం, రామరావణుల సంగ్రామంలో రావణుడు మరణిస్తాడు. రావణమరణానంతరం విభీషణుడికి పట్టాభిషేకం చేసి, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, సుగ్రీవుడు మొదలైనవారితో అయోధ్య చేరతారు. అయోధ్యలో శ్రీరామపట్టాభిషేకం జరిగాక, రామచంద్రమూర్తి పరిపాలనలో అయోధ్య ధర్మపదంలో నడుస్తుంది.

శ్రీరామపట్టాభిషేకంతో సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ ముగుస్తుంది.

రామాయణం రాముని చరితము, హనుమాన్, సుందరకాండ వినడం అంటే అది అదృష్టం అయితే, గురువుగారు చాగంటి కోటేశ్వర రావు గారి నోట పలికిన అమృతపలుకులు వినడం మరీ అదృష్టమే.

తెలుగురీడ్స్.కామ్

అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు తెలుగు బాయ్స్ నేమ్స్, తెలుగు గర్ల్ నేమ్స్ తెలుగురీడ్స్ మొబైల్ యాప్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి మీ ఆండ్రాయిడ్ ఫోనులో…. ఈ క్రింది బటన్ టచ్ చేయండి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

వినాయక విజయం తెలుగు భక్తి మూవీ

వినాయక విజయం విజయవంతమైన తెలుగు భక్తి మూవీ. ఆదిదంపతుల ముద్దుబిడ్డ అయిన వినాయకుడి యొక్క పౌరాణిక సినిమా కధ.

కొత్తగా ఏ పని ప్రారంభించాలన్న వినాయకుడి అనుగ్రహం అవసరం, అటువంటి వినాయక విజయం తెలుసుకుంటే, విఘ్నాలు జయించి విజయంవైపు వెళ్ళడమే అవుతుంది.

ఇక ఈ తెలుగు మూవీ విజయవంతమైన భక్తి మూవీ అయిన వినాయక విజయంలో వినాయకుడు (Vinayaka) పుట్టుకకు కారణాలు చూపుతుంది.

కారణజన్ముడు అయిన ఉమాపుత్రుడిగా వినాయకుడి పుట్టుక, వినాయకుడి శిరస్సు మార్చడం. వినాయకునికి(Vinayaka) దేవతల ఆశీస్సులు అందించడం.

వినాయకుని(Vinayaka) విఘ్నాదిపత్యం, చివరగా మూషికునిపై విజయంతో కద కంచికి మనం ఇంటికి అన్నట్లు సాగుతుంది.

వినాయక విజయం తెలుగు మూవీ సాంకేతిక వర్గం.

బ్యానర్: జగన్మాత ఆర్ట్స్
మూవీపేరు: వినాయక విజయం
పాత్రలు:
బాలవినాయకుడు: బేబీ లక్ష్మీసుధ
వినాయకుడు: ఎంజివి మదన్ గోపాల్
శివుడు: కృష్ణంరాజు
పార్వతి: వాణిశ్రీ
విష్ణువు: రామకృష్ణ

వినాయకుడి పుట్టుక కారణాలు ఒక రాక్షసుని వరం అని అంటారు. మూషిక రాక్షసుని వరం ఈ విధంగా ఉంటుంది.

అయోనిజుడు, అకుంటిత దీక్షాపరుడు, బ్రహ్మచర్య దీక్ష, జితేంద్రియుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు, గుణశ్రేష్టుడు, సురశ్రేష్టుడు, సర్వశక్తిసంపన్నుడు అయిన మహావీరుడు అయి బ్రహ్మ సృష్టిలో పుట్టకుండా ఉన్న వ్యక్తి చేత అంతం అయ్యే అవకాశం మూషిక రాక్షసుడికి మరణం సంభవించాలి.

ఆ కారణం లోక కళ్యాణం (Vinayaka Vijayam) అయింది. మన అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడు (Vinayaka)వచ్చాడు.

వినాయక విజయం భక్తి మూవీ కధ ప్రారంభం

కైలాసంలో ఆదిదంపతులు లక్ష్మినారాయణులు, బ్రహ్మాది దేవతలతో కొలువుదీరిన సభతో మూవీ ప్రారంభం అవుతుంది. ఆ యొక్క సభలో దేవతలందరూ త్రిపుసారుల సంహారం అయ్యింది.

కానీ మరలా వారి వారసులు మూషికుడు వలన మరియు గజాసురుడు వలన భవిష్యత్తులో ఇంద్రాది దేవతలకు ఇబ్బందులు కలగవచ్చు అని సందేహం నారద మునీంద్రులు వెలిబుచ్చుతారు.

అందుకు ప్రతిగా శ్రీమహావిష్ణువు ఆదిదంపతులైన పార్వతిపరమేశ్వరులు ఇరువురు కలసి కైలాసంలో ఉండగా లోకాలలో ఎవరికీ ఏ ఇబ్బంది రాబోదని వెల్లడి చేస్తారు.

మరొక సన్నివేశంలో మూషికుడు, గజాసురుడు సభలో కొలువు తీరి ఉండగా నారద మహాముని వేంచేస్తారు. ఉచితాసినులు అయిన నారద మునీంద్రులు వారికి కైలాస సభ ప్రస్తావన తెచ్చి, హరిహరుల సహకారంతో రాక్షస జాతిని అంతమొందించాలని దేవతల ప్రయత్నం అని చెబుతారు.

దానికి మేము అంతకముందే దేవతలను అంతం చేస్తాం అని బదులు ఇస్తాడు మూషికుడు అయితే ఇంతకుముందు చాలామంది రాక్షసులు పలికి ఫలితం సాధించాలేకపోయరని ప్రతిగా బదులు పలుకుతారు నారద మునీంద్రులు.

శక్తితో శివుడు కలిసి ఉన్నన్నాళ్ళు ఎవరికీ అపాయం రాదని చెబితే, వారిని భక్తితో వేరు చేస్తానని గజాసురుడు పలుకుతాడు. ఇంద్రుడిని జయించి స్వర్గాన్ని జయిస్తానని మూషికుడు పలుకుతాడు.

మూషికుడు భార్య ప్రియంవద మాత్రం చాల ప్రాతివత్యం కలిగి, జగన్మాతను ఆరాధిస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు తన పతి యోగక్షేమాలు కోరుతూ పూజలు చేస్తూ ఉంటుంది.

ఇక మూషికుడికి ఇతరుల మనస్సును కొంతసేపు మాయచేసి తానూ అనుకున్న మాయ వారిపై ప్రయోగించకలడు. ఈ విద్యను పూజామందిరంలో ఉన్న తన భార్యపై ప్రయోగించి చూపుతాడు.

మరొక సన్నివేశంలో గజాసురుడు శివుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు, అత్యంత భక్తి శ్రద్దలతో శివుడిని అర్చిస్తూ ఉంటాడు.

దేవేంద్రుడు దుర్వాస మహర్షి చేత శపించబడడం, వినాయక విజయం తెలుగు భక్తి మూవీ.

తరువాతి సన్నివేశంలో ఇంద్రసభకు దూర్వాస మహర్షి వేంచేస్తారు, అప్పుడు దేవేంద్రుడు ఆ మునీంద్రుడుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారు.

సంతసించిన ముని తన తపఃప్రభావమైన ఒక మాలను ఇంద్రుడికి ఇస్తాడు. అప్పుడే మూషికుడు కూడా అక్కడ జరుగుతున్న సన్నివేశం చూస్తాడు. ఇంద్రుడిపై మూషికుడు తన విద్యను ప్రదర్శించి, మహామునిపై దుర్భాషలాడేవిధంగా ప్రేరేపిస్తాడు.

దాంతో ఇంద్రుడితో అహంకారపూరితమైన మాటలు మాట్లాడతాడు. దూర్వాస ముని ఆగ్రహానికి కారణం అయ్యేలా చేస్తాడు. ఇంద్రుడి ప్రవర్తన కారణంగా కోపగించిన ముని దేవేంద్రుడు పదవి కోల్పోయి రాక్షసులచే పీడీంపబడతావని శపించి అక్కడ నుండి నిష్క్రమిస్తారు.

మాయ తొలగగానే నేనెందుకు ఇలా ప్రవర్తించానని దేవేంద్రుడు చింతిస్తుంటాడు. అందుకు అక్కడకు వచ్చిన నారద మహర్షి, నీవు మూషికుని మాయప్రభావం వలన అలా ప్రవర్తించావని చెబుతాడు. అతని దుర్బుద్ధితో నీమీద ఈ ప్రయోగం చేసాడని వివరిస్తారు.

నారదుడు ఆ తరువాతి సన్నివేశంలో పార్వతి మాత వద్దకు వెళతాడు. శివుని గురించి గజాసురుడు చేస్తున్న భక్తిపూర్వకమైన తపస్సు సంగతి చెబుతాడు. అందులో అంతర్యం కూడా పార్వతి మాతకు వివరిస్తాడు.

పరమేశ్వరా అంటే పరిగెత్తుకెళ్ళి మరీ వరాలిచ్చే శివుడితో జాగ్రత్త అని చెబుతారు. అయితే పరమశివుడు మాయలు చేయని మహాదేవుడు, భక్తులు కోరికలు నెరవేర్చే భాక్తపరాదినుడు అని అంటుంది పార్వతి మాత.

ఈలోపు పరమేశ్వరులు అక్కడికి వేంచయగానే నారద మహర్షి నిష్క్రమిస్తారు. పార్వతి మాత మహాదేవుని గజాసురుడు సంగతి అడిగితే, భక్తులు కోరిక నెరవేర్చడమే నా కర్తవ్యం అని బదులిస్తే, తర్వాతి సన్నివేశం గజాసురుని తపఃప్రాంతంలోకి.

తపస్సు చేస్తున్న గజాసురుడు ఎంతకీ, శివుని అనుగ్రహం కలగలేదని, నీ కరుణలేని ఈ జన్మ నాకొద్దని తనతలని తానే నరుక్కోబోతాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమైతే, అప్పుడు గజాసురుడు శివుని చూసి స్త్రోత్రం చేస్తాడు.

ముక్కంటి, గౌరీమనోహరా, గంగాధరా కరుణించితివా అని శివుని కాళ్ళపై పడతాడు. అప్పుడు శివుడు నీ భక్తికి మెచ్చా, వరం కోరుకో అంటాడు. గజాసురుడు నీవు నా గర్భంలో కొలువు అయి ఉండాలి అంటాడు, అప్పుడు పరమశివుడు, ఈ కోరిక వలన విపరీత పరిణామాలు వస్తాయని వారించినా, వాటికి నేనుసిద్దం నీ నా గర్భంలో కొలువు కమ్మని వేడుకుంటాడు, గజాసురుడు.

శివుడు గజాసురుడి గర్భంలోకి శివలింగంగా వెళతాడు. ఇక మూశికుడి ఆగడాలు మొదలవుతాయి. మూషికుడు ఇంద్రుడిని ఓడించి, స్వర్గాన్ని ఆక్రమించి, తానూ ముల్లోకాలకు ప్రభువుగా ప్రకటించుకుంటాడు.

తల్లిచేతిలో పుట్టిన వినాయకుడు (Vinayaka), తండ్రి చేతితో మరలా బ్రతకడం

ఇంద్రాది దేవతలు, మునీంద్రులు బ్రహ్మలోకం వెళ్లి, బ్రహ్మదేవులకు మూషికుని గూర్చి మొరపెట్టుకుంటారు. భ్రాహ్మగారు మూషికుడు వరసంపన్నుడు అంటాడు. ఇంకా అతను అంతం అవ్వాలంటే, అయోనిజుడు, అకుంటిత దీక్షాపరుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు, జితేంద్రీయుడు, గుణశ్రేష్టుడు, సురశ్రేష్టుడు సర్వశక్తి సముపార్జుతుడు మరియు నా సృష్టిలో జన్మించనివాడు అయి ఉండాలి.

అని చెప్పి, ఆ జగజ్జనని శరణు వేడండి అని చెబితే, దేవతలు పార్వతి మాతను కలిసి ఈ విషయం మొరపెట్టుకుంటారు. అప్పుడు పార్వతిమాత పరమశివులు లేరు, శివుడు లేకుండా నేనేమి చేయలేనని చెబితే, దేవతలు శ్రీమహావిష్ణువుని ప్రార్ధిస్తారు.

ప్రత్యక్షమైన ఉపేంద్రుడు పార్వతిమాతలో మోసాన్ని మోసంతో జయించాలి, మేము శివుడిని ఆ గజాసురుని గర్భం నుండి బయటికి తీసుకువస్తాం అయితే, మా ప్రయత్నానికి తోడుగా నీవు కూడా శివుడు వచ్చేవరకు భగ్నం కలగకుండా శివదీక్ష చేయమని అంతర్ధానం అవుతాడు.

అభ్యంగన స్నానం చేయబోతు పార్వతిమాత దేవతలు చెప్పిన సుగుణాలు కలిగిన కుమారుని ఆలోచన చేస్తూ, తన చేతిలో ఉన్న పసుపుముద్దతో బాలుడి బొమ్మను చేస్తుంది. ఆ బొమ్మ బాలుడుకి జగన్మాత ప్రాణం పోస్తే, బాలుడికి(Vinayakudiki) పార్వతి మాత తన శక్తి ఆయుధం ఇచ్చి, నేను శివదీక్ష చేస్తున్నాను కావున, ఎవరు మందిరప్రవేశం చేయకుండా కావలి కాయమని చెప్పి, పార్వతి మాత శివదీక్షలో ఉంటుంది.

గజాసురుడు సభలో కొలువై ఉండగా, విష్ణువు, బ్రహ్మాదిదేవతలు మారువేషంలో వచ్చి ఎద్దులతో నృత్యప్రదర్శన చేసి, అతడిని మెప్పిస్తారు. అప్పుడు గజాసురుడు మీకు కావాల్సినది కోరుకోమంటాడు.

బదులుగా బ్రహ్మ, విష్ణువులు నీ గర్భంలో ఉన్న శివుడుని ఇచ్చేయమని చెబుతారు. గజాసురుడు దేవతలతో శివుడిని మీరే మెప్పించి తీసుకువెళ్ళండి అని బదులుఇస్తాడు. బ్రహ్మవిష్ణువుల స్త్రోత్రానికి శివుడు గజాసురుని గర్భం చీల్చుకొని బయటకి వస్తే, పరమశివుని చూసి గజాసురుడు ఎప్పుడూ నిన్ను చూస్తూ నీ చెంత ఉండే వరం ఇవమని కోరతాడు, శివుడు అనుగ్రహిస్తాడు.

కైలాస ప్రవేశం చేయబోయిన పరమశివుని పార్వతి పుత్రుడు(Vinayakudu) అడ్డగిస్తాడు. శివుడు వారించి చూసిన ఎదురించే బాలుని(Vinayakuni) శిరస్సు ఖండించి, శిరస్సుని ముక్కంటితో దగ్ధం చేస్తాడు. పుత్రుడి ఆర్తనాదంతో బయటకు వచ్చిన పార్వతిమాత విచారిస్తుంది.

అప్పుడు బ్రహ్మవిష్ణువులు ఆ బాలుడుని మేము పునర్జీవుడిని చేస్తాం, కానీ శిరస్సు ఏది పెట్టాలని అంటారు. పరమశివుడు, నంది-బృంగిలను పిలిచి, ఎవరు ఉత్తరదిక్కుకి తలపెట్టుకుని పడుకుంటే, వారి తలను తీసుకురమ్మని చెబుతారు.

శివుని ఆజ్ఞతో బయలుదేరిన వారికి ఉత్తరదిక్కుగా తలపెట్టుకుని నిద్రిస్తున్నఏనుగు మాత్రమే కనిపిస్తుంది. ఉత్తరదిక్కుగా తలపెట్టుకుని పడుకోవడం అంటే దక్షిణ యమస్థానాన్ని చూడడం అని అనుకుని, ఆ ఏనుగు తలని తీసుకుని కైలసానికి వెళతారు.

పార్వతి మాత అంత అందమైన బాలుడికి (Vinayakudiki) ఈ ఏనుగు తలా అని భాదపడితే, నారదుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నీ బిడ్డడు కారణ జన్ముడు అతను ద్విజన్ముడు, ద్విముఖుడు కావాలి కాబట్టి అంగీకరించమని అడుగుతారు.

అలాగే నీ బిడ్డడికి సర్వదేవతా శక్తులు వస్తాయని చెబుతారు. పార్వతి మాత అంగీకారం తరవాత ఏనుగు తలని ఆ బాలుడి(Vinayakudi) కి అతికిస్తారు. ఆ బాలుడు గజముఖుడై గజాననుడుగా మారతాడు.

గజాననుడు విఘ్నాదిపతిగా మూషికుడిని ఓడించి వినాయక విజయం పొందడం (Vinayaka Vijayam).

తరువాయి శాస్త్రోక్తంగా ఆ బాలుడికి బ్రహ్మోపదేశం చేసి తపస్సుకి పంపిస్తారు, పార్వతి పరమేశ్వరులు. తపస్సు విజయవంతంగా పూర్తిచేసుకుని వచ్చిన గజాననుడికి నారద మహర్షి కుమారస్వామిని తమ్మునిగా పరిచయం చేస్తారు. తపస్సు పూర్తిచేసుకుని జితేంద్రీయుడైన పుత్రుని చూసి, గణాధిపతిని చేయదలస్తే,  గణాధిపత్యానికి కుమారస్వామి పోటిపడితే, ఇద్దరికీ ఒక పరీక్షను పార్వతి పరమేశ్వరులు పెడతారు.

ఎవరైతే, ముమ్మారు విశ్వప్రదక్షణ చేస్తారో, వారికీ గణాధిపత్యం ఇవ్వడం జరుగుతుంది అని చెబుతారు. వెంటనే కుమారస్వామి పోటిలో విజయం సాధించడానికి తనవాహనం అయినా నెమలిపై బయలుదేరితే, గజాననుడు ఆలోచన చేసి, తల్లిదండ్రుల వలననే విశ్వం ఉంటే, విశ్వకారకులైన తల్లిదండ్రుల పాదపూజ చేసి ముమ్మారు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే, కుమారస్వామి వెళ్ళిన ప్రతిచోట గజాననుడు ఎదురువస్తూ కనబడతాడు.

ప్రదక్షిణ పూర్తిచేసి వచ్చిన కుమారస్వామి గజాననుడి గెలుపు అంగీకరించి, గణాదిపత్యం అన్నగారికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆవిధంగా గజాననుడు పార్వతి పరమేశ్వరుల పాదపూజ ద్వారా గణముల అన్నింటికీ అధిపతి అయ్యి, విఘ్నేశ్వరుడుగా పిలవబడతాడు.

మూషికుడు గర్విష్టి అయ్యి బందించిన ఇద్దరి దేవతా జంట కోరిక మేరకు వినాయకుడు వారికి మేలు చేయదలచి, మూషికుడుని యుద్దంలో ఓడిస్తాడు, అప్పుడు మూషికుని భార్య ప్రియంవద భక్తికి మెచ్చిన పార్వతిమాత మూషికుని రక్షిస్తే, జగన్మాత మూషికుని గతజన్మ దేవతలకు వివరించి, మూషికుని వినాయకుడిని శరణువేడమంటే, మూషికుడు వినాయకుడిని శరణువేడి వినాయకుడి పాదాల వద్ద ఎలుకగా ఉంటాడు. అతని భార్య వినాయకునికి చత్రమై భర్త చెంతనే ఉంటుంది. వినాయకుడుకి జగన్మాతకి అభేదంగా చెబుతూ వినాయక విజయం విజయవంతం అవుతుంది.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

తెలుగు చిన్న పిల్లల పేర్లు మొబైల్ యాప్ .

తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్

తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్ చేయండి. తెలుగులో కొన్ని కేటగిరీలలో గల పోస్టులను రీడ్ చేయండి.

శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు

చిన్న పిల్లల తెలుగు పేర్లు గల పేజిలు దర్శించండి. అచ్చ తెలుగులో బాలబాలికల పేర్లు చూడండి. తెలుగులో రెండు, మూడు పదాలతో కూడిన పేర్లు కూడా మీకు ఆ పేజిలలో ఉంటాయి.

బాలుర కొరకు గల తెలుగు పేర్లను ఒక పేజిలో బాలికల కొరకు గల తెలుగు పేర్లను మరొక పేజిలో ఉంటాయి. అచ్చ తెలుగులో మన తెలుగు పేర్లను చూడండి.

ఇంకా ఈ తెలుగు రీడ్స్ బ్లాగులో బుక్స్ గురించి తెలుసుకోవచ్చును. అనేక రకాల తెలుగు ఆన్ లైన్ బుక్స్ మనకు పిడిఎఫ్ రూపంలో లభిస్తాయి.

వాటిని రీడ్ చేయడానికి ఈ బ్లాగుపోస్టులలో గల లింకును క్లిక్ చేసి తెలుగు బుక్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

పురాణాలలో గల తెలుగు బుక్స్ మీరు రీడ్ చేయడానికి ఈ బ్లాగు పోస్టులలో గల లింకుల ద్వారా మీ పరికర నిల్వలోకి దిగుమతి చేయవచ్చును.

తెలుగు పురాణ పుస్తకాలు శ్రీరామాయణం, శ్రీమద్భగవద్గీత, శ్రీమద్భాగవతం, మహాభారతం వంటి బుక్స్ పూర్తిగా పిడిఎఫ్ రూపంలో ఈ బ్లాగులో పోస్ట్ చేయబడిన లింకుల ద్వారా పొందవచ్చును.

పుస్తకం చదవడం మంచి అలవాటు అంటారు. పురాణ పుస్తకాలు చదవడం ఉత్తమమైన అలవాటు అంటారు. పురాణ విజ్ఙాన పుస్తకాలు చదవడం ఉపయుక్తమంటారు. ఎలాగైనా పుస్తకాలు మేలు అంటారు.

భక్తి పుస్తకాలు చదవడం అంటే భక్తి భావనతో మనసు కాసేపు ప్రశాంతతో ఉండడమే… భక్తి బలం కాలంలో కలిసి వస్తుందంటారు. భక్తిబలం స్త్రోత్రపఠనంతో పెరుగుతుందని అంటారు.

బుక్స్ గురించి చాల గొప్పగా చెబుతారు. పుస్తకం నిత్యం వెంట ఉండగలిగే మంచి స్నేహితుడు వంటిది. పుస్తకంలో చదివిన మంచి విషయాలు కష్టకాలంలో ఓ మిత్రుని మాదిరి సాయపడతాయని అంటారు.

మిత్రుడు బాహ్యంగా ఉంటాడు. పుస్తకం ఆంతర్యంలో నిత్యమిత్రుడుగా ఉంటుంది. అటువంటి మిత్రుడు ఎలాంటి పుస్తకాలు చదివితే అలాంటి మిత్రుడు మనమే తయారు చేసుకుంటాం.

స్నేహితుడు మన ప్రవర్తనను తెలిసి ఉండడం వలన, మనకు సరైన సమయంలో మంచి సలహా ఇవ్వగలడు. అలాగే మంచి పుస్తకం చదివే మనసుకు కూడా పుస్తకం ఓ స్నేహితుడులాంటిదే. మనతో ఉండే మిత్రుడు మంచి సలహానే ఇస్తాడు. అలాగే మంచి పుస్తకం ఎప్పుడూ మనసులో మంచి ఆలోచనలనే సృష్టిస్తాయి.

ఇంకా ఒక పుస్తకం మనసును ఒక విషయంపై దృష్టి పెట్టేలాగా చేస్తుంది. పుస్తకంలో ఉండే ప్రధాన లక్షణం ఇదే… ఈ లక్షణం వలన మన మనసు ఏకాగ్రత పెరుగుతుంది.

బుక్స్ గురించి తెలియజేస్తూ, టెక్నాలజీ గురించి, సినిమాల గురించి కూడా పోస్టుల ఉండగలవు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్ చేయండి… ఇందులో గల పేజిలు చూడండి.

అచ్చ తెలుగు పేర్లు తెలుగులో పిల్లల పేర్లు బాయ్ నేమ్స్

అచ్చ తెలుగులో బాలిక తెలుగు పేర్లు గర్ల్ తెలుగు నేమ్స్