సినిమా రంగంలో ఎదగాలనుకునేవారికి చిరంజీవి ఆచార్యగా కనబడతారు. ఎందుకంటే స్వయంకృషితో పైకొచ్చిన హీరో అనగానే చిరంజీవే గుర్తుకువస్తారు.
ప్రాణం ఖరీదు, పున్నమినాగు, కోతలరాయుడు, మంత్రిగారి వియ్యంకుడు అంటూ సినిమా రంగంలో పునాదిరాళ్ళు ఏర్పరచుకుంటూ… అందరి మనసులలో ఖైదీగా మారారు.
గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు, హిట్లర్, మాస్టర్ అంటూ అందరికీ మెగా స్టార్ అయ్యారు. ఎదుగుతున్న హీరోలకు ఆదర్శం అనిపించుకున్నారు.
ఎవరైనా కొత్తగా సినిమా రంగంలోకి వస్తే, అలా వచ్చినవారికి ప్రేరణ ఆచార్య చిరంజీవే అని గర్వంగా చెప్పుకుంటారు.
కధానాయికలకు ఆచార్య చిరంజీవితో జత కట్టడం ఒక కలగా ఉంటుంది. అటువంటి కల నెరవేరి సంతోష పడ్డవారు ఉంటారు.
తెలుగు సినిమా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి… అదే రంగంలో ఎదగాలనుకునేవారికి చిరంజీవి ఆచార్యగా ఉంటారు.
గాడ్ ఫాదర్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చిన చిరంజీవి డైనమిక్ హీరో, డేరింగ్ హీరో, సుప్రీమ్ హీరో అంటూ అభిమానులకు చేరువైనా చిరంజీవి… మెగాస్టార్ గా ప్రజల మనసులో స్తిరంగా నిలిచారు.
తెలుగు సినీ పరిశ్రమలో తన పేరిట ఎన్నో రికార్డులని నెలకొల్పిన చిరంజీవి కొంతకాలం ప్రజాజీవితంలో వచ్చి సినిమాలకు దూరంగా ఉన్నారు. కారణాలు ఏవైనా మరలా సినిమా రంగంలోకి వచ్చి, అదే స్పీడ్ కొనసాగిస్తున్నారు.
ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సైరా నరసింహారెడ్డి సినిమాతో ఇప్పటి హీరోలకు ఛాలెంజ్ విసిరారు. అప్పటి క్రేజ్ ఇప్పటికి అభిమానులలో ఉండడం విశేషం.
ఆచార్య తెలుగు సినిమాలో నటిస్తున్న చిరంజీవి, సినీ రంగంలో ఎదుగుతున్నవారికి ఒక ఆచార్యుడుగానే కనబడతారు. ఒక ఆచార్య సినిమా కాకుండా ఇంకా ఆయన గాడ్ ఫాదర్, భోలా శంకర్ అనే టైటిల్ గల చిత్రాలతో ప్రేక్షకులముందుకు రానున్నట్టు వార్తా విషయం.
ఎప్పుడో పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు సినిమాల నుండి ఇప్పటి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల వరకు చిరంజీవి చరిష్మా పెరుగుతూ… ప్రేక్షకుల మదిలో ఖైదిగా మారిన మెగాస్టార్ బర్త్ డే ఆగస్టు 22… పుట్టిన రోజు సంధర్భంగా మెగా స్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు… ఆచార్య చిరంజీవికి మని మని హ్యాపీ బర్త్ డే…
లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం. ఏదైనా లక్ష్యం సాధించాలంటే, ఆ యొక్క లక్ష్యంపైన సరైన అవగాహనతో పాటు ఏకాగ్రత ముఖ్యం.
ఏదైనా లక్ష్యం ఏర్పాటు అయినప్పుడు, ఆ లక్ష్యం చేరడానికి కృషి, పట్టుదల ప్రధానం. అటువంటి లక్ష్యంపై పట్టుదల పెరగడానికి దానిపై ఉండే అవగాహన మూలం అవుతుంది.
ఎంత అవగాహన ఉంటే అంత త్వరగా లక్ష్య సాధనవైపు మనసు పరుగులు పెడుతుంది.
అయితే లక్ష్యం చాలా సులభంగా కనబడవచ్చు. కానీ అప్పుడు నిర్లక్ష్యం చూపిస్తే, అదే లక్ష్యానికి శత్రువు అవుతుంది. మధ్యలోనే లక్ష్యం చెదిరే అవకాశాలు ఎక్కువ.
ఏర్పరచుకున్న లక్ష్యం చెదిరిపోవడానికి ప్రధాన కారణం. మనసులో లక్ష్యంపై దృష్టితో బాటు ఇతర విషయాలు కూడా ఉండడం.
పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులు రావాలి! అనే లక్ష్యం ఉన్న విద్యార్ధికి టివి చూడడం అనే అలవాటు ఉంటే, అతని మనసులో టివిలోనూ కార్యక్రమములు కనబడుతూ ఉంటాయి.
మరొక విద్యార్ధికి ఆటలంటే ఇష్టం కానీ అతనికి పబ్లిక్ పరీక్షల లక్ష్యం ఉంది. అయితే అటలంటే ఆసక్తి ఉన్న అతని మనసుకు మాత్రం ఆడుకోవడానికి రెడీగా ఉంటుంది.
దేనిపై ఎక్కువ ఆసక్తి ఉంటే దానివైపు మనసు వేగంగా మరలిపోతుంది అంటారు.
మనసులో లక్ష్యం సాధనకు కృషి చేయాలన్న తలంపు బలంగా ఉండాలి!
మరలిపోవడం మనసు యొక్క గుణం అయితే, ఆ గుణాన్ని అదుపు చేయడం యువతకు బలం అవుతుంది. అటువంటి బలం యువత ఎంత పెంచుకుంటే, అంత త్వరగా లక్ష్య సాధనకు మనసులో ఏకాగ్రత ఏర్పడుతుంది.
మన చుట్టూ ఎప్పుడూ అనేక విషయాలు ఉంటూనే ఉంటాయి. అవి మనం పుట్టి పెరిగిన లేక నివసిస్తున్న ప్రాంతం మరియు మిత్రుల బట్టి ఉంటాయి. అయితే మనం పుట్టి పెరిగిన లేక మన మిత్రుల మద్య మనం హీరో కావాలంటే మన మనసుపై మనకు నియంత్రణ ముఖ్యం.
తన చుట్టూ అనేక విషయాలు ఆకట్టుకునే విధంగా ఉంటూ, తన సమయం వృధా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అని ఎవరు విషయాలపై అవగాహనతో ఉంటారో, వారు వ్యక్తులపై ఆగ్రహం తెచ్చుకోరు. విషయాల వ్యాపకం తగ్గించుకోవడంలో జాప్యం చేస్తున్న మనసుపై ఆగ్రహిస్తారని అంటారు.
ఎందుకంటే విషయాలే మనసులో ఉంటాయి. విషయాలే ఆలోచనలకు కారణం అవుతాయి. విజ్ఞాన వేదికగా ఉండాల్సిన మనసు వినోద వేదికగా మారుతుంటే, విజ్ఞులు ఒప్పుకోరు అంటారు.
విజ్ఞానమును వంటబట్టించుకునే సమయంలో ఏర్పడే అవరోధాలకు విషయాలు కారణం అయితే, అటువంటి విషయాలవైపు వెళ్లకుండా ఉండడానికి మనసులో ఏకాగ్రత ముఖ్యం.
ఏకాగ్రతతో ఉండే మనసు తన ముందు ఉన్న పనిని చాలా చాలా చక్కగా చేయగలదని పెద్దలు చెబుతారు. అందుకు ఉదాహరణగా వేకువజామునే చేసే పనులు చెబుతారు.
కాబట్టి అనేక విషయాలు మనసును పట్టుకుని దానిని ఆకర్షించే పనిలో ఉంటాయి. కానీ లక్ష్యం చేరాలంటే వాటిని నియంత్రించాలి. అటువంటి విషయాలను నిరోధించడానికి మనసుకు బలం ఏకాగ్రత. ఏకాగ్రతగా మనసును ఒక విషయం వైపు మరలిస్తే, అది లక్ష్య సాధనకు ఉపయోగపడుతుంది.
నేర్చుకునే వయసులో జీవితానికి ఉపయోగపడే ప్రతి విషయంలోనూ శ్రద్ద చూపుతూ, లక్ష్యాన్ని చెదరగొట్టే విషయాలపై నియంత్రణ కలిగి ఉంటూ ముందుకు సాగాలి…
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి. గాలిలో ప్రయాణం చేస్తూ ఉండే శబ్ధ సంకేతాలను మనకు మాటలు లేక పాటలు రూపంలో వినిపించే సాధనాన్ని రేడియో అంటారు.
విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రయాణం గురించి గతంలో మ్యాక్స్ వెల్, హెర్ట్ జ్ మరియు బ్రాన్లీ వంటివారు ప్రయోగాలు చేస్తే, చివరికి మార్కోని ప్రయోగాల అనంతరం రేడియో ఆవిష్కరణ జరిగినట్టు చరిత్ర చెబుతుంది.
1907 సంవత్సరంలో బ్రిటిష్ నావికాదళంలో ఒక ఓడ నుండి మరొక ఓడకు వారి జాతీయగీతం రేడియో ద్వారా ప్రసారం చేసుకున్నట్టు, 30 మైళ్ళ దూరం రేడియో ప్రసారాలు మార్కోని పంపినట్టు చరిత్ర.
100 వాట్ల సామర్ధ్యం గల రేడియో ప్రసార కేంద్రం 1922 లో లండన్లో స్థాపించబడింది. అటు తరువాయి 1923 మేలో జెకోస్లావేకియాలోనూ అదే సంవత్సరంలో జర్మనీలోను రేడియో ప్రసార కేంద్రాలు స్టాపించబడ్డాయి.
మనదేశంలో రేడియో ప్రసార కేంద్రం అల్ ఇండియా రేడియోగా ఉంది. దీనికి ఆకాశవాణి పేరు ఉంది. ప్రపంచంలో అతి పెద్ద రేడియో వ్యవస్థల్లో ఇది ఒక్కటి.
మన దేశంలో రేడియో ఆకాశవాణి గా పరిచయం
ఆకాశవాణి ప్రసారములలో వ్యవసాయ పనులకు సంభందించిన కార్యక్రమములు ఉండేవి. పంటలగురించి, కొత్తరకాల వంగడాలు, సస్యరక్షణ, వ్యవసాయ పద్ధతులగురించి కార్యక్రమములు రైతులకు సాయపడేవి.
ఇంకా పశు సంరక్షణ, పాడి, పశువులు గురించి రేడియో ప్రసార కార్యక్రమములు రైతులకు చక్కగా వివరించేవారు.
అలాగే వార్తలను శబ్ద రూపంలో ఏరోజూకారోజు సాయం వేళల్లో రేడియో ద్వారా ప్రసారం చేసేవారు. రేడియోకు ముందు వార్తలు కేవలం దినపత్రికల ద్వారా మాత్రమే చదువుకునేవారికి పరిమితం.
కానీ రేడియో వచ్చాక అక్షరజ్ఞానం లేనివారు కూడా వార్తలు వినడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా సమాజంలో జరిగే విశేషాలు దేశంలో ఎక్కువమంది తెలుసుకునే అవకాశం రేడియో ద్వారా ఏర్పడింది.
ప్రజా వినోదార్ధం సంగీత కార్యక్రమాలు, సినిమా పాటల ప్రసారం వంటి వినోదాత్మక ప్రసారాలు రేడియో ద్వారా జరిగేవి.
రేడియో వినోదాత్మక, వివరణాత్మక కార్యక్రమములు పాటల, మాటల రూపంలో ప్రజలను ఆకట్టుకునేవి.
నాటికలు, నాటకాలు, సినిమాలు కూడా మాటల, పాటల రూపంలో ప్రసారాలు ప్రజలను ఆకర్షించేవి.
మొదట్లో పెద్దగా ఉండే రేడియోలు చిన్న పరిణామంలోకి మారి ఎక్కువమందికి రేడియో చేరువైంది.
కాలంలో రేడియో, రేడియో మరియు టేప్ రికార్డర్ గా కూడా అందుబాటులోకి వచ్చింది. టివిలు వచ్చేవరకు రేడియో ప్రసారాలు విశేషంగా ప్రజలను ఆకర్షించేవి.
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం. సమాజంపై ప్రభావం చూపగలిగే వాటిలో వార్తా పత్రికలు ఉంటాయి. మొదట్లో వార్తా పత్రికలే పాలకులకు ప్రజలకు సమాచారం అందించడంలో ముందుండేవి.
టివి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తదితర పరికరాలు వచ్చాక, వార్తలు ప్రచారం పొందడంలో పోటీ పెరిగింది. గతంలో మాత్రం ప్రజలకు వార్తలను అందించడంలో ప్రధాన పాత్ర పత్రికలదే.
ప్రతిదినం ఎన్నో ఇళ్ల ముంగిట్లోకి వార్తలు చేరవేసే ప్రక్రియను వార్తా పత్రికలు చాలాకాలం నుండి మోసుకొస్తున్నాయి. టివి చూసినా సరే, వార్తా పత్రిక చదివితేనే వార్తలు చదివినట్టు ఉండదు అనేవారు కూడా కనబడతారు.
కొందరికి వార్తా పత్రికను చదువుతూ టీ త్రాగే అలవాటు ఉంటుందని అంటారు. వారికి వార్తా పత్రిక చదవకుండా టీ తాగితే, టీ తాగిన తృప్తీ ఉండదనే వారు ఉన్న ఆశ్చర్యపడనవసరం లేదంటారు.
అంటే ప్రతిదినం వార్తా పత్రిక చదవడం కొందరికి ఒక అలవాటుగా మారినట్టే.
ఇక సమాజనికి మీడియా ఒక స్తంభంలాంటిది అయితే, వార్తా పత్రికల ప్రధాన పాత్రను కలిగి ఉండేవి.
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం కల్పించడంతో బాటు, ప్రజా పాలనలోని లోటుపాట్లు, సామాజిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో వార్తా పత్రికలు కధనాలు చాలా కీలకమైనవి.
ఇంకా సమాజంలో ఎక్కడైనా అమానుషం ఘటన జరిగితే, దానిని నలుగురికి తెలిసేలాగా చేస్తూ, అందుకు కారణం అయినవారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టే విధంగా వార్తా పత్రికలలో కధనాలు సాయపడగలవని అంటారు.
ఉద్యమాలకు ఊపిరి పోయాలంటే, వార్తా పత్రికలలో వచ్చే కధనాలు కీలకంగా మారగలవు.
ప్రపంచంలో జరిగే విషయాలను, ప్రజలకు అక్షర రూపంలో చూపించే వ్యవస్థే వార్తా పత్రికలు
అక్షరం ఆయుధం కన్నా పదునైనది అంటారు. అక్షరంలో పలికే భావం, ఒక వ్యక్తిలో చైతన్యం తీసుకురాగలదు. అలాంటి వారిని ఎక్కువమందిని ఒకేసారి చైతన్య పరచగలిగే భావాలు, వార్తా పత్రికల ద్వారానే ప్రజాలలోకి చేరతాయి.
ప్రజలకు అవసరాలు పట్టించుకోకుండా, సామాజిక అభివృద్దిని కాదని ప్రవర్తించే ప్రభుత్వం ఉంటే, అటువంటి ప్రభుత్వ విధానాలను ఎండగట్టగలిగె అక్షర శక్తి వార్తా పత్రికల కధనాలలో కదులుతూ, ప్రజలలో అవగాహన తీసుకురాగలవు.
రాజకీయాలలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఉంటే, ప్రజల పక్షం ఎప్పుడు ఉండేవి వార్తా పత్రికలుగా చెబుతారు. ప్రజా సమస్యలపై కధనాలు వ్రాస్తూ, ప్రభుత్వ అధికారులలో చలనం కలిగించే శక్తి వార్తా పత్రికలకు ఉంటుంది.
నేటి కాలంలో టివిలు, స్మార్ట్ ఫోన్లు అంటూ ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నా, వార్తలను ప్రజలకు అందించడంలో వార్తా పత్రికలు పోటీ పడుతూనే ఉన్నాయి.
ఇంకా వార్తా పత్రిక పఠనం వలన విద్యార్ధులకు జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకా సమాజంపై ఒక అవగాహన కూడా ఏర్పడగలదు.
చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం. చలన చిత్రం అంటే ఆంగ్లంలో సినిమా అంటారు. వెండితెరపై కదిలే బొమ్మలు మాట్లాడుతూ సన్నివేశాలలో పాల్గొంటూ ముగింపుకు వచ్చే కధను తెలియజేసేది సినిమా. మనుషులు నటించిన పాత్రలను తిరిగి అనేకమార్లు తెరపై ప్రదర్శించేవిధంగా తయారు చేసిన ప్రక్రియ చలనచిత్రంగా మారితే, అది అనేకమార్లు ధియేటర్లలో ఇంకా ఓటిటి ద్వారా చిన్న చిన్న తాకే తెరలలో కూడా ప్రదర్శితమవుతుంది. అదే సినిమా….
తెలుగులో మొదటి చలన చిత్రం శబ్దం లేకుండా మూకీ సినిమాగా 1921 లో విడుదల అయ్యిందంటారు. ఆ తరువాత 1950వ దశకంలో అద్బుతమైన తెలుగు సినిమాలు వచ్చాయి.
తెలుగు చలన చిత్రాలు మొదటగా భక్తి భావనను పెంచే విధంగానే సాగాయని అంటారు. బహుశా తెలుగు చలనచిత్రం రాకముందు నుండి కూడా నాటకాలు ఉండేవి. అవి ఎక్కువగా పౌరాణిక నాటకాలు కాబట్టి, అవే కొన్ని నాటకాలు వెండితెరకెక్కాయని అంటారు.
వెండితెరపై వెలుగు వెలిగిన తొలి కధనాయుకులు, కధనాయికలు కూడా భక్తిని పెంపొందించే పాత్రలే పోషించారు. పౌరాణిక పాత్రలతో వెండితెరపై వెలుగు వెలిగారు, అప్పటి నటీనటులు.
అటువంటి తెలుగు భక్తి సినిమాలు బాగా రావడం వలన సమాజంలో భక్తితో కూడిన జ్ణానము ప్రజలకు మరింత చేరువైందని అంటారు. దీనిని బట్టి చలన చిత్రాలు సమాజముపైన బాగా ప్రభావం చూపుతాయని తెలియబడుతుంది.
అంటే ఎటువంటి చలన చిత్రాలు సమాజంలో పెరిగితే, అటువంటి మార్గములో సమాజము గతి ఆధారపడే అవకాశం ఉంటుందని తెలియబడుతుంది.
చలన చిత్రాలు మంచిని మోసికెళ్తే, సమాజంలో మంచి పెరుగుతుంది.
సమాజంలో చలన చిత్రాలు మంచిని చూపించే ప్రయత్నం చేస్తే, సమాజంలో మంచి మరింత పెరుగుతుంది. చెడును అదేపనిగా చూపుతూ ఉంటే, చెడు భావనలు పెరిగే అవకాశం ఉంటుందని అంటారు.
ఎందుకంటే చలన చిత్రాలు మనిషిని ఇట్టే ఆకట్టుకోగలవు. సరైన కధనం కలిగిన కధ అయితే, వ్యక్తి మనసులో దీర్ఘకాలం మెదులుతూనే ఉంటుంది. అంతటి శక్తివంతమైన చలన చిత్రాలు మానవాళికి సందేశాత్మ కధలు అందిచడంలో కూడా ముందుంటున్నాయి. వీటి వలన సమాజనికి మేలు కలుగుతుంటే, సమాజనికి చేటు తెచ్చే కొన్ని రకాల చలన చిత్రాలు కూడా ఉంటున్నాయని అంటారు.
ప్రేక్షకుల దృష్టిని బట్టి చలన చిత్రాలు ఉంటే, ఎటువంటి చలన చిత్రాలు చూస్తున్నామో
ప్రేక్షకుల అభిరుచిని బట్టి చలన చిత్రాలు నిర్మాణం సాగితే, ఎటువంటి చలన చిత్రాలను ప్రేక్షకులు ఆధారిస్తూ ఉంటే, అటువంటి చలన చిత్రాలు నిర్మాణం అవుతూ ఉంటాయి.
సమాజంపై చలన చిత్రాలు మంచి ప్రభావం చూపగలవు. ఆగగాహనా రాహిత్యంతో చేసే ప్రయత్నాల వలన వచ్చే చలన చిత్రాలు సమాజంపై ప్రతికూల ప్రభావం కూడా చూపగలవు అంటారు.
కాబట్టి చలన చిత్రాలు కేవలం వినోదాత్మక దృష్టితోనే కాకుండా, సామాజిక శ్రేయస్సు కూడా దృష్టిలో ఉంచుకుని చలన చిత్రాల నిర్మాణం కొరకు దర్శకనిర్మాతలు ఆలోచన చేయాలి.
ప్రేక్షకులు కూడా కేవలం వినోదం ఉన్న చలనచిత్రాలను కాకుండా, సందేశాత్మక చలన చిత్రాలను ఆధరించడం వలన మరిన్ని సందేశాత్మక చలన చిత్రాలు సమాజంపై మంచి ప్రభావం చూపగలవు… కారణం ప్రేక్షకాధరణే చలన చిత్ర పరిశ్రమ మనుగడ ఆధారపడి ఉంటుంది.
ప్రేక్షకుల దృష్టిని బట్టి దర్శకుని దృష్టి, దర్శకుడు తీసే సినిమాలు ప్రేక్షకుల దృష్టి ప్రభావితం అవుతూ ఉంటాయి.
గ్రంధములకు ఆలవాలమైన స్థలమునకు గ్రంధాలయం అని పేరు. అనేక గ్రంధములు ఈ గ్రంధాలయాలలో ఉంటాయి. గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి. అంటే లైబ్రరీ గురించి తెలుగులో వ్యాసం.
గ్రంధము అంటే పుస్తకము. ఆవహించడానికి అనువుగా ఉండేది. దేవాలయంలో దేవుడు ఆవహించినట్టుగా గ్రంధాలయములో గ్రంధములు ఆవహించు ఉంటాయి. గ్రంధములలో శాస్త్ర పరిజ్ఙానం నిక్షిప్తం అయి ఉంటుంది. ఇక గ్రంధాలయం అంటే పుస్తకాలయం. అంటే పుస్తకములు నిల్వ ఉంచు ప్రదేశముగా చెప్పవచ్చును.
ప్రజల ఉపయోగం కొరకు విజ్ఙాన విషయాలు తెలుసుకోగోరు వారికి, అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి, వాటిని పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయం అని అంటారు.
విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. గ్రంధాలయాలలో లభించు పుస్తకాలు వివిధ విషయాలలో విజ్ఙానమును నిక్షిప్తం చేసుకుని ఉంటాయి.
ఆధునిక పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో తొలి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు అయ్యిందని పరిశోధకులు భావిస్తారు.
చాలా గ్రంధాలయలు మనకు ఉంటున్నాయి. ఇంకా ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజి పెరిగాక ఆన్లైన్ లైబ్రరిలు పెరిగాయి.
వివిధ రకాల తెలుగు బుక్స్ స్టోర్ చేసుకుని, వాటిని చదివే అలవాటు ఉన్నవారికి, చదువుకునే నిమిత్తం బుక్స్ అందిస్తూ, చదువుకోవడం పూర్తయ్యాక వారి వద్ద నుండి బుక్స్ రిటర్న్ తీసుకోవడం… గ్రంధాలయాలలో జరుగుతూ ఉంటుంది.
విజ్నాన విషయాల గురించి వ్రాయబడిన పుస్తకాలు గ్రంధాలయాలలో లభిస్తాయి. ఇంకా వివిధ పాపులర్ రచయితల పుస్తకాలు లభిస్తాయి.
ముఖ్యంగా సామాజిక అంశాలలో వివిధ రచయితల పుస్తకాలు గ్రంధాలయాలలో లభిస్తాయి.
సమాజం చేత కీర్తింపబడ్డ ప్రముఖుల జీవిత చరిత్రలు పుస్తక రూపంలో గ్రంధాలయాలలో లభిస్తాయి.
పుస్తక పఠనం అంటే ఆ పుస్తకంలో వ్రాయబడిన అంశముతో మనసు మమేకం కావడమే అంటారు.
ఏదైనా ఒక వస్తువు తయారీ గురించి వ్రాయబడిన పుస్తకం ఒక వ్యక్తి చదువుతూ ఉంటే, ఆ వస్తువు తయారీ విధానంలో ఆచరించవలసిన విధివిధానాలపై మనసులో ఊహ పుడుతుంది.
తనకంటూ ఒక పూర్తి ఊహాత్మక విధానం తట్టేవరకు మనసు పుస్తములో విషయంపై దృష్టిసారిస్తుంది. అలా పుస్తక పఠనం అంటే మనసు పుస్తకం చదువుతూ ఉన్నంతసేపు ఏకాగ్ర చిత్తంతో ఉంటుంది.
ఇలాగే ఎవరైనా గొప్పవారి జీవిత చరిత్ర చదివినా అక్కడి అప్పటి పరిస్థితులపై మనసు ఊహ ఏర్పరచగలదు. కాబట్టి మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉండడం వలన మనసులో మంచి ఆలోచనలు పెరుగుతాయి.
జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయం ఎంతగానో దోహదపడుతుంది
గ్రంధాలయాలలో అన్నీ రకాల విజ్ఞాన పుస్తకాలు లభిస్తాయి.
ఏదైనా ఒక వస్తువు తయారీ విధానం గురించి పుస్తక రూపంలో ఉంటే అది గ్రంధాలయంలో ఉండవచ్చు.
ఎవరైనా గొప్ప వ్యక్తి గురించి పుస్తకం వ్రాయబడి ఉంటే, అది కూడా గ్రంధాలయంలో లభించే అవకాశం ఉంటుంది.
గతంలో జరిగిన సామాజిక చరిత్ర గురించి పుస్తకాల రూపంలో గ్రంధాలయాలలో లభిస్తుంది.
సామాజిక, తాత్విక, వేదాంత విజ్ఞానము, పిల్లల పెంపకం, పిల్లల పేర్లు, వ్యవస్థ, వ్యవస్థ విధి విధానాలు ఇలా ఎన్నో రకాల అంశాలలో పుస్తకాలు ఉంటే, అవి గ్రంధాలయంలో లభించే అవకాశం ఉంటుంది.
తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి గ్రంధాలయం ఒక విజ్ఞాన కూడలి అవుతుంది. విజ్ఙాన వేదికలు అన్నీ అక్షరరూపంలోకి మారితే, అవి గ్రంధాలయములలో అల్మారాలలో నిక్షిప్తం అయి ఉంటాయి.
తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ వ్రాయడం గురించి….
లేఖ వ్రాసేటప్పుడు మొదటగా టాప్ రైట్ కార్నర్లో డేట్, దాని క్రిందగా ప్లేస్ వ్రాస్తాము. ఆ తరువాత ఉత్తరం వ్రాసే వ్యక్తి పేరు, ఆ వ్యక్తి చిరునామ వ్రాస్తాము.
ఇంకా క్రిందగా ఉత్తరం ఎవరికి వ్రాస్తున్నామో వారి హోదాను బట్టి, వారిని సంభోదిస్తాము.
మిత్రుడుకి లెటర్ వ్రాస్తున్నాము కాబట్టి ప్రియమైన స్నేహితుడా…. లేదా
ప్రియనేస్తమా లేకా ప్రియమిత్రమా… అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ లేఖ వ్రాయడం మొదలు పెడతాము.
తేదీ: 01.08.2021,
విజయవాడ
మొదటగా తారీఖు, ప్రాంతము వ్రాసాము… ఇప్పుడు మిత్రుని పేరు, చిరునామా…
మీ మిత్రుని పేరు,
మిత్రుని నివాస వీధి,
మిత్రుని ఊరు, మండలం, జిల్లా,
మిత్రుని స్టేట్ - పిన్ కోడె.
ఇప్పుడు మిత్రుడిని సంభోదిస్తూ…. లేఖను వ్రాయడం….
ప్రియ నేస్తమా...
నీవు అచ్చట కుశలమా.... నేను ఇచ్చట కుశలము. అంటూ కుశల ప్రశ్నలతో మొదలు పెట్టి... పండుగ గురించి వ్రాయాలి. పండుగ విశిష్టత, పండుగను మీ ఊరిలో ఏవిధంగా జరుపుకుంటారు. పండుగలో ప్రధాన ఆకర్షణలు ఏమిటి తెలియజేస్తూ... పండుగ ప్రభావం మీపై ఎలా ఉంటుందో తెలియజేస్తూ... లేఖ కొనసాగించాలి. తరువాత పండుగకు మిత్రుని ఆహ్వానిస్తూ', లేఖను కొనసాగించవచ్చు.
దీపావళి, సంక్రాంతి, దసరా, వినాయక చవితి తదితర పండుగలు పల్లెటూళ్లలో బాగా జరుగుతాయి. అలాగే పట్టణాలలోనూ బాగా జారుగుతాయి.
ఎప్పుడూ ఓకే లాగా కాకుండా మార్పు కోరే మనసుకు మరొకచోట జరిగే పండుగలపై కూడా ఆసక్తి ఉంటుంది. కాబట్టి పల్లెటూల్లో ఉండేవారికి పట్టణం వాతావరణంపై, పట్టణంలో ఉండేవారికి పల్లెటూరిపై ఆసక్తి ఉంటుంది.
కావున పండుగ గురించి మీ మీ ప్రాంతాలలో ఎలా చేస్తారో… అందులో విశేషాలు ఏమిటో తెలియాయజేయడం. ఇంకా ఆ పండుగలో ఎలా పాల్గొంటున్నది… తెలియజేస్తూ… మిత్రుడికి ఆహ్వాన లేఖను ముగించడం….
ఓయ్ మిత్రమా నీవు మా ఊరిలో పండుగను చూడాలి... నీకు ఇదే నా ఆహ్వానం... నీవు, నీ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని, మా ఊరికి రావాలి.
తప్పకుండా నీవు పండుగకు మా ఊరికి వస్తావని ఆశిస్తూ... నీనేస్తం...
ఇట్లు,
ప్రియ మిత్రుడు
మీ పేరు.
ఈ విధంగా తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ వ్రాయవచ్చు.
అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ వ్రాయమని అంటే ఎలా వ్రాయాలి.
ముందుగా లేఖ ఎవరు ఎవరికి వ్రాయాలి?
విద్యార్ధి అయితే, స్కూల్ ప్రిన్సిపల్ కు ఉద్యోగి అయితే తన పై అధికారికి సెలవు ధరఖాస్తు పెట్టుకుంటారు.
ఇప్పుడు ఒక విధ్యార్ధి స్కూల్ హెడ్ మాస్టర్ కు లేఖ వ్రాయాలంటే, ఎలా వ్రాయాలి?
మొదటగా సెలవు ధరఖాస్తు అంటే ఆంగ్లంలో అయితే లీవ్ లెటర్ అంటూ హెడ్డింగ్ పేపర్ పైభాగంలో వ్రాయాలి.
ఆ తరువాత స్కూల్ ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ ను సంభోదిస్తు, స్కూల్ పేరు, స్కూల్ అడ్రసు రాయాలి. అభ్యర్ధనగా తిరిగి సంభోదిస్తూ, సెలవు ధరఖాస్తు వ్రాయడం మొదలు పెట్టాలి.
సాధారణంగా తెలుగులో అయితే అయ్యా, అని సంభోదిస్తారు. ఆంగ్లంలో అయితే సర్ అని సంభోదిస్తారు.
సెలవు ధరఖాస్తు వ్రాస్తున్న విధ్యార్ధి తన పేరు, తన రోల్ నెంబర్, తన తరగతి తెలియజేస్తూ, ఆపై తనకు సెలవు కారణం వ్రాయాలి. కారణం వ్రాశాక అందుకు ప్రాతిపదికను కూడా తెలియ పర్చాలి.
విద్యార్ధికి అనారోగ్యం అయితే, అది ఎప్పటి నుండో తెలియజేస్తూ, వైధ్యుని సలహా మేరకు లేదా తండ్రి సలహా మేరకు స్కూల్ సెలవు అడుగుతున్నట్టుగా వ్రాయాలి.
సెలవు కోసం వివరం తెలియజేశాక, ఏ తేదీ నుండి ఏ తేదీవరకు సెలవు అవసరమో తెలియాయజేయాలి. తరువాత ధన్యవాదలు తెలుపుతూ లెటర్ పూర్తి చేయాలి.
చివరగా ఇట్లు, భవదీయుడు అంటూ మీ పేరు వ్రాసి, సంతకం చేయాలి.
నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే నిర్మల మనసుతో భగవంతుడిని చేరడానికి చేసే ప్రయత్నం అంటారు.
అసలు నిర్మల అంటే మాలిన్యం లేనిది అయితే నిర్మల మనసు అంటే మనసులో మలినం లేకుండా ఉండడం.
మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే, అందులో ఉన్న మలినం, అందులో ఉండే మంచి గుణాలు తెలియబడతాయని అంటారు.
అంతేకానీ ప్రశాంతత లేని మనసులో తన గురించిన ఆలోచన కన్నా ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.
స్వీయ పరిశీలన వలన మనసు శాంతితో ఉండవచ్చు అంతే, స్వీయ పరిశీలనకు కూడా ఆలంబన భక్తి అంటారు.
ఎందుకంటే ముందు మనసు లోకంలో ఉండే విషయాల గురించి ఆలోచన చేయడం భాగా అలవాటు అయ్యి, అటువంటి ఆలోచనలతో స్వీయ పరిశీలనకు ఆస్కారం లేకుండా చేసుకుంటుంది.
బహుశా అందుకేనోమో భగవానుడు వివిధ రూపాలలో అవతరించి లోకరీతిలో భక్తుడి మనసులోకి వెళ్ళేవిధంగా కనబడతాడేమో?
మనసు ముందుగా తనపై తన పరిశీలన చేయడానికి అంగీకరించదు… కాబట్టి ఒక జడ్జి మనసులోకి రావాలి. ఆత్మ స్వరూపుడైన ఈశ్వరుని మనసులో జడ్జిగా నియమించుకుంటే, స్వీయ పరిశీలనకు మనసుకు మార్గం లభిస్తుందని అంటారు.
భగవంతుడు ముందు మనసులోకి వచ్చాడనే ఎరుకను మనసు కలిగి ఉంటే, తన లోపల ఒకరికి జవాబుదారీ అనే ఆలోచన మనసు చేయగలదు.
కానీ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు… ఇప్పుడు అది కాదు ముఖ్యం అనుకుంటే, భగవంతుడు లోపలే ఉన్నాడనే ఎరుక మనసు కలిగి ఉండదు.
ఒకసారి భగవంతుడు మనసులోనే ఉన్నాడు. మనసుకు ఆధారమైన అత్మే భగవానుడు… అని గ్రహిస్తే, మనసు తాను చేస్తున్న కర్మలలో విచక్షణ కోల్పోదు అని అంటారు.
చేస్తున్న కర్మలకు ఒకడు అధికారి లోపాలే ఉన్నాడనే భావన, మనసుని తప్పు చేయనివ్వదని అంటారు.
అలా జడ్జిగా మనసులో ఉన్న భగవానుడు, మనసుని శుద్ది చేయడం మొదలైతే చిత్తశుద్ది ఏర్పడి, మనసు నిర్మలం కావడానికి కారణం కాగలదని అంటారు.
నిర్మల భక్తి అంతే ఏమిటో అని ఆలోచన చేస్తూ, కాలం వృధా చేయడం కంటే, ఆత్మస్వరూపుడైన భగవానుడిని ఇష్టదేవత రూపంలో నిత్యస్మరణ శ్రేయష్కారం అంటారు.
మనసు శాంతిగా ఆలోచన చేయడానికి అలవాటుపడితే, ప్రశాంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటారు.
ప్రశాంతమైన ఆలోచనలు కలిగిన మనసు నిర్మల మనస్తత్వంతో మనగలగుతుంది. ప్రశాంతమైన ఆలోచన పరమాత్మ స్వరూపం గురించిన ఆలోచన మనసుతోనే ఉంటుందని అంటారు..
ఏది ఏమిటి అను తెలుసుకునే ఆలోచన సందేహాలకు తావు ఇస్తూ ఉంటే, ఒక్కడు ఉన్నాడు. వాడు అధికారి అనే ఆలోచన మనసును సరి అయిన దారిలో పెట్టవచ్చని అంటారు.
డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగంతెలుగు వ్యాసం. స్మార్ట్ ఫోన్ వాడుక పెరిగాక డిజిటల్ చెల్లింపులు అధికమయ్యాయి.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుక విధానం చాల సులభంగా మారింది. కేవల అక్షర జ్ఞానం ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ వాడుక చాల తేలిక. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ భాష ప్రాంతీయ భాషలలోకి మార్చుకోవచ్చు.
సాధారణంగా అయితే కరెంట్ బిల్లులు వంటి నెలవారీ చెల్లింపులు క్యూలో నిలబడి కట్టుకునేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వలన ఆన్ లైన్ చెల్లింపులు సులభతరం అయ్యాయి. పేమెంట్ వాలేట్స్ అందుకు బాగా సహకరిస్తున్నాయి. ఎవరికైనా మని పంపాలంటే మనియార్డర్ లేదా బ్యాంకు నుండి లావాదేవీలు నిర్వహించవలసి ఉండేది.
అయితే స్మార్ట్ ఫోన్, టాబ్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడుక పెరగడంతో బ్యాంకర్లు ఆన్ లైన్ బ్యాంకింగ్ బాగా ప్రోత్సహించడంతో లావాదేవిలు కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా జరుతున్నాయి.
పేమెంట్ వాల్లెట్లు వచ్చాక చెల్లింపులు కేవలం ఫోన్ నెంబర్ ఆధారంగా జరగడం ఎక్కువ అయ్యింది. పేటీయం, ఫోన్ పే, జిపే వంటి పేమెంట్ వాల్లెట్లు ప్రజలు బాగా వాడుతున్నారు.
ఇలా స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లింపులు పెరిగి, నగదు లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి.
నగదు లావాదేవీలలో చొర భయం ఉంటుంది.
ఇంకా నగదు లావాదేవిలలో రశీదు కీలకం. నగదు రశీదు వలన నగదు ముట్టినట్టు లేదా ముట్టనట్టుగా పరిగణిస్తారు.
కానీ డిజిటల్ చెల్లింపులు నేరుగా ఖాతాదారుని ఖాతాకు జమ అవ్వడంతో దానికి డిజిటల్ ప్రూఫ్ ఉంటుంది. బౌతికంగా రశీదుతో పని ఉండదు.
అయితే డిజిటల్ చెల్లింపులు చేయడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ఉన్నవారికే డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.
బ్యాంకు ఖాతా లేనివారికి మాత్రం డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ లేద టాబ్ వంటి పరికరాలతో పేమెంట్ చెల్లింపులు చేయలేరు.
ఏదైనా ఒక జాతీయ బ్యాంక్ ఖాతాతో, సులభంగా యూపిఐ ద్వారా పేమెంట్ వాలెట్స్ లో నమోదు చేసుకుంటూ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి.
ఇక ముందు మన దేశంలో కూడా ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ వచ్చే అవకాశం ఉంది.
కనీస అక్షర జ్నానమ్ కలిగినవారు, తమ ఆర్ధిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ మనదేశంలో అమలు అయితే ఎక్కువమంది డిజిటల్ కరెన్సీ ఉపయోగించే అవకాశం ఉంటుంది.
అప్పుడు నగదు చెల్లింపులు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది.
డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం వలన పెరుగుతూ నగదు లావాదేవీలను కట్టడి చేశాయని భావిస్తారు.
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం తెలుగులో….
నాయకుడు ప్రజల మధ్యలోనే ఉంటాడు. ప్రజా సమస్య నుండి, దాని సాధించడానికి ప్రజల మధ్య నుండే నాయకత్వం ఉదయిస్తుందని అంటారు.
నాయకత్వం వహించేవారు పెత్తనం చేయాలనే తపన కాదు… నాయకత్వం అంటే సమస్యను పరిష్కరించుకోవడంలో తను ముందుండి అందరికీ మార్గదర్శకంగా నిలబడడం అంటారు.
కొందరు నాయకత్వం లక్షణాలు ఉన్నవారిలో అజమాయిషీ అనే ఆలోచన ఉండదు… వారిలో లక్ష్యాన్ని సాధించాలనే ఉండే పట్టుదల, లక్ష్యసాధనకు వారు చేసే కృషివలన అందరూ ఆ నాయకత్వమును అంగీకరిస్తారని అంటారు.
ఏదైనా నాయకత్వం అంటే ఇలా నాయకత్వ లక్షణాలు…
ఒక సమూహానికి లేక ఒక ప్రాంతవాసులకు ఒక వర్గమువారికి సంబంధించిన ఒక ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి చిన్న చిన్న లక్ష్యాలు నిర్ధేశిస్తూ, వాటి అమలుకు సహచరులు సలహాలు, తీసుకుంటూ అనుచరులను కలుపుకుంటూ ఒక వ్యక్తి అందరి మద్దతుతో ముందుకెళ్ళే ఒకా సాంఘిక ప్రక్రియ ప్రభావంతంగా సాగుతుంటే నాయకత్వంగా చెబుతారు.
పెద్ద లక్ష్యాన్ని చేధించడానికి అడ్డు వచ్చే సమస్యలపై పోరాడుతూ, పెద్ద లక్ష్యంవైపు నుండి అందరి దృష్టి మరలిపోకుండా చూసుకోవడంలో నాయకత్వ ప్రభావం కనబడుతుంది. ఇక ఆ లక్ష్యం చేరేవరకు సరైన ప్రణాళిక రచనా చేస్తూ, ఆ ప్రణాళికను అమలుచేయడంలో నిశ్చయాత్మక బుడ్డితో వ్యవహరించేవారు లక్ష్యంవైపు అనుచరలను నడిపించడంలో మార్గదర్శకంగా ఉంటారు.
సహచరులను కలుపుకుంటూ, సాంఘికంగా తమ లక్ష్యం యొక్క అవశ్యకతను తమ ప్రాంతంలో లేక తమ వర్గంలో ఉన్న అందరికీ అర్ధం అయ్యేలాగా తెలియజేస్తూ, లక్ష్య సాధనకోసం అందరిలో ప్రేరణ కలిగించే విధంగా మాట్లాడగలగడం నాయకత్వ లక్షణాలలో ప్రధానమైనదిగా చెబుతారు.
ముందుగా ఒక సామాజిక లేదా ప్రాంత లేదా వర్గము యొక్క లక్ష్యం సాధించాలంటే, ఒక్కరి వలన కాదు సమిష్టిగానే సాధించవలసి ఉంటుందని నాయకుడు గుర్తిస్తాడు. అందుకోసం అందరినీ సమిష్టిగా కలిసి తమ లక్ష్యం సాధించుకోవలసిన అవశ్యకతను తెలియజేస్తూ ఉంటాడు.
పరిస్థితులు ఆకళింపు చేసుకోవడం
వ్యక్తి యొక్క తెలివి, పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం, సాధ్యాసాధ్యాలు అంచనా వేయడం, భవిష్యత్తుపై అవగాహన, ధృఢమైన సంకల్పం, పట్టుదల, ధైర్యంగా మాట్లాడగలగడం, కొత్త కొత్త విషయాలను ఆహ్వానించగలగడం, శ్రేయస్సు కోసం పాటుపడే తత్వం, వ్యక్తిగత నియంత్రణ, వ్యక్తిగత ప్రవర్తన మొదలైన లక్షణాలు నాయుకునికి లేదా నాయకురాలికి ఉంటాయని అంటారు.
ప్రధానంగా నాయుకుడు లేదా నాయకురాలుకి ఉండవలసిన లక్షణం అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకోగలగడం…. ఆలోచన విధానం అందరినీ ఆలోచింపజేసెదిగా ఉండాలి అని అంటారు.
లక్ష్యంపై పూర్తి అవగాహన ఉండడం, సామాజికపరమైన అవగాహన, సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళిక రచన చేస్తూ, తమ లక్ష్యా సాధనకు కృషి చేయడం, అందరినీ ఆ యొక్క లక్ష్యంవైపుకు నడిపించడం.
లక్ష్యసాధనకు అందరిలోనూ స్పూర్తిని అంధించే కార్యక్రమాలు చేపట్టడం తదితర లక్షణాలు నాయకత్వ లక్షణాలుగా చెబుతారు.
చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే, శాస్త్ర ప్రకారం పెట్టుకున్న పేరు ప్రభావం ? పిల్లలకు పేరు పెట్టేటప్పుడు పంతులుగారికి పుట్టుక సమయం, తేదీ అందించి, వివరాలు అడిగి పేరు ఎంపిక చేస్తాం. కానీ పిల్లలకు మాత్రం చిట్టి చిట్టి పేర్లకు పలికే విధంగా అలవాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా చిట్టి పొట్టి పేర్లతో పిల్లలను పిలుచుకునేటప్పుడు శాస్త్రప్రకారం నామకరణం చేయడం ఎందుకు అనే ప్రశ్న ఉదయించకమానదు. బాబుకు కానీ పాపకు కానీ పేరు పెట్టే సమయంలో మంచి చెడు ఆలోచించి పేరు పెట్టేవారు… వారిని పిలవడంలో మాత్రం ముద్దుపేరు అంటూ మరొక పేరుతో పిలవడం కొందరు చేస్తూ ఉంటారు. చింటూ…, బంటూ… కిట్టు… అంటూ చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే, వారు ఆపేరుకే పలకడం అలవాటుపడతారు. ఇక ఎప్పటికీ ఆపేరుకే పలుకుతూ ఉంటారు. అసలు పేరు ఎందుకు పెడతారు అంటే, చిన్నారికి ఒక గుర్తింపు అలవాటు చేయడంతో బాటు… చిన్నారి కర్మ ప్రభావం బట్టి ఏ దైవ నామంతో పిలిస్తే, చిన్నారి కర్మప్రభావం బాగుంటుందని పండితులు సూచిస్తారో అటువంటి దైవనామం పేరు ప్రారంభంలో ఉండేలాగా పేరు పెడతారు. ఎక్కువగా నక్షత్ర పాదం బట్టి మొదటి అక్షరం ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ నక్షత్రం లేక ఆ నక్షత్ర అధిదేవత లేక ఆ రాశి అధిదేవతకు ప్రీతికరమైన అక్షరశబ్ధం ఉండవచ్చు.
పెద్దలు ఎప్పుడు పిల్లల శ్రేయస్సు కోరి పిల్లల యోగక్షేమాలు చూస్తూ ఉంటారు. కాబట్టి చిట్టి పొట్టి పేర్లకు చిన్నారులను పలికే విధంగా కాకుండా వారి నక్షత్ర లేక గ్రహబలం బట్టి పెట్టే పేరుకు వారిని పలకడం అలవాటు చేయాలని అంటారు.
పిల్లల పేర్లు పెట్టేది వారి శ్రేయస్సు కొరకు అయినప్పుడు, వారి శ్రేయస్సు కోసం వారి నక్షత్ర బలం పెరిగే విధంగా పెద్దలు పెట్టిన పేరుతో పిలవడం శ్రేయస్కరం అంటారు.
ముద్దు పేరుతో పిలిచినా, అసలు పేరుకే పలకడం పిల్లలకు అలవాటు చేయాలి… కానీ ముద్దు పేరు అసలు పేరును మరిపించేలా ముద్దు పేరుతో పిలవడం వలన నామకరణ ప్రక్రియ అనవసరం అని అంటారు.
చిట్టి పొట్టి పేర్లతో పిలవకుండా సార్ధక నామముతో పిల్లలను పిలవడం మొదలు పెడితే, వారు ఆ పేరుకే పలకడం అలవాటుగా మారుతుంది.
భక్తి భావన బలపడడంలో ప్రధాన పత్రం చిత్తం పోషిస్తే, అటువంటి చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిదిగా ఉంటుంది.
వ్యక్తి జీవితం యొక్క భక్తి మార్గములో మనసు చాలా ప్రధానమైనది. అది ఎటు తిరిగితే, జీవనగతి అటే ఉంటుంది.
అటువంటి మనసుపై ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి.
ఒక వ్యవస్థలో వ్యక్తి చుట్టూ పరిసరాల నుండి చేరే ప్రాపంచిక విషయాలు మనసుకు అలవాటుగా మారతాయి.
జీవనంలో వ్యక్తి మనసులోకి ప్రవేశించిన అనేక విషయాల్లో కొన్నింటిపై మనసు మమకారం పెంచుకుంటుంది.
అలా మనసులో మమకారం పెరగడంలో ప్రధాన పాత్ర పోషించేది చిత్తం అంటారు.
చిత్తం మనసు యొక్క భావనలలో పొందిన అనుభవాలను జ్నప్తికి తెస్తుందని అంటారు.
చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది. అంటే ఆన్ లైన్ హిస్టరీకి సంబంధించిన అంశాలలోనే మనం ఆన్ లైన్లోకి వెళ్ళిన ప్రతిసారి విషయాలు కనబడుతూ ఉంటాయి.
మన ఫోనులో జోడించబడిన ఉన్న మెయిల్ ఐడి ఆధారంగా మన ఫోనులో ఆన్ లైన్ సెర్చ్ హిస్టరీ సేకరించబడుతూ ఉంటుంది. ఆ ఈమెయిల్ ఎక్కడ ఓపెన్ చేసిన ఆ హిస్టరీకి సంబంధించిన విషయాలే కనబడుతూ ఉంటాయి.
యూట్యూబ్ ఖాతాకు జిమెయిల్ ఆధారంగా యూట్యూబ్ వీడియో హిస్టరీ కూడా ఆన్ లైన్లో సేవ్ అవుతుంది.
మరొక పరికరంలో జిమెయిల్ ఖాతా ఓపెన్ చేస్తే, మన ఫోనులో కనబడే వీడియోలే కనబడతాయి. గతంలో చూసిన అంశాలలో వీడియోలు కనబడుతూ ఉంటాయి.
యూట్యూబ్ కానీ ఫేస్ బుక్ కానీ గతంలో లైక్ చేసినవి లేక వాచ్ చేసినవి… ఆయా అంశాలలో పాపులర్ థింగ్స్ మనకు చూపుతూ ఉంటాయి… అలా చూపడానికి ప్రధాన ఆధారం ఆన్లైన్ హిస్టరీ.
అటువంటి ఆన్లైన్ హిస్టరీ డిలీట్ చేయాలంటే జిమెయిల్ ఖాతా అడ్మిన్ సెటింగ్స్ లో హిస్టరీ డిలీట్ చేయాలి….
అలాగే చిత్తము యొక్క చరిత్రను రూపుమాపలంటే ఆత్మ అనే అడ్మిన్ దగ్గర మనసు నిలబడాలి.
మనసు అటువంటి ఆత్మ దగ్గర నిలబడడానికి భక్తి ఒక మంచి మార్గం అని సులభమైన మార్గమని అంటారు.
ముఖ్యంగా చిత్తశుద్దికి భక్తిమార్గం మేలైన మార్గంగా పెద్దలు చెబుతూ ఉంటారు.
భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని, భాగవతము భగవంతునిపై అచంచల విశ్వాసము కలిగిన భక్తుల గురించి, భగవంతుడి గురించి తెలియజేస్తుంది.
రోజు మంచిమాటలు వింటూ నిద్రిస్తూ ఉంటే, మనసు భగవంతుడిపైకి మరలుతుందని దృతరాష్ట్రుడి నిష్క్రమణ తెలియజేస్తుంది.
సకలభోగాలు అనుభవించిన పాండవులు, కృష్ణనిర్యాణం కాగానే సర్వము త్వజించి ఉత్తరదిక్కుకు ప్రయాణం చేసే విధానం, భోగాలపై మనసులో వైరగ్యా అవసరాన్ని తెలియజేస్తుంది.
శివుని గురించి చెబుతుంది. లోకాలను రక్షించడం కోసం విషమును కంఠమునందే నిలుపుకున్న పరమేశ్వరుడి గురించి భాగవతం తెలియజేస్తుంది.
పశువులకు కూడా భక్తి ఉంటుందని… పశువులు కూడా భగవంతుడి అనుగ్రహం పొందగలవని గజేంద్రమోక్షం తెలియజేస్తుంది.
త్రాగు నీటిని పాడు చేస్తూ, అమాయకులైన ప్రజలను భక్షిస్తే, భగవంతుడు శిక్షిస్తాడని కాళీయమర్ధనం తెలియజేస్తూ ఉంటుంది.
భగవంతుడి లీలలను చూపుతూ భగవంతుడిపై ఆరాధన పెంచే క్రమంలో భాగవతం ఒక తీపి పదార్ధం వంటిది అంటారు.
మనసుకు బాగా నచ్చిన విషయంలో, అది బాగా స్పందిస్తుందని మనోవేత్తలు చెబుతారు. అలా మనసుకు బాగా నచ్చే విధంగా భగవంతుడు గురించి చెప్పడమే శాస్త్రం పని అయితే, అది భాగవతములో పుష్కలంగా ఉందని అంటారు.
త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మఅయితే ముగ్గురిగా మనిషి అంతర్గతంలో ఉంటాడు…
కానీ ఒక్కటే అనే భావం బలపడడానికి మాత్రం మనసే కదలాలని అంటారు.
శివుడు – లయకారుడు
విష్ణువు – స్థితికారుడు
బ్రహ్మ – సృష్టికర్త
తమోగుణం
రజోగుణం
సత్వగుణం
శివుడు లయకారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.
విష్ణువు స్థితికారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.
బ్రహ్మ సృష్టికర్త కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.
అంటే త్రిమూర్తులకు మూలం పరబ్రహ్మమని అంటారు.
అలాగే త్రిమూర్తులకు భార్యలు
శివుడుకి భార్య పార్వతి, విష్ణువుకి భార్య లక్ష్మి, బ్రహ్మకు భార్య సరస్వతి.
ముగ్గురమ్మలకు మూలం పరబ్రహ్మమనే అంటారు.
ఎలా చెప్పినా ఏం చెప్పిన ఈ త్రిమూర్తి తత్వం ప్రధానంగా ప్రస్తావిస్తూ భగవంతుడి లీలలు, సుగుణాలు గురించి చెబుతూ ఉంటారు.
సృష్టి ప్రారంభం బ్రహ్మ చేస్తే, బ్రహ్మకు మూలం విష్ణువు అని వైష్ణవులు, శివుడు అని శైవులు అంటూ ఉంటారు. అందుకు తగినట్టుగానే పురాణాలు ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు.
అయితే ఏనాడో ప్రారంభం అయిన సృష్టిలో మనం ఎప్పటివారమో మనకూ తెలియదు….
ప్రారబ్దం వలన పుట్టుక ఉంటే, ఆ ప్రారాబ్దానికి కారణం ఏనాటిదో ఈనాడు తెలియడం కష్టమే కానీ ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం చేయడమే శ్రేయస్కరం అని పెద్దలు అంటూ ఉంటారు.
ఏనాడో ఓనాడు పుణ్యకర్మ, ఎప్పుడో ఒకప్పుడు పాపకర్మ ఈజన్మలో ప్రారబ్ధం అయితే, అప్పటి పాపపుణ్యాలు భగవంతుడికి వదిలి ఇప్పటి కర్తవ్య నిర్వహణకు మనసుని ప్రిపేర్ చేయడానికి భక్తిమార్గం ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు.
త్రిమూర్తులలో త్రిమూర్తి తత్వం ఉంటుంది. ఒకరిలో ఒక తత్వమే చూడడం అవివేకం అంటారు. ముగ్గురికి ఒకరే యజమాని అయినప్పుడు… ఒకరిలో మూడు తత్వాలు ఉంటాయనేది పెద్దల సూచన.
విష్ణువు ఒక మనిషిగా పుడితే, ఆ మనిషికి కోపం వస్తే, చెడుని శిక్షించే క్రమలో లయకారుడు అయితే, అదే సమయంలో శిష్టరక్షణ చేసే స్థితికారుడుగా కూడా… సృష్టికి స్థితికి లయకి ఒకదానికొకటి అవినాభావ సంభందం ఉన్నప్పుడూ… త్రిమూర్తులు, ముగ్గురమ్మలు ఒక్కటే అవుతారు.
ఎక్కువ ఆలోచనలు గందరగోళం అయితే ఒకే ఆలోచన సాధనకు సాకారం అవుతుంది.
భిన్నాభిప్రాయాలు గల మనసులో శాంతి తక్కువ అయితే, ఏకాభిప్రాయం ఉండే మనిషిలో అశాంతి తక్కువ!
అలాంటి మనసుకు బలాన్నిచ్చే భక్తిలో భిన్నాభిప్రాయాలను కలిగి ఉండడం కన్నా ఏకాభిప్రాయంతో సాగడమే ఎవరికివారు శ్రేయస్కులుగా మారతారు.
త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం ఈ కోణంలో భక్తిభావనలు మనసుకు మేలు చేస్తాయని పండితుల ఉవాచ.
త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మఅయితే ముగ్గురిగా మనిషి అంతర్గతంలో ఉంటే, మనసు మాత్రం తనలో ఉండే భిన్నాభిప్రాయాలతో ఏకాభిప్రాయం సాధించాలని చెబుతారు.
అందుకు పురాణశ్రవణం, పురాణపఠనం, సద్విచారణ సాయపడతాయని అంటారు.
తెలుసుకుంటే సాధించాలనే తపన ఉండే మనసుకు పురాణాలు పరమర్ధాన్ని అందిస్తాయని చెబుతారు.
తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన మంచి ఫలితం ఇస్తుందని అంటారు. స్కూల్ కు వెళ్ళే బాలబాలికలను తెల్లవారు జామునే చాడువుకోమన్నట్టుగా…
స్కూల్ కు వెళ్ళే ఒక పిల్లవాడు ఎంత శ్రద్ద పెడితే, అన్ని మార్కులు పరిక్షలలో సాధించగలడు. అటువంటి పిల్లవానికి ఏకాగ్రత కోసం తెల్లవారు జాములో చదువుకోమని పెద్దలు చెప్పేవారు.
అంటే భగవంతుడి విషయంలో కూడా స్కూల్ పిల్లవాని వలె భక్తునికి శ్రద్ద అవసరం అనుకుంటా…
అందుకే స్కూల్ పిల్లవానిని చాడువుకోమన్నట్టుగా తెల్లవారుజామునే భగవంతుడిని ప్రశాంత చిత్తంతో ప్రార్ధన చేయమంటారు.
అవును శ్రద్ధ వలననే ఒక పిల్లవాడు పుస్తకంలోని విషయం గ్రహిస్తున్నాడు. విషయసారం గ్రహింఛి కొత్త విషయం కనుగోనడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అలాగే భక్తుడు కూడా భగవంతుడిపై శ్రద్ద పెడితే, భగవతత్వం మనసులోకి వచ్చేస్తుందేమో?
మరి భగవంతుడిపై శ్రద్ద పెట్టె ఆసక్తి మనసులో కలగాలంటే, దానికి ఆలంబన కోసం పురాణ పుస్తకాలూ చదవడం లేక పురాణ ప్రవచనాలు వినడం చేయమంటారు.
పురాణాలు చదవకపోయినా ప్రతిరోజు ఈశ్వరుని పూజ చేస్తూ ఉండాలని అంటారు.
కష్టాలలో ఉన్నవారికి సాయం చేస్తూ, ఆ సాయం ఈశ్వరునికి అర్పించేవారు ఉంటారు.
ప్రతి పనిలోనూ ఈశ్వరుని చూడడం ప్రధానమని అంటారు.
ఈశ్వర సంభందంగా జీవనం సాగించేవారిని ఆ ఈశ్వరుడే రక్షణ చేస్తాడని అంటారు. అయితే ఈశ్వరుడు చిత్తశుద్దిని చూస్తాడని చెబుతారు.
ఈ చిత్తశుద్ది ఉంటే, మనిషి మహనీయుడు అని అంటారు.
అటువంటి చిత్తశుద్ది కలగాలంటే ప్రశాంతమైన చిత్తం కలిగి ఉండాలి.
ప్రశాంతమైన చిత్తం కదిలే మనసులో కన్న, ఒక చోట దృష్టి సారించే మనసులో ఎక్కువగా ఉంటుందని అంటారు.
అలా మనసు ఒక చోట దృష్టి కేంద్రీకృతం చేయాలంటే, దానికి ఎంతో ఇష్టం అయితేనే దృష్టి పెడుతుందని అంటారు.
అలా మనసు ఒక చోట కేంద్రీకృతం అయ్యేలాగా దృష్టి పెట్టడానికి పూజ పునాదిగా చెబుతారు.
సంసారం సాగించేవారికి పూజ ప్రధానం అంటారు.
సంసారం సమస్యలను తెస్తుంది, సుఖదుఖాలను తీసుకువస్తుంది… వాటిని దాటి మనసుని ఏకీకృతం చేయడం చాలా కష్టమంటారు… అలాగే అది అసాద్యమేమి కాదని కూడా అంటారు.
చిత్తశుద్దితో పూజ చేయడానికి సాదారణ పూజ ప్రశాంత చిత్తంతో తెల్లవారు జామున ప్రారంభించడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతూ ఉంటారు.
కరోన కారణంగా స్కూల్స్ మూతబడ్డాయి. ఆన్ లైన్లో పాఠాలు ప్రారంభం అవుతున్నాయి. ఆన్ లైన్ సాధనాలతో టీచర్లకు కొత్త బోధనా పద్దతులు అలవాటు చేసుకోవలసిన స్థితి. ఇప్పటికే ప్రేవేటు స్కూల్స్ ఆన్ లైన్ సాధనాలతో ఆన్ లైన్ తరగతులు పాఠాలు అందిస్తున్నాయి.
ప్రైవేటు స్కూల్స్ లో ఆన్ లైన్ క్లాస్ టీచింగ్ ప్రారంభం అయ్యాయి. పాఠాలు ఒక చోట ఉంటూ, వేరు వేరు చోట్ల ఉన్న అనేకమంది విద్యార్ధులకు పాఠాలను డిజిటల్ సాధనాలతో చెబుతున్నారు.
ఇందుకు క్లౌడ్ మీటింగ్ యాప్స్ బాగా ఉపయోగపడుతున్నాయి… జూమ్, గూగుల్ మీట్ వంటి క్లౌడ్ మీటింగ్ యాప్స్ సాయంతో ఆన్ లైన్ పాఠాలు పిల్లలకు అందిస్తూ ఉన్నారు.
జూమ్ క్లౌడ్ మీటింగ్ అయితే అందులో ముందుగా మీటింగ్ క్రియేట్ చేయాలి. టీచింగ్ అంటే మరలా అదే సమయంలో క్లాస్ ఉంటుంది కాబట్టి జూమ్ లో మీటింగ్ క్రియేట్ చేసేటప్పుడు రీకరింగ్ మీటింగ్ ఆప్షన్ టిక్ చేయాలి. సమయం ఎంపిక చేసుకుని, మీటింగ్ క్రియేట్ చేస్తే, ప్రతి రోజు ఒకే సమయానికి మీటింగ్ ప్రారంభించవచ్చు. ఉచిత జూమ్ క్లౌడ్ మీటింగ్ 40 నిమిషాల పాటు ఉంటుంది. అయితే రీకరింగ్ మీటింగ్ క్రియేట్ చేసి ఉంటే, మరలా వెంటనే అదే మీటింగ్ ఐడితో మరలా మీటింగ్ స్టార్ట్ చేయవచ్చు.
గూగుల్ మీటింగ్ కూడా మీటింగ్ క్రియేట్ చేసుకుని మీటింగ్ ద్వారా టీచింగ్ స్టార్ట్ చేయవచ్చును. క్రియేట్ చేసిన మీటింగ్ లింక్ షేర్ చేసి, ఆ లింక్ ద్వారా మీటింగ్ కు స్టూడెంట్స్ ని ఆహ్వానించవచ్చు.
గూగుల్ మీట్, జూమ్ క్లౌడ్ మీటింగ్స్ యాప్స్ ద్వారా స్క్రీన్ షేర్ చేస్తూ పాఠాలు బోధించవచ్చు. వీటిలో మీటింగ్ సెటింగ్స్ ప్రధానంగా తెలుసుకోవాలి. అప్పుడే క్లాస్ పై కమాండింగ్ ఉంటుంది.
లేకపోతే స్టూడెంట్స్ అల్లరి ఆన్ లైన్లో కూడా కంటిన్యూ అవుతుంది. స్టూడెంట్స్ ని మ్యూట్ చేయడం, ఆన్ మ్యూట్ చేయడం… వారి వీడియో హైడ్ చేయడం. స్టూడెంట్ ని వెయిటింగ్ రూమ్ కు చేర్చడం వంటి సెటింగ్స్ తెలుసుకోవాలి.
ఫోన్ ద్వారా చాలా సులభంగానే ఆన్ లైన్ క్లాస్ చెప్పవచ్చు. అలాగే లాప్ టాప్ ద్వారా కూడా ఆన్ లైన్ క్లాస్ చెప్పవచ్చు.
డెస్క్ టాప్ కంప్యూటర్ అయితే మాత్రం వెబ్ కెమెరా మరియు మైక్ వంటి పరికరాలు ఆధానంగా యాడ్ చేయాలి. అప్పుడే డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా ఆన్ లైన్ తరగతులు నిర్వహించవచ్చు.
డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా ఆన్ లైన్ తరగతి క్లాస్ నిర్వహణకు కంప్యూటర్ కాన్ఫిగిరేషన్ బాగా ఓల్డ్ అయితే ఆడియో డ్రైవర్స్, వెబ్ కెమెరా డ్రైవర్స్ వంటివి మాన్యుయల్ గా ఇంస్టాల్ చేసుకోవాలి.
లేటెస్ట్ కంప్యూటర్ అయితే మాత్రం ఆటొమాటిక్ డ్రైవర్స్ ఇన్స్టలేషన్ ఉంటుంది.
నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు. వ్యక్తి పుట్టుకకు ప్రయోజనం భగవంతుడిని చేరడమే అయితే, అందుకు తొమ్మిది భక్తి మార్గాలను పెద్దలు చెబుతూ ఉంటారు.
తొమ్మిది భక్తి మార్గాలలో దేనిని భక్తితో శ్రద్దతో ఆచరించినా తరించవచ్చు అని అంటారు.
శ్రవణం, కీర్తనము, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అను తొమ్మిది భక్తి మార్గాలు నారదుడు ధర్మరాజుకు చెప్పినట్టుగా ఐతీహ్యం.
శ్రవణం
శ్రవణము అనగా వినడము… అంటే భగవంతుని గూర్చి చెప్పబడిన గాధలు వినడం. ఇంకా భగవంతుడి గురించిన ప్రవచనాలు వినడం. ఇంకా భగవంతుని భక్తుల గురించి వినడం. భగవంతుడి లీలలు గురించి వినడం. ఏదైనా భగవంతుని గురించి శ్రద్ధాభక్తులతో వినడం శ్రవణభక్తి అంటారు.
ధర్మరాజు, జనమేజేయుడు, పరిక్షత్తు వంటి వారు భగవంతుడి గురించి విని తరించారని పెద్దలు చెబుతారు.
వినడానికి ఇప్పుడు భగవంతుడి కీర్తనలు, పాటలు, కధలు, ప్రవచనలు అన్నీ కూడా ఆడియో రూపంలో అందుబాటులో ఉంటున్నాయి…
కీర్తనం
కీర్తనము అంటే గొప్పగా చెప్పుట… భగవంతుడి గొప్పతనం గురించి చెప్పుట. సుగుణాలను కీర్తిస్తూ ఉండడం. సుగుణాలపై ఆరాధన భావంతో మనసును భగవంతుడిపైనే లగ్నం చేయడం. నిత్యం భగవంతుడి సుగుణాలను మనసులో తలుస్తూ, వాటి గురించి మాట్లాడుతూ ఉండడం వలన మనసు భగవంతుడిపై సులభంగా లగ్నం అవుతుందని అంటారు. పూర్వం భక్తులు చేసిన కీర్తనలు భగవంతుడి యొక్క గొప్ప సుగుణాలను తెలియజేస్తూ ఉంటాయి. వాటిని మనసులో మననం చేసుకుంటూ, భగవంతుడి సంకీర్తనలు పాడుతూ ఉండడం…
త్యాగరాజు, అన్నమయ్య వంటి భక్తులు భగవంతుడిని కీర్తించి తరించారు.
స్మరణం
స్మరణ అంటే తలచుకొనుట. సాదారణంగా ఒక్కోసారి దూరంగా ఉండే, స్నేహితుడిని గుర్తు చేసుకుంటాం. అలాంగే దూరంగా ఉండే బంధువును గుర్తు చేసుకుంటాం. ఏదో ఒక బందం దూరంగా ఉన్నప్పుడూ, గుర్తుకు వచ్చిన ప్రతిసారి వారిని తలచుకుంటూ ఉంటాం… జీవిత భాగస్వామి అయితే దగ్గరగా వచ్చేవరకు తలుస్తూ ఉంటాం… అంతవరకు ఏ పనిలోనూ భాగస్వామి ప్రతిరూపం కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. అదే తరహాలో భగవంతుడిని తలుచుకోవడం గురించి కూడా స్మరణ భక్తిగా నవ విధ భక్తిలో చెబుతారు.
భాగవన్నామ స్మరణ చేస్తూ నారదుడు ముల్లోకాలు సంచారం చేస్తూ ఉంటాడు. భగవంతుడి లీలలు వింటూ ఉంటే, స్మరించే స్థాయికి మనసు చేరుకుంటుందని అంటారు.
పాదసేవనం
సేవించడం…. భగవంతుడికి సేవలు చేయడం. ఒక గుడిలో రుసుము చెల్లించి సేవలు చేయడమే కాకుండా, స్వహస్తలతో భగవంతుడి సేవలో పాల్గొనడమని చెబుతారు. ఒక పండుగకు ముందు గుడిని శుభ్రపరుస్తూ ఉంటే, అందులో పాలుపంచుకోవడం. భగవంతుడి పల్లకి మోయడం… శరీరమును భగవంతుడి సేవకు వినియోగించడం వలన భగవంతుడి అనుగ్రహం సులభం అంటారు.
అర్చనం
అర్చన భగవంతుడిని పూజించడం. దూప, దీపా నైవేద్యాలతో భగవంతుడిని పూజించడం. సనాతనధర్మంలో శాస్త్రం సూచించిన మాదిరిగా భగవంతుడికి పూజ ద్రవ్యాలు మనసు పెట్టి సమర్పించడం…. మానసికంగా భగవంతుడికి పూజ చేయగలిగే స్థాయి వచ్చే వరకు పూజా ద్రవ్యములతో భగవంతుడిని నిత్యం పూజించడం… మనసులో పూజా మెదులుతూ ఉంటే, మనసు భగవంతుడి పాదాల వద్దే ఉండడం… పూజలో పరమావధి అంటారు. భగవంతుడిని విగ్రహ రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ పూజా ధ్రవ్యములతో పూజ చేస్తూ ఉంటారు.
వందనం.
వందనం భగవంతుడి ముందు వినయంగా ఉండడం. వినయంతో నిత్యం భగవంతుడికి వందనం చేయడం. శిరస్సు వంచి పెద్దలకు గౌరవభావంతో వందనం చేసినట్టు, నిత్యం భగవంతుడి రూపానికి మనసులో వందనం సమర్పిస్తూ, బౌతిక దర్శనంలో భగవంతుడి పాదాలకు నమస్కరిస్తూ ఉండడం అంటారు.
ప్రహ్లాదుడు నిత్యం అన్నింటా శ్రీహరి దర్శిస్తూ, అంతటా నమస్కార భావంతోనే ఉండేవాడు.
దాస్యం
దాస్యం చేయడం కూడా సేవ చేయడం లాంటిదే. అయితే దాస్యంలో ఫలితం ఆశించకుండా యజమానికి లొంగి పని చేస్తాం. అలాగే భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి, భగవంతుడిని ఆరాదిస్తూ ఉండడం.
భగవంతుడికి తనంతట తానుగా దాసుడిగా మారిన హనుమ. అలాగే లక్ష్మణుడు కూడా ఈశ్వరుని వెంటే నిలిచాడు.
సఖ్యం
సఖ్యంగా ఉండడం అంటే స్నేహం చేయడం. ఒక మంచి స్నేహితుడితో ఎలా నడుచుకుంటామో అలాగే భగవంతుడితో స్నేహభావం పెరిగే విధంగా ప్రయత్నం చేయడం. పాండవులు ఈశ్వరునితో సఖ్యతతో ఉండి, నిరంతరం రక్షింపబడ్డారు…. చివరికి తరించారు.
ఆత్మనివేదనం
ఆత్మనివేదనం తనను ఈశ్వరుడికి అర్పించివేయడమే. ఆత్మను ఈశ్వరుడికి అర్పించడంలో బలి చక్రవర్తిని ఉదాహరణగా చెబుతారు.
నేటి రోజులలో స్మరణ చేయడం సులభం… భగవంతుడి గూర్చి చెప్పబడిన ప్రవచనాలు, పాటలు, కీర్తనలు వింటూ ఉండడం వలన మనసు భగవంతుడిపై లగ్నం కాగలదని అంటారు.
భగవంతుడి వైపు మరలిన మనసు భగవంతుడిని స్మరించడం మొదలు పెడుతుంది.
భాగవతం, రామాయణం, మహా భారతం వంటి పురాణ ప్రవచనాలు వినడం అలవాటు అయితే, అది శ్రేయస్కరమని అంటారు.
దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు. తగు నియమాల వలన మనసులో దైవంపై భక్తి శ్రద్దలు పెరుగుతాయని చెబుతారు.
దేవాలయం అంటే భక్తులను అనుగ్రహించడానికి దైవము కొలువుతీరిన క్షేత్రం. ఆ క్షేత్రం పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన పరమాత్మ భక్తుల కోరికలు తీర్చడానికి కొలువైన పరమ పావన దైవనివాసం. అంతరి పరమపుణ్య ప్రదమైన దేవాలయములో దైవ దర్శనమునకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిభందనలు చెబుతారు.
గుడికి వెళ్ళే భక్తులు (స్త్రీ / పురుషులు) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేయవలెను. నుదుట కుంకుమ ధరించాలి.
గుడి ఆచారం ప్రకారం సంప్రదాయమైన దుస్తులు ధరించాలి. మగవారు పంచె, కండువా… ఆడువారు సంప్రదాయక చీరలు.
దేవాలయమునకు బయలుదేరుతున్నప్పుడే భగవన్నామ స్మరణ మేలని అంటారు.
భగవంతుడికి భక్తితో పూజించడానికి కనీస పూజా సామాగ్రి ఉండాలి… అంటే ధూప దీప నైవేద్యాలు…
దేవాలయ ప్రాంగణం చేరుకోగానే, ప్రాంగణం బయటే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతారు.
దేవాలయం ఆలయం ప్రవేశించడానికి ముందు, ఆలయ గోపురానికి నమస్కరించి ఆపైన మెట్లకు నమస్కరించాలి.
దేవాలయం లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ మనసు భగవంతుడిపైనే పెట్టాలి.
దేవాలయం చుట్టూ ఆలయంలొని దైవమును అనుసరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని అంటారు.
ప్రదక్షిణ సమయంలో మనసంతా భగవంతుడిపైనే ఉండడం శ్రేయస్కరం అంటారు.
దేవాలయంలో పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిలబడాలని అంటారు.
ఆలయంలో దైవమును ఆపాదమస్తకం వీక్షించాలని అంటారు. అంటే కాళ్ళ దగ్గర నుంటి ముఖం వరకు పూర్తిగా దైవమును దర్శించాలని అంటారు.
దైవదర్శనం అయిన తరువాత ఆలయంలో కాసేపు కూర్చొని ఆలయంలో కొలువుతీరిన దైవనామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో కాసేపు దేవాలయంలోనే ఉండాలని అంటారు.
దైవ ప్రసాదం భక్తితో స్వీకరించడం వలన భగవంతుంది అనుగ్రహం కలుగుతుందని అంటారు.
ఇంటికి తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ ఆలయంలోని స్వామికి నమస్కరించుకుని ఆలయం బయటికి వచ్చిన తరువాత మళ్ళీ తిరిగి గోపురానికి నమస్కరించి వెళ్ళాలని అంటారు.
వివిధ ప్రాంతాలు వివిధ పద్దతులను బట్టి ఆయా దేవాలయములలో కొన్ని ప్రత్యేక నియమాలు చెబుతూ ఉంటారు. అటువంటి క్షేత్రముల దర్శనమునకు వెళ్ళే ముందు, ఆయా క్షేత్రముల చరిత్రను, నియమాలను ముందుగా తెలుసుకోవడం శ్రేయస్కరం అంటారు.
నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది. నేర్చుకునే ఆసక్తి ఉన్నంత కాలం, మనసు నిత్యం విషయసారం గ్రహిస్తూనే ఉంటుంది.
తెలుసుకోవడం విధ్య అయితే, నేను నిరంతరం నిత్య విధ్యార్ధిని అనే భావన, నిరంతరం ఏదో ఒక విషయం తెలుసుకునేలాగా మనసును ప్రేరేపిస్తుంది.
నాకు అంతా తెలుసు అనే భావన, అలసత్వానికి నాంది అవుతుంది. రాను రాను తెలుసు అనే భావన తెలిసిన విషయాలను మరిపించే అవకాశం కూడా ఉండవచ్చు.
విధ్యార్ధికి విద్యాలయంలో విధ్య నేర్పించబడుతూ ఉంటే, అందరికీ సమాజం కూడా ఒక పాఠశాల మాదిరిగా ఉంటుంది.
బడిలో తపన ఉన్న విధ్యార్ధి ఉత్తమ ఫలితాలను తెచ్చుకుంటూ ఉంటే, ఆసక్తి కనబరచని విధ్యార్ధి అధమ ఫలితాలను పొందుతూ ఉంటాడు. తపనకు శ్రద్ద తోడైతే, శ్రద్దకు సరైన బోధన అందితే, ఆ తపన మనిషిని ఉన్నత శిఖరం వరకు తీసుకువెళుతుంది.
ఒక స్కూల్ వలె సమాజం కూడా అందరికీ ఒక పాఠశాల వంటిదే అంటారు.
నిత్యం సమాజంలో అనేకానేక విషయాలు మనిషి చుట్టూ ఉంటాయి. అనేక సమస్యలు మనిషికి వస్తూ ఉంటాయి. అనేక సమస్యలు పరిస్కారం అవుతాయి. ప్రతి పరిస్కారం ఏదో ఒక పాఠం మిగిలుస్తుంది.
ఏదో నేర్చుకోవాలనే బలమైన భావనకు ప్రేరణ నేను నిత్య విధ్యార్ధిని అనే భావన!
సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన గొప్పవారు సైతం, ఇంకా ఏదో నేర్చుకోవాలనే బలమైన భావనతో ఉంటారు. వారికి నేర్చుకోవడంలోనే తృప్తి ఉంటుందేమో….
ఏదైనా అలవాటు ఉన్న మనసు, ఆ అలవాటువైపే చూస్తూ, మనిషిని ఆ అలవాటు దగ్గరికి తీసుకుపోతూ ఉంటుంది… అలా నేర్చుకోవడం ఒక అలవాటుగా మారితే, మరి వారి మనసు ఏదో కొత్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.
‘‘జీవితంలో చాలా ఎత్తు పల్లాలు చూశారు. మీరు చూడని సక్సెస్ అంటూ లేదు.. ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన మీకెందుకు.?’’ అని మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తే, ‘నేనింకా నేర్చుకోవాల్సింది చాలా వుంది.
—చిరంజీవి
అమ్మ ఒడిలో ఆరంభం అయ్యే విధ్య, విద్యాలయంలో కొనసాగి, సమాజంలో ఒక గుర్తింపుగా మారుతుంది. అలా గుర్తింపు పొందిన వ్యక్తికి జీవితం ఏదో ఒక పాఠం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.
సత్యం కోసం తపనపడే మనసు, అబద్దాన్ని ఛేదించేవరకు సాధన చేస్తూనే ఉంటుంది. నిత్య సత్యం చుట్టూ అబద్దం అల్లుకుంటూనే ఉంటే, సత్యాన్వేషణ చేసేవారికి, అబద్దం నిత్యం, ఏదో ఒక పాఠం అందిస్తూనే ఉంటుంది.
లోకం మనిషికి కొత్త అనుభవం అందిస్తూనే ఉంటుంది. కాలంతో బాటు లోకం తీరు మారుతుంది… లోకం తీరు గమనించేవారు, లోకాన్ని అనుసరించడం ద్వారా తమనుతాము అభ్యాసకులుగా మార్చుకుంటారు.
వినేవారు ఉండాలే కానీ చెప్పేవారికి కొదువలేదు… ఆసక్తి ఉంటే అశక్తతో ఉన్నా సరే ఓపికతో వినినిపించేవారు ఉంటారు. వారికి చెప్పడంలో ఉండే తృప్తి, వినేవారికి వరంగా మారుతుంది.
తన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులను పరిశీలిస్తే ప్రతిదినం ప్రతిఘడియ నూతన అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటారు. ఇలా మనిషి నిత్య విధ్యార్ధిగా ఉండే అవకాశాలు ఎక్కువ.
నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.
జీవితంలో ప్రతిరోజు, ప్రతిక్షణం పరిశీలన దృష్టి ఉంటే, ఒక కొత్త పాఠం నేర్చుకోవడమే అవుతుంది.
పుట్టిన వ్యక్తి పెరుగుతూ, తన జీవన కాలంలో ఎన్నో పాత్రల పోషిస్తూ ఉంటారు. ప్రతి పాత్రకు ఎదురయ్యే అనుభవాలు, కొత్త పాఠాన్ని నేర్పుతూ ఉంటాయి.
విశాఖలో ఎయు సైన్సు కళాశాల దినోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను అనునిత్యం విద్యార్థిగా వివిధ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు
—చంద్రబాబు నాయుడు
నేను నిత్య విధ్యార్ధిని అను భావనకు సాధన తోడైతే నిత్య సమాజమే ఒక పాఠశాల
అభ్యాసం ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తుంది. విధ్యార్ధి దశలో పాఠాలపై ఆసక్తి ఉంటే, ఉద్యోగంలో పనితీరు మెరుగుపరచుకోవడంలో అభ్యాసం, కొత్త విషయాలు తెలుసుకునేలాగా ప్రేరణ అవుతుంది.
ఒక ఉద్యోగికి తను పనిచేసే చోట అన్ని విషయాలు తెలిసే అవకాశం తక్కువ. కొత్తలో తెలిసిన విషయాలతో పని ప్రారంభం అయితే, తరువాత తెలియని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, అది అభ్యాసం వైపు మరలుతుంది.
తెలిసిన విషయాలు తెలియనివారికి తెలియజేస్తూ, తెలియని విషయాలు తెలుసుకోవడం అనేది కార్యాలయాలలో జరుగుతూ ఉంటుంది.
ఎదిగే పిల్లలకు ఇంట్లో అమ్మా, నాన్న, అక్క, అన్నయ్య… అందరూ అధ్యాపకులే అవుతారు…
ఒక్కోసారి చిన్నవారే పెద్దవారికే తెలిసిన విషయంలో సూచనలు అందిస్తూ ఉంటారు. ఎక్కువమంది ఉండే ఉమ్మడి కుటుంబంలో ఎన్నో విషయాలు తెలియబడుతూ ఉంటాయి.
నిత్య విధ్యార్ధికి ఇంటి నుండి బడి నుండి సమాజం…. పాఠశాలగానే కనబడితే, అను నిత్యం అభ్యాసమే….
యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం. ఇప్పటి ప్రసాద సాధనాలు యువతపై రెండు రకాల ప్రభావం చూపించే అవకాశం కలదు.
ఒకటి: ఉపయుక్తమైన విషయ సంగ్రహణం చేసే క్రమంలో ఉత్సాహావంతులకు ప్రోత్సాహకరంగా నేటి సాంకేతికత ఉపయోగపడును.
రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
బ్లేడు రెండువైపులా పదును కలిగి ఉండి, దానిని ఉపయోగించేటప్పుడు చేతి వెళ్లకు ప్రమాదకరంగా ఉంటుందో, నేటి సాంకేతికత కూడా ఎదిగే మనసుకు అలాగే ఉంటుంది.
ప్రసార సాధనాల ప్రభావం సమాజంలో ముఖ్యంగా యువతపై ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా మొబైల్స్ రూపంలో ప్రసార సాధనాల ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది.
ఒకప్పుడు ప్రసార సాధనాలు కేవలం పత్రికల రూపంలోనే ఉండేవి. అవి మాస పత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలు, దిన పత్రికలు అంటూ పత్రికల ద్వారకా సమాచారం అందేదీ.
రేడియో కార్యక్రమాలు ప్రజలను అలరిస్తూ వచ్చేవి, సాయం వేళలో సాంగ్స్ వినడం ఒక అలవాటుగా కూడా ఉండేదని అంటారు.
ఆ తరువాత టివిల వలన ప్రసార సాధనాల పనితీరు మెరుగు పడింది. అనేక అంశాలు ప్రతి ఇంటిలోకి వార్తలుగా రావడం… ఇంకా వినోద కార్యక్రమాలు సంఘజీవిని ఇంటికే పరిమితం చేయడంలో టివిల పాత్ర ప్రముఖమైనది అంటారు.
టివిల నుండి వేగం అందుకున్న ప్రసార సాధనాలు ఇప్పుడు అందరి చేతులలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడే అందించే క్రమానికి మారాయి.
పత్రిక – రేడియో – టివి – కంప్యూటర్ – లాప్ టాప్ – టాబ్ – స్మార్ట్ ఫోన్ ఇలా ప్రసార సాధనాలు అక్షర రూపంలో, శబ్ధరూపంలో, దృశ్య రూపంలో ప్రసారం అయ్యి, ఇప్పుడు దృశ్యం రూపం పెద్ద పెద్ద స్క్రీనుల నుండి అతి చిన్న స్క్రీనులా ద్వారా కూడా ప్రపంచాన్ని అరచేతిలో చూపుతున్నాయి.
యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం
స్మార్ట్ ఫోన్, ఇది ఒక మాయల మరాఠి చేతిలో మంత్రదండం లాగా మనిషి చేతిలో ఇమిడిపోయింది.
ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టడానికి క్యూ కట్టిన జనులు ఇప్పుడు ఉన్న చోట నుండే కదలకుండా కరెంట్ బిల్ పే చేసే స్థితిని ప్రసార సాధనాలు కల్పిస్తున్నాయి.
సమయం సేవ్ చేయడంలో ఇది మంచి పరిణామం అయితే, అదే సమయంలో సహనం స్థానంలో అసహనం ఏర్పడే అవకాశం కూడా ఈ స్మార్ట్ ఫోన్ వంటి సాధనాల రూపంలో కలిగే అవకాశం ఉంటుంది.
ఇలా ఏదైనా నెలవారి చెల్లింపులు చేయడంలో చేతిలోని స్మార్ట్ ఫోన్ పనితీరు ఒక అద్బుతమే అని చెప్పాలి. ఇది నిజంగానే చేతిలో మంత్రదండం వలె ఉంటుంది.
ఇక వినోద కార్యక్రమాలు అయితే సరే సరి. ఎప్పుడంటే అప్పుడే, ఎక్కడంటే అక్కడే టైమ్ పాస్ కావడానికి స్మార్ట్ ఫోన్లో ఎన్నో వినోదాత్మక వీడియోలు దర్శనమిస్తాయి. వినోదభరిత పెట్టె వలె చేతిలో ఇమిడిపోతుంది.
ఒకటి: ఉపయోగకరమైన విషయ సంగ్రహణకు కంప్యూటర్ – లాప్ టాప్ – టాబ్ మరియు స్మార్ట్ ఫోన్లు చాలా ఉపయోగకరంగా….
ఉంటున్నాయనే చెప్పాలి.
ఒక విధ్యార్ధి తరగతిలో టీచర్ చెప్పిన విషయం అర్ధం కాకపోతే, ఇంటర్నెట్ ఆధారిత పరికరములలో శోధించి సాధించవచ్చు.
అలాగే ఒక ఉద్యోగి తన కార్యచరణలో సందేహాలకు సమాధానాలను ఇంటర్నెట్ ఆధారితపరికరాల ద్వారా వచన రూపంలో కానీ దృశ్య రూపంలో కానీ పరిస్కారం కనుగొనవచ్చు.
నేర్చుకునే వయస్సులో ఆసక్తికి నేటి సాంకేతికత అదనపు ఆయుధంగా మారుతుంది. అయితే అది మంచి ఆసక్తి అయితే, అది అతని ఉన్నత స్థితికి హేతువు కాగలదు…
అవసరానికి ఆలోచన తోడైతే, ఆ ఆలోచన అందరికీ ఉపయోగపడేది అయితే, అదే ఆలోచనను అభివృద్ది పరచి అందరికీ ఉపయోగపడేలా చేయడంలో నేటి సాంకేతికత ఒక ప్రోత్సాహకరంగా ఉండగలదు.
రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం
కూడా నేటి సాంకేతికత ద్వారా అభివృద్ది చెందిన ప్రసార సాధనాలు కారణం కావచ్చు. ఇంటర్నెట్ ఆధారిత పరికరాలలో వ్యక్తికి స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది.
అతను శోధించే అంశం అతనికే పరిమితం అవుతుంది కానీ అతని శ్రేయోభిలాషులకు తెలిసే అవకాశం తక్కువ.
వయసుకు మించిన విషయాలు కూడా ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు ఉపయోగించేవారి దృష్టికి వచ్చే అవకాశం నేటి ప్రసార సాధనాల ప్రభావం ద్వారా ఉండవచ్చు.
వాటిని ఉపయోగించే వారి విజ్నతను బట్టి ప్రసార సాధనాల ఉపయోగం ఫలితం ఉంటుంది.
ఈ ప్రసార సాధనాల ప్రభావంతో వ్యక్తి ఆలోచనా తీరు వేగం పుంజుకుంటే, దానికి సరి అయిన పరిస్కారం యోగా అంటారు.
మనసుని నియంత్రించే ప్రక్రియలో యోగా మేలైనదిగా చెప్పబడుతుంది.
ఇప్పటి ప్రసార సాధనాలు అనెక అంశాలుయువత మదిలోకి చొచ్చుకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే శ్రేయస్సు కలిగించే విషయాలు మాత్రం మనిషికి శాంతిని అందిస్తే, ఆకట్టుకునే విషయాలు మనసులో అశాంతికి ఆలవాలం కాగలవు.
మంచి చెడులు ఒకరిని అనుసరించి తెలుసుకునే రోజుల నుండి శోధించే తెలుసుకునేవిధంగా ప్రసార సాధనాలు మార్పును తీసుకువచ్చాయి.
తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజంపైన పడుతుందా? అవుననే అంటారు. ఎందుకంటే ఒకప్పుడు హిట్ సినిమాను బట్టి, ఆ సినిమా చీరలు అని అమ్మకాలు కొనసాగించేవారు.
అంటే పెళ్లిసందడి సినిమా సూపర్ హిట్ అయ్యింది… ఆ తురువాత బట్టల షాపులలో పెళ్ళిసందడి చీరలు అంటే అమ్మకాలు ఎక్కువగా ఉండేవి… అదేవిధంగా తెలుగు సినిమా హీరోల స్టైల్ కూడా యువతపై ప్రభావం చూపుతుంది.
మన తెలుగు సినిమాల కధలు సమాజంలో ఎదో ఒక మూల జరిగిన సంఘటన ఆధారంగా లేక రచయిత మైండులో పుట్టిన ఆలోచన ఆధారంగా కావచ్చు.
కాని ఆయా తెలుగు సినిమాల ప్రభావం మొత్తం తెలుగు సమాజంపై ఉంటుంది.
ఎక్కువ అభిమానులు కలిగిన హీరో సినిమా అయితే, ఎక్కువమంది యువకులపై ప్రభావం చూపుతుంది.
ఏమిటి? ఈ తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజం పైన…
అంటే ఆలోచనా ధోరణిలోకి సినిమాలలో ఉండే విషయాలు వచ్చి చేరతాయి.
ఎలాంటి విషయాలు ఆలోచన ధోరణికి దగ్గరవుతాయి? అంటే కధానాయకుడు వేష ధారణ యువకులలో అనుసరించాలనే ఆసక్తిని పెంచవచ్చు.
అలాగే కధానాయిక యొక్క వేషధారణ కు యువత మనసులో మెదులుతూ ఉంటుంది.
ఇంకా మాటల ప్రభావం కూడా ఉండవచ్చు. అంటే సినిమాలో నాయకా నాయికలు మాట్లాడే భాషా శైలి యువతను ఆకట్టుకుంటే, అటువంటి శైలిని యువత అనుసరించడానికి ఆసక్తి కనబరచవచ్చు.
ఇలా తెలుగు సినిమాల వలన వేషధారణ, మాటతీరు తెలుగు సమాజంపై పడే అవకాశం ఉంటే, ఇంకా సినిమా కధలో చేయవచ్చు, చేయకూడదు అనే పనులపైన కూడా సినిమా ప్రభావం ఉండవచ్చు.
సమాజంలో ఎదో ఒక ప్రాంతంలో ఏదైనా వింత ప్రవర్తన ఉన్న వ్యక్తి ఉంటే, అటువంటి వ్యక్తి కధను సినిమాగా మరల్చడం ద్వారా ఆయా ప్రాంతీయ పోకడ మొత్తం సమాజానికే తెలియబడుతుంది.
ఒక దర్శకుడి వినూత్న ఆలోచన సినిమాగా వచ్చినా ఆ ఆలోచన కూడా యువత మైండులో మెదులుతుంది.
ఇలా కొందరి ఆలోచనా సృష్టి, సమాజంలో యువతపైన ప్రభావం చూపించే అవకాశం సినిమాల వలన ఎక్కువగా ఉండవచ్చు.
తెలుగు భజన పాటలు వింటూ ఉంటే, మదిలో పాటల పల్లకి అవుతుంది. కీర్తనలు భజన పాటల రూపంలో భజించడం అంటే మనసును భక్తివైపు మరల్చడమే.
భక్తుడి భజన వలన భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. అలాగే భక్తుని మది గుడిలో నుండి మనసంతా వ్యాపిస్తాడని అంటారు.
భజన చేయడం వలన భగవంతుని అనుగ్రహం త్వరగా పొందవచ్చని పెద్దల మాట. పదే పదే భగవణ్ణామమ్ భజించడం అంటే భగవంతుని అనుగ్రహం కోసం తపించడమే అంటారు.
కర్మ ప్రభావం చేత మనిషి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటే, సుఖంలోనూ దుఖంలోనూ భగవంతుడిని దర్శించడమే భక్తి అని చెబుతారు.
నిత్యము విషయ లాలస చేత, మనిషికి భక్తిపై మనసు లగ్నం కానప్పుడు మాత్రం, భజన చేయడం వలన మనసు భక్తికోసం తపిస్తుంది అంటారు.
తెలుగు భజన పాటలు వింటూ ఉంటే మనసు తన్మయంతో పరవశిస్తుందని అంటారు.
వ్యక్తిని సత్యదూరం వైపు నడిపించే విషయాలు వ్యక్తి చుట్టూ చేరడంలో చాలా వేగంగా వస్తాయి. కానీ సత్యంవైపు నడిపించే భక్తిమార్గం వైపు మాత్రం వ్యక్తి నడవడానికి భగవంతుడి అనుగ్రహం అవసరం అంటారు. భగవంతుడి అనుగ్రహం భజన చేత త్వరగా కలిగితే, భజన పాటలు భగవంతుడిని స్తుతి చేస్తూ ఉంటాయి.
భగవంతుడి భజన పాటలు మనసును కుదుటపరుస్తాయని అంటారు. భజన పాటలు భగవంతుడిపై మనసు లగ్నం అయ్యేవిధంగా ప్రభావం చూపగలవని పెద్దల మాట.
భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనసుతో భజన చేయడం అంటే అదొక తపస్సు అని అంటారు. భక్తి భజన పాటల వలన మనసు త్వరగా భగవత్సరూపమును పట్టుకుంటుందని అంటారు.
తెలుగు భక్తి భజన పాటల పుస్తకాలు ఉచితంగా మీ ఫోనులో కానీ కంప్యూటర్ లో కానీ లాప్ టాప్ లో కానీ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది అక్షరాలను క్లిక్ చేయండి.
భక్తి కోసం మనసు తపించడమే, కష్టం కలిగినప్పుడు అది శాంతించదనికి, భక్తి మనసుకు మంచి మందు అంటారు. మంచిమందు కోసం మనసు ముందుగా ఇష్టపడకపోవచ్చు కానీ అలవాటు అయితే మాత్రం ఆ మంచి మందును అందరికీ పంచే మంచి ప్రయత్నం మనసు చేయగలదని అంటారు.
తపన ఉంటే తపస్సు చేసేవరకు మనసు ఊరకుండదు అని అంటారు. అటువంటి తపన భక్తివైపు మరలితే, జీవితం ధన్యత పొందుతుందని చెబుతారు. అటువంటి తపనకు నాంది భగవంతుడి భజన అంటారు.
తెలుగు భజన పాటలు వింటూ , భజన చేస్తూ భాగవన్నామ స్మరణలో మనసు తన్మయావస్తకు చేరడం ఒక తపస్సు వంటిది అంటారు. అలాంటి తపస్సు వలన లోపాలే ఉండే భగవంతుడు కష్టంలోను మనసు చలించకుండా బుద్దిని సన్మార్గంలో నడిపిస్తాడని పెద్దలంటారు.
భగవంతుడు కోసం పాటలు రచించినవారు ఎందరో… ఆ మహానుభావులు రచించిన పద్యాలు, కీర్తనలు భజన రూపంలోకి మార్చినవారు కూడా ఉన్నారు.
అలాంటి రచనలే భజన పాటలుగా మారితే, ఆ తెలుగు భజన పాటలు వింటూ మనసు భగవంతుడి వైపు తిరుగుతుందని అంటారు.
భజ గోవిందం భజగోవిందం అంటూ సాగే భజన పాటతో గోవిందుడి అనుగ్రహం పొందడం సులభతరం అంటారు.
ఎందుకు భజన పాటలు వ్యక్తి మనసుని భక్తి మార్గం వైపు తిప్పగలవని అంటారు.
ఎందుకంటే భక్తి వలన ముక్తి సులభమనే సూచన పొందినవారంతా భక్తికై తపిస్తారు.
భక్తుల మొర అలకించే భగవానుడు, త్రికరణశుద్దితో పలికే పలుకులను భగవంతుడు అలకిస్తాడు.
ఒకరే ఒక చోట కూర్చుని ఉంటే, అతని మనసు పలు పలు విధాలుగా తలంపులు చేయడానికే ప్రయత్నం చేయవచ్చు.
ఇంకా ఒక్కరే కూర్చుని భక్తితో భగవానుదిని స్మరించే సమయంలో ఏదో ఒక సమస్య మనసుపై ఒత్తిడి తేవచ్చు…
ఎలాగో లాగా ఒక వ్యక్తి ఒక చోట కూర్చోవడానికి ప్రయత్నం చేయడానికే చాలా సమయం పడుతుంది. కానీ సావాసంలో మనసు త్వరగా నిలకడ పొందగలదని అంటారు.
పదిమండి ఒక చోట కూర్చుని, క్రమశిక్షణతో ఒక పని మొదలు పెడితే, ఆ పనిలో వారంతా లీనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పదిమందిలో ఎక్కువమంది పనిమీద ధ్యాస పెట్టగలరు. అలాగే భగవంతుడిని ప్రార్ధించేవారిలో కూడా పదిమంది ఒక చోట కూర్చుని భాగవన్నామ సంకీర్తన చేస్తుంటే, ఎక్కువమంది మనసు ఆ సంకీర్తన ఆలాపన చేస్తూ ఉంటుంది.
అందుచేత పదిమంది కలసి చేసే పనిలో ఎక్కువమంది శ్రద్దాశక్తులు కలిగి ఉండే అవకాశం ఎక్కువ. ఇక భజన పాటలు పాడడం మొదలు పెడితే మాత్రం, ఎక్కువమంది మనసు భగవంతుడి వైపు వెళుతుంది.
ఏకాగ్ర చిత్తం కలిగి ఉండడం భక్తిలో మొదటి మెట్టుగా చెబుతారు.
భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ అంటే తెలుగు వారందరికి గర్వ కారణమే. కరిగిపోతు కొవ్వొత్తి వెలుగు ఇస్తుంది…
అలా ఒక తెలుగు గడ్డపై పుట్టిన తెలుగు బిడ్డ దార్శనికత నేటి మన భారత ఆర్ధిక పురోగతి అని పెద్దలు ప్రశంసిస్తూ ఉంటారు.
ఇప్పుడు ప్రశంశలు అందుకుంటున్న అలనాటి తెలుగు బిడ్డ అప్పటి భారతదేశ ప్రధానమంత్రి.
ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన పాలనలో దేశం పురోగతికి పురుడు పోసుకుంటూ ఉంటే, ఆయన తెలివికి నిశ్చేష్టతో చరిత్ర తన పని మరిచి పోయి ఉండవచ్చు.
ఇప్పటికే ఆ మహానుభావుడు ఎవరో తెలుగువారికి అర్ధం అయ్యి ఉంటుంది…. ఆయనే పాములపర్తి వెంకట నరసింహరావు…
ఆర్ధికంగా అప్పులపాలు అయ్యి, ప్రపంచంలో అధిక అప్పులు ఉన్న దేశాలలో మూడవ స్థానంలో ఉన్న భారత దేశానికి ప్రధానిగా బాద్యతలు స్వీకరించిన తెలుగుబిడ్డ.
సాధారణంగా ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే, మునుపటి పార్టీ అనుసరించిన విధానాలను మార్చివేయడం పరిపాటి… కానీ మన తెలుగుబిడ్డ పివి నరసింహరావుగారి విధానాలను కొనసాగించడమే కాకుండా… ఆయనను అప్పటి ప్రతిపక్ష పార్టీ తరపు దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రశంసించడం అంటే… పివి ఘనత ఏమిటో తెలియబడుతుంది.
లోకం వినేవారికి వినిపిస్తూనే ఉంటుంది. విననివారిని విడుస్తూనే ఉంటుంది. చేసేవారితో చేయించుకుంటూనే ఉంటుంది…. అలా పివి నరసింహరావుగారితో దేశం రక్షింపబడింది. అయితే ఆయనకు గుర్తింపు ఇవ్వడంలో వెనకబడింది అని వాపోయినవారు ఉంటారు.
ఘనుడు ఘనత కోసం ప్రాకులాడడు. తన కర్తవ్యం తాను చేసుకుపోతాడు… అలా ఆయన కర్తవ్యం నేటి దేశ వర్తమానంగా చెబుతారు.
వర్తమానంలో మంచిని అడ్డుకునేవారు చరిత్రను శాసించగలిగితే, మంచి చేసేవారికి గుర్తింపు ఆలస్యం అవుతుంది. అయితే ఆలస్యంగా వచ్చే గుర్తింపు చిరకాలం కొనసాగుతుంది…
అప్పుడు పాలించిన పివి నరసింహరావుగారు, ఇప్పటికే వెలుగు విరజిమ్ముతున్నారు…
అందుకే ఇప్పుడు ఆయన గురించి మరింత మందికి ఓ మహానుభావుడుగా తెలియజేద్దాం… మన భవిష్యత్తు తరానికి ఓ గొప్ప వ్యక్తి గురించి తెలుపుతూ ఉందాం…
అప్పుడు తాను దర్శించిన భారతం కోసం, ఎంతో కృషి చేసిన ఆ తెలుగుబిడ్డ గురించి తెలుగుతరం అంతటా తెలిసేలా తెలియజేద్దాం. ముందుగా మనం గుర్తుకు తెచ్చుకుందాం… గుర్తుపెట్టుకుందాం… పిల్లలకు తెలియజేద్దాం!
భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ, మన తెలుగు గడ్డలో పుట్టిన తెలుగుజాతి ముద్దు బిడ్డ పివి నరసింహరావు గారు.
మీ చానెల్లో యొక్క యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేయడం ఎలా? ఈ బ్లాగు పోస్టులో….
అప్ లోడ్ చేయబడిన మీ యూట్యూబ్ వీడియో మరల మీ డెస్క్ టాప్ కంప్యూటర్ నందు డౌన్ లోడ్ చేయాలంటే, కొన్ని వెబ్ సైట్స్ ఉంటాయి. మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ నందు మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేసుకోవడం సులభమే.
కంప్యూటర్ బ్రౌజర్లో వీక్షిస్తున్న వీడియో url ఈ క్రింది విధంగా ఉంది అనుకోండి. క్రింది యుఆర్ఎల్ గమనించండి….
https://www.youtube.com/watch?v=3wnG9k3VbVE
పై యుఆర్ఎల్ నందు https://www. ఆంగ్ల అక్షరాల తరువాత youtube.com/watch?v=3wnG9k3VbVE ఈ ఆంగ్ల అక్షరాలకు ముందు ss అను రెండు అక్షరాల ఈ క్రింది యుఆర్ఎల్ మాదిరిగా జత చేసి ఎంటర్ చేయగానే… యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ లింక్ అందించే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
https://www.ssyoutube.com/watch?v=3wnG9k3VbVE
చుడండి పై యుఆర్ఎల్ నందు బోల్డ్ చేయబడిన ఆంగ్ల అక్షరాలు ఎక్కడ టైపు చేయబడి ఉన్నాయో… అలాగే ఏదైనా యూట్యూబ్ వీడియో లింకులో ss అను ఆంగ్ల అక్షరాలు లింక్ మద్యలో యాడ్ చేసి, సదరు వీడియోను డౌన్ లోడ్ చేయవచ్చు.
మరొక వెబ్ సైట్ ద్వారా కూడా మీ చానెల్ నందు గల యూట్యూబ్ వీడియోలను సులభంగా డౌన్ లోడ్ చేయవచ్చు.
మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?
గూగల్ నందు ఈ క్రింది విధంగా y2mate అను ఆంగ్ల అక్షరాలు టైపు చేయండి. ఆ తరువాత గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఈ క్రింది చిత్రంలో మాదిరిగా ఉంటుంది.
పై చిత్రంలో చూపిన విధంగా మొదట్లోనె కనబడుతున్న యుఆర్ఎల్ ఈ క్రింది విధంగా ఉంది. దాని పై క్లిక్ చేయగానే, సదరు వై2మేట్ వెబ్ సైట్ మీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది.
https://www.y2mate.com
ఈ క్రింది చిత్రం గమనించండి…. వై2మేట్.కాం ఓపెన్ అయితే ఈ క్రింది ఇమేజ్ మాదిరిగా ఉంటుంది.
మీరు ఈ వెబ్ సైట్ నుండి మీయొక్క యూట్యూబ్ చానెల్ లోని వీడియోలు లేదా ఆ వీడియోకి సంబందించిన ఆడియో ఫైల్ సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రింది చిత్రం గమనించండి.
పై చిత్రంలో ఒక యూట్యూబ్ వీడియో మీ యూట్యూబ్ వీడియో అయితే, దాని వీడియోలో కూడా పై చిత్రంలో చూపినట్టుగానె లైక్, అన్ లైక్ బట్టన్స్ మరియు షేర్ బట్టన్ ఉంటుంది. షేర్ బటన్ పై క్లిక్ చేస్తే, ఈ క్రింది చిత్రంలో మాదిరిగా ఒక పోప్ అప్ విండో వస్తుంది. క్రింది ఇమేజ్ చుడండి.
మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?
పైన గల ఇమేజ్ లో వీడియో లింక్ ఎదురుగా copy అను ఆంగ్ల అక్షరాలు బ్లూ కలర్లో కనబడుతున్నాయి… కదా ఆ ఆంగ్ల అక్షరాలపై క్లిక్ చేయగానే, వీడియో యొక్క లింక్ copy అవుతుంది.
అలా మీ చానెల్ యూట్యూబ్ వీడియో లింక్ copy చేసి, దానిని అప్పటికే ఓపెన్ చేసి ఉన్న వై2మేట్.కాం బ్రౌజర్లో ఈ క్రింది చిత్రంలో మాదిరిగా పేస్ట్ చేయగానే, ఆడియో వీడియో డౌన్ లోడ్ బట్టన్లు కనబడతాయి.
మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?
పైచిత్రంలో చూపిన విధంగా వీడియో లింక్ బట్టన్ పై క్లిక్ చేయగానే, క్రింది చిత్రంలో మాదిరి మరొక పోప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ గ్రీన్ కలర్లో ఉన్న డౌన్ లోడ్ బట్టన్ పై క్లిక్ చేయగానే, మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ కావడం మొదలు అవుతుంది.
కొన్ని బ్రౌజర్ సెట్టింగ్స్ బట్టి ఈ క్రింది చిత్రంలో మాదిరిగా, డౌన్ లోడ్ ఫైల్ ను సేవ్ చేయవలసిన పోప్ అప్ విండో ఓపెన్ అవ్వవచ్చు… అప్పుడు ఒకే బట్టన్ క్లిక్ చేస్తే, మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ అవుతుంది.
మీ నెట్ వర్క్ ఇంటర్నెట్ వేగం బట్టి, వీడియో డౌన్ లోడ్ సమయం ఉంటుంది.
మనకు అనేక తెలుగు కధలు ఉన్నాయి… అయితే కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? అంటే, కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని వ్యాక్యాలలో కధ గురించి…. ఈ తెలుగు వ్యాసంలో
కధ అంటే ఎదో ఒక సత్యమైన విషయమును తెలియజేస్తూ, కల్పనతో కూడిన వచనం గాని, వాక్కుగా గాని చెబుతారు. పరిణామం ప్రకారం కధలు చిన్న కధలు, పెద్ద కధలు, నవలలు, ఒక పేజి కధలు… అలా కొన్ని రకాలుగా కధలు ఉంటాయి.
కధలు చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి అమ్మ చెప్పే కమ్మనైన కధలు ఉంటాయి. ఇలా చిన్న పిల్లలకు అమ్మ చెప్పే కధలలో నీతికధలు కూడా ఉంటాయి. ఇంకా అవి పురాణాలలోని కధలు కావచ్చు. సమాజంలో నానుడి పొందిన కధలు కావచ్చు… కానీ అమ్మ చెప్పే కమ్మని కధలు వీనులకు విందుగా ఉంటాయి.
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?
ఇంకా చిన్న పిల్లలకు అమ్మమ్మ, తాతయ్యలు కూడా ఓపికగా కధలు చెబుతూ ఉంటారు. వీరు చెప్పే కధలలో కూడా రామాయణ, భారతం లాంటి పురాణేతిహాస కధలు ఉండవచ్చు… లేక వారే కల్పించి కధను చెప్పవచ్చు.
అంతర్లీనంగా నీతిని ప్రభోదించడం
అమ్మ చెప్పినా, అమ్మమ్మ చెప్పినా కధలలో నీతి ఉంటుంది. అంతర్లీనంగా నీతిని ప్రభోదించడం ఇటువంటి కధలలో ఉంటుంది. ఇలాంటి కధలు గతంలో గద్యంగా రచించబడి ఉండవచ్చు.. లేదా ప్రసిద్ది చెందినవారి వాక్కులుగా ఉండవచ్చు..
తెలుగులో అనేక కధలు ఉన్నాయి. అవి కవులు రచించిన కధలు ఉంటాయి. ప్రసిద్ది చెందిన రచయితల కధలు దిన, వారపత్రికలలో ప్రచురితం అవుతూ ఉంటాయి.
సంభాషణలలో కధలు పుడుతూ ఉంటాయి. సరదాగా మాట్లాడుకుంటూ కధలు అల్లి చెప్పగలిగే సామర్ధ్యం ఉన్నవారు, సమాజంలో తారసపడవచ్చు…. అప్పటికప్పుడు మాటల మధ్యలోనే కధ అల్లి చెప్పేస్తారు… ఇలాంటి కధలను కట్టు కధలని అంటారు. ఇవి ఎలాగైనా ఒక విషయం గురించి ఎదుటి వ్యక్తిని ఒప్పించే ప్రయత్నంలో పుడుతూ ఉంటాయి.
కధలు ఆసక్తిగా ఉంటూ, అంతర్లీనంగా నీతిని, సుగుణాలను వ్యక్తం చేస్తూ ఉంటాయి. సుగుణాలపై ఆసక్తి కదల వలన కూడా కలుగుతుందని అంటారు. కద అంత శక్తిని కలిగి ఉంటాయని చెబుతారు. ఇందుకు ఉదాహరణ… శివాజీ మహారాజుకు మంచి గుణాల కలగడంలో, అతనికి చిన్నతనంలో తనతల్లి చెప్పిన సాహస కధలు కారణం అంటారు.
తెలుగు కధ వృత్తాంతం బట్టి కధలను
కధలలో కధ వృత్తాంతం బట్టి కధలను కొన్ని వర్గాలుగా చెబుతారు. సాహస వీరుల గురించి తెలియజేసే కధలను సాహస కధలు అని అంటారు. ప్రక్రుతి గురించి అయితే, ప్రక్రుతి కదలని అంటారు. నీతిని ప్రధానంగా ప్రభోదిస్తూ ఉంటే నీతి కదలని అంటారు. నేర ప్రవృత్తిని తెలియజేసే కధలను క్రైం కదలని అంటారు.
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?
చరిత్రను తెలుపుతూ ఉంటే, చారిత్రిక కదలని, పురాణాల నుండి వెలువడిన కధలు అయితే, పురాణ కదలని అంటారు.
కధలను చెప్పేవారిని కధకులు అంటారు. పురాణాలలో హరి గురించి తెలియజేసే కధలను చెప్పేవారిని హరిదాసు అంటారు.
కధలో ప్రధాన వ్యక్తి, కధానాయకుడు అయితే, అతనిని అనుసరించే స్త్రీని కధానాయిక అవుతుంది. కొన్ని కధలలో స్త్రీ ప్రధాన పాత్రగా ఉంటే, కధానాయికగా ఉంటే, ఇందులో కదానాయుకుడు, కధానాయికను అనుసరించేటట్టు ఉంటుంది. కధలో ప్రధానవ్యక్తి మరణిస్తే, కదా శేషుడు అంటారు. ప్రధానస్త్రీ మరణిస్తే, కదా శేషురాలు అంటారు.
అసలు కధ అనే పాదం కథ్ అనే ధాతువు నుండి పుట్టిన పదంగా చెబుతారు. ఈ కధానిక ప్రస్తావన అగ్ని పురాణంలో చెప్పబడినట్టుగా చెబుతారు.
ఇక కధలలో రకాలు…
రంగమును బట్టి కధలు ఉంటాయి. సినిమాలు నిర్మించడానికి తయారుచేసుకునే కధలు ఉంటాయి. వీటిని సినిమా కధలుగా చెబుతారు. ఎక్కువగా కల్పితం ఉండే కధలు ఇవి.
చిన్న పిల్లలకు బొమ్మల రూపంలో చెప్పే కధలను బొమ్మల కదలు అంటారు. ఇవి చందమామ వంటి పత్రికలలో ప్రచురితం కాబడి ఉంటాయి.
రేడియోలాలో ప్రసాదం కావడానికి తయారు చేసుకునే కధలను లేదా రేడియోలలో చెప్పబడిన కధలను రేడియో కధలు అంటారు.
పత్రికలలో ప్రచురితం కావడానికి తయారు చేసుకునే కధలను లేక ప్రచురితం అయిన కధలను పత్రికా కదలని అంటారు.
సామజిక సమస్యలను స్పృశిస్తూ, సామజిక బాధ్యతను గుర్తు జేసే కధలను అభ్యుదయ కదలని అంటారు.
ఒక వ్యక్తి చేత ఎక్కువ చెప్పబడిన కధలను ఆ వ్యక్తి పేరుతొ కధలుగా చెబుతారు. అలాగే ఒక వ్యక్తి ప్రధాన పాత్రగా సాగే అనేక కధలను, ఆ వ్యక్తి పేరుతొ గల కధలుగా చెబుతారు. ఉదా: తెనాలి రామకృష్ణ కధలు…
అలాగే ఒక మార్గం లేదా ఒక ప్రాకృతిక అంశం ఆధారంగా చెప్పబడే కధలను కూడా ఆ అంశము పేరుతొ గల కధలుగా చెబుతారు. ఉదా: చందమామ కధలు, కాశి మజిలి కధలు.
ఇంకా చిన్న చిన్న కధలను చిన్న కదలని, పిట్ట కదలని, తాతమ్మ లేక తాతయ్య కధలు అంటారు.
మన తెలుగులో పిట్ల కధలు, కట్టు కధలు తదితర తెలుగు కధలు
పిట్ట కధలు, కట్టు కధలు, తాతమ్మ కధలు ఎక్కువగా కల్పితమైనవిగానే ఉంటాయి.
పురాణాలలోని కొందరు వ్యక్తుల గుణాలు తెలియజేస్తూ చెప్పే కధలు పురాణ కధలు లేక ఇతిహాస కధలుగా చెబుతారు. చరిత్రలో ధీరుల గురించి, వీరుల గురించి, నాయకుల గురించి, వారి వారి సుగుణాలను తెలియజేస్తూ చెప్పే కధలను చారిత్రక కధలు అంటారు.
జానపదుల చేత చెప్పబడిన కధలను జానపద కధలు అంటారు.
ఆసక్తిని రేకెత్తిస్తూ, వివిధ విషయాల సారమును పొందుపరిచే మాటలతో, చివరకు నీతివ్యాక్యమును గుర్తుకు తెచ్చేవిధంగా సాగడమే కద యొక్క గొప్పతనంగా చెప్పబడుతుంది.
బాలబాలికలలో మంచి గుణాలపై ఆసక్తిని పెంపొందించే సాధనాలలో కధ ప్రధానమైనదిగా ఉంటుందని అంటారు. మంచి వ్యక్తిత్వం కొరకు మంచి మంచి నీతి కధలు వినాలని అంటారు.
వినే కధ యొక్క కధావస్తువును బట్టి మనసులో మెదిలే ఆలోచనలు ఉంటాయని అంటారు. అందుకే పిల్లలకు నీతి కధలను వాక్కు రూపంలో కానీ, బొమ్మల రూపంలో కానీ తెలియజేస్తూ ఉంటారు.
కాలక్షేపం కోసం చెప్పుకునే కధలను కాలక్షేప కధలు లేక సంభాషణ కధలు అని అంటే, అలాంటి కాలక్షేప కధలకు స్మార్ట్ ఫోన్ ఒక బ్రేక్ ఇచ్చినట్టే అంటారు. స్మార్ట్ ఫోన్ వంటి పరికరాలలో అనేక కాలక్షేప విషయాలు మనిసి మనసుకు ఆకర్షిస్తాయి…కాబట్టి.
కధ వలన నీతి అనే మాట మనసును తాకుతుంది. కావున కధలు ఇప్పటికి అమ్మ నోటివెంట వెలువడుతూనే ఉంటాయి. తాతయ్య, తాతమ్మ వంటి పెద్దల మాటలలో కధలు కదులుతూనే ఉంటాయి…
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? అంటే కధ మంచి విషయమును అంతర్లీనంగా అందిస్తూ, ఆసక్తిగా సాగే వచన రూపం కానీ వాక్ రూపం కానీ అయి ఉంటుంది. కధలు తెలియజేసేదేమిటి? అంటే నీతిని ఎక్కువగా ప్రభోదిస్తూ ఉంటాయి.
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి ! గుణపాఠం అంటే గుణమునకు పాఠం. ఎవరి గుణమునకు పాఠం అంటే, చెడుగుణం కలిగిన వ్యక్తికి గుణపాఠం అంటారు.
ఒక వ్యక్తిని మోసం చేస్తూ, మరొక వ్యక్తి జీవిస్తూ ఉంటే, మోసం చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పే అవకాశం మోసపోయిన వ్యక్తికి కాలం కల్పిస్తుంది…
కానీ గుణపాఠం త్వరగా ప్రారంభం కాకపోవచ్చు… కానీ గుణపాఠం ఎదురయితే జీవితంపై ప్రభావం పడుతుంది…. సమాజంలో గుర్తింపు మారుతుంది.
సమాజంలో వివిధ రకాల స్వభావాలతో వ్యక్తులు కలిసి ఉంటారు. అందరి స్వభావం ఒకేవిధంగా ఉండకపోవచ్చు. అలాగే వివిధ వ్యక్తులు వివిధ రకాల గుణాలను కలిగి ఉంటారు.
ఒకరి గుణం వలన మరొకరికి మేలు జరగవచ్చు. ఒకరి గుణం వలన మరొకరికి నష్టం కలగవచ్చు. కానీ ఒకరి గుణం వలన మరొకరికి చేటు కలిగితే, సదరు వ్యక్తికి గుణపాఠం కాలమే చెబుతుందని అంటారు.
అంటే కాలంలో మరొక వ్యక్తి రూపంలోనో మరొక సంఘటన ద్వారానో చెడు గుణాలు కలిగిన వ్యక్తికి కాలం గుణపాఠం చెబుతుందని పెద్దలు అంటారు.
గుణాలు మారే స్వభావం ఉన్నవారికి, చెడు ప్రవర్తన కలిగిన వారికి కూడా కాలం ద్వారా సమాజంలో గుణపాఠం ఉంటుందని చెబుతారు. సమాజంలో సహజీవనం చేసే వ్యక్తులు మంచి గుణాలు కలిగి ఉంటే, సమాజం చేత కాలంలో కీర్తింపడతారు. అదే చెడు ప్రవర్తన కలిగి ఉండీ, ఇతరులకు చేటు చేసేవిధంగా ప్రవర్తించేవారికి సమాజం కాలంలో గుణపాఠం చెబుతుంది.
జీవితంలో ఎదురైన సంఘటనల ద్వారా గుణపాఠం నేర్చుకున్న వ్యక్తి, తన జీవన మార్గాన్ని మంచివైపు నడిపించగలడు. గుణపాఠం నేర్వని వ్యక్తి స్వీయపతనానికి కారణం కాగలడు.
ఒక వ్యక్తి ఏదైనా పని చేసేటప్పుడు, ఆ పని వలన సామాజిక విధానానికి విఘాతం కలిగిస్తుందంటే, విజ్నులు సదరు పనిని మానుకుంటారు.
అలాగే ఎవరైనా ఒక వ్యక్తి తన స్వార్ధ ప్రయోజనం కోసం సామాజికమైన నష్టం ఉన్నా, సామాజిక ప్రయోజనలు ప్రక్కనపెట్టి తన స్వార్ధ ప్రయోజనం గురించే చూసుకునేవారికి సమాజం చేత కాలంలో గుణపాఠం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
తన గుణాలు తాను పరిశీలన చేసుకోవడానికే కాలం పరిస్థితుల ద్వారా వ్యక్తికి జీవన పాఠాలు చెబితే, గుణపాఠం నేర్చుకున్నవారు. జీవితగమ్యాన్ని చేరగలరని పెద్దలంటారు.
జీవనపోరాటంలో సామాజిక పరిస్థితులు ఎప్పుడూ అనుకూలం కాదు… అలాగే ఎప్పుడూ ప్రతికూలం కాదు. అలాంటి కాలంలో సద్గుణాలతో నడుచుకునేవారి ప్రవర్తన మిగిలినవారికి ఆదర్శప్రాయంగా ఉంటుంది.
సహజీవనంలో సహచరులను ఇబ్బందులకు గురిచేస్తూ, ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం వ్యక్తిగత స్వార్ధం కోసం వ్యవస్థాగత ప్రయోజనాలు కూడా ప్రక్కన పెట్టేసేవారు జీవితంలో గుణపాఠం ఎదురౌతుందని అంటారు.
ప్రకృతి నియమాలు పక్కకు పెట్టి, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తే, సదరు ప్రాంతం కాలంలో గుణపాఠం పొందుతుందని అంటారు. అంటే పర్యావరణం విషయంలో ప్రకృతిని అసహజమైన పద్దతిలో ఉపయోగించుకోవడం కూడా ప్రకృతి నుండి గుణపాఠం ఎదుర్కోవడానికి కారణం కాగలదు.
అపకారికి ఉపకారం చేయమని సూచించే పద్యం మనకు బాగా ఫ్యామస్…
తనకు అపకారం చేసినవారికి సాయం అవసరం అయితే, అలాంటి అపకారికి కూడా ఉపకారమే చేయమని నీతిని తెలియజేసే పద్యం.
అంటే ఈ పద్యం యొక్క భావమును పరిశీలిస్తే, సమాజంలో ఒకరు మరొకరికి అపకారం చేయకుండా ఉండాలనే భావనకు బలం చేకూరుతుంది.
ఒక వ్యక్తికి అపకారం చేసిన వ్యక్తికి కూడా ఉపకారమే చేయమని అంటే, తనకు అపకారం చేయకుండా ఉన్నవారికి, ఉపకారం చేసిన వారికీ ఉపకారమే చేయాలి… ఇక అపకారం ఎవరికి చేయాలి?
పద్య భావం ప్రకారం అపకారం చేయాలనే ఆలోచన రాకుండా ఉంటే, అటువంటి వ్యక్తి ఉత్తమ గుణమే కలిగి ఉన్నట్టు.
ఒక వ్యక్తికి సమాజంలో అపకారం చేయనివారు, ఉపకారం చేసినవారు కూడా ఉంటారు. కానీ ఆ ఒక వ్యక్తి తన స్వార్ధం కోసం తెలిసి తెలిసి అపకారం తలపెడితే, మాత్రం అటువంటి వ్యక్తి గుణపాఠం కాలంలో ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది.
ప్రకృతిలో కాలంలో చర్యకు ప్రతిచర్య జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఎలా జీవనం సాగిస్తూ ఉంటే, అలాంటి జీవనం వలన ఏర్పడే పరిస్థితులు మరలా ఎదురయ్యే అవకాశం కాలంలో కలుగుతూ ఉంటుంది.
కాబట్టి వ్యక్తికి చుట్టూ ఉండే వ్యక్తుల ద్వారా మంచిచెడులు సూచించబడుతూ ఉండే అవకాశం ఎక్కువ… వ్యక్తుల ద్వారా సూచించబడే సమయం మనల్ని మనం మార్చుకునే సమయంగా అవకాశంగా భావిస్తే, వ్యక్తి జీవనం శాంటిమయం అవుతుంది… అంటారు.
శ్రుతిమించిన వ్యవహారం బెడిసికొడుతుంది… అలా పదే పదే అలాంటి వ్యవహారాలు నిర్వహించేవారికి కాలమే గుణపాఠం చెబుతుందని అంటారు…
ఎవరికైనా గుణపాఠం ఎవరైనా చెప్పే అవకాశం కాలం భవిష్యత్తులో కల్పిస్తుందని అంటారు… అయితే అప్పటికి ఆ వ్యక్తిలో కూడా దోషం ఉండకుండా స్వీయపరిశీలన అవసరం అని అంటారు.
స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక ప్రవర్తన వలన ఆ బంధం మరింత బలపడుతుంది అంటారు. ఏ బంధం అయినా స్నేహం ప్రభావం ఉంటుంది.
మానవ జీవనం అనేక బంధాలతో కొనసాగుతుంది. ప్రతి బంధంలోనూ స్నేహపూర్వకంగా ప్రవర్తించే వారు శాంతిగా ఉంటారు. వారి చుట్టూ ఉండేవారిని శాంతిగా ఉంచుతారు.
అంటే స్నేహం యొక్క ప్రభావం ప్రతి మానవ బంధంపైనా ఉంటుంది. అంటే స్నేహం ఇద్దరి మద్యలో అంతరాలను తొలగిస్తుంది. ఇద్దరినీ ఒక్కటి చేసే ప్రక్రియలో మొదటిమెట్టు స్నేహమే అవుతుంది.
మంచి మిత్రుడిని మించిన ఆస్తి లేదంటారు. ఎందుకంటే మంచి మిత్రుడు స్నేహితుడి మంచిని కోరుకుంటాడు. ఆపదలో ఆదుకుంటాడు. బాధలో ఓదార్పు అవుతాడు. కష్టానష్టాలలో మంచి మిత్రుడు వెన్నంటే ఉంటాడు. కాబట్టి మంచి మిత్రుడిని మించిన ఆస్తి ఉండదని అంటారు.
అమ్మఒడిలో అమ్మ దగ్గర అప్యాయతను చూసిన తర్వాత, మనిషి చూసే మరో ఆప్యాయత స్నేహంలో కనబడుతుంది. మంచి మిత్రుడు వలన మరొక మంచి బంధమే అవుతుంది.
స్నేహపూర్వక ప్రవర్తనతోనే పనులను సులభంగా నెరవేర్చుకోగలం… స్నేహంతో మెదిలే మనిషికి అంతా స్నేహితులే…
అహంకారికి మిత్రులుండరు అని అంటారు… అంటే ఎక్కువమంది మిత్రులన్నవారికి అహంకార భావన ఉండదేమో… లేదా స్నేహపూర్వక ప్రవర్తనతో ఎదుటివారి అహం సంతృప్తి చెందుతుంది. ఏది ఏమైనా స్నేహం వలన ఇద్దరి మధ్య అహంకార అంతరాలు తొలగిస్తుంది.
ప్రేమకు పునాది స్నేహమని ఎక్కువమంది నమ్ముతారు. అంటే ప్రతి బందంలోనూ ప్రేమ ఉంటుంది. కాబట్టి ప్రేమను వెన్నంటే స్నేహం ఉంటుంది.
మనిషికి ఉండే బంధాలు స్నేహంతో ముడిపడి ఉంటే, ఆ బంధం మరింత బలంగా
తండ్రి కొడుకుతో స్నేహపూర్వకంగా ఉంటే, ఆ కొడుకుకు తనతో సింహం స్నేహం చేస్తున్నట్టేగానే అనిపిస్తుంది.
అమ్మ కూతురితో స్నేహంగా ఉంటే, ఆదిశక్తి ఆ అమ్మాయితో స్నేహం చేస్తున్నట్టే…
అన్న తమ్ముడితో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఆ తమ్ముడికి పులి తోడు ఉన్నట్లే…
ఇలా సహజంగా మనిషికి ఉండే బంధాలు స్నేహంతో ముడిపడి ఉంటే, ఆ బంధం మరింత బలంగా మారుతుంది.
వ్యక్తికి మిత్రులు ఉన్నట్టే శత్రువులు ఉండవచ్చు… అయితే శత్రువు కూడా మిత్రుడుగా మారితే మాత్రం… జీవితం సుఖవంతం…
స్నేహం వలన శతృత్వ భావనలు ఉండవు.
ఎదుగుతూ ఉన్నప్పుడే ఏర్పడే స్నేహబంధం, జీవితముపైన ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎంతమంది మిత్రులు ఉంటే, అంత బలగం వ్యక్తికి ఉన్నట్టే…
ప్రతి బంధమూ నేను నువ్వు అనే వేర్పాటు భావన తీసుకురావచ్చు కానీ స్నేహం మాత్రం సమానమనే భావనతోనే ఆరంభం అవుతుంది. మనమంతా ఒక్కటే అనే బలమైన భావనను స్నేహం మరింతగా పెంచుతుంది.
గొప్పవారి స్నేహం వలన మనకూ సమాజంలో గౌరవం లభిస్తుంది. అంటే స్నేహం ఎప్పుడూ సమానమైన స్థితినే ఇస్తుంది.
స్నేహం అంటే స్నేహమే చెప్పాలి… మంచి స్నేహమే మేలు చేస్తుంది. అటువంటి మంచి స్నేహంలోనే స్నేహం యొక్క గొప్పతనం తెలియబడుతుంది.
సమాజంలో స్నేహం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహం గురించి తెలియజేయాలంటే పది వ్యాక్యాలు కాదు పది పుస్తకాలు వ్రాసిన సరిపోదు.
స్నేహం గొప్పతనం మంచి మిత్రుడు స్నేహం వలననే తెలియబడుతుంది…
స్నేహితుడి దృష్టిలో లోకంపై మిత్రభావనతోనే ఉంటుంది. స్నేహామంటే స్నేహమే… అయితే ఎటువంటి స్నేహం చేస్తూ ఉంటే అటువంటి ప్రభావం జీవితంపైన ఖచ్చితంగా ఉంటుంది అంటారు.
అందుకే స్నేహం చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు.
ఏ బంధం అయినా స్నేహపూర్వక ప్రవర్తన వలన బలహీన పరిస్థితిలో కూడా బలంగా మారగలదు… ఇలా ఆలోచిస్తే జీవితంలో ప్రేమ ఉన్నంత బలంగా స్నేహం కూడా ఉంటుంది.
కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం. కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. ఇంతకంటే మంచి పోలిక ఏముంది?
వ్యక్తి తన జీవిత కాలంలో సమయ పాలన పాటించడం బట్టి, అతని జీవితం ఆధారబడి ఉంటుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగడం వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ ఉంటుంది. అదే వ్యక్తి తగు సమయానికి పనిని పూర్తి చేయలేకపోతే, ఆ వ్యక్తి చేతివృత్తికి విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా, అవసరానికి ఉపయోగపడే విధంగా ప్రతిభ ప్రదర్శించలేకపోతే, ఆ ప్రతిభా పాటవాలు నిరర్ధకమే అంటారు.
అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ, మరొక వ్యక్తి అవసరం లేక ఒక వ్యవస్థాగత అవసరంపైన ఆధారపడి ఉంటుంది. అలా కాలంలో వ్యక్తి ప్రతిభకు గుర్తింపు, ఆ వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా తన పనిని తాను పూర్తి చేయడంపైన ఆధారపడి ఉంటుంది.
వ్యక్తి కానీ వ్యవస్థ కానీ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందించే ప్రక్రియను పాటిస్తూ, ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తూ ఉంటే, సేవలు సమయానికి ఉపయోగపడితే, సదరు వ్యవస్థపైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. సదభిప్రాయం ఏర్పడితే, సదరు వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్ధికంగా లాభాలు గడించగలరు. అంటే ఆర్ధిక పురోగతిని కాలం శాసించగలదు.
గడువులోపులో పనిని పూర్తి చేయగలగడం వలన అవసరాలకు అంతరాయం కలగదు
ఒక మోటారు సైకిల్ మెకానిక్, ఒక వ్యక్తి యొక్క మోటారు సైకిల్ రిపైరు చేయడానికి రెండురోజులు గడువు కోరితే, అతను ఖచ్చితంగా తను కోరిన గడువులోపులో మోటారు సైకిల్ రిపైరు చేయగలిగితే, సదరు మోటారు సైకిల్ యజమాని యొక్క మన్ననకు పాత్రుడు కాగలడు. కానీ ఆ రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైరు చేయలేకపోతే మాత్రం, మరొకసారి మోటారు సైకిల్ రిపైరుకు వచ్చినప్పుడు సదరు యజమాని మరొక మెకానిక్ కొరకు శోచించే అవకాశం ఉంటుంది. అదే మోటారు సైకిల్ తన దగ్గర కొంతమంది సహాయకులను పెట్టుకుని, తన దగ్గరకు వచ్చిన ప్రతి మోటారు సైకిల్ రిపైరు చేసేస్తూ ఉంటే, అతని దగ్గరకు ఆ ప్రాంతపు మోటారు సైకిల్ యజమానులు మోటారు సైకిల్ రిపైరు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ కాలంలో అవసరానికి మోటారు సైకిల్ రిపైర్ చేయగలగడం వలన అతని ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఇంకా వాహనదారుల పని కూడా అంతరాయం ఏర్పడకుండా ఉంటుంది.
కాలంలో ఒక వ్యక్తి ఇచ్చే కమిట్ మెంట్, మరొక వ్యక్తి మరొకరికి ఇచ్చే కమిట్ మెంట్ కు కారణం కాగలదు. అంటే మోటారు సైకిల్ మెకానిక్ ఒక మోటారు సైకిల్ యజమానికి మోటారు సైకిల్ రిపైరుకు రెండురోజులు గడువు ఇస్తే, ఆ మోటారు సైకిల్ యజమాని కూడా తను పనిచేసే చోట కానీ, తన సేవలు అందుకునే వ్యక్తులకు కానీ అదే గడువు కోరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మోటారు సైకిల్ మెకానికి రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైర్ చేయగలిగితే, అతని మాట నిలబడుతుంది. ఇంకా మోటారు సైకిల్ యజమాని మాట నిలబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే, కాలమును బంగారంగా మార్చుకోవడమే…. భవిష్యత్తులో మాటకు విలువ పెరగడమే అవుతుంది.
అలా ఒక మెకానిక్ తను కోరిన గడువులోపులో పనిని పూర్తి చేయగలగడం వలన అవసరాలకు అంతరాయం కలగదు.
ఇలా వ్యవస్థ అయిన సరే, తమ సంస్థ ఇచ్చే గడువులోపులో సేవలను అందించడమే, ఆ సంస్థ మనుగడకు ప్రధాన కారణం కాగలదు.
వ్యక్తి జీవితములో కాలం కన్నా విలువైనది ఉండదు.
బాల్యం అంటే చిన్నప్పుడు
యవ్వనం అంటే యుక్త వయసుకు వచ్చినవారు
వృద్దాప్యం అంటే ముసలివారు….
పై ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి.
బాల్యంలో ఆటలు ఆదుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా చాలా ప్రధాన విషయం. బాల్యంలో ఒక బాలుడు స్కూల్ కు వెళ్తూ చదువుకుంటూ, రోజు కొంత సమయం ఆటలు ఆడుకోవడం… ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు.
ఆటల వలన శరీరానికి అలుపు ఉంటుంది. సమయానికి తినడం వలన, తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వలన విషయ పరిజ్నానమ్ పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోదనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది.
సామాన్యమైన చదువు ఒక ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది.
అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యంగా ఉండేలా, బాల్యంలో చదివే చదువులు వ్యక్తి వృత్తికి సాయపడేలా ఉంటాయి… ఇక్కడ ఎంత శ్రద్దపెట్టి చదువు చదివితే, అంత గుర్తింపు… ఎంత చక్కగా తిండి తిని, సరైన వ్యాయామం కానీ ఆటలు కానీ అడితే, అంతటి ఆరోగ్యం అంటారు.
కష్టపడి బాల్య కాలంలో చేసే సాధన యవ్వన కాలమును ప్రభావితం చేస్తుంది. అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని, వృద్దాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్టం యొక్క ఫలితం మరొక కాలంలో పడుతుంది.
కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం
అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి… అందుకు శ్రమించాలి అని అంటారు.
కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై పడుతూ ఉంటాయి… అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగ పడుతుంది.
ఒక వ్యక్తి వ్యాయామంతో కాయమును పెంచితే, ఆ కాయము కాలంలో వచ్చే అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుందని అంటారు.
అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే, కాలంలో కలిగే ఆర్ధిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది.
ఒక వ్యక్తి తనతోటివారికి సాయపడుతూ ఉంటే, కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటివారే తనకు అండగా నిలబడతారు….
అంటే ఒక వ్యక్తి చేసే సాధన ఏవిధంగా ఉంటే, అదే విధంగా కాలంలో సమాజం నుండి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు.
ఈ విధంగా కాలం వ్యక్తి జీవితముపై అనేక విధాలుగా ప్రభావం చూపగలదు… కాబట్టి కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం… అందుకే కాలం చాలా విలువైనది… ఇది ఒక మాటగా ఉండవచ్చు. ఒక సేవగా ఉండవచ్చు. ఒక సాయంగా ఉండవచ్చు. డబ్బురూపంలో ఉండవచ్చు… ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా విలువైనది…. మాత్రం సత్యం... కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం…
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం.మాటతీరు వలన మన్ననలు పొందవచ్చు. మాట తీరుతో బాగుంటే, స్నేహపూర్వక సమాజం మనిషి చుట్టూ ఏర్పడుతుంది. సంఘంలో గుర్తింపు మాట తీరును బట్టి ప్రభావితం అవుతుంది.
మనిషి మాట తీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. మాట వలన మనిషికి మనిషికి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి.
మాటే మంత్రం అవుతుంది. మాటే కష్టం పోగొడుతుంది. మాటే మనిషికి కష్టాన్ని తీసుకురావచ్చు. మాట శక్తివంతమైనది… అది ఒక మంత్రంగా పనిచేయగలదు. ఎందుకంటే మాట మనసుని తాకుతుంది.
వ్యక్తి మాట తీరు బాగుంటే, ఆ వ్యక్తి చుట్టూ స్నేహితులే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా సరే స్నేహపూర్వక ఆదరణ మాట తీరు బాగుండే వ్యక్తిపై చూపుతారు.
అలా కాకుండా ఒక వ్యక్తి మాట తీరు కటువుగా ఉంటే మాత్రం, ఆ వ్యక్తికి ఎక్కువమంది మిత్రుల కంటే శత్రువులు పెరుగుతారు. మాట తీరు వలననే మిత్రత్వం లేదా శతృత్వ భావనలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి.
సమాజంలో వ్యక్తిపై అతని మాట తీరు ప్రభావం చాల ప్రముఖమైంది. అతని మాటే అతనికి పరిచయాలు తీసుకువస్తుంది,. మాట తీరును బట్టి స్నేహితులు గాని శత్రువులు గాని ఉండవచ్చు.
మాట తీరు మనిషికి ధైర్యాన్ని ఇవ్వగలదు, మాట తీరు వలన విషయాలను చక్కగా వివరించవచ్చును. మాట తీరు మంచిదైతే లోకం అంతా ప్రశాంతంగా కనబడుతుంది. లేకపోతె లోకం అశాంతిగా అనిపిస్తుంది.
కొందరి మాట తీరు ఎదుటివారిలో శాంతిని రేకెత్తిస్తే, కొందరి మాట తీరు ఎదుటివారిలో అశాంతికి కారణం కాగలదు. కొందరు నొప్పించే మాట తీరు కలిగి ఉండి, తమ చుట్టూ ఉండేవారిని కూడా బాధపెడుతూ ఉంటారు.
మాట సాయం వలన మనిషికి మనో బలం ఏర్పడుతుంది. అటువంటి మాట సాయం మంచి మాట తీరు కలిగిన వ్యక్తులకే సాద్యమంటారు.
మాట తీరు ప్రాముఖ్యత గురించి పురాణాలలో కూడా కనబడుతుంది.
మనకు మాట తీరు ప్రాముఖ్యత పురాణాలలోను కనబడుతుంది. రామాయణంలో హనుమంతుడు మాట్లాడితే ప్రాణాలు నిలబడతాయి. హనుమంతుడు చాల చక్కగా ఓర్పుగా మాట్లాడగలడు, విషయం సూటిగా సున్నితంగా హృదయానికి తాకేలాగా మాట్లాడగలడు. అందుకే శ్రీరాముడు సీతాన్వేషణలో హనుమపైన నమ్మకం ఉంచాడు. శ్రీరాముని నమ్మకాన్ని హనుమ నిలబెట్టాడు,
చక్కని మాట తీరు ఉంటే, రోజుల తరబడి మాట్లాడినా ఆ మాటలు వినేవారు ఉంటారు. మహా భారతంలో శుకుని మాటలను వారం రోజులపాటు వింటూ కూర్చున్నాడు. మాట తీరు బాగుంటే చెప్పే విషయం ఎదుటివారి మనసులో మంచి భావనలు పెంచుతుంది.
ఏడు రోజులలలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకున్న పరిక్షత్తు మహారాజు… శుక మహర్షి మాటలకు మరణ భయం పోగొట్టుకున్నాడు. జీవిత పరమార్ధం ఏమిటో తెలుసుకోగలిగాడు… కారణం మంచి మాటలు చెప్పగల వారిని మాట్లాడించేలాగా మాట తీరు కలిగి ఉండడమే…
మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అనే నానుడి ఒకటి కలదు. మంచి భావనలు కలిగి ఉండే వ్యక్తికి మాటపై మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. మాట యొక్క అంతరార్ధం గ్రహించి మెసులుకుంటారు… కాబట్టి మంచి మనిషికో మాట చాలు అంటారు.
ఏదైనా మాట తీరు బాగుంటే లోకమంతా మిత్రులే…. లేకపోతె లోకంలో ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతాయి. మాట తీరు ప్రభావం మనిషి జీవితంపై పడుతుంది.
తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన చక్కని కార్యక్రమం తెలంగాణకు హరితహారం. ఇది అటవీకరణ కార్యక్రమం.
2015 తెలంగాణ రాష్ట్రంలో మొక్కలు నటి, తెలంగాణ అంతా పచ్చదనం నింపాలనే సదుద్దేశ్యంతో ప్రారంభించబడింది… ఈ హరితహారం.
తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ ఈ హరితహారం కార్యక్రమం ప్రారంభించారు.
ఈ హరితహారం కార్యక్రమం ప్రకారం హైదరాబాద్ నగరంలో ఒకరోజునే 25,00,000 మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఒకరోజులో లక్షమంది 163 కిలోమీటర్ల దూరం అనేక మొక్కలు నటించడం జరిగింది.
మొక్కలు నాటడం వాటిని పెంచి వృక్షాలుగా తయారు చేయడం అంటే ప్రకృతి సమతుల్యతకు పాటుపడడమే… ఎక్కువ వృక్షాలు ఉండడం వలన అక్షిజన్ ఎక్కువగా ఉంటుంది.
సహజమైన ప్రాణవాయువు మనిషి మంచి ఆరోగ్యదాయకం అంటారు. మానవ మనుగడకు చెట్లు చాలా కీలకమైనవి… అటువంటి చెట్లతో తెలంగాణ ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడే విధంగా చేయాలనే ఈ హరితహారం కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా భావింపబడుతుంది.
ఏదో ఒక ఏడాది కాకుండా ప్రతియేట ఈ హరితహారం కార్యక్రమం తెలంగాణలో నిర్వహించబడుతుంది. ఏటా అనేక మొక్కలు నాటుతున్నారు.
తెలంగాణలో మొక్కలు నాటి, వాటిని వృక్షాలుగా మార్చి అటవీకరణ ప్రాంతం పెంచి, తెలంగాణలో వానల శాతం పెరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.
రోడ్లకీరువైపుల మొక్కలు నాటడం వలన కాలుష్య ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది.
ప్రాణవాయువు శాతం పెరిగి, సహజమైన గాలి వలన మనిషికి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
పర్యావరణ సమతుల్యత పెరిగే అవకాశం ఈ హరితహారం కార్యక్రమం వలన ఉంటుంది.
ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో….
అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యాలుగా ఉన్నాయి
సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం
ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం
తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం
హరితహారం కార్యక్రమం గురించి ప్రజలలో ప్రేరణ కలిగించడానికి నినాదాలు కూడా కలవు.
తెలంగాణ ‘పచ్చ’ల పేరు.. హరిత హారం జోరు వనాలు పెంచు-వానలు వచ్చు చెట్లను పెంచు-ఆక్సిజన్ పీల్చు పచ్చని అడవులు-సహజ సౌందర్యములు వనాలు-మానవాళి వరాలు పచ్చని వనములు-ఆర్థిక వనరులు అడవులు-మనకు అండదండలు అడవి ఉంటే లాభం-అడవి లేకుంటే నష్టం అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు అటవీ సంపద-అందరి సంపద చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు అడవులు-వణ్యప్రాముల గృహములు పచ్చని వనాలు-రోడ్డునకు అందములు సతతం-హరితం మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి చెట్టుకింద చేరు-సేదను తీరు అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే మొక్కను పట్టు-భూమిలో నాటు దోసిలిలోకి తీసుకోమొక్కు -ఏదోస్థలమున నాటుము మొక్క
ప్రకృతికి మేలు జరిగితే, ప్రకృతి నుండి సమాజనికి మేలు జరుగుతుంది. ప్రకృతిని ఎంత సహజంగా ఉంచితే, ప్రకృతిలో అంత సహజంగా మానవ మనుగడ ఉంటుంది.
సహజంగా ఉండే ప్రకృతిలో చెట్లు చాలా కీలకం… అలాంటి చెట్లను హరితహారం కార్యక్రమం ద్వారా పెంచి, వాటిని పోషించాలని అనుకోవడం మంచి చర్యగా భావింపబడుతుంది.
మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ. తెలుగులో వ్యాసం. ఈ కరోన కాలంలో ఎంత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, అంత ఆరోగ్యం ఇంకా అదే పెద్ద సామాజిక సేవ!
కరోన దాటికి ప్రపంచ దేశాలు దిగివచ్చాయి. లాక్ డౌన్ విధించాయి. ఆర్ధిక లావాదేవీలు పక్కనబెట్టి ప్రజారోగ్యం గురించి, కరోన కట్టడికి కృషి చేశాయి.
అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కరోనపై సంపూర్ణ విజయం సాధించాలి. కరోనపై పూర్తిగా విజయం సాధించాలంటే సామాజికంగా ప్రజల తీరే ముఖ్యం.
ఎవరు ఎంతబాగా తమనితాము కాపాడుకోవడానికి కోవిడ్ నియమాలు పాటిస్తారో? వారే సామాజిక సేవకులు… తమకుతాము మంచి మిత్రులు కూడా.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వలన కరోన వ్యాధి సోకే అవకాశం తక్కువ… తనదాకా కరోన వైరస్ రాకుండా నియంత్రించడం అంటే, తన నుండి కరోన వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడమే….
అందరూ గుర్తించవలసిన విషయం కరోన వ్యాప్తి చెందకుండా తమకుతాము తగు జాగ్రత్తలు పాటించడం. అనవసరంగా గుంపులలోకి రాకుండా ఉండడం… ప్రధానమైన విషయం.
అనవసరపు ప్రయాణాలు చేయకుండా ఉండడం. ఒకవేళ ప్రయాణం చేయవలసిన అగత్యం ఏర్పడితే మాత్రం, ప్రభుత్వ సూచనలు పాటించడం….
ప్రయాణములో మాస్క్ ధరిచి ఉండడం... ధరించిన మాస్క్ మూతి, ముక్కు కనబడకుండా ఉండేలా చూసుకోవడం… ఎక్కడ బడితే అక్కడ చేతులు వేసి, ఆ చేతులను ముఖముపై పెట్టకుండా ఉండడం వంటి జాగ్రత్తలు పాటించడం….
ఇలా మనం మన పరిశుభ్రత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే, అంత ఆరోగ్యంతో బాటు సామాజిక సేవ కూడా అవుతుంది. ఎందుకంటే మన జాగ్రత్త వలన కరోన మన ద్వారా సమాజంలో వ్యాప్తి చెందదు.
ఇక ఇలా వ్యక్తి పరిశుభ్రతతో బాటు పరిసరాల శుభ్రత కూడా చాలా ప్రధానమైన విషయం. పరిసరాల బాగుంటే, చుట్టూ ప్రక్కల క్రిములు చేరకుండా ఉంటాయి.
చెత్తను ఎక్కడ బడితే అక్కడ పడవేయకుండా ఉండాలి. దాచిపెట్టిన చెత్తను మున్సిపాలిటీ లేదా పంచాయితీ బళ్ళు వచ్చినప్పుడు ఆ బళ్ళల్లో చెత్తను వేయాలి.
ఇంకా బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలి. బహిరంగ మురుగునీటిపారుదలను అరికట్టాలి. కలుషితమైన నీరు తాగడం మానివేయాలి. దోమల నిర్మూలన చేయాలి….
వ్యక్తిగత పరిశుభ్రత మనం మన పరిశుభ్రత విషయంలో
మనం తినే భోజనం వేడిగా ఉండాలి.
మనం ఆహారం తీసుకునే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.
శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు వ్యాయామం చేయాలి.
సురక్షితమైన లైంగిక సంబంధము వలన మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండగలదు.
సాధారణ ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి.
సాధారణంగా కొన్ని రకాల వ్యాధులు వివిధ బుతువులు, కాలాల్లో వసుంటాయి. వీటిని సీజనల్ వ్యాధులు అంటారు. అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కాలక్రమంలో వచ్చే వ్యాధుల గురించి , వాటికి సంబంధించిన కారణాలు, లక్షణాలు తెలుసుకోవాలి.
వ్యాధి లక్షణలు తెలియడం వలన వ్యాధినివారణ సులభం అవుతుంది.
అలా ఆ వ్యాధులను నివారించడమే కాకుండా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు.
ఇలా తగు జాగ్రత్తలతో ఉండడం వలన కరోన కాలంలో కూడా వ్యాధిగ్రస్తులు కాకుండా ఉండవచ్చు.
పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం. పక్షులకు ప్రధానంగా ఎగిరే గుణం ఉంటుంది. తమ ఆహార సముపార్జనకు ఆకాశంలో తమ శక్తిమేర ఎగురుతాయి.
ఈ పక్షులు అంతరోష్ణ జీవులు లేక ఉష్ణ రక్త జీవులు అంటారు. పక్షుల శరీరం ఎగరడానికి వీలుగా వాటి దేహ నిర్మాణం ఉంటుంది.
రెక్కల సాయంతో పక్షులు ఎగురుతాయి. శరీరంపైభాగం ఈకలతో కప్పబడి ఉంటుంది.
కొన్నిరకాల పక్షులు నీటిపై కూడా ఉండగలవు. వీటిని నీటిపక్షులు అంటారు.
కొన్ని పక్షులు రాత్రులు మేల్కొని ఉంటాయి, రాత్రివేళల్లో మాత్రమే సంచరిస్తాయి. వీటిని నిశాచర పక్షులు అంటారు.
మరికొన్ని పక్షులు ఒక నిర్ధిష్ట సమయం ప్రకారం చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి, మరల తిరిగి వస్తాయి. వీటిని వలస పక్షులు అంటారు.
నీటిపక్షులకు ఉదాహరణగా బాతు, హంస, నీటికోడి, నీటికాకి…. చెబుతారు.
నిశాచర పక్షులకు ఉదాహరణగా గుడ్లగూబ, పైడిగంట…. చెబుతారు.
రకరకాల పక్షులు భూమిపై జీవిస్తూ, ఆకాశంలో ఎగురుతాయి. పిచ్చుకలు, కాకులు, గ్రద్దలు, చకోర పక్షి, చిలుక, మైనా, పావురాలు, రాబందులు, కొంగలు, లకుముకి, వడ్రంగి, పాలపిట్ట, గోరింక తదితర పక్షులు ఉంటాయి.
పక్షులు గూడు గురించి
తల్లిపక్షి పిల్ల పక్షులను గూడులో ఉంచి కాపాడుతుంది. పిల్ల పక్షులకు ఆహారం తీసుకొచ్చి, పిల్ల పక్షుల నోటిలో పెడతాయి. పిల్ల పక్షులకు రెక్కలు వచ్చి ఎగిరేవరకు తల్లి పక్షి, పిల్ల పక్షులను రక్షిస్తుంది.
ఇక ఈ పక్షిగూళ్ళు పుల్లలు, గడ్డి, ఆకులు వంటి సేంద్రీయ పదార్థాలతో కలిసి ఉండవచ్చు, ఇవి రకరకాల పరిమాణాలలో ఉండవచ్చు. వివిధ ఆకారాలలో కనబడతాయి. ఇంకా రాయి, చెట్టు, లేక భవనాలలోని కిటికీ రంధ్రాలు కూడా గూడులుగా మార్చుకుంటాయి. కొన్ని పక్షి గూళ్ళు గుండ్రంగా ఉండవచ్చు. కొన్ని పక్షిగూళ్ళు పైకప్పు లేకుండా ఉంటాయి. కొన్ని గూళ్ళు కేవలం పుల్లలలో నిర్మితమై ఉంటాయి,
పక్షి పిల్లలు అన్నీ గూడులోనే ఉండి, తల్లి పక్షి అందించే ఆహారంతో బ్రతుకుతాయి. పిల్ల పక్షులు ఉన్న గూడును తల్లి పక్షి కాపలా కాస్తూ ఉంటుంది.
ఈ భూమిపై మనిషితో బాటు అనేక జంతువులతో బాటు పక్షులు కూడా చాలానే ఉండేవి…. కానీ కాలంలో మారిన పరిస్థితుల బట్టి పక్షి జాతులు అంతరిస్తున్నట్టు చెబుతారు.
పిచ్చుకలు ఎక్కువగా కనబడేవని. ఇప్పుడు అవి కనబడడం లేదు అంటారు. కారణం సెల్ టవర్స్ అని చెబుతారు.
ఇలా కొన్ని మానవ సౌకర్యాల కోసం ప్రకృతిలో చేసే మార్పులు మరొక జాతి అంతమునకు కారణం అవ్వడం విచారకరం.
తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో… తెలుగు సామెతలలో పదాలు పదునైన మాటలను కలిగి ఉంటాయి.
మాటలు మనసును తాకుతాయి. మాటలు మనసును కదిలిస్తాయి. మాటలు మనసును బాధిస్తాయి. మనసుకు ఓదార్పు అవుతాయి.
ఒక వ్యక్తి తన మాటల ద్వారా నలుగురిని కలుపుకోవచ్చు. మనిషికి మాటల ద్వారా తగువులు పెరుగుతాయి. మనిషి మాటల ద్వారా మనిషి మరింతమందికి దూరం అవ్వవచ్చు… దగ్గరకావొచ్చు… మాట అంత శక్తివంతమైనది.
అలాంటి మాటలు పెద్దల ద్వారా చమత్కారంగా చలోక్తులుగా వినబడుతూ ఉంటాయి. అలాంటి మాటలలో ఎంతో అర్ధం వెతకవచ్చు అంటారు.
మాటల ఒక మనసులోని భావము చక్కగా ఎదుటివారి మనసులోకి ప్రవేశింపజేయవచ్చు. మాటలు అంతటి ప్రభావవంతమైనవి.
అంతటి ప్రభావం చూపగలిగే మాటలు కొన్ని వ్యాక్యాలుగా చాలా సార్లు వింటూ ఉంటాము. కొన్ని చోట్ల ఎక్కడో గోడపై చదువుతూ ఉంటాం…
అలా మనసుపై ప్రభావం చూపగలిగే మాటలు వ్యాక్యాలుగా వ్రాసి ఉంటాం. అలా కొన్నిసార్లు పదునైన మాటలు పదాలుగా ఉండే వ్యాక్యాలు…
కొన్ని సార్లు చక్కని చమత్కార మాటలు పదాలుగా గలిగి వ్యాక్యాలుగా ఉంటాయి.
మరి కొన్ని సార్లు నిష్టూరపు మాటలు పదాలుగా గలిగి వ్యాక్యాలుగా ఉంటాయి…
భిన్నమైన భావనలను కలిగించే మాటలు కూడా పదాలుగా ఉండే వ్యక్యాలు కూడా ఉంటాయి…..
ఇలాంటి మాటలు కలిగి ఉండి, మనసులో ఆలోచనను రేకెత్తించే వ్యక్యాలు సామెతలుగా ఉంటాయి. అలాంటి తెలుగు సామెతల గురించి….
సామెతలు ఏదో సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏదో స్వభావ లోపాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏదో సామాజిక మూస పద్దతిని తెలుపుతూ ఉంటాయి.
ఒక్కోసారి ఏదో విధానమును తెలుపుతూ ఉంటాయి. ఒక్కోసారి మనసును కదిలిస్తాయి. కాలం విలువను తెలియజేస్తాయి. మాట విల్వాను తెలియజేస్తాయి. స్వభావాన్ని ప్రశ్నిస్తాయి…. సామెతలు మనసుపై ప్రభావం చూపేవిధంగా ఉంటాయి.
ముఖ్యంగా తెలుగు సామెతలు సందర్భానుసారం వాడుతూ ఉంటారు.
అంటే కాలంలో అప్పటి సమయం, ఆ సమయంలో పరిస్థితులు బట్టి కొందరు ఉపయోగించే సామెతలు ఆలోచింపజేస్తాయి.
కరోన కాలంలో కేవలం పనిని మాత్రమే చేసుకుంటాను… అని ఏమాత్రం కోవిడ్ నియమాలు పట్టించుకొని వ్యవస్థ దగ్గర పని చేయడానికి సిద్దపడేవారు ఉంటే, వారి దగ్గర “కొరివితోతలగోక్కున్నట్లు” అనే సామెత అతికినట్టు సరిపోతుంది.
లాక్ డౌన్ వేల పనికి పోతాను అంటే “బతికుంటేబలుసాకుతినవచ్చు” అను సామెత… అంటే ఏదైనా పరిస్థితులను కూడా గుర్తు చేస్తూ సామెతల ప్రభావం మనసుపై ఉంటుంది.
పెద్దలమాట చద్దిమూట అను ఒక సామెత ఉంది.
పెద్దలమాట చద్దిమూట అంటే అనుభవం కలిగి ఉన్న వారి మాట ఎంత బలమైనదో తెలియజేయడానికి ఈ సామెత చెబుతారు. పుద్దుటే తినే చద్ది అన్నం బలం అని అంటారు. అలాంటి బలంతోనే పెద్దలమాటను పోల్చారు.
అయితే ఇక్కడ పెద్దలంటే చేస్తున్న పనులలో పూర్వానుభవం కలిగి ఉన్నవారు. పూర్వకాలం వయసుతోబాటు పనులు చక్కగా సాగుతూ ఉండడం వలన పెద్దలకు ఎక్కువ విషయాలు తెలిసి ఉండేవి. మారిన కాలంలో చదువులు మారాయి. వయసుతో సంబంధం లేకుండా విషయావగాహన ఉంటుంది.
అనుభవజ్నుల మాట వినడంవలన పనులలో ఆటంకాలు ఏర్పడకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు… ఈ పెద్దలమాట చద్దిమూట నుండి గ్రహించవలసిన విషయం.
అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం చదవండి. అమ్మ ఒడి గురించి వ్రాయండి అంటే తెలుగులో వ్యాసం వ్రాయడానికి కొంత విశ్లేషణ…
విధ్యార్ధులకు ఆర్ధికంగా అండగా ఉండాలనే సదుద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ కొరకు ఈ పధకం అందుబాటులో ఉంది.
రాష్ట్రంలో నివసించే వారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది.
కుటుంబంలో ఒక విధ్యార్ధికి ఆర్థిక సాయం కింద ఒక ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ అమ్మఒడి పధకం ద్వారా అమలు చేస్తున్నారు. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.
ఇప్పుడు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విధ్యార్ధులకు నగదుకు బదులుగా లాప్ టాప్ ఎంచుకునే అవకాశం అమ్మ ఒడి పధకం కల్పిస్తుంది.
అమ్మఒడి విధార్ధికి ఆర్ధిక సాయం అందించే ప్రక్రియగా ప్రారంభమయిన, పేద విధ్యార్ధికి ఆశకు అండ అవుతుంది. పెద విధార్ధికి ప్రోత్సాహకంగా ఉంటుంది.
మన రాష్ట్రంలో అమలు చేస్తున్న అమ్మఒడి పధకం వలన సాలుకు ఒక విధ్యార్ధికి అందే నగదు, ఫీజు చెల్లించలేని వారికి వెసులుబాటుగా ఉంటుంది.
ఫీజు చెల్లించగలిగిన వారు, తమ పిల్లలకు ఏదైనా ప్రోత్సాహక వస్తువు కొనుగోలు చేసే విధంగా అమ్మ ఒడి పధకం నగదు ఉపయోగించుకోవచ్చు. ఇలా చదువుపై మరింత ఆసక్తిని పిల్లలకు ఏర్పరచవచ్చు.
ఎందుకంటే కొత్త వస్తువు పిల్లల మనసుకు ఉత్సాహం అందిస్తుంది. ఉత్సాహం పొందిన మనసు తన లక్ష్యంవైపు ఉత్సాహంగా పరుగులు తీస్తుంది.
ఇలా అమ్మఒడి పధకం నగదు పేద వారికి ఆర్ధికంగా, పెద్దవారికి ప్రోత్సాహకంగా మారుతుందని చెప్పవచ్చు.
అమ్మఒడి పధకం క్రింధ లబ్ది పొందేవారు, అమ్మఒడి ఆశయం మేరకు చక్కగా విధ్యను అభ్యసించాలి. మంచి ఫలితాలను సాధించాలి.
మన దేశం గురించి వ్రాయండి తెలుగులో మన దేశం భారత దేశం గురించి వ్రాయండి…
పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి…. అంటూ సాగే తెలుగు సినిమా పాటలో భారతదేశపు మహనీయుల గురించి కీర్తించబడింది.
మనదేశం భారతదేశం అనేక మంది మహానుభావులను అందించిన దేశం. అందరు విశ్వమును సమభావముతో చుసిన మహానుభావులే కావడం విశేషం.
స్వామి వివేకానందా, రామ కృష్ణ పరమహంస, గాంధీ తదితర మహనీయులు ప్రపంచం చేత కీర్తింపబడ్డారు. ఆ మహానుభావులు మన భారతదేశపు గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేశారు.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము…. అను భారతీయ తెలుగు జాతీయ గీతాన్నిరాయప్రోలు సుబ్బా రావు గారు రచించారు. దేశమంటే ఏకాదటిపై నడిచే ప్రజా వ్యవస్థ అని తెలియజేసే మేలుకొలుపు గీతాలు మనకు లభిస్తాయి.
ఇంకా దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు. అంటూ సాగే పాటలు మన మనసులో ఆలోచన సృష్టిస్తాయి.
ఇంతమంది మహనీయులు దేశం గురించి అంతగా ఆలోచన చేసి, తపనతో పాటలు రచించారు… అంటే, వారి వారి మనసులలో దేశమంటే ఎంత ప్రీతి? దేశమంటే ఎంత భక్తి భావం ఉందో తెలియవస్తుంది. మనదేశం ఇటువంటి సాహితి వేత్తలను అందించింది.
ఎక్కడైనా ఏదో ఒక విధానం ఉంటుంది. ఏదో ఒక విధానం వలన కొందరు ఇమడలేకపోవచ్చు. ఇంకా జీవన పరమార్ధం విషయంలో అయితే ఆయా దేశాలలో ఏదో ఒక వీధి విధానం మాత్రమే అనుమతి ఉంటుంది.
కానీ మన దేశం మన మాతృదేశం అయిన భారతదేశంలో జీవనపరమార్ధం విషయంలో అనేక మతాలు ఉన్నాయి. నచ్చిన మతాచారం అందుకుని జీవనగమ్యం వైపు వెళ్లడానికి అందరికీ హక్కులు రాజ్యాంగం ఇచ్చింది. ఈ మతస్వేచ్ఛ రాజ్యాంగంలో మరే ఏ దేశంలోనూ లేదని అంటారు.
ఆచారవంతమైన విధానంలోనే ఇంత స్వేచ్ఛను భారతీయ పౌరలకు లభిస్తుంటే, మిగిలిన విషయాలలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎలా ఉంటుందో… ఆలోచన చేయవచ్చు. మనదేశం వ్యక్తిగత స్వేచ్ఛకు ఆలవాలం.
ఎవరో ఒక గొప్పవాడు, డబ్బున్నవాడు దేశంలో స్వేచ్ఛగా జీవించడం ఎక్కడైనా ఉంటుంది. కానీ ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛగా జీవించగలగడమే నిజమైన ప్రజస్వామ్యం అయితే, అది మనదేశంలోనే ఉంది.
సామాన్యుడు నుండి అసామాన్యుడు వరకు స్వేచ్చను అందించే మనదేశం మన భారత దేశం… శాంతికి మూలాధారం లాంటిది.
ఏదో దేశంవారు మరొక దేశంపై క్రూరంగా దాడి చేయడం, వారు ప్రతీకార చర్యలకు పాల్పడడం ఎక్కువగా జరుగుతుంది. మనదేశంపైన కూడా అప్పుడప్పుడు జరుగుతుంది.
కానీ భయబ్రాంతులకు గురయ్యే అవకాశం మన దేశం భారత దేశంలో తక్కువ. మన దేశం భారత దేశం శాంతిని కోరుకునే దేశం. అందులో నాయకత్వ లక్షణాలు మన దేశం భారత దేశానికి ప్రతినిద్యం వహించే వారిలో పుష్కలంగా కనబడతాయి.
ఈ అంశంలో స్వామి వివేకానందా వంటివారు నిరూపించారు. శాంతిగా ఉన్నచోట మానవ మనుగడ ప్రశాంతతో ఉంటుంది. అంతకుమించిన గొప్ప సమాజం ఏముంటుంది?
మన దేశం భారత దేశంలో శాంతికి ఆలవాలం ఎలా?
ఏనాటి నుండో ఉన్న మన భారతీయ సాంప్రదాయంలో స్త్రీలు శాంతితో ఉన్నారు. వారి వలన గొప్ప గొప్ప సామాజిక, తత్వవేత్తలు మన దేశం భారత దేశంలో జన్మించారు. వారి వలన దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయం గురించి తర్వాతి తరాలకు తెలియబడుతూ వచ్చింది.
అందుకు సాక్ష్యంగా అనేక దేవాలయాలు, వాటి వాటి స్థల పురాణములు ఉంటాయి. ఎందరో భక్తులు దైవాన్ని తెలుసుకున్నట్టుగా పురాణాలు చెబుతాయి.
యోగులు శాంతితో సామాజిక సంక్షేమం కోరుతూ, ధర్మ ప్రచారం చేయడం, ప్రజలను శాంతివైపు నడిపించే విధానం గురించి విస్తృత ప్రచారం చేసి ఉండడం మరొక ప్రధాన కారణం… మన దేశం భారత దేశం శాంతికి మూలం.
మన దేశం భారత దేశంలో సాహితి వేత్తలు, సామాజిక వేత్తలు, తత్త్వ వేత్తలు వలన సామాజిక సమస్యలపై అవగాహన సమాజంలో ఏర్పడుతూ ఉంది. తత్వవేత్తల వలన వ్యక్తిలో చిత్తశుద్దిపై ఆలోచన ఉంటుంది… ఈ ఈ విధానాలు మనిషిలో శాంతి అనే అంశం ఉంటూ ఉంటుంది.
ఎన్నో పర్యాటక ప్రాంతాలు, ఎన్నో చరిత్రాత్మ ప్రాంతాలు, ఎన్నో పురాణ కట్టడాలు, ఎంతో మంది యోధులు, సాధువులు, యోగులు మన దేశం భారత దేశంలో జన్మించారు.
నిత్య శాంతి కోసం తపించే నాయకత్వం మన దేశం భారత దేశంలో ఎప్పుడూ ఉంటుంది. ఆ నాయకత్వం అంగీకరించే ప్రజలు సమాజం శాంతితో ఉండడానికి పునాదిగా ఉంటుంది.
విశ్వశాంతి అంటే అది భారతదేశం వలననే సాధ్యమనే భావం ప్రపంచం అంతటా ఉండడం, మన దేశం భారత దేశం యొక్క కీర్తి తెలియబడుతుంది.
ఇంతటి మన దేశం భారత దేశంలో పాలన కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో ఏ రాష్ట్రనికి, ఆ రాష్ట్రమే పరిపాలన కొనసాగించే అధికారం ఉంది. ఇవి కాక కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.
మన దేశం భారత దేశంలో గల రాష్ట్రాలు తెలుగులో
ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ చత్తీస్ గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ ఒడిషా పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు తెలంగాణ త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమబెంగాల్
కేంద్రపాలిత ప్రాంతాలు మన దేశం భారత దేశంలో
అండమాన్ నికోబార్ దీవులు చండీగడ్ దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ జమ్మూ కాశ్మీర్ లడఖ్ లక్షద్వీప్ ఢిల్లీ పాండిచ్చేరి
భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది. భక్తీ, ముక్తికి భగవద్గిత మనసుకు ఔషధం వంటిది అని అంటారు.
మహాభారతములో భీష్మ పర్వములో ప్రారంభం అయ్యే భగవద్గీత ఒక ప్రత్యేక గ్రంధంగా ప్రసిద్ది చెందింది.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని అది జీవితానికి దిశా నిర్దేశం చేయగలదని అంటారు. భక్తీ భావనతో గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు ప్రోత్సాహకంగా ఉంటుంది. భగవద్గీత చదువుతూ, చిత్తశుద్దితో జీవించడం పాపహరణకు ఒక మార్గమని పెద్దలు చెబుతారు.
మనిషి జీవనంలో యోగం ఉంటుంది. మనిషి జీవించే క్రమంలో కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు ఉంటాయి.
భగవానుడు అర్జునునిడికి బోధించిన భగవద్గీతలో ఆత్మ తత్వము, జీవన కర్తవ్యము – కర్మ, జ్ఞానము, భక్తి, యోగ సాధన, భగవత్తత్వము, శ్రద్ధ, గుణ విభాగము తదితర విషయాలు ప్రస్తావించబడతాయి.
అనేక మంది మహానుభావులు భగవద్గీతను రీడ్ చేయడం ఒక అలవాటుగా పెట్టుకుంటారు. ఎక్కువ మంది భగవద్గీతను జ్ఞానం కొరకు చదువుతూ ఉంటారు.
స్వాతంత్ర్య ఉద్యమం దేశమంతా వ్యాప్తి చెంది, దేశాన్ని ఒక తాటిపై నిలబెట్టిన మహాత్మా గాంధి కూడా భగవద్గీత పారాయణం చేసినట్టు ఆయన రచనలే చెబుతాయి.
వ్యక్తిలో స్ఫూర్తిని రగిలించే శక్తి భగవద్గీత పఠనం వలన వస్తుందని అంటారు
“నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.”
— మహాత్మా గాంధీ
జ్ఞానం అందించే భగవద్గీతలో విభాగాలు ఉంటాయి. అవి ఈ క్రింది యోగములుగా చెబుతారు.
ఎరుకలో ఉన్నవాడికి పొంచి ఉన్న ప్రమాదంపై అవగాహన ఉంటుంది. పాములు పట్టేవానికి పాముల గురించి బాగుగా ఎరుకలో ఉంటుంది. కావున అతను పామంటే భయపడడు. అలాగే జీవన పరమార్ధం ఎరుకలో ఉన్న వ్యక్తికి, బాధించే విషయాలు ఉండవని అంటారు.
భగవద్గీత వలన విషయ వాసనలు నశించి, విషయములకు ఆలవాలమైన మనసు గురించి మనసే ఆలోచన చేయడమే ఒక అద్బుతమని అంటారు.
మనసు అనేది మననము వలన దుఃఖము, సుఖము తెచ్చుకుంటుంది అంటారు. సుఖదుఃఖాలు మనసుపై ప్రభావం చూపుతూ ఉంటాయి. సుఖంగా ఉంటే సంతోషం, దుఃఖంగా ఉంటే విచారం…
విషయాల వలన విచారం ఎక్కువయ్యే మనసుకు భక్తిభావన ఒక ఆలంబనగా ఉంటుందని అంటారు. భక్తితో ఆలోచన చేసే మనసు శాంతిగా శోచించడం అలవాటు చేసుకోగలుగుతుందని అంటారు.
భక్తి భావన భగవద్గీత రీడ్ చేయడం ద్వారా కూడా పెంపొందించుకోవచ్చు. భక్తితో మెదిలే మనసులో వ్యగ్రత కన్నాశాంతస్వభావం పెరుగుతుంది.
మనసులో భక్తి భావనలు పెంచుకునే ప్రక్రియలో భగవానుడు బోదించిన భగవద్గీతను చదువుకోవడం మంచి అలవాటుగా చెబుతారు.
భగవద్గీతకు సంబంధించిన వివిధ పుస్తకాలు ఆన్ లైన్లో రీడ్ చేయడానికి లేదా మీ ఫోనులో పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయడానికి ఈ క్రింది బట్టన్ పై క్లిక్ చేయండి.
భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు. ప్రవచనాలు వినడం వలన భాగవతం బాగుగా మనసులో నాటుకుంటుంది.
వినుడు భాగవతం భగవంతుడిని చేరాలనే భావనను పెంపొందించుకో… తెలుగులో భాగవతం విను, అలా భాగవతం వినగా వినగా… కాలంలో వచ్చే కష్టానికి కారణం కనబడగలదు.
భాగవతం రచించిన తరువాతే వ్యాసుని మనసు శాంతించినది అని పండితులు చెబుతారు. అలాంటి భాగవతం వినాలనే సంకల్పం చేయడం, భక్తి అనే భావన బలపడుతుంది.
చదివే భాగవతం మనసులో బలంగా నాటుకోవాలంటే, పెద్దల మాటలలో భాగవతం గురించి వినాలని అంటారు.
వినడం అలవాటు అయితే, ఆలోచన అగుతుంది. వింటున్న విషయం పైనే మనసు నిలబడుతుంది. అలాంటి మనసుకు భాగవతం వినాలనే తలంపును తెచ్చిపెడితే, భక్తి భావన బలపడే అవకాశం ఎక్కువ.
చదవకూడని బుక్స్ అనెకంగా అందుబాటులో ఉంటాయి… అవి చదవాల్సిన బుక్స్ చదవకుండా ఉండడానికి అవరోధాలుగా ఉంటాయి. కాబట్టి చదవకూడని విషయాలు చదివిన మనసుకు పెద్దలమాట మంత్రంలాగా పనిచేస్తుందని అంటారు. కాబట్టి భాగవతం పండితుల ప్రవచనాల ద్వారా వినడం ప్రధానం అంటారు.
భగవంతుడిని గురించి, భగవంతుడి అనుగ్రహం పొందిన భక్తుల గురించి భాగవతం చక్కగా తెలియజేస్తుందని అంటారు. అందువలన భాగవతం గురించి ప్రవచనాలు వినాలనే అంటారు.
భక్తి భావం బలపాడడానికి భాగవతం చక్కగా ఉపయోగపడుతుందని అంటారు. పుస్తక రూపంలో లభించే భాగవతం పండితుల వాక్కులలో మరింతగా మనసును చేరగలదు.
ఒక్కడే అయినా అనేక రూపాలలో దర్శనమిచ్చే భగవంతుడు గురించి భాగవతం బాగుగా తెలియజేస్తుందని అంటారు. వ్యాస భాగవతం పోతనా మాత్యుల ద్వారా తెలుగులోకి అనువదించబడింది.
భక్తి భావన వృద్దికి భాగవతం వినడం చదవడం సాధన వైపు మనసు మరలుతుంది
పలువురు పండితులు భాగవత ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి. భాగవతం గురించి తెలుగులో ప్రవచనాలు విని, భాగవతం చదవడం మొదలుపెడితే, చదివేటప్పుడు ఊహించే అలవాటు గల మనసుకు పెద్దల మాటలు మార్గదర్శకం కాగలవు.
భాగవతం గురించిన పెద్దల మాటల ప్రభావం మనసుపై భాగవతం చదివేటప్పుడు పడుతుంది. భగవంతుడు గురించి విన్న మనసు, భగవంతుడి గురించి చదువుతుంటే, సక్రమమైన ఊహాశక్తి పుడుతుంది.
మనసుకు ఉండే బలం ఊహా శక్తి అయితే, అది చెడు విషయాలపైకి వెళితే, అదే దాని బలహీనత… అదే మనసు భగవంతుడు గురించి ఊహ చేయడం మొదలుపెడితే, అదే బలం. అయితే సదాచారం వలన సక్రమమైన పరివర్తన ఉన్నట్టు… పెద్దల మాటల వలన సక్రమమైన ఆలోచన ఉంటుందని అంటారు.
తపించే హృదయానికి భావావేశం ఎక్కువైతే, అది భాగవతం వైపు మరలితే, భక్తి భావన బలపడుతుంది. భక్తి భావన బలపడడం అంటే, మనోబలం పెంచుకోవడమే అంటారు.
ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం. అవగాహన కోసం వ్యాసం. ఆరోగ్యం కోసం ఎప్పుడూ వైద్యుని సలహాలే పాటించాలి.
ఇది భారతదేశంలో ప్రాచీన వైద్య విధానం. ఆధునిక వైధ్యం అందుబాటులో రాని కాలంలో ఆయుర్వేద వైద్యమే ఆధారంగా ఉండేది.
దేశంలో పల్లె ప్రాంతాలు, వ్యవసాయ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండి, ఆయుర్వేద వైధ్యం అందుబాటులో ఉండేది. మూలికలు ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో వాడతారు.
శరీరంలో అనారోగ్య సమస్యలను దోషాలుగా చెబుతారు. దోషాలకు విరుగుడుగా మూలికలతో చేసిన ఆయుర్వేద మందులు వాడటం పరిపాటి.
ఇంకా నాటువైద్యం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉండటం కూడా ఉండేది. ఆయుర్వేద మూలికలను చూర్ణంగా తయారు చేసి నాటు వైద్య్లులు వివిధ శారీరక రుగ్మతలకు మందులుగా ఇస్తూ ఉండేవారని అంటారు.
నాటు వైద్యంలో ఔషద మొక్కల నుండి ఆకులు సేకరించి, వాటి రసం ద్వారా కూడా శరీర గాయాలకు పూయడం ఉంటుంది.
ఇంట్లో పూజలు అందుకునే తులసి మొక్క ఔషధ గుణాలతో కుడి ఉంటుందని అంటారు.
ఇప్పటికీ దేశంలో కొన్ని చోట్ల నాటు వైద్యం అందుబాటులో ఉంటుంది.
ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ప్రధానంగా మూడు దోషాలకు మందులు తయారు చేస్తారు. అవి వాతం, పిత్తం మరియు ఖఫం దోషాలుగా చెబుతారు.
ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో పరిష్కారాలు శారీరక రుగ్మతలను దూరం చేస్తాయని అంటారు.
ఇంగ్లిష్ మందులు అందుబాటులోకి వచ్చాక, ఆయుర్వేద వైద్యం నుండి ఆధునిక వైద్య పద్దతులకు ప్రజలు అలవాటు పడ్డారు. నాటు వైద్యం కన్నా ఆర్ఎంపి డాక్టర్ వద్ద చికిత్స పొందడానికి ప్రజలు అలవాటు పడ్డారు.
కాలం మారుతున్న కొలది వైద్య విధానం పూర్తి ఆధునిక పద్దతులలోకి మారింది. ఆధునిక పద్దతులలో వివిధ పరీక్షల ద్వారా రోగి శారీరక సమస్యలను కనుగొని, రోగానికి మందులు వేయడం బాగా అభివృద్ది చెందింది. ఈ విధానంలో శస్త్రచికిత్సలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
ఎన్ని ఆధునిక పద్దతులు వచ్చినా, ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముకుని జీవించేవారు ఉన్నారని అంటారు. ఇంకా దీర్ఘ కాలిక అనారోగ్యం ఉన్నవారు ఆయుర్వేద వైద్య విధానం వైపు చూడడం జరుగుతుంది.
అనారోగ్యం – ఆందోళన – నమ్మకం – వైద్యం
అనారోగ్యంతో ఉన్నవారు ఆందోళనకు గురి అయితే, మనసు పొందే భయం వలన రోగం మరింత ముదురుతుందని అంటారు. రోగి ఏ విధానంలో వైద్యం పొందినా ముందుగా వారి మనసులో ఆందోళన అధికమవ్వకుండా చూసుకోవాలని పెద్దలంటారు.
ఎక్కువమందికి చికిత్స చేసిన వైద్యులకు, అనేక రోగాలపై అవగాహన ఎక్కువగా ఉంటుంది. అనుభవజ్నులు అయిన వైద్యులకడకు వెళ్ళడం, వారి వైద్యంపై నమ్మకం ఉంచి, చికిత్స పొందడం ప్రధానమని పెద్దలు అంటారు.
శరీరం మనసుతో పెనవేసుకుని ఉంటుంది. రోగ నివారణకు మందులతోబాటు మనసుకు ప్రభావం చూపుతుందని అంటారు. కనుక మనసులో అపనమ్మకం వదిలి సరైన వైద్య విధానం వైపు వెళ్ళడం ద్వారా రోగం త్వరగా నయం చేసుకోవచ్చని అంటారు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పద్దతులలో రోగ నిర్ధారణ చేసుకోవడం సులభం. ఖర్చుతో కూడుకున్న విధానం అయినా రోగ నిర్ధారణ అవ్వడం వలన రోగం నయం చేసుకోవడానికి మార్గం త్వరగా ఏర్పడుతుందని అంటారు. కావున ముందుగా రోగ నిర్ధారణ చేసుకోవడం ఆపై అనుభవజ్నులైన వైద్యుడిని కలవడం ప్రధానం అంటారు.
ఆయుర్వేదం అయిన ఆధునిక పద్దతి అయినా నమ్మకంలో సరైన వైద్యులను సంప్రదిస్తే, అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.
ప్రాచీనమైన ఆయుర్వేదం పూర్వులు ఎక్కువగా ఆధారపడి జీవిస్తే, ఇప్పుడు ఆధునికమైన వైద్యముపై మనము ఆధారపడి జీవిస్తున్నాము.
అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం, అమృతం వంటిది. అమ్మ ఆప్యాయంగా చేసే స్పర్శలోనే అమృతత్వం ఉంటుంది.
అమ్మా అనిపించకుండా బాధ ఊరుకోదు. అమ్మా అని ఆర్తితో అరిపించకుండా కష్టం కూర్చోదు. ఒక వయసుకు వచ్చాక కూడా అమ్మా అంటూ బాధను అనుభవిస్తాం… గతంలో అమ్మ చూపిన ఆప్యాయత గుర్తుకు రాగానే బాధను మరుస్తాం…. అంటే అమ్మ అమృతమైన ప్రేమను పంచేస్తుంది.
అమ్మలేని జీవిలేదు. అమ్మలేని జీవితం లేదు. అమ్మతోనే వెలుగు ఆరంభం. లోకంలోకి ప్రయాణం ప్రారంభం అమ్మ ఒడి నుండే… మొదలు.
ఏడుపుతో ప్రారంభం అయ్యే జీవనంలో అమ్మఒడి ఓదార్పు బడి. అమ్మఒడి భయానికి బదులు చెబుతుంది. అమ్మఒడి అప్యాయతకు భాష్యం చెబుతుంది.
అమ్మఒడి చిన్నారికి బాలబడి. అమ్మఒడి ఊయల. అమ్మఒడి చిన్నారికి కధాప్రాంగణం. రచయిత అయినా, సామాన్యుడు అయినే, ప్రధాని అయిన అమ్మఒడిలో భయం వలన రక్షణ పొందిన దీనుడే…
ఎన్నో రచనలు కీర్తించేది అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వమునే
బిడ్డను కనే అమ్మ చేసే త్యాగం, బిడ్డను పెంచడంలో అమ్మ చూపే ఆప్యాయత రచనామృతాన్ని చిన్నవిగా చేస్తే, రచనలు అమ్మను పొగడడంలో పోటీపడి నాన్నను మరిచిపోవడంలో అతిశయోక్తి లేదు.
నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న ముందుంటాడు. నాన్న వలన నలుగురిలో గౌరవం దక్కుతుంది. నాన్న వలన నలుగురు పరిచయం అవుతారు. నాన్నతోనే సామాజిక ప్రభావం ప్రారంభం.
అమ్మ గురించి చెప్పడంలో పడి నాన్నను మరిచిపోయిన రచనలు అన్నట్టుగా నాన్న కన్నా అమ్మనే రచనలు కీర్తిస్తాయి. కానీ అవిరామ శ్రమ నాన్నలో ఉంటుంది.
పిల్లలకు నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు. అలాంటి ఆలోచనకు పునాది నాన్న వలననే కలుగుతుందని అంటారు.
కేవలం చదువుకునే వయసులోనే నలుగురిలో గౌరవం లభిస్తుందంటే, అది నాన్నపై సమాజంలో నిలిచిన మర్యాదే. ఎదుగుతున్న బాలబాలికలకు సమాజంలో ఏర్పడే స్థితి నాన్నతో ముడిపడి ఉంటుంది.
కన్నబిడ్డల కోసం కన్నతల్లి అమృతమైన ప్రేమను అందిస్తే, వారి పోషణకు నాన్న తన రక్తాన్నిధారపోస్తాడు. కష్టపడి ఇష్టంతో కాలంలో కలిగే కష్టాలను ఎదుర్కుంటాడు.
తనను నమ్ముకుని ఎదుగుతున్నవారి ఆశలకు నాన్న జీవం పోస్తాడు. నాన్న ఉన్నాడనే ధైర్యంతో పిల్లలు సమాజంలో స్వేచ్ఛగా తిరగగలరు.
సమాజంలో నాన్న ఇచ్చే రక్షణ మరే ఇతరులు ఇవ్వలేరని అంటారు. నాన్న అంటేనే భరోస… నాన్న బ్రతుకుకి భరోస కల్పించగలడు.
అమ్మాయి అల్లరిని ఆధారిస్తాడు. అబ్బాయి బరువును మోస్తాడు. అమ్మాయి ఆలోచనకు విలువనిస్తాడు. పిల్లల మనోభావాలను ఎరిగి, వారి వారి ఆశయాలకు అనుగుణంగా నాన్న చేసే కృషి అద్బుతమే అవుతుంది.
ఎదిగే పిల్లలకు ఆదర్శంగా కనిపించేవారిలో, నాన్నే మొదట నిలుస్తాడు. నాన్న ఆదర్శంలో మార్గదర్శకంగా మారతాడు. నాన్నను అనుసరించాలనే ఆలోచన పిల్లలకు కలగకమానదు.
ఎదిగే వయస్సు చేసే అల్లరికి నాన్న ఒక అడ్డుగోడ. నాన్నను దాటి అల్లరి అల్లరి చేయలేదు.
జీవనగమ్యం చేరడంలో నాన్న ఆచరించిన కుటుంబ పద్దతి, తర్వాతి తరానికి కూడా విధానం అయి కూర్చుంటుంది.
నాన్న లేని సమాజంలో బిడ్డడి, భవిష్యత్తు ఆగమ్యగోచరం. నాన్న వలననే మర్యాద, మన్నన మొదటగా సమాజం నుండి లభిస్తాయి. నాన్నను అనుసరించే అమ్మకు, నాన్నే మార్గదర్శకం. బిడ్డలకు నాన్నే మార్గదర్శకం.
సమాజంలో ఒక కుటుంబానికి ఏర్పడిన గుర్తింపు నాన్న సంపాదించిన విలువైన ఆస్తి వంటిది. ఆ ఆస్తిని ఎవరు దొంగిలించలేరు. పోగొట్టుకుంటేనే పోతుంది తప్ప, విలువైన ఆస్తి నాన్న సంపాదించిన గౌరవ, మర్యాదలు మనిషికి వెన్నంటి జీవితాంతం ఉంటాయి.
ఎప్పుడూ నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అయితే
నాన్న తనకోసం తను కష్టపడింది… తక్కువగానే ఉండవచ్చు. కానీ బిడ్డల కోసం పడే కష్టం, తపన ఎక్కువగానే ఉంటుంది. అదే నాన్న తత్వం.
కష్టాన్ని ఇష్టంగా ధారపోసే నన్నతత్వం పెద్దగా గుర్తింపు పొందకపోయినా…. నాన్న మాత్రం తనవారి కోసం తాను శ్రామిస్తూనే ఉంటాడు.
అన్నీ తెలిసినా ఏమి తెలియనివాడిలాగా ఉండడం నాన్నతత్వంలోనే ఉంటుంది. పిల్లల దగ్గర నేర్చుకుంటున్నట్టు ఉండగలడు. పిల్లలు గాడి తప్పుతుంటే, భయాన్ని చూపించగలడు.
వయసుకు వస్తున్నవారికి అలవాట్లు అలుముకోకుండా, వ్యసనాలు వంటబట్టకుండా నాన్న అనే భయం బిడ్డడిని కాపాడుతూ ఉంటుంది.
అమ్మ చూపే అమృతమైన ప్రేమ ముందు, నాన్న శ్రమ, నాన్న తపన కనబడదు. కానీ బిడ్డలు సాధించే విజయాలకు ఆరంభం అమ్మ అయితే, పట్టుదల నాన్నే అవుతాడు.
యువకుడుగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవమే, నాన్నగా మరగానే ఆలోచనగా మారిపోతుంది. నిత్యం పిల్లల శ్రేయస్సుకొరకు తపన ప్రారంభం అవుతుంది. పిల్లల కట్టడికి కారణం, సమాజంలో తాను చూసిన సామాజిక పరిస్థితుల ప్రభావం అవుతుంది.
కఠినంగా ఉన్నట్టు కనబడే నాన్న హృదయం వెనుకాల, బిడ్డడి భవిష్యత్తు బాగుండాలనే తాపత్రయం వరదలా ప్రవహిస్తుంది. నాన్న కనబడని ప్రేమ ప్రవాహం వంటి వాడు.
నాన్న ప్రేమ ప్రవాహం కనబడకుండా భవిష్యత్తు కోసం తీసుకునే ప్రణాళిక, ప్రణాళిక అమలు కోసం చేసే నిర్ణయాలు, అలవాట్లకు అంటుకోకుండా చేసే కట్టడి… తదితర విషయాలు కప్పిపుచ్చుతాయి.
ఎదిగే పిల్లల చెడు ఆలోచనలకు నాన్న ఆనకట్టవంటివాడు.
పిల్లల కోసం పాటుపడే తల్లిదండ్రులలో ఎక్కువతక్కువలనే భావనే ఉండదు. అలాంటి వారిలో క్రమమైన ఆలోచనను అమలుపరిచేది నాన్న యొక్క దీక్షే.
నాన్నకు ప్రేమతో మంచి అనిపించుకోవడంలో ముందుండాలి. నాన్నకుప్రేమతో ఇచ్చే కానుక అంటే, సమాజంలో చెడు అనిపించుకోకుండా బ్రతకడమే అంటారు.
బిడ్డకు నాన్న ఇచ్చిన బారోసా ముందు జీవితం ఇచ్చే బారోసా చిన్నదిగానే కనబడుతుంది. కష్టంలో నాన్న పడ్డ కష్టం చూస్తే, జీవితంలో కష్టం ఎదుర్కోవలనే పట్టుదల, దీక్ష కలుగుతాయని అంటారు.
జీవితంలో ఆకాశం అందుకునే అవకాశం వస్తే, అందుకునే పట్టుదల, తెగువ, దీక్ష నాన్న నుండే వస్తాయని అంటారు. కష్టంలోనూ నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం.
ప్రయత్నంలో నాన్న పట్టుదల, నాన్న దీక్ష, సమస్యలను ఎదుర్కోవడంలో నాన్న చూపే తెగువ… సాధనలో నాన్నచూపే దక్షత. ఆరంభనికి నాన్న తీసుకునే దీక్ష… అన్నింటిలో నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు.
రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు… మీకు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ శుభాకాంక్షలు…
రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము మననము చేయడము జీవనగమ్యము చేరడానికే. రాముడు అనుగ్రహం ఉంటే, సాధ్యం కానీ విజయం సిద్దిస్తుంది.
శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామనామము జపించడమే మార్గం.
ఏమి కర్మలు చేసి ఉన్నమో? ఏమి కర్మలు వెంటాడుటయో? కాలం – కర్మ జీవితాన్ని ఎటు మలుపు తిప్పుటయో? ఎవరికెరుక? ఆ రామునికెరుక… కనుక రామునే పట్టుకుంటాను. రామనామము నిత్యము మననము చేస్తా!
శ్రీరామనామము జపిస్తూ, రామభజనము చేసే పోతనకు రామానుగ్రహం అయ్యింది. శ్రీమద్భాగవతమ్ సంస్కృత భాష నుండి తెలుగు భాషకు అనువదించారు.
రామానుగ్రహం పొందిన పోతనామాత్యులు, శ్రీమద్భాగవతమ్ రామునికే అంకితం అందించారు… కానీ డబ్బుకోసం మరే ఇతర విషయాలకు ఆశపడలేదు. తన మనసును రామస్వరూపముతో నింపేసుకున్నారు. మనసు నిండా రాముడే ఉంటే, మరి ఆ మనిషి కావలసినదేముంటుంది.
రామదాసు రామునిపైనే దృష్టి. రామదాసు జీవితం సుఖంలో ఉన్నప్పుడు రామాలయం నిర్మించారు. కష్టంలో ఉన్నప్పుడూ దాశరది శతకం అందించారు. రామానుగ్రహం కలిగితే మంచి పనులు జీవనోద్దరణ నిర్మాణమే మనసులో ఉంటుంది.
ఎంత కష్టం వచ్చిన రామునిపై నమ్మకంతో ఉండి, జీవితాల్ని ధన్యం చేసుకున్నవారు బమ్మెర పోతన, రామదాసు…
శ్రీరాముడు కేవలం పోతనను అనుగ్రహించడమే అనుకుంటే, రామదర్శనం పొందితే చాలు. కానీ రాముడు తెలుగువారందరినీ అనుగ్రహించాలని అనుకున్నాడు.
రావణాసురుడిని చంపడమే కాకుండా, చాలా కాలం భూమిపై ఉండి, మనుష్య జాతిని ఉద్దరించిన శ్రీరాముడు, తెలుగువారందరినీ అనుగ్రహించడం కోసం బమ్మెర పోతనతో భాగవతం అనువాదం చేయించాడు.
అలాగే శ్రీరాముడు రామదాసును అనుగ్రహించడమే అనుకుంటే, రామదాసు గుడి కడుతున్నప్పుడే గోపన్న మనసులో శ్రీరాముడు చేరాడు. కానీ అందరినీ అనుగ్రహించడం కోసం రామదాసుతో శతకం అందించాడు.
మన శ్రీరాముడు కేవలం భక్తుడునే అనుగ్రహించడం కాదు, భక్త జనాన్నే అనుగ్రహించడం చేస్తూ ఉంటాడు.
అలాంటి మన శ్రీరాముడు అందరి మనోసింహాసహనంలో సీతాలక్ష్మణ ఆంజనేయులతో అధిష్టించాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు…
రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు
“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే”
ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉండడమే పెద్ద ఆస్తి అన్నారు.
ఆరోగ్య నియమాలు ప్రక్కన పెట్టి, జీవితం అంతా కష్టపడి పాతిక లక్షలు సంపాదించి, చివరలో ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవలసి వస్తే, జీవితాంతం పడ్డ కష్ట ఫలితం?
సరిగ్గా తినక, తినడంలో సమయ పాలన పాటించకుండా, మనసు పాడు చేసుకుని, శరీరాన్నిఇబ్బందికి గురిచేసి, అనారోగ్యంపాలు చేయడం వలన, వారిని నమ్ముకుని ఉండేవారికి కూడా ఇబ్బందే.
అదే ఆరోగ్య నియమాలు పాటించి, జీవితాంతం మొత్తం పదిలక్షలు కూడబెట్టినా, ఆ డబ్బు నమ్ముకున్నవారికి ఉపయోగం. ఇంకా ఆరోగ్యంగా జీవితం ఉంటుంది.
అనుభవజ్నులు అయిన వైద్యుల సలహాలు పాటిస్తూ జీవనం సాగాలని వైద్య నిపుణులు అంటారు. ఎందుకంటే నేటి సమాజంలో ఆహారం పైనా ఇంకా పర్యావరణం పైన కాలుష్య ప్రభావం పడుతుంది.
నిజమైన సంపద అంటే ఆరోగ్యంగా ఉండడమే అంటారు.
అసలైన సంపద ఆరోగ్యంగా ఉండడమే అని అంటారు. ప్రశాంత చిత్తం కలిగిన వారు సుఖ నిద్ర పొందుతారు. అంతకన్నా ఆస్తి ఏమి ఉంటుంది?
ఇంకా పరుగులు పెడుతున్న సంపాదనా మార్గాలు మనిషిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశాలు కూడా ఎక్కువ అంటారు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఆహార నియమాలు పాటించాల్సిందేనని అంటారు.
ఆరోగ్యంగా ఉంటే కష్టపడి పనిచేసి ఆర్ధిక ప్రగతి సాధించవచ్చు. అనారోగ్యం పాలైతే, సంపాదన హరించుకుపోతుంది. సంపాదన తగ్గుతుంది.
ఆరోగ్యవంతమైన శరీరధారి లక్షణాలు
వ్యక్తి వయస్సు మరియు వ్యక్తి ఎత్తును బట్టి సరైన బరువు కలిగి ఉంటారు.
శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.
ఆరోగ్యవంతుల గుండె లయబద్దంగా కొట్టుకుంటుంది.
అలాగే ఆరోగ్యంతో ఉండేవారి నాడీ కూడా లయబద్దంగా కొట్టుకుంటుంది.
శరీరంలో రక్త ప్రవాహం తగినంతగా సాగుతుంది.
అరుగుదల సక్రమంగా ఉంటుంది.
మల విసర్జనలో, మూత్ర విసర్జనలో సమస్యలు ఉండవు… తదితర విషయాలలో శరీర పనితీరు చక్కగా ఉంటుంది.
ఆరోగ్యం గురించి శ్రద్దగా పాటించవలసినవి
పౌష్టకాహారం
ఆహారం తీసుకునే విషయంలో సమయ పాలన
మంచినీరు తగినంతగా త్రాగుట
శరీరానికి నిర్ధిష్ట సమయంలో వ్యాయామం అవసరం
అలాగే నిర్ధిష్ట సమయంలో మనసుకు వ్యాయామం ఉండాలి.
నిత్యం నిర్ణీత సమయంలో ధ్యానం చేయడం తదితర నియమాలు చెబుతారు.
అద్బుతమైన పరికరాలను అపురూపంగా చూసుకుంటూ ఉంటే, మరి శరీరం కన్నా అద్బుతమైన సాధనం ఈ సృష్టిలో మరొకటి లేదని అంటారు.
పరికరాలను మనిషి సృష్టించగలడు, కానీ శరీరమును కాదు. ఇది మాతృగర్భంలో జరిగే ప్రక్రియ…. కాబట్టి వెలకట్టలేని శరీరాన్ని ఆరోగ్యవంతంగా కాపాడుకోవడం వ్యక్తి యొక్క కర్తవ్యం.
బలమైన మనసును నియంత్రణలో ఉంచుకోవడం అంటే తనని తను జయించడం అంటారు.
ఆరోగ్యం విషయంలో మనసు చాలా కీలకం. నియమాలు పాటించాలన్నా, విడిచిపెట్టాలన్నా మనసే ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కాబట్టి శరీరం, జీవితం విలువ తెలియజేసే రచనలు, పెద్దల మాటలు వలన మాటవినని మనసు కూడా నియమాలు పాటించడానికి సిద్ద పడుతుంది.
ఆరోగ్యం కన్నా గొప్ప ఆస్తి లేదు. అనారోగ్యంగా కన్నా పెద్ద శత్రువు లేడు. మనసు మద్యలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. దానిని నియంత్రించడమే ప్రధానం అంటారు.
భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది. భక్తి భలే మందు మనుసుకు. భక్తిభావన చేత మనసు శాంతికి దగ్గరగా అశాంతికి ఆమడ దూరంగా ఉంటుంది.
భక్తి భావనలు… భక్తి భావన బలమైనది
దైవంపై మనసుకు ఏర్పడే భక్తి భావన ఎంత బలంగా ఉంటే, అంతటి మనోశక్తి అంటారు. విగ్రహం ముందు నిగ్రహం మనలో మనోశక్తికి మూలం అంటారు.
ఎవరికి ఇష్టమైన దైవం, వారి వారి మనసు మూలంలో ఉంటారు. కానీ మనసు తనకు తాను ఏర్పరచుకునే విషయలాలస వలన మూలలోనే మిగిలిపోతుంది.
మనసు ఏర్పరచుకునే విషయాలు, అలవాటుగా మారి ఉంటాయి. అలా అలవాటులు మనసులో ఉన్న భక్తి భావనను తొక్కి పెడతాయి. బలమైన అలవాటులు శక్తిని హరిస్తూ ఉంటే, మనసు మాత్రం అలవాటుకు లొంగుతుంది.
నియంత్రణ ప్రధానంగా ఆచారం ఉంటే, కేవలం మన మనసును విషయవాసనల నుండి దూరం చేయడానికే ఆచారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అయితే, ఆచరించడం మనసుకు మందు వేయడం వంటింది.
సమాజంలో మనిషి చుట్టూ ఉండే విషయాలు మనసులో గూడు కట్టుకుని ఉంటాయి. మదిగదిలో మెదిలే ఆలోచనలు కేవలం విషయాలవైపు మాత్రమే వెళితే, ఆ మనసుకు వ్యాపకాల పరంపర అంటే అమిత ఇష్టం ఏర్పడుతుంది.
విషయాలను చూస్తూ, విషయాల సృష్టికి ఆధారమైన వాడిని తలుస్తూ ఉండడం వలన మనసులో మూలలో దాగి ఉన్న భక్తి పైకి వచ్చే మార్గం కూడా ఏర్పడుతూ ఉంటుంది.
మనకు భక్తి భావం బలమైనది మనసుకు శాంతి అందించడంలో భక్తి భావం ముందుంటుంది. కారణం కష్టాలకు చలించిపోకుండా మనసుకు దైవమున్నాడనే భావన మనసులో చేరిన ఆందోళనను చెరుపుతుంది. ఆందోళన లేని మనసు అది శాంతిగా ఉంటుంది. దాని చుట్టూ ఉండేవారిని శాంతితో ఉండనిస్తుంది. కాబట్టి భక్తి భావం మనసుకు శాంతిని అందిస్తుంది.
బలమైన మనసుకు బలహీనతే అద్దంకి. బలహీనత కూడా బలంగా మార్చగలిగే శక్తి దైవానికి ఉందని పెద్దలంటారు. కానీ భక్తి భావన బలంగా లేకపోవడం వలననే, మనసు ఆందోళనకు దగ్గరగా, అశాంతిని అనుకుని ఉంటుంది.
ప్రతి విషయంలోనూ ఎదురవుతున్న అనుభవాలు అనుభవిస్తూ, మనసులో మరో మూలన పడిన భక్తి భావనను పైకి తీసుకువచ్చే ఆలోచనలకు కూడా అవకాశం ఇవ్వడమే భక్తి భావన బలపడడానికి మార్గం అంటారు.
జీవితంలో కష్టసుఖాలు కామన్. కానీ కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. ఇష్టపడి పనిచేస్తే, కష్టం తెలియకుండా పని పూర్తి అవుతుంది. అది కూడా మనసు వలననే అంటారు.
అలాంటి మనసుకు భక్తి భావనను కూడా పెంచే విధంగా ఆలోచనలకు అవకాశం ఇవ్వడమే భక్తి భావన పెరుగుదలకు బీజం పడుతుంది.
విగ్రహం ముందు నిగ్రహం వహించడం నియంత్రణలో ప్రాధమిక ప్రయత్నం
విగ్రహం ముందు నిగ్రహం వహించడం నియంత్రణలో ప్రాధమిక ప్రయత్నం అయితే, భక్తి భావన బలపడడానికి అది ఆది ప్రయత్నం అవుతుంది.
మనకు అనేక మతాలు, అనేక దైవాలు, దేవతలు ఉన్నారు. మన సమాజంలో మత స్వేచ్చ ఉంది. దైవనామ స్మరణకు, దైవారాధనకు షరతులు లేవు.
మనసు ఉండాలే కానీ మార్గములు అనేకం. భక్తి అనే భావన మనసులో మెదలాలి కానీ దేవతలకు కొదువలేదు.
ఒక దైవం అనుకుని. ఆ దైవంపై నమ్మకం ఉంచుకుని, ఆ దైవ నామస్మరణ చేయడం. ఆ దైవ స్వరూపమును మనసులో ముద్రించుకోవడం ప్రధానం అయితే అందుకు విగ్రహారాధన మొదటిమెట్టు అంటారు.
దైవ స్వరూపమును మనసులో బలంగా ముద్రించుకోవడానికి మార్గం విగ్రహం ముందు నిగ్రహంతో ఉండడం.
నిగ్రహం అలవాటు కావడానికే విగ్రహం ముందు కూర్చుని నియమాలతో ఉండడం. స్తోత్రం చేయడం, దైవ సేవ చేయడం అంటారు.
ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో చదవండి. ప్రకృతిలో గాలి, నీరు, అగ్ని, భూమి ప్రకంపనల వలన విపరీతాలు సంభవిస్తే వాటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు.
ఈ పంచభూతాలలో ఏది అధికమైనా అది ప్రకృతి వైపరీత్యంగా సంభవించి, వాటివలన మనవాళికి అపారనష్టం జరుగుతూ ఉంటుంది.
ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మానవుడు అడ్డుకోవడం కష్టం. కానీ కొన్నిసార్లు ప్రకృతిలో జరుగుతున్నా మార్పులు గమనించి, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయగలడు.
అలా ముందుగానే ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసినప్పుడు మాత్రం, ముందస్తు చర్యల వలన ప్రకృతి వైపరీత్యాల వలన మానవాళికి జరగబోయే అపారనష్టం నుండి కొంతవరకు బయటపడగలడు.
ఎన్ని ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నష్టం తీవ్రంగానే ఉంటుంది. కారణం ప్రకృతిలో పంచభూతాలు ప్రకోపిస్తే, వాటి ప్రతాపం చాలా ప్రభావం చూపుతాయి.
భూకంపాలు – భూమి కంపించుట వలన ప్రకృతి వైపరీత్యాలు
భూమి అడుగుభాగం వివిధ పొరలతో వివిధ లోహాలతో ఉంటుంది. భూమి లోపల కూడా నీరు, ఖనిజాలు ఉంటాయి. భూమి లోపల చర్యలు జరిగినప్పుడు భూమి ప్రకంపనలకు గురి అవుతుంది.
అకస్మాత్తుగా భూమిలోపల ఏర్పడే చర్యలతో లేక విడుదల అయ్యే శక్తి వలన భూమి కంపిస్తుంది. అలా భూమి కంపించినప్పుడు భూమి పగిలి బీటలువారుతుంది.
భూమి కంపించడం భూమి పగలడం వలన భూమిపైన ఉండే భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదాలు వలన ప్రాణనష్టం, ఆస్తినష్టం, ఆర్ధిక నష్టం జరుగుతూ ఉంటుంది.
ఇలా భూమి నుండి ఏర్పడే ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కొరకు భూకంపాలను అంచనా వేసే పరికరాల సాయంతో భూకంపం సంభవించే సమయం ముందుగానే పసిగడితే, ముందస్తు చర్యలు వలన ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చు.
అయితే ఆస్తి నష్టం, ఆర్ధిక నష్టం అడ్డుకోవడం అసాధ్యం.
ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు
అగ్ని ప్రమాదాలు వైపరీత్యాలు
అగ్ని వలన జరిగే ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వలననే జరుగుతాయి. గ్యాస్ లీక్ కావడం, కెమికల్ లీకేజ్ తదితర తప్పుల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.
ఇటువంటి అగ్ని ప్రమాదాలు నుండి రక్షణ కొరకు నీరు, ఇసుక, వాయువులు వంటివి అందుబాటులో ఉండడం వలన అగ్ని ప్రమాదాలు పెద్ద ప్రమాదాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడవచ్చు.
పెద్ద మొత్తంలో గ్యాస్ లీకేజ్ వంటివి అపార నష్టం చేయగలవు. మానవ తప్పిదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే, అగ్ని ప్రమాదాల నుండి రక్షణ ఉంటుంది.
అగ్నిమాపక సిబ్బంది వలన చాలావరకు అగ్ని ప్రమాదాలను ఆర్పిన ఘటనలు ఉన్నాయి.
గాలి-నీరు ప్రకృతి విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు
ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించేది గాలి-నీరు వలనే. తుఫాన్, అతి భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులు ఇంకా సునామీ వంటి విపత్తులు మనవాళికి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి.
సముద్రగర్భంలో జరిగే విపరీత చర్యలు వలన సునామీ ఏర్పడితే, తీర ప్రాంతం అంతా నీటిమయం అవుతుంది. తీరప్రాంతాలు అన్నీ నీట మునుగుతాయి. ఇటువంటి సునామీలు వలన ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలు అపారనష్టం తీసుకువస్తాయి.
ఇంకా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం వలన తీవ్ర వర్షాలు, అతి భారీ వర్షాలు కురవడం వలన కూడా నదులు విపరీతంగా ప్రవచించి వరదలుగా సంభవిస్తాయి.
వరదల వలన ప్రాణ నష్టం, పంటనష్టం, ఆస్తి నష్టం, వ్యవస్థలు స్తంభించడం వంటివి జరుగుతాయి. వాయుగుండం తీరం దాటుతున్నప్పుడు ఈదురు గాలులు, అతిభారీ వర్షాలు చాలా నష్టం కలిగిస్తాయి.
వాతావరణం మార్పులు గమనిస్తూ, ముందస్తు హెచ్చరికలు చేయడం వలన ఒక్కోసారి గాలి-నీరు వలన సంభవించే ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త వహించినా ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవించేది.
గాలి-నీరు వలన సంభవించే విపత్తుల నుండి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడగలరు కానీ ఆస్తినష్టం, ఆర్ధికనష్టం, వ్యవస్థలు స్తంభించడం వంటివి జరగకుండా అడ్డుకోవడం అసాధ్యమే అవుతుంది.
అయితే ప్రకృతి వైపరీత్యాలు జరిగిన వెంటనే పునరుద్దరణ చర్యలు తీసుకునే వ్యవస్థ మనకు అందుబాటులో ఉండాలి. అందుకు అందరూ స్పందించి తగినంత సాయం చేయాలి. ఇటువంటి సాయం చాలామంది చేసి ఉన్నారు… కూడా.
ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు
ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు, అంటే ప్రకృతిలో అసహజత్వం జరగకుండా చూసుకోవడమే అంటారు.
సహజంగా ఏర్పడిన పర్యావరణంలో భూమిపై గాలి, నీరు, నిప్పు సాయంతో జంతుజాలం, మానవుడు నివాసం ఉంటారు. జంతువులు కేవలం వాటి ఆహారం, నివాసం విషయంలో ప్రకృతిలో లభించే సహజస్థితిలోనే జీవిస్తాయి.
ప్రకృతిని తనకు నచ్చినట్టుగా మార్చుకునే తెలివి, సామర్ధ్యం మనిషికి సొంతం. అటువంటి తెలివి ప్రకృతి సహత్వాన్ని దెబ్బతీసి, ప్రకృతి సమతుల్యత పాడైతేమాత్రం ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి.
ఎంత సహజంగా ప్రకృతి ఉంటే అంతా ఆహ్లాదకరమైన ప్రకృతి, ఎంత అసహజత్వానికి గురి అయితే, అంతటి విపత్తులను పొందుతుంది. అది విపరీత స్వరూపాన్ని పొందితే మానవాళికి నష్టమే కానీ లాభం ఉండదు.
ప్రకృతి విపరీత స్థితికి చేరడానికి గాలి-నీరు ఎక్కువగా సాయపడతాయి. ప్రకృతిలో కుత్రిమ చర్యలు సహజత్వాన్ని పాడు చేయకుండా తగు జాగ్రత్తలు టేసుకోవాలి.
మనిషితోబాటు కలిసి జీవించే జంతుజాలం వలన కూడా ప్రకృతి సమతుల్యత ఉంటుంది అని అంటారు. కాబట్టి ప్రకృతిలో జంతుజాలం అంతరించిపోయే చర్యలను కూడా నివారించాలి.
ప్రకృతి వైపరీత్యాల నివారణకు, ప్రకృతిని సహజత్వం నుండి దూరం చేయకుండా ఉండడమే ప్రధానం…
పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో! భూమి, గాలి, నీరు ఉన్న చోట మొక్కలు, చెట్లు, జంతువులు ఉంటే, దానిని సహజ పర్యావరణం అంటారు. ప్రకృతి నియమాల ప్రకారం అనేక జీవజాతులు ప్రకృతిలో నివసిస్తాయి.
అటువంటి పర్యావరణంలో మనిషి కూడా ఒక భాగస్వామి. బుద్ది కుశలత, తెలివి కలిగిన మానవుడు ప్రకృతిని తనకు సౌకర్యంగా మార్చుకునే శక్తిని కలిగి ఉంటాడు.
అలాంటి మనిషి కొన్ని ప్రాంతాలలో మనిషి ఏర్పచుకునే నివాసాలలో ప్రకృతి మార్పుకు గురి అవుతుంది. అటువంటి మనిషి చుట్టూ పర్యావరణం తన సహత్వానికి బిన్నంగా మారుతుంది. కొన్ని చోట్ల పకృతికి హాని జరిగే విధంగా చర్యలు ఉంటే, పర్యావరణం దెబ్బ తింటుంది. ఇది మనిషి ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది.
సహజమైన నీరు స్వచ్చంగా ఉంటూ, మనిషికి ఉపయోగపడుతుంది. స్వచ్చమైన గాలి మనిషిని ఆహ్లాదపరుస్తుంది. కానీ ప్రకృతి సహజత్వాన్ని దెబ్బతీయడం వలన ప్రకృతి వనరులు కూడా సహజత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. దాని వలన మనిషికే నష్టం వాటిల్లనుంది. సహజ వనరుల శక్తి మనిషికి అందె అవకాశం తగ్గుతూ ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ గురించి పాటు పడవలసిన అవసరం ప్రతి ఒక్కరి సామాజిక బాద్యత.
ప్రకృతిలో సహజంగా లభించే వనరులు వలన సృష్టిలో అనేక జీవరాశులు బ్రతుకుతూ ఉన్నాయి. చెట్లు వదిలే గాలి మనిషికి ప్రాణవాయువు అయితే, చెట్లు వలన మనిషి ఎంతో ప్రయోజనం పొందుతున్నాడు.
పర్యావరణంలో చెట్లు చేసే పని, అవి బ్రతికినంతకాలం కొనసాగుతుంది. చెట్లు ఎక్కువగా ఉన్న చోట గాలి స్వచ్చంగా ఉంటూ, గాలి కాలుష్యం తక్కువగా ఉంటుంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా
అందుకే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే, ప్రకృతిలో సహజంగా పెరిగిన ఎన్నో చెట్లను మనిషి తనకోసం తొలగిస్తున్నారు. అందువలన మనిషి మరలా అటువంటి చెట్లు తయారుకావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా వాతావరణం అనుకూలంగా లేకపోతే నాటిన ప్రతి మొక్క చెట్టుగా మరే అవకాశం తక్కువ. కాబట్టి వీలైనన్ని మొక్కలు పెంచడానికి ప్రతివారు కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణలో చెట్లు చాలా కీలకమైనవి.
సమాజంలో పర్యావరణ పరిరక్షణ అంటూ అనేక నినాదాలు సంవత్సరాలుగా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలు జరుగుతున్నాయి. అంటే మనిషి వలన ప్రకృతికి జరుగుతున్న నష్టం ఏమిటో? పెద్దలు గుర్తించారు. కాబట్టే పర్యావరణ పరిరక్షణ నినాదాలు వచ్చాయి. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఏర్పడింది.
అంతగా పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను సమాజంలో పెద్దలు గుర్తించారు. కానీ నరుకుతున్న చెట్లు, ఒక్కరోజులో పెరిగినవి కావు. ఏళ్ల నాటి నుండి మొక్కలుగా పెరిగి, పెరిగి చెట్లుగా ఎదిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. అటువంటి చెట్లు తొలగించే సమయానికి ఒక చెట్టుకు కనీసం పది మొక్కలు నాటి, వాటిని పెంచే ప్రయత్నం చేస్తే, అటువంటి చెట్లు భవిష్యత్తులో మానవ మనుగడకు అవసరమైనన్ని తయారుకాగలవు… కావున మొక్కలు పెంచడానికి ఎవరికి మినహాయింపు లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
మనిషి మనుగడకు గాలి అవసరం. అలాగే నీరు అవసరం. నేడు చెట్లు తక్కువగా ఉండడం వలన పర్యావరణ సమతుల్యత తగ్గి వానలు సరైన సమయానికి రావడం లేదనే వాదన బలంగా ఉంది.
వానలు సమృద్దిగా కురిస్తే, నీరు పుష్కలంగా ఉంటుంది. తగినంత నీరు ఉంటే, తగినంత పంటలు పండుతాయి. తగినంత పంటలు పండితే, తగినంత ఆహార పదార్ధాలు లభిస్తాయి. శ్రమజీవులకు ఆహారం అందుతుంది. నేటి సమాజం శ్రామిక జీవులపైనా, రైతులపైనా ఆధారపడి ఉంది.
నీటి దుర్వినియోగం కూడా పర్యావరణ పరిరక్షణకు చేటు చేస్తుంది.
గత కాలంలో నీరు భూమిపై మాత్రమే ప్రవహించేది. అందువలన నీరు అయితే భూములోకి ఇంకేదీ. లేకపోతే ఎండలకు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘంగా మరి మరలా భూమిపైకి వర్షించేది. ఇలా ఒక సహజమైన క్రమం జరుగుతూ ఉండేది. కానీ నేటి రోజులలో నీరు ప్రవహించేది గొట్టాలలో…
వివిధ రకాల గొట్టాల ద్వారా వివిధ విధాలుగా నీటి మళ్లింపు జరుగుతుంది. అందుకోసం ఆకాశం నుండి కురిసే వానలు చాలక భూమిలో నీటిని పైకి తీసుకురావడం కూడా జరుగుతుంది. అందువలన నీటి దుర్వినియోగం అయితే, భూమిలోపల నీరు తగ్గుతుంది. దానితో భూమిలోపల సమతుల్యత లోపిస్తుంది.
నీటి వాడకం జాగ్రత్తగా జరిగితే, భూమి నుండి వెలికి తీసే నీటి శాతం తగ్గుతుంది. ప్రకృతి సహజంగా నీరు వానరూపంలో కురవడానికి అనేక చెట్లను తయారుచేసుకోవలసిన అవసరం నేటి మానవాళిపై ఉంది.
వివిధ పరిశ్రమల నుండి నిషిద్ద జలాలు వెలువడితే, వాటి వలన కూడా పర్యావరణకు ప్రమాదము.
నేటి మొక్కలే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి వృక్షాలుగా మారాలి.
నేటి మొక్కలే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి వృక్షాలుగా మారాలి అంటే, పర్యావరణ పరిరక్షణలో విధ్యార్ధులు పాత్రతను తీసుకోవాలి. విధ్యార్ధులు పర్యావరణ పరిరక్షణ గురించి, మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి, తెలియని వారికి తెలియజేస్తూ ఉండాలి.
భవనాల నిర్మాణం కొరకు, రోడ్ల నిర్మాణం కొరకు చెట్లను తొలగించడం కోసం పాటుపడే వారికన్నా, మొక్కలు నాటి, వాటిని పెంచడానికి పాటు పడేవారి శాతం తక్కువ.
కాబట్టి నేడు నాటిన మొక్కలలో ఏదో ఒక్కటి అతి పెద్ద వృక్షంగా మారగలదు. ఆక్సిజన్ అందించగలదు. ఎండ నుండి రక్షణ కల్పించగలదు. కావున మొక్కలు నాటడం, వాటిని చెట్లుగా ఎదిగేవరకు కృషి చేయడం గురించి ఉదృతమైన ప్రచారం ఒక ఉద్యమం లాగా జరగాల్సిన ఆవశ్యకతను నేటి ప్రకృతి సమస్యలు తెలియజేస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణలో చెట్లు, జంతువులు, గాలి నీరు అనేక విధాలుగా పాలు పంచుకుంటాయి. వాటిని సహజంగా ఉండేలాగా కృషి చేయవలసిన బాద్యత, ప్రకృతిని వినియోగించుకుంటూ, ప్రకృతిని ఆధారంగా జీవించే ప్రతి మనిషిపైన ఉంటుంది.
శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం. శతకాలు చదవమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉన్నత తరగతి పాఠ్యాంశాలలో కూడా తెలుసు శతకాలు ఉంటాయి.
పలువురు పెద్దలు శతకాలను చదవమని చెప్పడమే, శతకాలు చదవానికి ఒక ప్రేరణ. ఇంకా ఉన్నత తరగతి పాఠ్యాంశాలలోనూ తెలుగు శతకాలు ఉండడం కూడా ప్రధాన కారణంగా కనబడుతుంది.
సమాజనికి మేలు చేసే విషయాలు బాల్యం నుండి అలవాటు చేయడం కోసం పలు పాఠ్యాంశాలు విధ్యార్ధులకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ విధంగా ఆలోచన చేస్తే, శతకాలకు మన పెద్దలు ఇచ్చిన ప్రాధాన్యత గుర్తించవచ్చు.
ఎందుకు శతకాలు చదవాల్సిన అవసరం ఉంది?
తెలుగులో శతకాలను చదవమని ప్రేరేపించవలసిన అవసరం ఎందుకు అంటే, శతకాలు విశేషమైన అర్ధాన్ని కలిగి ఉంటాయి. వాటిలో వివిధ తాత్విక, దైవిక, సామాజిక, వ్యక్తిత్వ విషయాలను సూచిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జీవనగమ్యం గురించి ఆలోచన రేకెత్తించేవిధంగా శతకాలలో పద్యాలు ఉంటాయి.
శతకాలు నీతిని ప్రభోదిస్తాయి. విలువలను గురించి ఆలోచనలు రేకెత్తిస్తాయి.
జీవితలక్ష్యం, జీవిత పరమార్ధం, సామాజిక సంబంధం ఇలా పలు విషయాలలో ప్రశ్నలు ఉంటాయి. వ్యక్తిత్వం, వ్యక్తి యొక్క మనస్తత్వం గురించి శతకాలు యందు ఉండేడి పద్యాలలో ఉంటాయి.
శతక పద్యాలు చిన్న పదలతోనే ఉంటాయి. కానీ బావం బలంగా ఉంటుంది. ఇంకా శతకాలలో భక్తి భావనను పెంచే విధంగా పలు పద్యాలు ఉంటాయి.
భక్తి భావన మనిషి మనసుకు శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది. కాబట్టి భక్తి పరమైన భావనలు పెరడానికి శతక పద్యాలు ఉపయుక్తంగా ఉంటాయి.
ముఖ్యంగా శతకాలు మనిషి చిత్తశుద్దిని ప్రశ్నిస్తూ కూడా ఉంటాయి. ఇంకా సమాజంలో గల వివిధ స్వభావుల గుణాలను కూడా తెలుపుతాయి.
ఆసక్తికరమైన విషయం తెలుగు శతకాలు ఎక్కువగా వాడుక భాషలోనే ఉంటూ, వివిధ విషయాలలో ఆసక్తికరమైన ఆలోచనను మనసులో ఏర్పరచగలవు. అయితే తెలుగు వాడుక భాష వివిధ భాషలతో కలిసి భాషలో పదాలు మరుగున పడడం వలన తెలుగు వాడుక భాష కూడా గ్రాంధిక భాష వలె అనిపించడం నేటి సమాజంలో సహజమైంది.
తెలుగులో గల వివిధ శతకాలు
వేమన శతకం
దాశరధి శతకం
సుమతి శతకం
భాస్కర శతకం
శ్రీ కాళహస్తీశ్వర శతకం
ఇంకా వివిధ తెలుగు శతకాలు కలవు.
ప్రతి తెలుగు శతకం పద్యం చివరలో మకుటం ఉంటుంది. ఆ మకుటం శతక పద్యాలు రచించిన వారి పేరుతో కూడి ఉండవచ్చు. లేక రచయత ఇష్టదైవ పేరుతో కూడి ఉండవచ్చు.
వేమన శతకం యొక్క మకుటం విశ్వదాభిరామ వినురవేమ అయితే సుమతీ శతకం మకుటం సుమతీ…
శ్రీకాళహస్తీశ్వరా శతకం రచయిత దూర్జటి, శ్రీకాళహస్తీశ్వరా శతకం మకుటం శ్రీకాళహస్తీశ్వరా దూర్జటి యొక్క ఇష్ట దైవం.
పద్య రూపంలో నీతిని బోధించే శతకాలు వ్యక్తిలోని చిత్త శుద్దిని ప్రశ్నిస్తూ ఉంటాయి. శతక పద్యాల యొక్క భావన బలపడ్డ వ్యక్తి యొక్క మనసు చెడుకు దూరంగా ఉంటుంది.
తెలుగులో గల శతకాలు చదవడం వలన మనసుకు మేలు జరుగుతుందని పెద్దలంటారు… కావున శతకాలు చదవడం మంచి అలవాటు అవుతుంది.
సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో ఈ పోస్టు మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
మనిషికి మరచిపోవడం ఎంత సహజమో అంతకన్నా ఎక్కువ విషయాలు గుర్తులో ఉంటాయి. ఏదైనా మరిచిపోయే విషయం అతిగా ఉండడం అంటే బాగా వయస్సు అయిపోయాక జరిగేది మాత్రమే…
మరిచి పోవడం అనేది చాలా సహజం, అయితే అన్నీ విషయాలు మరిచిపోము. ఎప్పుడో ఏదో ఒక విషయం మరిచిపోతే మనకు పది విషయాలు గుర్తుకు ఉంటాయి. అంటే ఇక్కడ మరిచిపోయినది, గుర్తుకు రాకపోయేసరికి కలిగే చికాకు వలన మనసు పొందే భావన వలన మిగిలిన విషయాలు ప్రక్కకు వెళ్ళిపోతాయి.
ఇది పాఠాలు విషయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రాని ప్రశ్నలు గురించి ఆలోచించి వచ్చిన ప్రశ్నల సమాధానాలు మరిచిపోవడం జరుగుతూ ఉంటుంది.
సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా అంటే, సహజంగా పాఠాలు అర్ధం చేసుకోవడం మేలైన విధానం అయితే, తగినంత సాధన చేయడం మరింత మంచి ఫలితం వస్తుంది.
పాఠాలు గుర్తులో లేకపోవడానికి కొన్ని కారణాలు
అర్ధం చేసుకుంటూ చదివి ఉండక పోవడం
సబ్జెక్టులో ఏదో ఒక సెక్షన్ పై అనవసరపు భావన (కొందరు లెక్కలు బాగా చేస్తారు. కానీ ఆల్జీబ్రా అంటే ఆసక్తి తక్కువ. అంటే ఆసక్తి లేని విషయాలలో సాధన చేయకపోవడం)
ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం
పరీక్షా సమయంలో వేరొకరి భావన బలంగా మనసులో ఉండిపోవడం
అర్ధం చేసుకుంటూ చదివి ఉండక పోవడం
ఒకటికి పదిసార్లు పుస్తకాలలో పాఠాలు బట్టి బట్టడం వలన కొన్నిసార్లు గుర్తుకు ఉంటాయి. కొన్నిసార్లు ఒత్తిడిలో గుర్తుకు రాకపోవచ్చు. పుస్తకంలో పాఠాలు అర్ధం చేసుకుంటూ చదివి ఉండక పోవడం వలన అవి గుర్తుకు రాకపోవచ్చు.
అదే పుస్తకంలో పాఠాలు పాఠశాల తరగతిలో చెప్పినప్పుడు శ్రద్దగా వింటే, అసలు పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటో తెలియబడుతుంది. ప్రాధమికంగా పుస్తకంలో చాప్టర్ ప్రస్తావిస్తున్న అంశం అర్ధం అయితే, ఆ అంశంపై మైండులో ఆలోచనలు పెరుగుతాయి. తద్వారా ఆ అంశంపై అవగాహన పెరిగి, ఆ అంశంలో ప్రశ్నలకు సమాధానాలు సమయానికి తట్టే అవకాశం ఉంటుంది.
లెక్కల పుస్తకంలో ఉండే సూత్రాలు అర్ధం అయితే, లెక్కలు చేయడం చాలా తేలిక. అలాగే తెలుగు అయినా, సోషల్ అయినా, సైన్స్ అయినా చాప్టర్ లో ఉన్న అంశం గురించి సరైన అవగాహన ఉంటే, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం సులభం అవుతుంది.
కేవలం వచనంతో పాఠాలు అయినా, ఆ పాఠాలలో ప్రస్తావించే అంశం ఏ విషయానికి సంబంధించినది? తెలుసుకుని, ఆ అంశం గురించి మనకు తెలిసి ఉన్న విధానాల ద్వారా కూడా పరిజ్ణానమ్ పెంచుకోవచ్చు.
సహజంగా తరగతి గదిలో చెప్పే పాఠాలు గురించి ఆలోచన చేయడం వలన సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం సాధ్యపడుతుంది.
ఉదాహరణకు సోషల్ సబ్జెక్టులో చరిత్ర ఉంటే, చరిత్రకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. అవి చూస్తే, చరిత్ర గురించి అవగాహన మైండులోకి సులభంగా చేరుతుంది. అలాగే ఆర్ధిక బడ్జెట్ వంటి విషయాలు, స్టాటిస్టిక్స్ గురించి కేవలం పుస్తకాల ఉండే కాకుండా పత్రికలలో న్యూస్, వీడియోలు కూడా చూసి తెలుసుకోవచ్చు. ఒకే రకమైన పద్దతిలో చదువు కన్నా పలు రకాలుగా పరిజ్ణానమ్ పెంచుకోవడమే చదువుకునేతప్పుడు చేయాలి. అర్ధం కానీ పాఠాలు గురించి, తెలిసిన స్నేహితులను అడగడం వలన ఆ పాఠం గురించి గుర్తు ఉంటుంది. ఎందుకంటే స్నేహితుడితో ముచ్చట్లు మైండుకు బాగా పడుతుంది. అలాగే టీచర్లను అడగడం. టీచర్ల అంటే భక్తి, భయం ఉండడం వలన కూడా వారిని అడిగిన పాఠాలు ఎక్కువగా గుర్తులో ఉండే అవకాశాలు ఎక్కువ. ఏదైనా అర్ధం కానీ సబ్జెక్టులో వివిధ పద్దతిలో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ సబ్జెక్టులో కూడా మేలైన ఫలితాలు రాబట్టవచ్చు. సరైన సాధన, పట్టుదలతో చేస్తే, సాధించలేనిది అంటూ ఉండదని పెద్దలు అంటారు.
సబ్జెక్టులో ఏదో ఒక సెక్షన్ పై అనవసరపు భావన (కొందరు లెక్కలు బాగా చేస్తారు. కానీ ఆల్జీబ్రా అంటే ఆసక్తి తక్కువ. అంటే ఆసక్తి లేని విషయాలలో సాధన చేయకపోవడం)
చదువుకునే వయస్సులో టీచర్ల అంటే భయంతో పాటు తోటివారితో అల్లరి కూడా ఉంటుంది. అల్లరితోనో, భయంతోనో ఏదో ఒక సబ్జెక్టులో సాధన తక్కువగా ఉండవచ్చు.
ఇష్టమున్న సబ్జెక్టులో మైండ్ ముందుగానే స్పందిస్తుంది. ఇష్టం లేని సబ్జెక్టులో మైండ్ మాట్లాడదు. మైండుకు ఏదో కష్టం అనే భావన బలపడిన చోట, తప్పించుకోవాలని చూడడం దాని సహజ లక్షణం. కాబట్టి కష్టం అని అనిపించే సబ్జెక్టులో మొదటి నుండి ప్రత్యేకమైన సమయం కేటాయించి, దాని సంగతి చూడాలి.
ఏదైనా మొదటిగా ఏర్పడే భావన, చాలా కాలం ఉంటుంది. ఒక సబ్జెక్టు గురించి పాఠాలు విన్నప్పుడు, సరిగా అర్ధం చేసుకోకపోతే, ఆ సబ్జెక్టుపై మొదటి భావన కష్టమనే భావన ఏర్పడవచ్చు. అందుకే పాఠశాల తరగతులలో పాఠాలు మొదటి నుండి సరిగ్గా వినాలి. మొదటి నుండి సరిగ్గా విని ఉండక పోవడం వలన సబ్జెక్టుపై ఏర్పడే భావన, మైండుపై పరీక్షలలో చూపుతుంది. అలా పరీక్షల నుండి ఆ భావన మరింత బలపడే అవకాశం.
వీక్ సబ్జెక్ట్ ఉందంటే, ఆ సబ్జెక్టులో పాఠాలు సరిగా వినలేదు లేక సరైన సాధన చేయలేదని గుర్తించాలి. ప్రత్యేక సమయం కేటాయించి, ఆ సబ్జెక్టులో సాధన చేయాలి.
ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం
పాఠశాలలో చదువుకునే సమయంలో సబ్జెక్టులపై దృష్టి పెట్టడం మానేసి, పరీక్షల ముందు పుస్తకాలు చదివేసి, పరీక్షలలో వాటిని గుర్తుకు తెచ్చుకుని వ్రాసేయడానికి అలవాటు పడడం వలన ప్రధాన పరీక్షలలో కూడా అదే అలవాటు ఉంటుంది.
బాగా గుర్తుకు ఉండే సబ్జెక్టులు బాగా వచ్చినట్టు, గుర్తులేని సబ్జెక్టులు రానట్టు మనసు భావన పొందుతుంది. ఒక తరగతి సబ్జెక్టులలో అన్నీ బట్టీ బట్టీ చదివే అవకాశం ఉండదు. అందుకనే వచనంలో ఎక్కువ మార్కులు వచ్చే వారికి లెక్కలు, సైన్స్ సబ్జెక్టులలో మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉండవచ్చు.
తరగతి పాఠాలు సరిగా వినక, బట్టీ బట్టి చదివిన పాఠాలు ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయడం కన్నా పాఠాలు సరిగ్గా విని వాటిలో సరైన సాధన చేయడం ఉత్తమం.
పరీక్షల సమయంలో మైండును సహజంగా పని చేసే విధంగా చూసుకోవాలి కానీ ఆందోళనతో ఆలోచించకూడదు.
పరీక్షా సమయంలో వేరొకరి భావన బలంగా మనసులో ఉండిపోవడం
“ఈ సారి మార్కులు తక్కువ వచ్చాయో… నీ పని చెబుతా” ఇక పరీక్షలకు ముందు టీచర్లు కానీ ఇంట్లో పెద్దవారు కానీ మందలించడం కూడా సహజం. ఎందుకంటే భయంతోనైనా భాగా చదువుతారేమో అని వారి ఆలోచనగా ఉంటుంది. అయితే ఆ మాటలను దృష్టిలో పెట్టుకుని బాగా చదవడానికి ప్రయత్నం చేయాలి… కానీ భయం పెంచుకోకూడదు. ప్రయత్నించక పోతే కచ్చితంగా తప్పే. ప్రయత్నిస్తూ భయం పెట్టుకోవడం అనవసరం… వారు చెప్పినట్టు మంచి మార్కుల కోసం పట్టుదలతో చదవడమే పనిగా పెట్టుకున్నప్పుడు అనవసర భయాలు, భవనాలు వృధా…. కొందరు అలాంటి భయాలే, పరీక్షల సమయానికి కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ పరీక్షల సమయానికి సరైన సాధన చేసి ఉంటే, మైండులో భయం పొందడానికి స్థానం ఉండదు. అయితే గుర్తుకు తెచ్చుకుని భయం పెట్టుకోవడం వలన అనవసర ఒత్తిడి వస్తుంది. పరీక్షల సమయంలో ఎప్పటికీ ఏ సబ్జెక్టులో పాఠాలు అవసరమో, ఆ పాఠాలు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి.
ఇలాంటివి అన్నీ ముఖ్యంగా మనసుకు సంబంధించినవే…. కాబట్టి మనసుకు తర్ఫీదు ఇస్తే, చాలు. ఇంకా పౌష్టికాహారం సర్వ సాధారణం.
ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మాత్రం అవసరానికి అసలు విషయం గుర్తుకురాదు. ఆ సమయంలో మరింత చికాకు తెచ్చుకుని, కోపం తెచ్చుకుంటే, మరింత ఒత్తిడికి లోనయ్యి గుర్తులో ఉన్న విషయం కూడా మరిచే అవకాశం ఎక్కువ.
గుర్తులో లేదు, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే ముందు మనకు ముందు చేయవలసిన పనిని ముగించేసి, అప్పుడు గుర్తుకు రావలసిన విషయం గురించి ఆలోచించాలి.
చేయవలసిన పని ముందు ఉండగా, ఆ పని యొక్క ఒత్తిడి మైండుపై కొంత ఉంటుంది. ఆ పని వదిలి గుర్తులో లేని విషయం గురించి ఆలోచన చేస్తే, చేయవలసిన పని వలన ఉండే ఒత్తిడి మైండులో మరింత పెరుగుతుంది.
అదెలాగంటే ఉదాహరణ:
మీరు ఇంట్లో డ్రాయింగ్ వేయడానికి సిద్దం అయ్యారు. ప్రాజెక్టు వర్కులో భాగం ముఖ్యమైన డ్రాయింగ్ వేయాలి. దానికి సిద్దం అయ్యారు. ఈలోపు మీ అమ్మగారు వచ్చి “ఉదయం నీకు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టవు?” అని అడిగారు. వెంటనే మీరు బ్లాంక్ మైండుతో ఆలోచనలోకి వెళ్లారు. ఎందుకంటే ఉదయం స్కూల్ కు వెళ్ళే హడావుడిలో డబ్బులు తీసుకోవడం గుర్తు ఉంది. కానీ ఆతర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. సడన్ గా అమ్మ డబ్బులు అనగానే తీసుకోవడం గుర్తుకు వస్తుంది. కానీ డబ్బులు ఎక్కడ పెట్టడం జరిగిందో గుర్తుకు రాదు. ఇక ఆ డబ్బులు గురించే ఆలోచన చేస్తే, ఆలోచన పెరిగి పెరిగి చికాకు కలుగుతుంది. ‘ఒక ప్రక్క డ్రాయింగ్ వేయాలి’ అనే ఆలోచన మైండులో మెదులుతూ ఉంటుంది. కానీ డబ్బులు గురించి ఆలోచన కూడా వస్తుంది. డబ్బులు గుర్తుకు రాకపోతే, అమ్మ మరొకమారు అడిగేటప్పటికి కోపం కూడా కలుగుతుంది. అలా కాకుండా అమ్మ డబ్బులు అడగగానే, ముందుగా అమ్మతో “నేను డ్రాయింగ్ అర్జెంటుగా వేయాలి, ఈ పని పూర్తయ్యాక డబ్బులు ఎక్కడ పెట్టానో వెతికి ఇస్తాను” అని చెబితే, ముందుగా మీరు డబ్బులు గురించిన ఆలోచన నుండి బయటకు వచ్చేయవచ్చు. డ్రాయింగ్ వేయడం, సంతృప్తిగా పూర్తి చేశాక, ఆలోచిస్తే డబ్బులు విషయం వెంటనే గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. శాంతితో ఉండే మనసు పనితీరు అద్భుతమని చెబుతారు.
ఇలా మీకు క్వశ్చన్ పేపరులో కూడా సడన్ గా ఆమ్మ అడిగిన ప్రశ్నలాగానే కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటిని మొదట మరిచిపోవాలి. బాగా వచ్చిన క్వశ్చన్స్ గురించి బాగా వ్రాసేసి, ఆపై గుర్తులో లేని ప్రశ్నలు సంగతి చూడాలి.
అంటే గుర్తు లేకపోవడం అంటే మనసులో జరిగే ప్రక్రియ. ఏదో ఒక విషయంలో మరుపు సహజం. అయితే అది శాశ్వతం కాదు. మరలా అది గుర్తుకు వస్తుంది. కానీ ఒత్తిడి గురి అయితే మాత్రం చికాకు, అసహనం కలుగుతాయి.
ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకోవడం ఎలా?
ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకోవడం ఎలా? ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది?
సహజంగా పరీక్షా కాలంలో ఒత్తిడి ఉంటుంది. దీనివలన నాకు మతి మరుపు ఉందేమో అనే ఆలోచనలు కూడా పెరుగుతాయి.
ఇంకా కొందరికి పెద్దవారు భయపెడుతూ చెప్పిన మాటలు వలన అనవసరపు భయాలు పొందుతారు. బాగా చదివే వారికి కూడా ఈ భయం వలన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది.
ఒక్కసారి పరీక్షా హాలులో కూర్చుంటే, కేవలం క్వశ్చన్ పేపరులో ఉన్న క్వశ్చన్స్ గురించి మాత్రమే చూడాలి. ప్రశ్నలకు సమాధానాలు చక్కగా వ్రాయడానికి ప్రయత్నం చేయాలి, కానీ గతంలో విన్న హెచ్చరికల గురించి కాదు.
మరిచిన విషయాలు గుర్తుకు తెచ్చుకునే సమయం మనసు శాంతిగా ఉండాలి. అంటే అప్పటికి చేయవలసిన పనిని పరిపూర్ణంగా చేయాలి.
ఒక సంవత్సరంలో ఒక తరగతి విధ్యార్ధులు పరీక్షలు నిర్వహించ బడతాయి. వాటిలో ఉత్తీర్ణత శాతం, ప్రతి విధ్యార్ధికి ఒక గుర్తింపు తెచ్చిపెడుతుంది.
ఎక్కువ మార్కులు వచ్చేవారికి ప్రశంశలు, తక్కువ మార్కులు వచ్చినవారికి హెచ్చరికలు సహజంగా వస్తాయి.
చదువుకునే కాలంలోనే నేర్చుకునే వయస్సు. ఎంత నేర్కుకుంటే అంతా పనితనం అబ్బినట్టు, ఎంత చక్కగా ఏకాగ్రతతో పాఠాలు వింటే, అంతా చక్కగా పాఠాలు అర్ధం అవుతాయి. సబ్జెక్టుపై సరైన అవగాహన ఏర్పడుతుంది. మరింత సాధన చేస్తే, సమాధానాలు సారవంతంగా అర్ధవంతంగా వ్రాయగలరు.
మాయొక్క పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం , కొత్తగా కట్టబడిన మా పాఠశాలలోకి మేము ఈ మద్యనే మారాము. అందమైన భవనంలోకి మా పాఠశాల మార్చబడింది.
ఊరికి దూరంగా కొత్తగా నిర్మించిన పాఠశాల చుట్టూ చెట్లు ఉంటాయి. చాలా ప్రశాంతంగా పాఠశాల వాతావరణం ఉంటుంది. మూడు అంతస్తుల భవనంలో అన్నీ తరగతులు మరియు తరగతుల సెక్షన్ల వారీగా గదులు ఉంటాయి.
నేను చదువుకునే తరగతి గది చివరి ఫ్లోర్. మాతరగతి గదికి ఒక డోర్, ఇంకా రెండువైపులా కిటికీలు ఉంటాయి. కిటికీల వలన సహజమైన గాలి మా తరగతి అంతా వ్యాపిస్తుంది.
ప్రతిరోజు సరైన సమయానికి విధ్యార్ధులు తరగతులకు హాజరు కావాల్సిందే. అలాగే మాకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా పాఠాలు టైమ్ టేబల్ ప్రకారం ప్రారంభిస్తారు.
తరగతిగది కిటికీలో నుండి బయటకు చూస్తే, పొలాలు, చెట్లు కనబడతాయి. స్కూల్ చుట్టూ వేయబడిన మొక్కలు వలన పాఠశాల ఆవరణ అంతా అందంగా కనబడుతుంది.
మా పాఠశాలలోని పిల్లలంతా ఆటలు ఆడుకోవడానికి పాఠశాల ముందు పెద్ద ఖాళీస్థలం ఉంది. ఆ స్థలంలో మేమంతా చక్కగా ఆటలు ఆడుకుంటాము.
ఆస్థలంలో ఆటవస్తువులు కూడా మాకు మా పిఇటి సర్ ఇస్తారు.
పాఠశాల గ్రౌండ్ ఫ్లోర్ లోనే విషయాలమైన హాల్ ఉంది. అందులో స్టేజ్ కూడా ఉంది. ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగితే, మేమంతా ఈ హాల్ నందే కూర్చుని వీక్షిస్తాము. స్టేజ్ కు ఉన్న గోడపై ఎల్సిడి స్క్రీన్ ఉంది. దానిపై మాకు ఆన్ లైన్ క్లాస్ వీడియోలు ప్రదర్శిస్తారు.
మాకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అంతా మాకు తరగతి గదులలోనే చక్కగా పాఠాలు చెబుతారు. చాలా అర్ధవంతంగా పాఠాలు చెబుతారు.
ఇంకా ఆన్ లైన్ ద్వారా కూడా పాఠాలు గల వీడియోలు మాకు చూపిస్తారు. ఏవైనా సందేహాలు అడిగితే, వాటికి వివరణ ఇస్తూ, మాకు అర్ధం అయ్యేలాగా పాఠాలు చెబుతారు.
మా పాఠశాలలో ఉపాధ్యాయులు సగం మంది పైగా చాలాకాలం నుండి మాపాఠశాలలోనే పాఠాలు చెబుతున్నారని, మా ప్రిన్సిపల్ సర్ చెబుతారు.
దూరం నుండి, పొరుగుళ్ళ నుండి వచ్చే విధ్యార్ధులను పాఠశాలకు తీసుకురావడానికి స్కూల్ బస్సులు కలవు. పాఠశాల నిర్వహణ ఉన్న ప్రతిరోజు బస్సుల ద్వారా చాలామంది విధ్యార్ధులు దూరం నుండి, పొరుగుళ్ళ నుండి వస్తూ ఉంటారు. పాఠశాల తరగతులు అయిపోగానే, మరలా అవే బస్సులలో ఇంటికి బయలుదేరతారు.
చుట్టూ చెట్లు, పొలాలు ఉండే, మాపాఠశాలకు శభ్ద కాలుష్యం ఉండదు. చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో పాఠాలు వింటాము. లంచ్ బ్రేక్ లో మేమంతా భోజనాలు చేయడానికి, విశాలమైన గది మాకు ఉంది. అందులోనే మేమంతా భోజనాలు చేస్తాము. అందరికీ త్రాగు నీరు అందుబాటులో ఉంటుంది.
రోజు సాయంకాలం సమయంలో మా పాఠశాల ముగింపు బెల్ కొట్టగానే మేమంతా పాఠశాల నుండి మా మా ఇళ్లకు బయలుదేరతాము…
స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం. స్త్రీలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. బాలుర కన్నా ఎక్కువగా బాలికలు చదువులో ముందుంటున్నారు.
అయితే వారికి సరైనా భద్రత కల్పించగలిగితే, స్త్రీలు మరింత ముందుకు సాగుతారు. మెరుగైన ఫలితాలు రాబట్టగలరు. ఓర్పు వహించడంలో స్త్రీలు ముందు ఉంటారు.
కనుక వారికి సమాజంలో సరైన భద్రత కల్పించగలిగితే, మెరుగైన సమాజం మన ముందు ఉంటుంది.
ఒక పురుషుడైన, ఒక స్త్రీ అయినా అమ్మ ఒడిలో పాఠాలే, ఎప్పటికీ మదిలో ఉండిపోతాయి. అటువంటి స్త్రీకి ఉన్నత చదువులు ఉంటే, మరింతమంది నైపుణ్యం కలిగినవారు మన సమాజంలో తయారుకాగలరు.
ఎందుకు భద్రత విషయంలో అంటే, స్త్రీలపై బౌతికదాడులకు పాల్పడడం, లైంగిక వేదింపులకు పాల్పడడం కొందరికి అలవాటుగా ఉంటుంది. అలాంటి వారి వలన స్త్రీలకు భద్రత కరువు అవుతుంది.
సహజంగానే స్త్రీలను గౌరవించడం మన భారతీయ సంప్రదాయం. అలాంటి సంప్రదాయం గల మన భూమిలో స్త్రీలపై దారుణాలు జరగడం దురదృష్టకరం.
ఇప్పుడున్న సామాజిక పరిస్థితులలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలలో రక్షణ ప్రధాన సమస్య. సమాజంలో పురుషులతో సమానంగా కష్టపడుతూ కేవలం లింగబేధం వలన స్త్రీలపై లైంగిక దాడులు చేయడానికి కొందరు ఆకతాయిలు ప్రయత్నం చేయడం జరుగుతుంది.
స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలలో ప్రధానంగా వారి భద్రత విషయంలో రాజీపడని వ్యవస్థ సమాజంలో ఉండాలి.
అయితే ఎంత వ్యవస్థ ఉన్న అల్లరితనం అలవాటు అవుతున్నవారిని నియంత్రించడం కష్టం. అయితే రోగ నివారణ చర్యలు కన్నా రోగం బారిన పడకుండా తీసుకునే చర్యలే ఉత్తమము అంటారు.
స్త్రీల విషయంలోనూ తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. స్త్రీ యొక్క గొప్పతనం తెలియజేసే విధంగా వ్యవస్థలు పనిచేయాలి.
ఒక నాయకుడైనా, ఒక పనివాడు అయినా, ఒక కలెక్టర్ అయినా, ఒక ముఖ్య మంత్రి అయినా, ప్రధాన మంత్రి అయినా, అఖిరికి ఆ భగవానుడి గురించి తెలియజేసే గురువు అయినా సరే అమ్మ కడుపులో నుండే పుట్టాలి. బిడ్డను కనడానికి అమ్మ చావుతో పోరాటం చేస్తుంది.
అమ్మ చావుతో పోరాటం చేసి బిడ్డను కంటుంది. అటువంటి అమ్మ సాదారణంగానే పూజ్యనీయురాలు. అలాంటి అమ్మగా మారాబోయే అమ్మాయిలు అంటే, గౌరవంతో నడుచుకునే విధంగా వ్యవస్థలలో చర్యలు తీసుకోవాలి.
ఉద్యోగం చేసే స్త్రీ ఒక అమ్మ, మనల్ని కన్న అమ్మ వంటిదే, ఉద్యోగం చేసే అమ్మ కూడా… అని సాటి ఉద్యోగస్తులు ప్రవర్తించే విధంగా వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి.
అమ్మ ప్రేమ చేతనే, బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదుగుతాడు. అటువంటి ప్రేమాభిమానాలు గల స్త్రీకి సమాజం నుండి లభించాల్సింది… ప్రధమంగా గౌరవం…
స్త్రీల గురించి పవిత్రమైన భావనలు బాల్యం నుండే అలవాటు చేయాలి
విద్యా విధానంలోనే స్త్రీల గురించి పవిత్రమైన భావనలు కలిగే విధంగా చర్యలు ఉండాలి. గొప్ప పుస్తకం చదివే అలవాటు ఉన్నవాడి ఆలోచనలు గొప్పగానే ఉంటాయి.
అలాగే పుస్తకాలలో చదివిన గొప్ప విషయాలు మనిషిలో మంచి ఆలోచనలను ఏర్పరుస్తాయి. కావునా స్త్రీల గురించి మంచి ఆలోచనలు పెరిగే విధంగా చర్యలు అన్నీ వ్యవస్థలలోనూ ఉండాలి.
స్త్రీని లోకువగా చూసే సమాజం నుండి, స్త్రీని గౌరవించే సమాజంలోకి సమాజం మార్పు చెందాలి. అదే స్త్రీ అభ్యున్నతికి మొదటి మెట్టు… ప్రధానమైనది…
పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం. క్లాసులో సమాధానం చెప్పాలి. పరీక్షలో పేపరుపై బాగా వ్రాయాలి. అర్ధవంతంగా సమాధానాలు వ్రాయడం ప్రధానం.
SSC పరీక్షలు ఫెయిల్ అయితే అంతే, అనే భావన కొందరిలో ఉంటుంది. అటువంటి భావన వలన బాగా చదివేవారు కూడా పదవతరగతికి వచ్చేసరికి వెనుకబడే అవకాశం ఉంటుంది. కనుక పదవతరగతి బాగా చదవాలనే బలమైన సంకల్పం చేసుకోవాలి. అందుకోసం కృషి చేయాలి.
ఇష్టపడి చదివితే, చదివే సమయం కష్టం తెలియకుండా ఉంటుంది. సమయం అంతా చదువుపై అవగాహన ఏర్పడడంలోనూ లేక గుర్తుపెట్టుకోవడంలోనూ సాగిపోతుంది. ఇష్టమైన హీరో సినిమా బాగుంటే, 2.30 గంటలు ఇట్టే గడిచినట్టు, పదవతరగతి చదివే సమయం అంతా చదివే ప్రక్రియలోనే గడిచిపోతుంది.
SSC ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి గ్రేడ్ సాధిస్తే, జీవితంలో అదొక మైలురాయి. ఎప్పుడు మైలు రాయిని చేరుకునే సమయంలో ముందడుగు వేయాలి… కానీ బలహీనతలు గుర్తుకు తెచ్చుకోకూడదు.
పరుగు పందెంలో పాల్గొన్న అందరిలోనూ ఒక్కడే విజేత అవుతారు. కానీ మిగిలినవారు విజేతలు కాకపోయినా, ప్రయత్నం లోపం ఉండదు. కాబట్టి వారు పందెంలో గెలవకపోయినా తమ ప్రయత్నంపై తాము తృప్తిగా ఉంటారు. మరొకసారి బాగా ప్రాక్టీస్ అయ్యి, విజేతగా నిలవడానికి గట్టి ప్రయత్నం చేస్తారు.
అలాగే SSC చదువుతున్న విధ్యార్ధులు కూడా, నెలవారి టెస్టులలో తమకు లభిస్తున్న మార్క్స్ గమనించుకోవాలి. ప్రతిసారి గట్టి ప్రయత్నంతో చదవాలి. ఇంటర్నల్ గా స్కూల్లో జరిగే టెస్టుల్లో మార్క్స్ మెరుగుపడుతూ ఉండేలా చూసుకుంటూ ఉంటే, అదే అలవాటు SSC ఎగ్జామ్స్ అప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది.
ప్రధానంగా పదవతరగతి ప్రారంభం నుండే తమకు బలమున్న సబ్జెక్టులలో పట్టు పెంచుకుంటూ, తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులలో తగినంత కృషి చేయాలి. బలమున్న సబ్జెక్టులు అంటే, మీకు ఆయా సబ్జెక్టులలో అవగాహన ఎక్కువ. కాబట్టి పాఠాలు వింటున్న సమయంలోనే వాటిలో మీకు పట్టు పెరుగుతుంది.
తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులలో అవగాహన ఏర్పరచుకోవడంలో ఏదో లోపం ఉంటుంది. అది గుర్తిస్తే వాటిలో కూడా మంచి మార్కులు సాధించవచ్చు. ఎంత ప్రయత్నించినా అవగాహన కానీ సబ్జెక్టులలో ఒకటికి పదిసార్లు చదివి గుర్తుపెట్టుకునే విధానం ఉత్తమం. ఇంకా ఇలా తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులలో ముఖ్యమైన ప్రశ్నలు పేపరుపై వ్రాస్తూ ఉండడం కూడా మేలైన పద్దతి.
ఒకసారి వ్రాయడం అంటే, కొన్ని సార్లు చదవడం వంటిది. ఎక్కువ సార్లు వ్రాసిన సమాధానం గుర్తు ఉండే అవకాశం ఎక్కువ. అతి అన్నింటిలోనూ అనర్ధం అంటారు. బాగా మార్కులు వచ్చే సబ్జెక్టులపై నిర్లక్ష్యం ఉండకూడదు. అలాగే తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులంటే భయం లేక చికాకు ఉండకూడదు.
పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా సమాధానాలు వ్రాయడం ప్రధానం
ఇక క్వశ్చన్ పేపర్ చూడగానే, చదవని క్వశ్చన్స్ వస్తే, టెన్షన్ తెచ్చుకోవడం. చదివిన క్వశ్చన్స్ వస్తే ఓవర్ ఎగ్జైట్ అవ్వడం మానేయలి. ఎగ్జామ్స్ వ్రాసే సమయంలో క్వశ్చన్ పేపర్ తీసుకుని, దానిలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నింటిని చదివాలి. అలా క్వశ్చన్ పేపర్లో బాగా గుర్తు ఉన్న క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. అలా బాగా వచ్చిన క్వశ్చన్లకు చూసుకుని, వాటికి సమాధానాలు వ్రాయడానికి మైండును సరిగా ప్రిపేర్ చేసుకోవాలి.
ముందుగా బాగా గుర్తున్న క్వశ్చన్లకు సమాధానాలు తేలికగా వ్రాయవచ్చు. అలా వ్రాసిన సమాధానాలు పాయింట్ల రూపంలో అర్ధవంతంగా వ్రాయగలిగితే, మంచి ఇంప్రెషన్ ఉంటుంది.
కొన్ని క్వశ్చన్లకు సమాధానాలు పూర్తిగా గుర్తు ఉండవు. అలాంటి క్వశ్చన్లను ముందుగా వ్రాయడం మొదలు పెడితే, బాగా గుర్తు ఉన్న సమాధానాలు కూడా మరిచిపోయే అవకాశం ఉండవచ్చు. కాబట్టి మైండులో పూర్తి సమాధానాలు గుర్తుకు వస్తున్న ప్రశ్నలకు ముందుగా సమాధానాలు వ్రాయడం మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది.
బాగా గుర్తు ఉన్న క్వశ్చన్లకు సమాధానాలు వ్రాయడం పూర్తయ్యాక, సగం, సగం గుర్తు ఉన్న క్వశ్చన్లకు సమాధానాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు. అయితే సగం సగం గుర్తు ఉన్న క్వశ్చన్లు ఎక్కువగా ఉంటే, అలాంటి క్వశ్చన్లకు అన్నింటికీ సమాధానాలు వ్రాయడం మొదలు పెట్టడం బెటర్. అయితే ప్రతి క్వశ్చనుకు సమాధానం వ్రాశాక కొంచెం ఖాళీ ఉంచుకోవాలి. సగం సగం గుర్తు ఉన్న క్వశ్చన్లు అన్నింటికీ సమాధానాలు వ్రాసేసి, ఆ తర్వాత మిగిలిన ఆన్సర్స్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం మేలు.
మొత్తానికి ఒక క్వశ్చన్ పేపరులో మనకు బాగా వచ్చిన ప్రశ్న నుండి సమాధానం వ్రాయడం మొదలు పెట్టాలి. బాగా గుర్తు ఉన్న క్వశ్చన్లు అన్నీ ముందుగా వ్రాయడం వలన పేపరు దిద్దేవారి దృష్టిలో మంచి గుర్తింపు పడుతుంది. ఆపై గుర్తుకు వచ్చినంత సమాధానాలు మిగిలిన క్వశ్చన్లకు వ్రాయడం చేయాలి.
గుర్తు ఉన్నంతవరకు సమాధానాలు వ్రాశాక, తెలిసిన మేరకు సమాధానాలు వ్రాయడం మొదలు పెట్టాలి. మొత్తానికి క్వశ్చన్ పేపర్లో వ్రాయవలసిన అన్నీ క్వశ్చన్లకు ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి.
పరీక్ష వ్రాసేటప్పుడు గుర్తుకు రాని క్వశ్చన్లకు సమాధానాలు వెతకడం అంటే, సమయం వృధా చేయడమే అవుతుంది. చివరలో హడావుడిగా బాగా వచ్చిన సమాధానం కూడా తప్పులతో వ్రాసే అవకాశం ఎక్కువ.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఎటువంటి జాగ్రత్తలు అంటూ ఆలోచన అనవసరం. సాదారణ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారో అలాగే ప్రిపేర్ అయితే చాలు. కానీ చదివేటప్పుడు మాత్రం కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇష్టపడి చదివితే, సబ్జెక్టుపై అవగాహన సులభంగా వస్తుంది.
అనవసరపు భయాలు, ఒత్తిడికి గురి కావడం అనేది మీ మనసులోనే ఉంటుంది. మీ మనసులో ఒక్కటే ఎగ్జామ్స్ బాగా వ్రాయాలి…. చదివిన క్వశ్చన్స్, గుర్తులో ఉన్న క్వశ్చన్స్,గుర్తుకు వస్తున్న క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడం ప్రధానం.
ఎంత బాగా చదివినా, ఎంత బాగా పేపరుపై వ్రాయగలమో అన్నీ మార్క్స్ గెయిన్ చేయగలరు. మంచి గ్రేడ్ సాధించగలరు.
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం పడుతుందా? తెలుగులో వ్యాసం. అవినీతి అనేది ఒక అంటువ్యాధి వంటిది. ఒకరి నుండి ఒకరికి వ్యాధి పాకినట్టు, అవినీతి అనేది కూడా ఒకరి నుండి ఒకరికి పాకుతుంది.
అంటువ్యాధి ఆరోగ్యానికి హాని చేసినట్టు, అవినీతి కూడా సామాజిక అభివృద్దికి కూడా అడ్డుపడుతుంది. అలా అనడానికి అసలు అవినీతి అంటే నీతి తప్పి ప్రవర్తించడం అంటారు.
నీతి తప్పి ప్రవర్తించడం అంటే, తాను చేయవలసిన పనికి తగిన జీతం లభిస్తున్నా, అదనపు ప్రతిఫల అందుకుంటూ, అర్హతలేని వారికి కూడా పనులు చేసి పెట్టడం అవినీతికి పాల్పడడం అంటారు.
ప్రమాణం ప్రధానంగా విధానం ఉంటుంది. అది విధ్యా విధానం కావచ్చు. నిర్మాణ విధానం కావచ్చు. రోగనివారణ చర్యలు కావచ్చు. తయారీ విధానం కావచ్చు. అలాంటి విధానం సరిగా సాగడం అంటే ఎవరి కర్తవ్యం వారు సరిగ్గా నిర్వహించడమే పెద్ద సామాజిక సేవ అంటారు.
ఎవరి పని వారు చేసుకుంటున్నంత కాలం, సమాజంలో పనులు వేగంగా సాగుతాయి. కానీ అవినీతికి అలవాటుపడి అదనపు ప్రతిఫలం కోసం తమ తమ పనులు నిలుపుదల చేయడం అంటే, అభివృద్దికి అడ్డుపడడం అవుతుంది.
అలా ఎక్కువమంది అదనపు ప్రతిఫలం ఆశిస్తూ పనులు నిలుపుదల చేసుకుంటూ పోతే, సమాజంలో పనులు సరైన రీతిలో కొనసాగవు. ఇంకా పనులలో నాణ్యతా లోపం ఏర్పడే అవకాశం ఎక్కువ.
నాణ్యతా లోపం వలన నిర్మాణాలు మనుషుల ప్రాణాలు బలిగొనవచ్చు. నాణ్యత లేని వస్తువులు సరిగా పని చేయవు. నాణ్యత లేని వాహనాలు ప్రయాణంలో ఇక్కట్లు కల్పించవచ్చు. నాణ్యత లేని వస్తువులు తగినంత కాలం పనిచేయవు ఇంకా అవసరంలో అవి ఆగిపోవచ్చు. ఇలాంటి నాణ్యతా లోపం అవినీతి వలన సమాజంలో విస్తరించే అవకాశం ఎక్కువ. కాబట్టి అవినీతి నిర్మూలన చేయడం అంటే సమాజాన్ని ప్రగతి పధం వైపు నడిపించడమే అవుతుంది.
కార్యలయంలో అధికారి అవినీతి, సమాజంపై ప్రభావం చూపుతుంది.
ఒక కార్యలయం సజావుగా సాగుతుంటే, ఆ కార్యలయం నుండి వచ్చే అనుమతులు సమాజంలో సక్రమంగా పనులు చేయించే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా ఒక కార్యాలయంలో ఒక అధికారి తన స్వార్ధం కోసం, తన అవసరం తీరడం కోసం అదనపు ప్రతిఫలం పొంది ఎవరికైనా అనుమతి అనుమతి ఇస్తే, ఆ అధికారిని మరొకరు అనుసరించే అవకాశం ఎక్కువ. అధికారుల అవినీతికి పాల్పడితే, సమాజంలో అర్హత లేనివారికి అనుమతులు లభించే అవకాశం ఉంటుంది.
అర్హత లేనివారి పనితీరు ప్రమాణాలకు దూరంగా ఉంటాయని అంటారు. ప్రమాణాలు పాటించని వ్యక్తుల పనులు నాణ్యతా లోపం కలిగి ఉంటాయి.
ఒక రహదారి నిర్మాణపు పనులు అర్హత లేనివారికి, సరైన ప్రమాణాలు పాటించని వ్యవస్థకు అనుమతులు ఇస్తే, సదరు వ్యవస్థ చేపట్టే రహదారులు నాణ్యతా లోపం కలిగి ఉంటాయి. అనుమతులు పొందే విషయంలోనే నియమం తప్పే వ్యవస్థలు, పనులు నిర్వహించే సమయంలో ప్రమాణాలు ప్రకారం పనులు చేయిస్తారనే నమ్మకం తక్కువ అని అంటారు.
సరి అయిన ప్రమాణాలు పాటించక నిర్మించే రహదారులు వానలకు పాడయ్యి, వాహన ప్రమాదాలకు కారణం కాగలవు. రవాణా సౌకర్యాలపై ప్రభావం చూపుతాయి. రవాణా సమయం పెరగడం వలన కాలం ఖర్చు ఎక్కువ, ఇందన ఖర్చు ఎక్కువ… ఈ విధంగా అవినీతి వలన అనుమతులు సమాజంలో అభివృద్దిపై ప్రభావం చూపుతాయి.
అనుసరించడం మనిషి అలవాటు అయితే అది అవినీతి విషయంలో కూడా జరగవచ్చు
లోకంలో ఒకరిని చూసి మరొకరు అనుసరించే వ్యవహారం ఉంటుంది. పెద్దవారిని చూసి అనుసరించేవారు ఉంటారు. తోటివారిని చూసి అనుసరించేవారు ఉంటారు.
అయితే అవినీతి విషయంలో మాత్రం ఎక్కువగా తోటివారిని చూసి అనుసరించే అవకాశం ఎక్కువ. పక్కింటావిడను చూసిన ఆవిడ, పక్కింటావిడ బడాయి పనులు అనుసరిస్తే, అలా అనుసరించిన వారి సంసారం ఇబ్బందుల పాలైనట్టు, అవినీతి అధికారిని అనుసరించే మరికొందరి వలన ఆ కార్యలయం పనితీరుపై సమాజంలో సందేహం ఏర్పడుతుంది.
అనుసరించడం అనేది మనిషికి సహజమే అంటారు. అయితే అలాంటి అలవాటు మంచి విషయాలలో అయితే, ఆ అలవాటు వలన సమాజానికి మేలు జరుగును. అదే అవినీతి విషయంలో అయితే ఆ అలవాటు సమాజనికి చేటు చేస్తుంది.
ఒక వ్యక్తికి సమాజం రక్షణవలయంలాగా ఉంటుంది. రాత్రుళ్లు దొంగతనం చేసే దొంగ సమాజం మేల్కొని ఉండగా దొంగతనం చేయలేడు. అసభ్యంగా ప్రవర్తించే గుణం కలిగినవారు, సమాజం మేల్కొని ఉండగా, అసభ్యంగా ప్రవర్తించలేడు. అలా సమాజం దుష్ట వ్యక్తుల నుండి, దుష్ట చేష్టితముల నుండి మనిషి ఒక రక్షణ వలయంగా ఉంటుంది.
అలా సమాజం మనుషులందరికి ఒక రక్షణగా ఉంటుంటే, అటువంటి రక్షణ ఇచ్చే సమాజమునే, తర్వాతి తరానికి అందించడమే నిజమైన వారసత్వపు ఆస్తి అవుతుంది.
అవినీతి ప్రభావం
మనిషికి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎక్కువగా దొంగలు తయారైన సమాజంలో బధ్రత ఉండదు. మనిషి ప్రశాంతత దెబ్బతింటుంది.
కావున అవినీతి అనేది మనిషి మనుగడకు, సామాజిక ప్రగతి ఒక అడ్డుగోడ వంటిది అయితే, దానికి నిర్మూలించవలసిన అవసరం ఉంది.
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం పట్టవచ్చు. ఎందుకంటే ఎవరి పని వారు సరిగా నిర్వహించడం వలన పని విధానం ప్రమాణాత్మకంగా సాగుతుంది.
నిర్మాణ విధాన ప్రమాణాలతో కొనసాగితే, కట్టడాలు, రహదారులు ఎక్కువకాలం ఉంటాయి. నాణ్యత కలిగిన రహదారులు వలన రవాణాలో సమయాభావం ఏర్పదు. నాణ్యతతో కూడిన కట్టడాలు, అకస్మాత్తుగా కూలిపోయే అవకాశం తక్కువ.
ఇలా ఏ రంగంలోనైనా ప్రమాణాలతో కూడిన విధానం కొనసాగితే, సమాజం ప్రగతిబాటలో సాగుతుంది.
సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు. ఈ శీర్షికన తెలుగులో వ్యాసం. సాధన చేత లోకంలో పనులు సముకూరును అంటారు. కృషి చేస్తే మనిషి ఋషి అవుతాడు. సరైన సాధన మనిషికి బలం అవుతుంది.
కృషి, పట్టుదల, దీక్ష తదితర గుణాలు మనిషిలో సాధనకు బలం అవుతాయి. మనసులో బలమైన సంకల్పం ఉంటే, ఆ వ్యక్తి యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి మనసుకు మార్గం తెలియబడుతుందని పెద్దలంటారు.
మంచి ఆశయం అంటే అది సమాజనికి మేలును చేకూర్చే ఆశయం అయితే, అటువంటి ఆశయం కలిగిన వ్యక్తి గొప్పవాడుగా మారతాడు. అయితే అదే అతని మనసులోనే ఉన్నప్పుడు మాత్రం అతనూ సాదారణ వ్యక్తే.
ఎప్పుడైతే సమాజనికి మేలును చేకూర్చే అంశంవైపు అడుగులు వేస్తాడో, అప్పుడే సమాజం నుండి గుర్తింపు లభించడం ప్రారంభం అవుతుంది. సదరు ఆశయం పరిపూర్ణమైనప్పుడు మాత్రం, ఆ వ్యక్తి సమాజంలో విశేషమైన గుర్తింపు పొందుతాడు.
ప్రతి మనిషిలోను ఏదో ఒక అంశంలో నైపుణ్యత ఉంటుందని పెద్దలంటారు. అంటే మనిషిగా పుట్టిన ప్రతివారు విశేషమైన ప్రతిభను ఏదో విషయంలో కలిగి ఉంటారు.
తమ యొక్క ప్రతిభను గుర్తించి, సాధన చేస్తే, సదరు వ్యక్తి సమాజంలో మంచి గుర్తింపున పొందగలడు. అద్భుతమైన ఫలితాలను సామాన్యుడు సైతం సాధించగలడు.
ఒక తరగతిలో చదువుకునే విధ్యార్ధులందరికీ ఒకే అభిరుచి ఉండదు. అలాగే అందరూ ఒకేలాగా చదవలేరు. అలాగే అందరూ ఒకేతీరుగా ఆలోచన చేయకపోవచ్చు… కానీ తరగతిలో బోధించే పాఠాలు మాత్రం అందరికీ ఒక్కటే.
అయితే ఆ తరగతిలో ఉన్న విధ్యార్ధులు అందరూ ఒకేలాగా పాఠాలు గ్రహించకపోవచ్చు. కానీ ప్రాధమికమైన అవగాహన పాఠాలపై తరగతి విద్యార్ధులందరికీ ఉంటుంది. అలాగే అందరికీ అన్నీ సబ్జెక్టులపై ఆసక్తి ఉండకపోవచ్చు.
కానీ ఒకరికి తెలుగంటే ఇష్టం ఉంటే, ఇంకొకరికి లెక్కలంటే ఇష్టం ఉండవచ్చు. మరొకరికి సైన్స్ ఇష్టం ఉంటే, వేరొకరికి సోషల్ అంటే ఆసక్తి ఉండవచ్చు… ఎవరికైతే ఆయా సబ్జెక్టులలో సరైన ఆసక్తి ఉంటుందో, వారు ఆయా సబ్జెక్టులలో ఉన్నత స్థాయి పరిశోధన చేయగలిగే స్థితికి చేరే అవకాశం ఉంటుంది. అయితే ఆయా సబ్జెక్టులలో ఆయా విధ్యార్ధులకు తగు సాధన అవసరం.
ఒక తరగతిలో కామన్ లెస్సన్స్ వినే విధ్యార్ధులలో ఆసక్తి వ్యత్యాసం ఉన్నట్టు, సమాజంలో సైతం వివిధ వ్యక్తులకు వేరు వేరు విషయాలలో లేక అంశాలలో ఆసక్తి ఉండడం సహజం.
ఆసక్తి వలన మనసు సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు చేయగలరు.
తమ తమకు గల ఆసక్తియందు తమకుగల ప్రతిభను, ఆయా వ్యక్తులు గుర్తెరగాలి. తమ యందు ఉన్న ప్రతిభకు మరింత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తే, మేలైన ఫలితాలు వస్తాయి.
అయితే ఆయా వ్యక్తులు తమకు గల ఆసక్తి, తమలో ఉన్న ప్రతిభను తెలుసుకుని, మరింత సాధన చేస్తే, సదరు వ్యక్తులు సమాజంలో విశిష్టమైన గుర్తింపు పొందవచ్చు. సమాజం చేత విశిష్టమైన గుర్తింపు అంటే, అది ఏదో ఒక అద్భుతం
పదే పదే దేని కోసం ఆలోచన చేస్తే, దానినే పొందే మనసుకు సాధన అనేది ఆయుధంగా మారుతుంది.
తీపి అంటే ఇష్టమున్న వ్యక్తి మనసు ఎప్పుడు తీపి పదార్ధాలపై మక్కువ చూపుతుంది. అలాగే ఆ వ్యక్తితో అవసరం ఉన్నవారు ఆయనకు తీపి పదార్ధాలనే కానుకగా సమర్పించి, తమ తమ పనులు నెరవేర్చుకుంటారు. అంటే ఇక్కడ తీపిని ఇష్టపడే మనసు, పలుమార్లు మక్కువతో ఆలోచన చేయడం, అదే విషయం తెలిసిన వారివద్ద తెలియజేయడం వలన సదరు వ్యక్తి మనసు తీపి పదార్ధాలను పొందుతుంది.
ఇలా ఏ విషయంపై మనసు ప్రీతిని పొందుతుందో, ఆ విషయంలో ఆ యొక్క వ్యక్తికి నైపుణ్యత వృద్ది చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తగినంత సాధన, కృషి అవసరం అవుతాయి.
సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు అనడానికి మనసు యొక్క విశిష్టతను గుర్తెరగడం ద్వారా సాధ్యం అవుతుంది.
మనుషులందరికి ఉండే మనసుకు, అందరి యందు ఒకే విధంగా ఉండదు. దానికి బలము – బలహీనత ఉంటాయి. అలాంటి మనసు సాధన చేత, దాని బలమే ఆయుధం వ్యక్తికి అయితే, దాని యొక్క బలహీనత కూడా బలంగా మారుతుంది.
మాటలు వలన మనసి మహనీయుడు కాగలడు… కానీ చెప్పుడు మాటలు వినడం వలన మనిషి పాడవుతాడని అంటారు… చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
కోపము రావడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధనలో కోపం రావచ్చు. సాధనాలోపం కారణంగా కోపం రావచ్చు. సాధనకు అడ్డుపడే విషయాలు వలన కోపం రావచ్చును… కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
అంటువ్యాధి ఒకరికి వస్తే, వారి నుండి మరొకరికి, మరొకరి నుండి ఇంకొకరికి…. ఇలా కొందరికి…. కొందరి నుండి మరి కొందరికి సోకి సమాజంలో వృద్ది చెందే అవకాశం ఎక్కువ… అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో వ్యాసం
ఒంటరిగా ఉంటే మనసు మాయదారి ఆలోచనలు చేస్తూ ఉంటుంది… కానీ ఒంటరిగా ఉన్నప్పుడూ పుస్తకం మంచి నేస్తం కాగలదు… ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది తెలుగులో వ్యాసం
చెప్పుడు మాటలు చేటుకు కారణం అవుతాయి… తెలుగులో వ్యాసం. చెప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో వాటిని గుడ్డిగా నమ్మడం కూడా అంతే తప్పు.
సమాజంలో మనిషికి మనిషికి మద్య ఏర్పడే సంబంధాలలో మరొక మనిషి పాత్ర ఉంటుంది. అవి మొదట్లో ఉన్నట్టు భవిష్యత్తులో ఉండవు. కారణం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మరొకరి చెప్పుడు మాటలు విని, నమ్మడమే అవుతుంది.
ఒక మనిషి ఇంకొక మనిషి ఏర్పడిన పరిచయం ప్రక్రుతి వలన కానీ మరొక మనిషి వలన కానీ జరుగుతుంది. అలా ఏర్పడిన కొన్ని సంబంధాలు ఎక్కువకాలం కొనసాగుతుంది. అలాంటి బంధాలలో కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలు ఉంటాయి.
కుటుంబ బాంధవ్యం ప్రకృతిపరంగా సహజంగా జరుగుతుంది. స్నేహ సంబంధం మనసును బట్టి, మనసు ఇష్టాయిష్టాలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. స్నేహం, కుటుంబ సంబంధం మనిషి మనసుకు బలంగా మారతాయి.
ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే
అలాంటి మానవ సంబంధాలు ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు సంబంధాలకు చేటు చేస్తాయి. అవి స్నేహ సంబంధం కావచ్చు. లేక కుటుంబ సంబంధం కావచ్చు.
మనిషికి మాటల వలననే మంచి సంబంధాలు ఏర్పడుతాయి. అలాంటి మాటలను కొందరు మంచికి ఉపయోగిస్తే, కొందరు చెడుకు ఉపయోగించవచ్చు. కొందరు చెడు అలవాట్ల కోసం ఉపయోగించే అవకాశం ఉంటుంది.
చెడు అలవాట్ల కొరకు మాట్లాడే మాటలు చెప్పుడు మాటలుగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి మాటలు, వారి స్వార్ధం కొరకు మాత్రమే ఉంటూ, విన్నవారికి చేటును చేసే అవకాశం ఉంటుంది.
మరికొందరికి చెడు గుణాలను కలిగి ఉండవచ్చు. మంచి సంబంధాలను చూసి ఓర్వలేని గుణం కలిగి, కొందరు సమాజంలో ఉండవచ్చు. ఇలాంటి వారి మాటలు మంచి సంబంధాలకు చేటును చేస్తాయి. ఇవే చెప్పుడు మాటలుగా సమాజంలో చెబుతారు.
మౌనం మనిషిని మునిగా మారిస్తే, మాటలు మనిషిని మాటకారిగా మారిస్తే, మంచికి ఉపయోగిస్తే, వారి వలన వారి చుట్టూ ఉన్నవారికి శాంతి చేకూరుతుంది.
కానీ మాటకారికి చెప్పుడు మాటలు చెప్పే స్వభావం ఉంటే మాత్రం, వారి చెప్పుడు మాటలకు సత్సంబంధం బలి అయ్యే అవకాశం ఉంటుంది.
అదే మాటకారికి మంచి గురించి చెప్పే అలవాటు ఉంటే, మాత్రం ఆ మాటకారి వలన అతని చుట్టూ ఉండేవారికి మంచి జరుగుతుంది.
మనిషికి మానవ సంబంధాలు కాలంలో కలిగే కష్టసుఖాలను ఎదుర్కోవడంలో సాయపడతాయి. ఒక ఓదార్పుగా మనిషికి మేలు చేసే మానవ సంబంధాలు చాలా విలువైనవి… డబ్బు ఇవ్వలేని మానసిక శాంతి, కుటుంబ సంబంధం, స్నేహ సంబంధం వలన కలుగుతుంది.
చెప్పుడు మాటలకు లోబడి
అయితే అటువంటి బంధాలు చెప్పుడు మాటలకు లోబడి చెడగొట్టుకోగూడదు. బంధం బలం, బంధం విలువ తెలిసినవారు చెప్పుడు మాటలు చెప్పారు, వాటిని వినరు.
బంధం మద్యలో చెప్పుడు మాటలు చేరి, ఆ బంధానికి చేటు చేయడానికి డబ్బు కూడా కారణం కావచ్చు. కావున డబ్బు సంపాదనలో కూడా ధర్మబద్దమైన జీవనం మేలును చేస్తుందని పెద్దలంటారు.
కావునా మంచి మిత్రుడిని లేక మిత్రురాలిని చెప్పుడు మాటలు విని, దూరం చేసుకోకూడదు. ఎటువంటి ఆధారం లేకుండా పుట్టుకొచ్చే చెప్పుడు మాటలు అసలు నమ్మకూడదు.
మాట విలువ తెలిసినవారి చుట్టూ, మంచి మనుషులు పెరుగుతారని పెద్దలంటారు. అటువంటి మాటను మంచిని పెంచడానికి, మంచిని పంచడానికి ఉపయోగించడం కూడా సామజిక సేవగానే పరిగణిస్తారు.
చెప్పడు మాటలు చెప్పడం వలన ఇద్దరి మద్య సంబంధం తెగిపోవచ్చు. చెప్పుడు మాటలు చెప్పడం వలన చెడు అలవాట్లు ఏర్పడవచ్చు. చెప్పుడు మాటల వలన మరొక మనిషి మనసు ఆందోళన చెందవచ్చు… కావునా చెప్పుడు మాటల వలన చేటు జరిగే అవకాశాలు ఎక్కువ.
అలాగే చెప్పుడు మాటలు వినడం వలన కూడా సంబంధాలు బలహీనపడతాయి. మంచిమిత్రుడిని లేక మంచి స్నేహితురాలిని కోల్పోవలసిరావచ్చు. కావున చెప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, వాటిని విని నమ్మడం అంతే తప్పు….
ఆధారం లేకుండా, అనాలోచితంగా మాట్లాడేవారి మాటలు పెడచెవిన పెట్టాలని పెద్దలంటారు.
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో వ్యవసాయం ఆధారంగా అనేక పంటలు రైతే పండిస్తాడు. దేశ ప్రజల తినే ఆహారం అంతా, దేశంలో రైతులు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది.
మనిషి బ్రతకడానికి శక్తి కావాలి. శక్తి ఆహార పదార్ధాలు ఆరగించడం ద్వారా లభిస్తుంది. శక్తి వలననే మనిషి పని కొనసాగించగలడు. అందుకు అవసరమైన ఆహారం దేశంలో రైతు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది.
వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి కీలకమైన అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి చాల ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రైతు గొప్పతనం గురించి ఇన్ తెలుగు
తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంలో ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు.
పంటలు పండించేవారిని మాత్రమే కాకుండా, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం తదితర పనులు చేపట్టిన వారిని కూడా రైతులు అనే అంటారు.
మనదేశంలో రైతు మూడు విధాలుగా పంటలు పండిస్తాడు. ఖరిప్, రబీ, జైద్ కాలాలుగా విభజించి, ఆయా కాలాల్లో తగు పంటలు రైతు పండిస్తాడు.
భూమిని నమ్ముకుని రైతు జీవనం సాగిస్తాడు. భూమిని సాగు చేస్తూ ఆహార పదార్ధాలుగా మారే ముడి పంటలను రైతే పండిస్తాడు. ఎక్కువమందికి భూమి సొంతంగానే ఉంటుంది. కొందరు ఇతరుల భూమిని బాడుగకు తీసుకుని సాగు చేస్తూ ఉంటారు.
ఎక్కువ భూమి ఉన్న రైతు కూలీల ద్వారా వ్యవసాయపు పనులు చేయిస్తూ ఉంటాడు. రైతు కాయకష్టం పైన మనదేశంలో ఆహార పదార్ధాలు ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. ఇంకా రైతు కూలీల శ్రమ వ్యవసాయం అభివృద్దికి తోడ్పడుతుంది.
జీవించే రైతే దేశానికి వెన్నుముక
భారత దేశ౦ వ్యవసాయక దేశం .ప్రప౦చ౦లో అత్యధిక జనాభా గల దేశాలలో రె౦డవదిగా ఉంది. ఇంకా ఇందులో ఎక్కువ శాతం ప్రజలు గ్రామీణ వాసులు ఉంటారు. వ్యవసాయ పనులలో పురుషులు, స్త్రీలు కూడా పాల్గొంటారు.
సమాజంలో పని చేయించేవారు, పని చేసేవారు, పని కల్పించేవారు మొదలైనవారిపై సమాజిక ఆర్ధిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. వీరందరికీ అవరసరమైన ఆహార ఉత్పత్తులు మాత్రం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. కావున ఏ దేశానికైనా వ్యవసాయం ప్రధానం. దానిని నమ్ముకుని జీవించే రైతే ఆ దేశానికి వెన్నుముకగా మారతాడు.
ప్రపంచంలో వ్యవసాయ భూమి ఉన్న దేశాలలో మొదటిది అమెరికా అయితే, రెండవది భారతదేశం. కానీ దిగుబడిలో మాత్రం ఆ దేశం వెనకబడి ఉండడం గమనించవలసిన విషయం.
రైతే మానవ మనుగడకు ప్రధానమైతే, అటువంటి రైతు ఇబ్బందులు ప్రక్రుతి పరంగా ఉంటాయి. అకాల వర్షం రైతుకు నష్టం తీసుకురావచ్చు. వర్షాభావం కూడా రైతుకు నష్టమే... అటువంటి ప్రక్రుతి ప్రభావాలలో మార్పులు రాకుండా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణలో కఠిన చర్యలు అవసరం.
దేశంలో రైతు ఆధారిత భూములకు తగినంత నీటి సదుపాయం కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆహార పదార్ధాలు ఉత్పత్తి చేసే రైతు సాగుకు నష్టం కలగకుండా పర్యావరణ పరిరక్షణ అందరి సామజిక బాద్యత… వ్యవసాయ ఆధారిత దేశంలో రైతు గొప్పతనం గురించి ఎంతచెప్పినా తక్కువే.
కోపం వలన కలిగే నష్టాలు. మనిషికి మంచి గుణాలలో శాంతంగా ఉండడం కూడా చెబుతారు. కానీ కోపం వస్తే, నియంత్రణ లేనివారికి, మాత్రం శాంతంగా ఉండే మనసు క్రోదానికి బలవుతుంది. తత్ఫలితంగా కోపం వలన నష్టాలు ఎక్కువ అవుతాయి.
మనకు కోపం రావడానికి కారణాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయిష్టమైన విషయాలు ఎదుర్కొనేటప్పుడు, మనిషి మనసు సహజంగా కోపానికి లోనవుతుంది. మనసుకు అయిష్టాలు చాలానే ఉండవచ్చు.
నచ్చని మాట వినబడినా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నచ్చనివారు ఎదురుపడిన కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. నచ్చని పని చేయాలంటే, కోపం, అసహనం కలిగే అవకాశాలు ఉంటాయి.
కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
అసహనం పెరిగే కొలది చిరాకు, కోపం పెరుగుతూ ఉంటాయి. చిరాకు, చికాకు వలన చీటికి, మాటికి కోపం రావడం అలవాటు అయితే, అది ఇతరులపై ప్రదర్శించడం అలవాటు అయి, వారి మనసులో మనపై చికాకు భావన పెంచుకునే అవకాశం మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.
దాని పర్యవసానంగా పలు సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. నలుగురిలోనూ “వీడికి కోపం ఎక్కువ” అనే భావన బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
కాని కోపం రాని మనిషి ఉండడు. అయితే కొందరు కోపాన్ని నియంత్రిస్తారు. కొందరు కోపాన్ని ఇతరులపై ప్రదర్శిస్తారు. కోపాన్ని నియంత్రించుకోగలగడం గొప్ప విషయంగా పెద్దలు పరిగణిస్తారు.
తన కోపమే తన శత్రువు అంటారు. అంటే ఎవరికీ కోపం వస్తే, అదే వారి శత్రువుగా మారుతుంది.
ఎందుకంటే ఎప్పుడూ కోపగించే తత్త్వం కలిగిన వ్యక్తితో ఎవరూ ఆప్యాయంగా మాట్లాడలేరు. ఆప్యాయంగా మాట్లాడే మనిషి ఒక్కరు కూడా లేకపోతే, ఒంటరితనం పెరిగి, మనిషి ఒంటరివాడుగా మారతాడు. కష్టసుఖాలు పంచుకోకుండా మనిషి మనసు ఉండలేదు.
ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే అలవాటు ఉంటే, అది చివరికి క్రోధంగా దారి తీసే అవకాశం ఉంటుంది. క్రోధం వలన మనసు విచక్షణ కోల్పోతుంది. అలాంటి సమయాలలో మనసు ఇష్టారీతిలో ప్రవర్తిస్తుంది.
ఇష్టానుసారం మెదిలే మనసుకు అంతులేని ఆలోచన, ఆందోళన, చికాకు ఎక్కువ అవుతాయి.
నచ్చిన విషయాలు మనసుకు ఎదురైనప్పుడు సంతోషించే మనసు, నచ్చని విషయం ఎదురైనప్పుడు మాత్రం అందుకు కారణం అయినవారిని వెతుక్కొని, వారిని తప్పుబడుతుంది.
అలాగే తమకు నచ్చినట్టు ప్రవర్తించే మనిషి అంటే ఇష్టం. తమకు నచ్చనట్టు ప్రవర్తించే మనిషి అంటే కష్టంగా కొందరి మనసు మారుతూ ఉంటుంది. కానీ అలంటే సమయంలో సంయమనం పాటించేవారిని, గొప్పవారిగా పెద్దలు చెబుతారు.
నచ్చడం, నచ్చకపోవడం అనే అలవాటు, మనిషికి నచ్చినట్టుగా కాకుండా శాస్త్రం లేక పెద్దలు ఆమోదించిన విధానం ప్రకారం ఉంటే, వారు మార్గదర్శకులుగా మారగలరు. కానీ నచ్చడం, నచ్చకపోవడం అనే అలవాటు, మనసును బట్టి ఏర్పరచుకుంటే, అదే అలవాటు కోపానికి కారణం కాగలదు.
తత్కారణంగా అలవాటు కోపంగా మారితే, తన కోపమే తన శత్రువుగా మారుతుంది.
ఆహారం ఒక పద్దతిగా వైద్యులు సుచించినట్టుగా తీసుకుంటే, అనారోగ్యం కూడా నయం అవుతుంది. అలా కాకుండా ఆహారం మనసు కోరినట్టుగా అతిగా ఆరగిస్తే, అదే ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా నచ్చని ఆహారం తినవలసి వచ్చినప్పుడు కోపం కలిగే అవకాశం ఉంటుంది.
ఇలా పలు విషయాలలో మనిషికి నచ్చడం, నచ్చకపోవడం ఉంటుంది. కానీ నచ్చిన విషయం అందరికి ఆమోదయోగ్యమైతే, అది మంచి విషయంగా ఉండవచ్చు. నచ్చని విషయం అందరికి ఆమోదయోగ్యంగా ఉండి, ఒక్కరికే నచ్చకపోతే, సదరు వ్యక్తి తన ఆలోచనను గమనించాలి.
కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి కోపం ఎందుకు వస్తుంది
మనిషి మనసుకు నచ్చడం, నచ్చకపోవడం, వినడం, వినకపోవడం, ఇష్టం, అయిష్టం వంటి వాటి భావనలు బలపడి ఉంటే, అవే కోపానికి కారణం కాగలవు, కీర్తికి కారణం కాగలవు.
ఒకరికి చదువుకోవడం ఇష్టం. అది మంచి, చదువుకునే విషయంలో కాలయాపన జరిగితే కోపం. అది మంచి చేసే కోపం. కానీ అదే కోపం పదే పదే తెచ్చుకుంటే, అది భాధకు కారణం కాగలదు.
మంచి విషయానికైనా, చెడు విషయానికైనా కోపం రావచ్చు. కానీ అది నియంత్రించబడాలి. అప్పుడే అది మనిషికి శాంతిని అందిస్తుంది. లేకపోతే కోపం వచ్చిన వ్యక్తి మనసుతోపాటు, ఇతరుల మనసు మదనపడుతుంది.
కావునా కోపమనేది కేవలం ఒక చెడు విషయాన్నీ ఖండించడానికి ఉపయోగపడాలి… కానీ మనసుకు అలవాటుగా మారకూడదు. అతి సర్వత్రావర్జయేత్ అంటారు.
అంటే అతి అన్నింటా అనర్ధమే అంటారు. కోపం విషయంలో ఇది నిజమని, గుర్తించకపొతే, మనసుకు కోపం చాలా చాలా నష్టాన్నే మిగిలుస్తుంది.
కారణం లేని కోపం చేటు చేస్తుంది. కారణాంతరాల వలన కోపం కలిగినా, దానిని నియంత్రించుకునే అలవాటు నేర్చుకోవాలి.
కోపం వలన కష్టాలు తీరవు కానీ కోపం వలన కొత్త కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ. కావునా కోపం అనే గుణం దుర్గుణంగా మారకుండా, కోపం అనే గుణంపై నియంత్రణ ప్రయత్న పూర్వకంగా సాధించాలి.
సాదారణ స్థితి మనిషికి మరొక మనిషితో సత్సంబంధం ఏర్పరిస్తే, కోపం వలన సత్సంబంధం మద్య బేధభావం ఏర్పడే అవకాశం ఎక్కువ. కాబట్టి కోపం కారణంగా నష్టాలు అధికంగా ఉండవచ్చు.
అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగువ్యాసం. సమాజంలో అంటువ్యాధులు ప్రభలితే, వాటి ప్రభావం అందరి ఆరోగ్యంపైనా పడుతుంది. దీని గురించి అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో వ్యాసం.
అంటువ్యాధి అంటేనే ఒకరి నుండి మరొకరికి పాకే గుణం కలిగి ఉంటుంది. సహజమైన వాతావరణంలో మనిషి సహజంగా తోటివారితో కలిగి జీవిస్తాడు. తద్ఫలితంగా అంటువ్యాధి వ్యాప్తి చెంది, నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ.
మనిషి సంఘజీవి, సమాజంలో కొందరితో కలిసి జీవించే మనిషి తనకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకుని జేవిస్తూ ఉంటాడు. ఇంకా సమాజంలో పలువురితో కలిసి పని చేస్తూ, లేక చేయిస్తూ జేవిస్తూ ఉంటాడు. అలా మనిషి నిత్యం సమాజంలో కొందరితో కలిసి మెలసి, కొందరితో కలుస్తూ జీవనం కొన సాగిస్తూ ఉంటాడు.
అటువంటి మనిషికి ఒకరినొకరు కలవడం వలన సాంగత్యం ఏర్పడుతుంది. ఆ సాంగత్యం మనసుపైనా, శరీరం పైన ప్రభావం చూపుతుంది. అలా ఉండే మానవ జీవనంలో సహజమైన వాతావరణం మంచి స్థితిని అందిస్తే, అసహజమైన వాతావరణం చెడు ఫలితాలను అందిస్తుంది.
సహజమైన వాతావరణం అంటే పరిసరాల పరిశుభ్రతతో ఉండడం. ఇంకా పర్యావరణ సమతుల్యతతో కొనసాగడం జరుగుతుంది.
అపరిశుభ్రత వలన కలిగే అంటువ్యాధులు అపారనష్టం గురించి
అసహజమైన వాతావరణం అంటే పరిసరాలు అపరిశుభ్రతతో ఉండడం. పర్యావరణం కాలుష్యం అవ్వడం వంటివి జరుగుతాయి. ఇలా సమాజంలో వాతావరణం అసహజంగా మారడం వలన అనేక అంటువ్యాధులు ప్రభలుతాయి. సంఘజీవి అయిన మనిషి నిత్యం పరిచయస్తులతో కలుస్తూ, ఉండడం వలన వ్యాధులు ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
ఇలా అంటువ్యాధులు సమాజంలో ప్రమాదకరంగా మారితే, అవి సమాజానికి అపారనష్టం కలిగిస్తాయి. సమాజానికి అపార నష్టం అంటే, ఆర్ధికంగా, నైతికంగా మనుషులు ఆందోళనను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సహజమైన పరిస్థితులలో మనిషి మనుగడ చాలా బాగుంటుంది. దైనందిన జీవనం కొనసాగుతూ, ఆర్ధికంగా ఎదుగుతూ, తోటివారికి సాయం చేస్తూ ఉంటాడు.
అదే అసహజమైన పరిస్థితులు పెరిగి, అంటువ్యాధులు ప్రభలితే, అదే మనిషి సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన ఆర్ధిక వనరులు కోల్పోయే అవకాశం ఎక్కువ. ఇంకా అనారోగ్యం ఎక్కువ అవుతుంది. తనకు సోకినా వ్యాధిని మరొకరికి వ్యాప్తి చెందడానికి కారకుడు కూడా కావచ్చును.
వ్యాధి గుణం ఒకరి నుండి మరొకరికి, ఆ మరొకరి నుండి ఇంకొకరికి ఆ ఇంకొకరి నుండి వేరొకరికి ఇలా ఒకరి నుండి రెండవ వారికి….మూడవవారికి… పదవవారికి… ఇరవైవారికి… అనేకమందికి పాకే గుణం వ్యాధికి ఉంటుంది. అటువంటి అంటువ్యాధులు చాలా ప్రమాదకరం.
కొన్ని రకాల అంటువ్యాధులు ప్రాణాంతకంగా మారతాయి. అటువంటి అంటువ్యాధులు మరింత ప్రమాదకరం.. వీటి వలన అనేకమంది ప్రాణాలు కోల్పోతారు.
మానవ మనుగడ అంతా ఒకరికొకరు సాయం వలననే సాగుతుంది. అటువంటి మనుషుల మద్య అంటువ్యాదులు తీవ్రత పెరిగితే, మానవ సంభందాలు ప్రభావితం అవుతాయి. కొందరు మనోధైర్యం కోల్పోయే అవకాశం కూడా అంటువ్యాధులు వలన ఏర్పడవచ్చు.
కావున అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా మనిషి చుట్టూ ఉండే సహజమైన వాతావరణం, సహజంగానే ఉండే విధంగా మనిషి కృషి చేయాలి. వ్యవస్థలు కూడా పరిసరాల పరిశుభ్రత విషయంలో పాటుపడాలి.
అంటువ్యాధులు నివారణ చర్యలు
ఎప్పుడైనా అంటువ్యాధి సమాజంలో వ్యాప్తి చెందుతూ ఉంటే, ముందుగా సంభందిత సామజిక వ్యవస్థలు మేల్కోవాలి.
వృద్ది చెందుతున్న అంటువ్యాధి లక్షణాలు గురించి పూర్తీ సమాచారం సేకరించాలి.
పెరుగుతున్న వ్యాధి గురించి సరైన అవగాహనా సమాజంలో కలగజేయాలి.
అంటువ్యాధి యొక్క సహజ లక్షణాలు గురించి అర్ధవంతంగా సంబందిత సమాజంలో తెలియజేయాలి
వ్యాధి లక్షణాలపై అపోహలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
అంటువ్యాధి గురించి పుకారు వార్తలను సమాజంలో పాకకుండా జాగ్రత్త తీసుకోవాలి
ముఖ్యంగా అంటువ్యాధి వ్యాపించకుండా సామజిక దూరం గురించి ప్రజలకు ప్రేరణ కలిగించాలి
అంటువ్యాధి నివారణకు ప్రాధమిక జాగ్రత్తలు ప్రాముఖ్యతను పదే పదే ప్రచారం కల్పించాలి
ఈ విధంగా ప్రాధమికంగా అంటువ్యాధి నివారణ చర్యలను, తగు వైద్య సూచనలు తెలియజేస్తూ సమాజంలో విస్తరింప జేస్తూ ప్రజల ద్వారానే ప్రజలలో వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా చూడాలి. ఆపై పెరుగుతున్న అంటువ్యాధి నివారణకు వైద్యపరమైన మార్గాలు అన్వేషించాలి.
తగిన సమయంలో సత్వర నిర్ణయాలు తెసుకునే వారి నాయకత్వంలో అంటువ్యాధి నివారణ గురించిన బాద్యతలు ఉంచాలి.
అంటువ్యాధి సమాజంలో ఒకసారి వ్యాపిస్తే, మరలా ఆ సమాజంలో వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. కావునా అంటువ్యాధికి టీకా సిద్దం చేయాలి. ఆ టీకా సమాజంలో ప్రజలందరికి వేయించాలి. ఇందుకోసం యుద్దప్రాతిపదికన చర్యలు అవసరం అని నిపుణులు అంటారు.
సమాజంలో ప్రమాదకరమైన అంటువ్యాధులు పెరిగితే, అవి సమాజంలో భారీ నష్టాన్ని అందిస్తాయి. కాబట్టి వాటిని వీలైనంత తక్కువ సమయంలో నివారించాలి.
బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం. నేటి బాలికలే రేపటి తల్లులు మారతారు . గృహిణిగా ఇంటి బాధ్యతలు చక్క పెట్టె, అమ్మ పిల్లలకు మొదటి గురువు గా ఉంటుంది. తల్లి దగ్గర నేర్చిన పాఠం జీవితంలో ఎప్పటికి గుర్తు ఉంటుంది. కాబట్టి ఒక తల్లి తన పిల్లలకు విద్యను నేర్పించడానికి, ఆమె బాల్యం లో చదువుకుని ఉండుట చాల చాలా ప్రధానమైన విషయం.
మారుతున్న కాలంలో ఆడువారు ఉద్యోగస్తులుగా చక్కగా రాణిస్తున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం కూడా బాలికలకు చదువు అవసరం ఉంది.
చదువుకున్న ఇల్లాలు వలన ఇంట్లో పిల్లలు బాగుగా చదవగలరు . ఇంకా విద్య యొక్క ఆవశ్యకత ను తల్లి ముందుగానే పిల్లల్లో ఏర్పరచగలదు . మనదేశం లో ఎక్కువ మంది నాయకులు తల్లుల బోధ వలననే మంచి ఆశయం కోసం కృషి చేసారని అంటారు.
బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం
కాబట్టి మంచి సమాజం భవిష్యత్తు మంచి అమ్మ దగ్గర పెరిగే బిడ్డల బట్టి ఆధారపడి ఉంటె, అటువంటి అమ్మ బాల్యంలో సరైన చదువుకుని ఉంటె, కచ్చితంగా మెరుగైన సమాజం కోసం రేపటి పౌరులు అమ్మ ఒడిలోనే పాఠాలు నేర్చుకునే అవకాశం బాలికల చదువు పైనే ఆధారపడి ఉంటుంది.
మహిళలు కేవలం ఉద్యోగస్థులుగానే కాకుండా అనేక రంగాలలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు . క్రీడారంగం , రాజకీయ రంగం, సినిమా రంగం వంటి పలు రంగాలలో ఆడువారి పనితీరు అద్భుతంగా ఉంటుంది.
వివిధ రంగాలలో అద్భుతమైన ఫలితాలు సాధించిన ఆడువారు, ఆలా నేటి బాలికలకు ఆదర్శంగా నిలిచే మహిళల అక్షరాస్యత, ఆసియాలోకే అతి తక్కువగా భారత దేశంలోనే ఉంది.
నేటికి 20 కోట్ల మంది మహిళలు నిరక్ష్య రాస్యులుగా ఉన్నట్టు అంచనా ఉంది. దీనిని బట్టి చూస్తే బాలికలకు అవసరం విద్య అనేది గతంలో తక్కువగా ఉందని అర్ధం అవుతుంది. స్త్రీలు కూడా మంచి విద్యను అభ్యసిస్తే, వారి ద్వారా పిల్లలకు మంచి విద్య అందే అవకాశం ఉంటుంది. కాబట్టి బాలికలకు విద్య అంటే తెలిసి ఉండడం, విషయ పరిజ్ఞానం వలన విషయాలపై అవగాహన ఉంటుంది. అలాగే అనేక విషయాలలో ఆగవగాహన వలన అపోహలకు తావు ఉండదు.
అపోహలు లేనప్పుడు మనో భయాలు తక్కువగా ఉంటాయి. నిరక్ష్యరాస్యులు అయిన స్త్రీలు గర్భస్థ సమయంలో ఇబ్బందులు పలు అయ్యే అవకాశం ఉంటుందని అంటారు.
కానీ చదువుకున్న మహిళలకు వారి వారి విషయాలపై కూడా తగినంత అవగాహనా ఉంటుంది. కాబట్టి బాలికలకు విద్య నేటి సమాజంలో చాల అవసరం ఉంది.
ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం. విద్య వలన వ్యక్తి బుద్ది వికసిస్తుంది. విద్య పలురకాలు…
అయితే ప్రాధమికంగా శాస్త్రీయ విద్యతో విద్యార్ధి దశ ప్రారంభం అయితే, అటువంటి విద్య అన్ లైన్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చు.
నేటి విద్యా వ్యవస్థ సాంకేతికత తోడై సులభతరంగా మారుతుంది. నేర్చుకునే ఉత్సాహం ఉండాలే కానీ ఎవరైనా విద్య నేరుకునే విధంగా విద్యావ్యవస్థ మారుతుంది.
ఇంటర్నెట్ ఆధారిత పరికరాల వాడుక పెరిగాక, ఆన్ లైన్ విద్యకు ప్రాముఖ్యత పెరిగింది. నేటి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకంగా విద్య అందరికి అందుబాటులోకి వచ్చింది.
ఒకప్పుడు విద్య నేర్చుకోవడానికి విద్యాలయానికి వెళ్లి, నిర్ణీత సమయాలలో విద్యాభ్యాసం చేయవలసి ఉంటే, ఇప్పుడది మరింత సులభం అయ్యింది.
ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే పరికరాలతో ఆన్ లైన్ విద్య సులభంగా నేర్చుకోవచ్చు. ఆయా పరికరాలు ఉపాద్యాయులను తెరపై చూపుతుంది. బోధన కొనసాగిస్తుండగానే, బోధించేవారిని ఇంటర్నెట్ ఆధారిత పరికరాలలో చూడవచ్చు.
ఇంటివద్ద నుండే విద్యనూ అన్ లైన్ ద్వారా అభ్యాసం చేయవచ్చు. ఇందుకు డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా లాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్ ఉపయోగించవచ్చు.
ఒకసారి రికార్డు చేయబడిన వీడియోలు మరల, మరలా చూడవచ్చు. అర్ధం కానీ పాఠ్యాంశాలు మరల మరలా వినడానికి అన్ లైన్ విద్య ఉపయోగపడుతుంది. ఇనుడుకు యూట్యూబ్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
విద్య వ్యక్తికి చాలా ప్రధానమైన విషయం. విద్య అంటే తెలుసుకోవడం. వ్యక్తి జీవనం కొనసాగించడానికి శాస్త్రీయంగా ఏమి తెలియాలో? బ్రతకడానికి ఏమి తెలియాలో? అది తెలిసిన వారి నుండి తెలుసుకోవడం.
శాస్త్రీయమైన విద్యాభ్యాసం పాఠశాలలందు నేర్పించబడుతుంది. కానీ అటువంటి శాస్త్రీయమైన విద్య సైతం ఆన్ లైన్ ద్వారా అభ్యాసం చేయవచ్చు.
ఇందుకు బాలురు, బాలికలు, మహిళలు, పురుషులు ఎవరైనా అన్ లైన్ ద్వారా విద్యనూ నేర్వవచ్చును.
నేటి విద్యా విధానం సాంకేతికత వలన అందరికి అందుబాటులోకి వచ్చింది. చెప్పేవారు ఉంటే, ఏ సమయంలోనైనా ఆన్ లైన్ ద్వారా విద్య అభ్యసించవచ్చు.
అంటువ్యాధులకు దూరంగా ఉండడానికి అన్ లైన్ విద్య అవసరం ఉంది.
కరోనా వైరస్ వలన అంటువ్యాధులు అంటే భయం వ్యాపించింది. అంటువ్యాధి వలన సమాజం అంతా వ్యాధిగ్రస్తం అయ్యే అవకాశం ఎక్కువ. ఒకరి నుండి ఒకరికి పాకే గుణం ఉండే అంటువ్యాధులు సోకకుండా అన్ లైన్ విద్య విద్యార్ధులకు ఉపయోగపడుతుంది.
రవాణా ఖర్చులు అదా చేసుకోవచ్చు. ప్రధానంగా కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఆసక్తి ప్రధానం.
ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? ప్రశ్నతో పాటు సమస్యలు కూడా ఉంటాయి.
అయితే ప్రధానంగా ఇందులో ప్రధాన సమస్య ప్రతిరోజు కొద్ది గంటలపాటు తదేకంగా ఎల్ఇడి స్క్రీను చూడడం వలన కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంకా స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ వంటి పరికరాలు అలవాటు అయితే, మనిషిలో ఒంటరితనం పెరిగే అవకాశం కూడా ఎక్కువ.
తోటివారితో కూడిన విద్య, గురువు ముందు నేర్చుకోవడం మేలైన విద్యావిధానం అంటారు.
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. శ్రీరామాయణంలో రాముడి పితృవాక్య పరిపాలన, సీతమ్మ ప్రాతివత్య ధర్మం, సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడి సేవానిరతి, లక్ష్మణస్వామితోడు ఏ పాత్ర చూసిన రాముని ధర్మమునకు కట్టిబడి ఉంటారు. ధర్మమునకు కట్టుబడి రాముడు నడిస్తే, రాముని వెంట నడిచినవారే ఎక్కువమంది ఉంటారు. మరణానికి చేరువ అయ్యేవారు రావణుడికి దగ్గరగా ఉంటే, ధర్మము అంటే ఇష్టపడేవారు రాముని చుట్టూ ఉంటారు. అలా రాముడి ధర్మమే రామాయణంలో చాలా ప్రధానంగా ఉంటుంది.
అలాంటి సుగుణాభిరాముడి గురించి శ్రీరామాయణం అంటే శ్రీరాముని పదహారు గుణాలను తెలుపుతూ ఉంటుంది.
ఈశ్వరునికి ఉండే పదహారు విశిష్టమైన గుణాలు ఒక మానవుడికి ఉంటే, ఆయనే శ్రీరామచంద్రమూర్తిగా ప్రవచనకారులు చెబుతారు.
ఇంకా శ్రీరాముడు పరమ ధర్మమూర్తిగా పురాణాలలో చెప్పబడతారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది… అనే ఆర్యోక్తి శ్రీ రామాయణంలో రాముని ద్వారా తెలుసుకోవచ్చు.
ఒక ప్రాంతంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి, ఆ ప్రాంతవాసులకు ఆదర్శం అయితే, ఆ ప్రాంతం మిగిలిన ప్రాంతాలకు ఆదర్శప్రాయంగా కనబడును.
అలాగే ఒక కుటుంబ పెద్ద కూడా సమాజంలో తగినంత అనుభవం కలిగి ఉంటాడు. కాబట్టి కుటుంబ పెద్ద అయినా తండ్రి తనయుడికి ఆదర్శప్రాయంగా నిలిస్తే, అతనిని అనుసరించడం తనయుడి ధర్మం.
అటువంటి కర్తవ్య దీక్షనే శ్రీరామచంద్ర మూర్తి రామాయణంలో నిర్వహించినట్టుగా రామాయణం ద్వారా మనకు తెలియబడుతుంది.
కేవలం తండ్రి మాటపై గురువుతో రాముడు అడవులలో నడిచాడు.
అయోధ్యలో అంతపురంలో సౌకర్యవంతమైన జీవనం కలిగి ఉన్న శ్రీరాముడు, విశ్వామిత్రుడి వెంట అడవులలో నడిచాడు.
శ్రీరాముడిని తనతో పంపవలసినదిగా, దశరడుని విశ్వామిత్రుడు కోరతాడు. అప్పుడు దశరదుడు శ్రీరాముడిని, విశ్వామిత్రుని వెంట పంపుతాడు… విశ్వామిత్రుడి చెప్పినట్టు శ్రీరాముడు అడవులలో నడుచుకుంటాడు.
విశ్వామిత్రుడిని దగ్గర అనేక అస్త్ర, శస్త్రాలను శ్రీరాముడు పొందుతాడు… కానీ వాటిని స్వప్రయోజనానికి ఉపయోగించకుండా కేవలం ధర్మరక్షణకై ఉపయోగించడం రామాయణంలో రాముడి దగ్గరే తెలుసుకోవాలని పెద్దలంటారు.
ఎంతటి శక్తిని పొందినా గురువు దగ్గర ఎంతటి వినయంతో నడుచుకోవాలో రామాయణంలో శ్రీరాముడిని నుండి నేర్చుకోవాలి.
గురువుపై గురి కుదిరితే అత్యంత శక్తివంతమైన, అసాదరణమైన విజయం సాధించవచ్చని శ్రీరామాయణంలో శ్రీరాముడినిచూసి తెలుసుకోవచ్చు.
శక్తివంతులైన రాక్షసులకు, ఇతరులకు సాద్యం కానీ శివధనుస్సు ఎక్కుపెట్టగలగడం శ్రీరాముడికే సాద్యం అయ్యింది.
చెప్పుడు మాటలు వింటే, బుద్ది నశిస్తుందని రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు
చెప్పుడు మాటలు వింటే, బుద్ది నశిస్తుందని శ్రీరామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే శ్రీరాముడంటే అమితమైన ప్రేమ కలిగినవారిలో కైకేయి ఉంటుంది.
ఆమెకు రాముడంటే చాలా ఇష్టం. అటువంటి కైకేయి చెప్పుడు మాటల వలన సమాజంలో నిందితురాలిగా మారింది. కన్న కొడుకు కూడా ఆమెను అసహ్యించుకోవడం కైకేయి విషయంలో శ్రీరామాయణంలో చూడవచ్చు.
శ్రీరామపట్టాభిషేకం అడ్డుకుని, కొడుకుకు రాజ్యం ఇప్పించాలనే సంకల్పం, మంధర మాటల వలన కైకేయి మనసులో కలుగుతుంది.
వెంటనే దశరడుడిని కోరడంతో, ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి మాటమేరకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడానికి అడవులకు బయలుదేరతాడు. శ్రీరాముడిని అడవులకు పంపింది, దైవమె అయినా, చెప్పుడు మాటలు వింటే, లోకనింద పొందే అవకాశం ఎక్కువ అని రామాయణంలో కైకేయి పాత్ర నిరూపిస్తుంది.
వ్యక్తి మహనీయుడుగా మారాలంటే అందుకు ఆదర్శప్రాయమైన పాత్రలు శ్రీరామాయణంలో చాలా కనబడతాయి. శ్రీరాముడులాగా అందరితో మంచి అనిపించుకుంటే, కష్టంలో అందరూ సాయపదతారని శ్రీరామాయణం చాటి చెప్పుతుంది.
అన్నీ తెలిసినా, మరొకరికి ఉపకారం చేయకుండా, అపకారం తలపెడితే, ఎంత ప్రమాదమో రామాయణంలో రావణుడు పాత్ర తెలియజేస్తుంది.
రావణుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. బలవంతుడు. అనేకమంది శక్తివంతులైన రాక్షసగణం కలిగినవాడు. అటువంటి వాడు అన్నీ తెలిసినా, మరొకరికి ఉపకారం చేయకుండా, అపకారం తలపెడితే, ఎంత ప్రమాదమో రామాయణంలో రావణుడు పాత్ర తెలియజేస్తుంది.
సాక్షాత్తు దైవానుగ్రహం కలిగి ఉన్నా, మన ప్రవర్తన ఇతరులకు అపకారం చేస్తే, ఫలితం అనుభవించాల్సిందే… రావణుడికి పరమేశ్వరుడి అనుగ్రహం కలిగింది. కాబట్టి పంచభూతాలను శాసించాడు.
ఇంకా లోకాన్ని పీదించాడు. మితిమీరి శ్రీరాముడి భార్యను తీసుకువెళ్ళి లంకలో కూర్చోబెట్టాడు. అందుకు ఫలితంగా సీతమ్మ తల్లి వేదనకు గురైంది…. సీత ఆవేదన, రావణుడికి పాపం పెరుగుతూ, పుణ్యం నశించడం మొదలైంది.
నశించిన పుణ్యం వలన కేవలం రావణుడికి దైవానుగ్రహం దూరం అయింది. రాముడు, రావణుడిని జయించాడు.
శ్రీరామాయణం వ్యక్తి సమాజంలోను, కుటుంబంలోను ఎలా జీవించాలో? తెలియజేస్తుందని పెద్దలు చెబుతారు.
సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం. డిజిటల్ యుగంలో, మొబైల్(సెల్) ఫోన్లు మన జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. ఈ పరికరాలు నిత్యం సోషల్ మీడియాతో కనెక్ట్ కావడానికి, మరియు వినోదంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. మొబైల్ వాడుక విస్తృతంగా పెరుగుతున్న వలన, అదే ఆందోళనకు దారితీస్తుంది. ఎందుకంటే మొబైల్ ఒక వ్యసనం వలె మారే అవకాశం ఉంది. ఈ వ్యాసం మొబైల్ వ్యసనానికి కారణాలు, పర్యవసానాలు మరియు సంభావ్య పరిష్కారాలను అన్వేషిస్తుంది, ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేయగలిగే శక్తివంతమైన చేతిలో ఉండే పరికరం.
మితి మీరిన సెల్ ఫోన్ వాడకం మనిషికి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని అంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వలన వ్యక్తి మొబైల్ పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్(సెల్) ఫోన్లు చాలా అనువుగా ఉంటాయి. ఎక్కడంటే అక్కడే మొబైల్లో గేమ్స్ అడవచ్చును, కనుక ఇది ఒక కారణం అవుతుంది. ఇక వినోదకరమైన అనేక అంశాలు ప్రధానంగా ప్రభావం చూపుతాయి.
ఇంకా సమాజంలోసెల్ ఫోన్ అతిగా వాడడంమొబైల్ వాడడం వలన నష్టాలు వివరిస్తూ అనేకమంది ఔత్సాహికులు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సెల్ ఫోను వాడుక పెరుగుతూనే ఉంది.
మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణలు మితిమీరుతున్నాయని, అటువంటి సెల్ ఫోన్ మాటల వల్ల రేడియేషన్ ప్రభావం పడుతోందని వైద్యులు అంటున్నారు.
మనమద్య సెల్ ఫోన్ రాకముందు సమాజంలో పలకరింపులు బాగుంటే, ఇప్పుడు పలకరింపులు పరిమితమైపోతున్నాయనే భావన బలపడుతుంది.
ఇపుడు సెల్ ఫోన్ వలన నిద్రలేవగానే, ఒకరికొకరు గుడ్ మార్నిగ్ అని చెప్పుకోవడం కంటే నిద్రలేవగానే సెల్ ఫోన్ ను చెక్ చేయడం ఎక్కువైపోయింది. స్మార్ట్ ఫోన్ చూడకుండా తెల్లవారదు, పొద్దుపోదు అన్నచందాన మనిషి జీవన కొనసాగుతుందనే వాదన బలంగా ఉంది.
సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు చాలానే చెబుతారు.
స్మార్ట్ ఫోన్ వాడుక, అదొక అలవాటుగా మారి, వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం.
శరీర ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
మానసిక చికాకులు, మనోవ్యాదులు పెరిగే అవకాశం
ముఖాముఖి సంబంధాలను మొబైల్ వ్యసనం తగ్గించేస్తుంది.
స్మార్ట్ ఫోన్ వాడుక, అదొక అలవాటుగా మారి వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం.
మన మానవ సమాజం అంతా మానవ సంబంధాలతో సాగుతుంది. నిత్య జీవితంలో బంధుమిత్రులతో కలిసి పనిచేస్తూ, కష్టసుఖాలలో భాగం అవుతూ ఉంటాం.
ఇలాంటి మన మానవ సమాజంలో యంత్రికతకు చోటు తక్కువగా ఉండేది. కాని ఇప్పుడు సినిమాలు మనిషిపై పోకడ పేరుతొ ప్రభావం చూపితే, టివిలు ఒంటరితనం పెంచితే, సెల్ ఫోన్స్ మనిషిపై పూర్తీ యాంత్రికమైన భావనను పెంచుతున్నాయి.
మనకున్న సమాజంలో నిత్యం ఎదో అలవాటుగా పని చేస్తూ, సంపాదన చేస్తూ ఉండే ప్రజల మధ్యలో చదువుకునే బాలబాలికలు ఉంటారు. అలవాటుగా పెద్దల నుండి పిల్లలకు కొన్ని అలవాట్లు సంక్రమిస్తూ ఉంటాయి..
ఇప్పుడు ఆ కోవలోకి సెల్ ఫోన్ వాడుక కూడా చేరుతుంది. తండ్రిని మించిన తనయుడు అన్నట్టుగా ఫోన్ వాడుక పిల్లలల్లో పెరుగుతుండడం పెరుగుతుందని, దాని వలన బాల్యం నుండే పిల్లలలో అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా.
ఒక అట వస్తువుగా, ఒక పరికరంగా, ఒక టీవీగా, ఓకే సంభాషణ అందించే పరికరంగా, ఇద్దరితో సమన్వయము చేసే పరికరంగా, బిల్ పే చేసే నేస్తంలాగ, వినోదం పంచె మిత్రుడిలాగా సెల్ ఫోన్ మనిషికి మరింత చేరువై, అది ఒక అలవాటుగా మారుతుంది.
ఎప్పుడు సెల్ ఫోన్ వాడుట కూడా ఒక వ్యసనంగా మారే అవకాశం ఎక్కువ అని అంటారు.
శరీర ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని తిరిగితే, అది స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతుంటే, క్యాన్సర్ కావాలని కొనుకున్నట్టే. మొబైల్ ఫోన్లను పదేళ్లుగా వాడే యువతకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని స్వీడన్కు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు.
అతిగా సెల్ ఫోన్ యూజ్ చేయడం వలన, చేతికి బాధారకమైన స్థితి రావచ్చు, మణికట్టు నుండి మెదడుకు గల నాళం దెబ్బతినే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
అంతేకాకుండా సెల్ ఫోన్ అలవాటుగా మారి వాహన వాడుకలో కూడా ఫోన్ వాడడం పరిపాటి అయిపోతుంది. దీని వలన వాహన ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువ.
ప్రతిరోజూ సెల్ ఫోను గంటల తరబడి ఉపయోగిస్తూ, మొబైల్ ఫోన్లను 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించినట్లయితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు కానుందని నిపుణుల మాట.
మరోవైపు సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారిలో వినికిడి సమస్య వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
సెల్ ఫోన్లో అధికంగా మాట్లాడే వారిలో తలనొప్పి, కళ్ళు తిరగడం, తల తిరగడం, కళ్లు బైర్లుకమ్మడం, ఆకలి మందగించడం, ఆందోళన వంటి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం కూడా ఎక్కువేనని అంటారు.
మానసిక చికాకులు, మనోవ్యాదులు పెరిగే అవకాశం
అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అతి అన్నింటిలోను అనర్ధమే అని భావన వస్తుంది. ఇది సెల్ ఫోన్ విషయంలో రుజువు అవుతుంది.
ఆత్రుత ఉంటుంది…. రోజు ఆత్రం కలిగించే విషయాలను మనసు మరిగితే, అవే విషయాలను మనసు రోజూ కోరుతుంది. ఇటువంటి ఆత్రం సెల్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ వాడుక వలన పెరిగె అవకాశాలు ఎక్కువని అంటారు.
నిత్యం ఒత్తిడికి లోనైతే మొదట కోల్పోయేది నిద్రాసమయం. ఇప్పటికే ఈ సమస్య సమాజంలో ఉంటే, అది సెల్ ఫోన్ వలన మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
సరసమైన ధరలలో నిత్యావసర వస్తువుల కంటే, సరసమైన ధరలలో స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అటువంటి స్మార్ట్ ఫోన్ మనిషి జీవనంలో అంతర్భాగం అయిపొయింది.
సెల్ ఫోన్ వాడొద్దని చెప్పడానికి ప్రధాన కారణం, దాని నుండి వచ్చే రేడియో ధార్మికత…
పిల్లలపై, తల్లులపై, తండ్రులపై, అత్త, మామలపై ఇలా ఏ బంధం చూసినా ఒంటరిగా మారడానికి సెల్ ఫోన్ ఒక ఆయుధంగా మారుతుంది.
తగు సమయంలో దీనిని గురించి ఆలోచన లేకుండా, అదే పనిగా సెల్ ఫోన్ వాడితే, మనిషిలో యాంత్రికత పెరిగి, మానవ సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఎక్కువ.
కాబట్టి సెల్ ఫోన్ అతి వాడుకను అతి త్వరగా నియంత్రణలోకి తీసుకురావలసిన అవసరం అందరికి ఉంది. ఇది అందరి పట్ల ఉన్న ప్రధాన సామజిక భాద్యత గుర్తించవచ్చు.
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది.
పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది.
భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం.
వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి.
సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది.
ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి.
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
మనదేశంలో పల్లెటూరు అందంగా కనబడుతుంది. సూర్యోదయం పచ్చని పొలాల్లో నుండి పొడుచుకువస్తుంది. భానుడి కిరణాల వేడి పెరిగేకొలది చెట్లు చల్లదనం మనకు ఎంతో హాయిని అందిస్తాయి.
గ్రామంలో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషి మరుపురాని స్మృతులుగా ఉంటాయని అంటారు.
ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో, మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా పల్లెటూళ్ళల్లో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో, కాయగూరల పాదులతో చక్కగా ఉంటుంది.
మనిషికి కావాల్సిన గాలి చాలా సహజంగా ఒక్క పల్లెటూళ్ళల్లోనే లభిస్తుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్ల ద్వారా ఆక్షిజన్ పుష్కలంగా లభిస్తుంది.
భూమి, గాలి, నీరు, నిప్పు పల్లెటూళ్ళల్లో సహజంగా ఉంటాయి.
భూమి, గాలి, నీరు, నిప్పు ఎంత సహజంగా ఉంటే, ప్రకృతి అంట ప్రశాంతంగా ఉంటుంది. భూమిపై కొన్నాళ్లు ఉండి వెళ్ళిపోయే మనిషి ప్రకృతిపై చేసే మార్పులే మనిషికి భవిష్యత్తుగా మారతాయి.
అలాంటి మనిషి కాపాడుకుంటున్న, కాపాడుకోవలసిన అంశాలలో పల్లెటూరి వాతావరణం, పశుసంరక్షణ ప్రధానమని పెద్దలు చెబుతారు. భూమి, గాలి, నీరు, నిప్పు వలననే మనిషి మనుగడ సాగుతుంది.
స్వచ్చమైన గాలి మనసుపై మంచి ప్రభావం చూపుతుంది. భూమిలో నుండి వచ్చే ఆహార పదార్ధాలు స్వచ్చంగా ఉంటే, మనిషి పూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండగలడు. స్వచ్చమైన నీరు మానవ శరీరం పోషణలో కీలకంగా ఉంటుంది.
ఈ విధంగా భూమి, గాలి, నీరు మనిషి ఆరోగ్యంపైన, మనసుపైనా కూడా ప్రభావం చూపుతాయని అంటారు.
సహజమైన ప్రక్రుతి పల్లెటూరిలో మెరుగ్గా ఉంటుంది. అందమైన పల్లెటూరు గురించి ఎంత చెప్పిన తక్కువే, ఎంత అనుభపూర్వకంగా తెలుసుకుంటే, అంత ప్రయోజనం తెలుసుకున్న వారికి ఉంటుంది.
పల్లె గురించి, పల్లె అందాల గురించి పల్లెటూరి కవితలు చెబుతాయి. గుడికి వెళ్లేముందు గుళ్ళో దేవుడి గురించి తెలుసుకుని వెళ్లినట్టు, పల్లెటూరికి వెళ్ళేముందు పల్లె గురించి తెలుసుకుంటే, ఆ వాతావరణం ఆస్వాదించగలం.
అందమైన పల్లెటూళ్ళల్లో వ్యక్తి గ్రామ జీవితం
అందమైన పల్లెలో సహజమైన ప్రక్రుతి చాలా సహజంగా ఉంటుంది. అందమైన పల్లెటూళ్ళల్లో వ్యక్తి గ్రామ జీవితం శ్రమతో కూడినది అయినా సంతృప్తికరమైనదిగా ఉంటుందని అంటారు.
ఒక వ్యక్తి కోడికూసే వేలకు నిద్రలేవడం పల్లెటూళ్ళల్లో ఉంటుంది. సూర్యోదయమునకు ముందే నిద్రలేవడం ఆరోగ్య లక్షణాలలో మొదటిదిగా చెబుతారు. అలా గ్రామంలో నివసించేవారు సహజంగా ఆరోగ్యలక్షణం పాటిస్తూ ఉంటారు.
ఇంకా గ్రామాలలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ఉంటుంది.
బంధువులు, భాందవ్యాలు బలంగా ఉండడంలో పల్లెటూరి ప్రశాంతత ప్రధానం అంటారు.
పల్లెలో నివాసం అంటే ప్రశాంతమైన ప్రకృతిలో పడుకున్నట్టే….
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుందని మీరు అంగీకరిస్తారా? అవును ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం ఒక నేస్తంలాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తాను
ఎందుకు ఒంటరిగా ఉంటే పుస్తకం ఓకే నేస్తం మాదిరిగా ఉంటుందని అంటున్నాను అంటే, పెద్దలు ఇదే మాటను ఎక్కువగా చెబుతారు. పుస్తకం వలన విషయపరిజ్ఞానం పెరుగుతుందని అంటారు.
పెద్దలు పలికే పలుకలలో పుస్తకాలు ఎక్కువగా చదవండి… అగవగాహన చేసుకోండి… విషయాలపై ఆలోచన చేయండని చెబుతారు. కావున పెద్దల మాటలను బట్టి చూస్తే, పుస్తకాలు ఒక మంచి మిత్రుడు మాదిరిగా మారతాయి.
నా దృష్టిలో నుండి చూస్తే నాకు తెలుగు పుస్తకం తెలుగు నేస్తంలాగా, ఇంగ్లీష్ పుస్తకం ఒక గుడ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. తెలుగు పుస్తకం చదివితే తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. బాగా తెలుగు తెలిసిన స్నేహితుడి మాటలు తెలుగులో అక్షరాలుగా పదాలు పేరాలలో పేరుకుపొతే అవి ఒక తెలుగు మిత్రుడి మాటలుగా నా మనసులోకి ప్రవేశిస్తున్నాయి.
ఇప్పుడు నా స్నేహితులతో లేకుండా ఒంటరిగా ఉంటే పది మంది మిత్రులు ఉన్నట్టే. ఎందుకంటే నాకు ఉన్న సబ్జెక్ట్ పుస్తకాలే నాకు మిత్రులు.
ఇంకా గ్రంధాయలం నుండి ఎరువు తెచ్చుకునే తాత్కాలిక నేస్తం అప్పుడప్పుడు పలకరిస్తుంది.
గ్రంధాలయం నుండి ఒక నాయకుడు చరిత్ర పుస్తకం అయితే ఓ పాతకాలపు నేస్తం నాకు దొరికినట్టే…
అలాగే నేటి నాయకుల చరిత్ర అయితే ఓ సోషల్ ఫ్రెండ్ ఉన్నట్టే… ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది..
తరం మారుతుంది తరతరాల సంస్కృతి పుస్తకం వలననే తరం నుండి తరానికి చేరుతుంది… అంటే పుస్తకం ఒక దీర్ఘకాలిక నేస్తమే అవుతుంది…
మంచి పుస్తకం కాలంలో ఎంతోమందికి ఓ మంచి నేస్తంగా మారుతుంది.
మంచి పుస్తకం కాలంలో ఎంతోమందికి ఓ మంచి నేస్తంగా మారుతుంది. ఎందుకంటే మంచి పుస్తకం అంటే అందరికి మక్కువ ఉంటుంది. కాలంలో కలిసిపోయిన విషయాలను పుస్తకం గుర్తుకు తేగలదు.
ఓ మంచి నాయకుడు జీవితం ఒక పుస్తకంగా మారితే, ఆ నాయకుడు కాలం చేసాక కూడా ఆయన జీవితం పుస్తకరూపంలో లోకంలో ఉంటుంది. ఆ పుస్తకం ఎంతోమందికి మంచిమిత్రుడులాగా ఉపయోగపడుతుంది.
క్రీడాలంటే ఇష్టం ఉన్నవారికి ఒక గొప్ప క్రీడాకారుడి జీవిత చరిత్ర పుస్తకం ఒక మంచి నేస్తంగానే కనబడుతుంది.
ఎవరికీ ఎలాంటి ఇష్టం అలాంటి రంగంలో పుస్తకం ఒక మంచి నేస్తంగా మారుతుంది.. కాలంలో అనేకమందితో విషయ విజ్ఞానం మిత్రునివలె పంచుకుంటుంది.
అల ఒక పుస్తకం పాఠ్యపుస్తకంగాను, జీవిత చరిత్రగాను, పురాణ కాలక్షేపంగాను ఓ మిత్రుని మాదిరిగా మనసుకు మంచిని పంచుతుంటే, మరి పుస్తకం మంచి మిత్రుడు అని ఒప్పుకోవాలి…
పుస్తకం చదవడం అంటే ఒక స్నేహితుడి అంతరంగంతో గడిపినట్టే….
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్ ఫ్రీగా లభించే మూవీస్ లిస్ట్ ఫేవరెట్ స్క్రీనులోకి యాడ్ చేసుకుని వాచ్ చేయడానికి…
తెలుగు మూవీస్ లిస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్… ఈ మొబైల్ యాప్ తెలుగు పాపులర్ మూవీస్ లిస్ట్, ఫ్యామిలి డ్రామా మూవీస్ లిస్ట్, యాక్షన్ మూవీస్ లిస్ట్…
డ్యుయల్ రోల్ మూవీస్ లిస్ట్, లవ్ స్టోరీ మూవీస్ లిస్ట్, ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీస్ మొదలైన మూవీస్ లిస్టులు డిస్ప్లే అవుతాయి. వాటి నుండి మీకు నచ్చిన మూవీస్ మీరు యాప్ ఫేవరెట్ స్క్రీనులోకి చేర్చుకోవచ్చు…
ఒక్క టచ్ తో మీకు నచ్చిన మూవీస్ లిస్ట్ ఒక ఫేవరెట్ లిస్టుగా మార్చేయండి.. అప్పటి నుండి మీరు యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి అదే లిస్ట్ కనబడుతుంది.
అవసరం లేని మూవీస్ జాబితా నుండి ఒక్క టచ్ తో రిమూవ్ చేయాయవచ్చు. ఫేవరెట్ లిస్ట్ మేకింగ్ కోసం తెలుగు ఫుల్ మూవీస్ యాప్ ఫ్రీ గా ప్లే స్టోర్ నుండి ఈ క్రింది బటన్ కు గల లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండీ.
గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా అందుబాటులో ఉన్న మూవీమాయా మొబైల్ యాప్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఇంస్టాల్ చేసి ఓపెన్ చేయగానే ఈ క్రింది ఫోటోలో ఉన్నట్టుగా మీ మొబైల్ ఫోనులో స్క్రీన్ ఉంటుంది.
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్
పైన ఫోటోలో మాదిరిగా మూవీమాయా ఫస్ట్ ఓపెన్ ఉంటుంది. పైఫోటోలో తెలుగు మూవీస్ లిస్ట్ వివిధ కేటగిరీలలో లింక్ చేయబడి ఉంటాయి.
మీరు క్లిక్ చేసిన కేటగిరీలో తెలుగు ఫుల్ లెంగ్త్ మూవీస్ లిస్ట్ ఉంటుంది. ఆ మూవీస్ పై లవ్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ పై క్లిక్ చేయగానే, సదరు సింబల్ కలిగిన మూవీ ఇదే యాప్ లో ఫేవరెట్ స్క్రీనులోకి జోడించబడుతుంది.
ఛత్రపతి సినిమాపై గల ఫేవరెట్ సింబల్ పై క్లిక్ చేయగానే ఛత్రపతి సినిమా వీడియో లింకుతో సహా ఫేవరెట్ స్క్రీనులోకి వస్తుంది. ఈ క్రింది ఫోటోలో మాదిరిగా….
పైన గల చిత్రంలో ఛత్రపతి సినిమా వీడియొ యాడ్ చేయబడింది… క్రిందగా “+” సింబల్ చూడండి. దానిపై క్లిక్ చేస్తే మరలా కేటగిరీల లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో ఉన్న సబ్ లిస్టుల నుండి మరొక సినిమా ఫేవరెట్ స్క్రీనుకు యాడ్ చేయవచ్చు.
అలాగే మరొక కేటగిరీలోని స్నేహం కోసం అనే చిరంజీవి సినిమాపై గల ఫేవరెట్ సింబల్ పై టచ్ చేయగానే, ఆ సినిమా కూడా ఫేవరెట్ స్క్రీనులోకి జోడించబడుతుంది.
ఇప్పుడు ఇంతకుముందు యాడ్ చేసిన ఛత్రపతి సినిమా దిగువగా స్నేహం కోసం సినిమా లింకు వీడియో కూడా జోడించబడుతుంది. ఈ క్రింది స్క్రీన్ చూడండి.
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్
చూసారా పై ఫోటో ఉన్నట్టుగా ఎన్ని సినిమా వీడియోలు అయిన ఫేవరెట్ స్క్రీనులోకి యాడ్ చేసి, తిరిగి యాప్ ఓపెన్ చేయగానే, మీరు ఎంచుకున్న సినిమాల లిస్టుతో యాప్ ఓపెన్ అవుతూ ఉంటుంది.
కేవలం “+” సింబల్ పై టచ్ చేసి యాప్ లో గల కేటగిరిస్ వాటిలో గల సినిమా లిస్టులను చూడవచ్చు.
మీరు చూసిన మూవీస్ మూవీమాయా యాప్ ఫేవరెట్ లిస్ట్ నుండి తొలగించవచ్చు. పై ఫోటోలో గమనించండి. డిలీట్ సింబల్ ఉంది. ఆ డిలీట్ సింబల్ పై టచ్ చేయగానే, సదరు మూవీ ఫేవరెట్ స్క్రీను నుండి రిమూవ్ అవుతుంది. మీరు ఫేవరెట్ స్క్రీనునుండి అన్నీ మూవీస్ రిమూవ్ చేస్తే, యాప్ లో గల ఫేవరెట్ స్క్రీన్ ఈ క్రింది ఫోటోలో మాదిరిగా ఉంటుంది.
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్
పై ఫోటోలో మరలా + గుర్తుపై టచ్ చేస్తే మరలా మూవీ కేటగిరీల స్క్రీన్ వస్తుంది. ఈ క్రింది ఫోటో మాదిరిగా….
ఈ పైన ఉన్న ఫోటోలో యాక్షన్ మూవీస్ లిస్ట్, లవ్ స్టోరీ మూవీస్ లిస్ట్, డ్యుయల్ రోల్ మూవీస్ లిస్ట్, పాపులర్ మూవీస్ లిస్ట్, ఫ్యామిలి డ్రామా మూవీస్ లిస్ట్, ఇంకా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రాజేంద్ర ప్రసాద్… తదితర హీరోల మూవీస్ లిస్ట్ కలవు. ఆయా లిస్టుల నుండి మీకు నచ్చిన మూవీని ఫేవరెట్ స్క్రీనులోకి జోడించవచ్చు… తిరిగి తొలగించవచ్చు.
క్రింది లిస్టులలో గల సినిమా ల లిస్టు స్క్రీనులు కొన్నింటిని చూడండి.
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ ఫ్రీ ఆండ్రాయిడ్ డౌన్ లోడ్ చేయడానికి ఈ క్రింది బటన్ పై క్లిక్ చేయండి.
లోన్ తీసుకోవడం తిరిగి చెల్లించడం అవసరాలు ఆలోచనలు ఎలా ఉంటాయో గమనించుకోవడం మనకు మనం మేలు చేసుకోవడం అంటారు.
అవసరం లోన్ గురించి తెలుగులో వ్యాసం. అవసరానికి తగినంత డబ్బు లేనప్పుడు లోన్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. తిరిగి చెల్లించడం కష్టం కాకుండా చూసుకోవడం ప్రధానం.
అటువంటి ప్రయత్నం చేసేటప్పుడు మనసులో గుర్తు ఉంచుకోవలసిన ఆలోచన… ఎందుకంటే ఆలోచనే మనసును మరింత ముందుకు నెడుతుంది.
లోన్ తీసుకునేటప్పుడు ఆలోచన, అవసరాలకు అనుగుణంగా లోన్ తీసుకోవడం ప్రధానం అయితే, తిరిగి చెల్లించడంలో ఉన్న సాధ్యాసాధ్యాలు గమనిచడం అంతకన్నా ప్రధానం.
నియంత్రణ గల మనసు పొరపాటుకు తావులేకుండా ఉండగలుగుతుంది. లోన్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు తగు ఆలోచన అవసరం అంటారు.
లోన్ తీసుకోవడం తేలిక కానీ తిరిగి చెల్లించడం కష్టం. తీసుకునేటప్పుడు ఉండే ఆసక్తి కట్టేటప్పుడు కనబడదని కొందరంటారు. కేవలం లోన్ చెల్లించడంలో ఒక్కసారి అశ్రద్ధ మొదలైతే ఇక అంతే, ఆ లోన్ పూర్తయ్యేవరకు మనశ్శాంతి ఉండదు.
ఎందుకు లోన్ తీసుకుంటాము అంటే అవసరం కోసం లోన్ తీసుకుంటాము. ఒక వస్తువు కొనడానికి లేదా ఒక కార్యక్రమము చేయడానికి లోన్ తీసుకుంటాము లేదా ఒక కట్టడము కట్టడానికి లేదా ఒక వాహనము కొనుగోలు చేయడానికి లోన్ వైపు వెళ్తూ ఉంటారు.
ఒక వస్తువు లేదా ఒక వాహనం కొనడానికి మన దగ్గర తగినంత ధనం లేనప్పుడు అదనపు ధనం కోసం లోన్ వైపు ఆసక్తి కనబరుస్తము.
అలాగే ఒక కట్టడం కట్టడానికి సరిపడా సొమ్ములు లేనప్పుడు కూడా మనం లోన్ వైపు మొగ్గు చూపుతాము.
ఇంకా ఏదైనా కార్యక్రమము జరపించడానికి కూడా తగినంత ధనం లేకపోతే లేదా గ్రాండుగా కార్యక్రమం జరిపించాలని తలిస్తే, లోన్ వైపు ఆసక్తి చూపుతాం.
వీటిలో సహజంగా వస్తువుల కోసం తీసుకునే లోన్స్ తిరిగి చెల్లింపులు బాగానే చేయగలం. ఎందుకంటే వస్తువు వాడకం మనకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి వస్తువు ఉపయోగం కనబడడంతో మనసు తృప్తిగానే ఉంటుంది.
కార్యక్రమం కోసం లోన్ తీసుకుంటే
కాని ఒక్కోసారి ఏదైనా కార్యక్రమం కోసం లోన్ తీసుకుంటే, లోన్ తీసుకునేటప్పుడు ఆసక్తి ఉంటుంది. కార్యక్రమం అయిపోయాక ఆ విషయం గురించి మరుపు మనసుకు ఉంటుంది. కానీ లోన్ తీరేవరకు మాత్రం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడో జరిగిన కార్యక్రమం మరిచిన మనసు మాములుగానే అశ్రద్ధను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.
కార్యక్రమం గురించి అయితే లోన్ తీసుకోవడం కన్నా తక్కువలో తక్కువ ఉన్న డబ్బులతోనే సదరు కార్యక్రమం నిర్వహించడం శ్రేయష్కరం అంటారు.
తాహతుకు మించి కార్యక్రమం తలపెట్టడం కన్నా, ఉన్నంతలో సర్దుకుని కార్యక్రమం తృప్తిగా నిర్వహించడం ఉత్తమమని పెద్దలంటారు.
ఇక వస్తువులు వీలైనంతలో చేతిలో ఉన్న సోమ్ములకు సరిపడా వస్తువునే ఎంచుకోవడం ఉత్తమమైన ఆలోచనగా పెద్దలు చెబుతారు.
ప్రారంభంలో ఉండే ఆసక్తి అంత్యములో ఉండదు. కాబట్టి ప్రారంభంలో మోజు కన్నా అవసరం గుర్తెరిగితే, ప్రారంభంలో ఉండే మనోస్థితి అంత్యములోనూ ఉంటుంది. ఈ విధానంలో ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం లేక వస్తువు కొనుగోలు వ్యవహారాలు నిర్వహించ తలిస్తే, అప్పులు లేక లోన్స్ వైపు ఆసక్తి ఉండదు.
తప్పని సరి పరిస్తితిలో లోన్ తీసుకుంటే, అందుకు తగ్గట్టుగా రాబడి పధకం మన దగ్గర ఉండాలి. లేకపోతే తీసుకున్న లోన్ తిరిగి చెల్లించలేక బాధపడాలి.
వస్తువు మీద ఆసక్తికి అధిక ఆలోచన తోడైతే, ఆ వస్తువుపై మోజు పెరుగుతుంది. మోజు పడ్డ మనసు వస్తువుకు లొంగుతుంది… అటువంటి ఆలోచనను ఆరంభంలోనే తుంచేయడం శ్రేయస్కరం అని పెద్దలంటారు.
లోన్ తీసుకోవడానికి ప్రధాన కారణం అవసరం అయితే, అది భవిష్యత్తులో భారం కాకుండా చూసుకోవడం విజ్ఞులు చేసే మంచి పని అంటారు.
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ, పరోక్షంగా ఆరోగ్యపరంగా సామజిక సేవ కూడా అవుతుంది.
పరిశుభ్రత మనిషి ఆరోగ్య సూత్రాలలో ప్రధానమైనది. మనిషి తన వంటికి పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే తన నివాసం పరిశుభ్రతగా ఉంటుంది.
తను ఆరోగ్యంగా ఉండడం తన ప్రధాన అవసరం అయితే, తన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచడం సామజిక అవసరం.
తన గురించి తన చుట్టూ ఉండే వారి గురించి పరిశుభ్రతను పాటిస్తే, ఒక సామజిక బాద్యత నిర్వహించిన వారవుతారు. మనిషి ఆరోగ్యం పరిశుభ్రత ఆధారంగా ప్రభావితం అవుతుంది. పరిశుభ్రత గల ప్రదేశంలో పరిశుభ్రతతో ఉన్న శరీరంతో పరిశుభ్రతమైన ఆహారం తీసుకోవడం కుటుంబ ధర్మాలలో ఒక్కటిగా ఉంటుదని అంటారు.
ఒక మనిషి తన పరిశుభ్రతతో బాటు పరిసరాల పరిశుభ్రత కచ్చితంగా పాటిస్తే అది సమాజం పట్ల తన కర్తవ్యమ్ నిర్వహించినట్టే అవుతుంది. అలాగే సామాజిక పరిశుభ్రత కోసం కృషి చేయడంతో సామజిక సేవ చేసినట్టే అవుతుంది.
వ్యక్తీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలలో ఉండే పరిసరాలు అంటే అవి నివసించే ఇల్లు, తిరిగే దారులు, పనిచేసే కార్యాలయాలు, నేర్చుకునే స్థలాలు, చదువుకునే విద్యాలయాలు ఇలా అనేక రకమైన పనులలో అనేక రకాలుగా పరిసరాలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి.
ఇల్లు పరిశుభ్రతతో ఉంటే, ఆ ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది.
ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అంటువ్యాది వస్తే, అది ఆ ఇంట్లో అందరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు పరిసరాలలో పేరుకుపోయిన చెత్త వలన క్రిములు పెరిగి, ఆ క్రిముల వలన వ్యాధులు పెరిగే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి అంటువ్యాధులు నివారణకు ముందుగానే పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవడం మనిషిగా కనీస సామజిక బాధ్యతగా చెబుతారు.
చదువుకునే విద్యార్ధులు ఉండే విద్యాలయాలు పరిశుభ్రతగా లేకపోతే ఆ పరిసరాలలో ఏర్పడే సూక్ష్మజీవుల వలన అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని విద్యాలయాల కార్యవర్గం, విద్యాలయాలలో ఉండేవారు, విద్యార్ధులు కూడా అందరు ఆయా విద్యాలయాల పరిసరాల పరిశుభ్రత గురించి శ్రద్ధ తీసుకుని పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలి.
పరిశుద్దమైన ఆహారం, పరిశుద్ధమైన పానీయం తీసుకోవడం వ్యక్తిగా అందరికి ఆరోగ్య నియమలుగా చెబుతారు. ఒక వ్యక్తి ఆరోగ్యం మరొక వ్యక్తిపై పడుతుందని కరోన వైరస్ కారణంగా అందరికి తెలిసి వచ్చింది. ఆరోగ్యం చెడినవారికి కరోన వైరస్ త్వరగా వ్యాపించి, వారిద్వారా మరింతమందికి కరోన సోకినా ఘటనలు ప్రపంచంలో గత ఏడాది నుండి జరిగాయి.
ఈ కరోనా వైరస్ కారణంగా పారిశుధ్యం, ఆరోగ్యం పరిశుభ్రత, పరిశుభ్రత నినాదాలు పెరిగాయి. పారిశుధ్యంతో కూడిన ఆహారం తీసుకుంటే, వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే, అంటువ్యాధులు త్వరగా సోకవు. లేకపోతే అంటువ్యాధులు ప్రభాలుతాయి. కావున వ్యక్తి తన ఆరోగ్యపరిరక్షణ చేసుకోవడం పరోక్షంగా సామజిక పరిరక్షణ కూడా చేసినట్టే అవుతుంది.
బలమైన వ్యక్తికీ బరించే బలం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేవారు వైరస్ బారిన పడకుండా తమనుతాము రక్షించుకుంటూ ఇతరులను అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడినవారవుతారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం అంటే, సమాజాన్ని ఆరోగ్యపరంగా రక్షించినవారమవుతాము.
పనిచేసే కార్యాలయాలలో, పని చేసే కర్మాగారాలలో ఆయా పరిసరాల పరిశుభ్రతను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఒక కార్యాలయంలో కానీ ఒక కర్మాగారంలో కాని వ్యక్తికి అంటువ్యాధి సోకితే, వారి ద్వారా, వారి చుట్టూ ఉన్నవారికి ఇంకా వారి వారి కుటుంబ సభులకు కూడా అంటువ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటువ్యాధులు ప్రభాలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన కర్తవ్యం అందరిపైన ఉంటుంది.
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ తద్వారా ఆరోగ్యపరంగా సామజిక సేవ కూడా అవుతుంది.
శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం చదవండి.
అర్జునుడికి భగవంతుడు బోధించిన బోధ కాబట్టి భగవద్గీత అన్నారు. అటువంటి భగవద్గీత పరమ పవిత్రమైనది. కోర్టులలో కూడా సాక్ష్యం తీసుకునేటప్పడు భగవద్గీతపైనే ప్రమాణం చేయిస్తారు. ఆత్మసాక్షాత్కరం, జ్ఙాన మార్గం, కర్మయోగం, భక్తి మార్గం అంటూ భగవానుడి బోధ కనబడుతుంది. నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి మనసుకు వారికే తెలియాలి. ఎందుకంటే? భగవద్గీత చదవాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది వారి మనస్సాక్షికే ఎరుక.
తన కర్తవ్యం తాను చేసుకుంటూ, రాగధ్వేషాలకు అతీతంగా జీవించేవారు కర్మయోగి అంటారు. అలాంటివారికి ఏ గీతాపాఠం అవసరంలేదు… జీవితాన్ని వారు సాధించుకుంటారని అంటారు.
వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి చుట్టూ ఏర్పడిన సామాజిక పరిస్థితులు, అతనికి పరిచయమై ఉన్న వ్యక్తులు, అతనిపై ప్రభావం చూపగలుగుతాయి. కారణం అతను కూడా తనచుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేసి ఉంటాడు. ప్రకృతిలో చర్యకు ప్రతిచర్య ఉంటుంది… కదా.
అలా ఒక వ్యక్తి తన దరిదాపులలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి. తనపై ఆధారపడినవారికి అనుగుణంగా నడుచుకోవాలి.. తనపై పెత్తనం చెలాయించేవారి మాటను మీర కూడదు… ఇలా ఒక వ్యక్తికి బంధనాలు ఏర్పడి ఉంటాయి..
తన ఇష్టంతో ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి పనులు చేయవలసి ఉంటే, అది అతని మనసుకు ఇబ్బందికరమే. ఇలాంటి పరిస్థితులు మానసికమైతే…
శారీరక రుగ్మతలు, శారీరక గాయాలు ఏవైనా మరలా మనిషి మనసును బాధించవచ్చును. ఇంకా కుటుంబ జీవనంలో తనతోటి వారి ఆరోగ్యం వ్యక్తి కష్టంగా మారవచ్చును. వ్యక్తి తన చుట్టూ ఉన్నవారిచేత ప్రభావితం కాబడతాడు.
అంతర్లీనంగా మనసు చేసే బోధకు బుద్ది వశం అయితే
అలాంటప్పుడు అంతర్లీనంగా మనసు చేసే బోధకు బుద్ది వశం అయితే, తప్పులు చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తి బుద్ది ఎప్పుడూ కర్తవ్యతా దీక్షతో ఉండాలని అంటారు. కానీ మనసు మాత్ర కలత చెందితే, అది బుద్దిపైనే ప్రభావం చూపుతుంది.
మనసు బుద్దిని లోబరుచుకోవాలని చూస్తుంటుంది. మనసు ఆలోచనలు చేస్తూ, తనకు తాను మేలు చేసుకోవగలదు… తనకు తానే చేటు చేసుకోగలదు.
వ్యక్తి మనసు దృఢంగా ఉంటే, వ్యక్తి బలమైన సంకల్పంతో మంచి మంచి విజయాలు అందుకోగలడు. కానీ మనసు చంచలంగా ఉంటే మాత్రం వ్యక్తి ఆశయ సాధనలో వెనకబడతాడు.
ఒక వ్యక్తికి కష్టం కాలంలో తన చుట్టూ ఉన్నావారి వలన కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితుల వలన కానీ కలగవచ్చును. కానీ కష్టంలో కూడా ఓర్పుతో ఉండి, బుద్దిని మనసుకు లొంగకుండా చూసుకున్నవారే విజేతలు అంటారు.
మనసు మనిషిపై ప్రభావం చూపుతూ బుద్దిని ప్రభావితం చేయగలదు. అటువంటి మనసుకు మందు భగవద్గీత అంటారు.
ఎందుకంటే ఏదైనా పురాణం చదివితే భక్తి భావన బలపడుతుంది. భగవద్గీత చదివితే, తనపై తనకు పరిశీలన ఏర్పడుతుందని అంటారు. భగవద్గీత చదవడం వలన సమాజంలో తన మనోప్రవృత్తి ఎలా ఉందో వ్యక్తికి అంతర్లీనంగా అవగతమవుతుందని అంటారు.
బుద్ది బ్రంశం చెందకుండా ఉండడానికి మనసుపై మనసు యుద్దం చేయడానికి భగవద్గీత పఠనం ఉపయోగపడుతుందని అంటారు.
భగవద్గీతలో భక్తితో బాటు మనోవిజ్ఙానం ఉంటుంది.
మనిషికి దారి తెలిస్తే, చేరవలసిన గమ్యానికి చేరుకుంటాడు. అలా మనిషిలో దారి తెలిసేది ఎవరికి? దారి తెలుసుకోవాలనే సంకల్పం చేసేదెవరు? ఎలా వెళ్ళాలి? అని ప్రశ్నించుకునేది, ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాదాణం మనసు అంటారు.
మనసు మనసునే ప్రశ్నించడమే అంతరంగంలో సంఘర్షణ అంటారు.
ఒక వస్తువు ఎలా వాడాలి? ఒక వస్తువు ఉపయోగించే విధానం ఏమిటి? ఒక వస్తువు వలన కలిగే ప్రయోజం ఏమిటి?… వ్యక్తి ఒక వస్తువును ఉపయోగించాలనుకున్నప్పుడు, ఇలాంటి ప్రశ్నలు ఎక్కడ పుడతాయో అదే అంతరంగం.
అలాంటి అంతరంగంలో సంకల్ప వికల్పాలతో దోబూచులాడేదే మనసు అంటారు.
అంటే గమ్యం చేరడానికి దారి తెలిస్తే, వ్యక్తిని గమ్యం వైపు అడుగులు వేసే వ్యక్తిలో ఉండేది మనసే.
అలాగే వస్తువు వాడుక విధానం తెలిసిన వ్యక్తిలో వస్తువును ఉపయోగించాలనే తలంపులు తట్టి లేపేది… మనసే.
ఇలా తెలిసిన విధానంతో పనులు చేయించగలిగే మనసుకు, తన గురించి తనకే తెలిస్తే…
ముందు తనను తాను పరిశీలన చేసుకుంటుంది.
తన తప్పులను గుర్తిస్తుంది
తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది…
అలా తనపై తనకు పరిశీలన చేసుకునే శక్తి సత్సంగం వలన కలుగుతుందని అంటారు. అలాంటి సత్సంగంలో బాగమే భగవద్గీత…
భగవద్గీత చదివితే మనోవికాసం ఏర్పడుతుందని అంటారు. మనసుపై బుద్దికి పట్టు ఉంటుందని అంటారు.
క్లిష్ట సమయాలల స్పందించాల్సిన మనసుకు మంచి మార్గం చూపించగలిగే శక్తి భగవద్గీతలో ఉందని అంటారు. అందుకే భగవద్గీతను చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటారు.
అర్జునుడి విషాదం కలిగినప్పుడే భగవద్గీత పుట్టింది… మనిషికి విషాదం కలిగనప్పుడే కృంగిపోతాడు… కానీ భగవద్గీత పఠనం మనిషి మనసుకు బలాన్ని అందిస్తుందని అంటారు.
శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? అను శీర్షికకు వ్యాసం పూర్తయింది.
సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021 sankranthi subhakankshalu quotes 2021
భోగినాటి భాగ్యం దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ వాకిలి సంక్రాంతి ముగ్గులతో మీ మనసు ముత్యాల నవ్వులతో ఉప్పొంగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు…
సంక్రాంతి వస్తుంది… తెస్తుంది సంతోషాల చిరుజల్లు… ఆ చిరుజల్లులలో మీకుటుంబం తడిసి సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
సంవత్సరంలో వచ్చే పెద్ద పండుగ, వస్తూ వస్తూ మీకు సకలైశ్వర్యములు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ మీకు మీ బంధు మిత్రులు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
మీ లోగిలి అంతా ముగ్గులమయంతో నిండాలి. మీ మనసంతా ఆనందమయం కావాలని కోరుకుంటూ మీకు మీ బంధు మిత్రులకుభోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
వస్తే వాయినం ఇస్తా, ఉంటే ఊరంత పందిరివేసి పండుగ చేస్తాం… పెద్ద పండుగలో బంధుమిత్రులతో కలిసిమెలిసి సంతోషం పంచుకోవాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
బంగారం ధర భోగిమంటలు వలె పైపైకి, ఎంత పైపైకెగిరిన బంగారం అయిన బంగారంలాంటి మనసు మందు తేలిపోతుంది… అటువంటి బంగారంలాంటి మనసు కలిగిన మిత్రమా నీకు నీకుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు…
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో ఇమేజ్
కరోనా కారణంగా కలవకపోవచ్చును… కానీ మనసు వేదికగా జరిగే పండుగలో వేదికంతా మీరే… నామనసే మీ పండుగకు వేదిక అవ్వడానికి వెయిట్ చేస్తుంది… మీకు మీ బంధుమిత్రలకు సంక్రాంతి శుభాకాంక్షలు…
ఆలోచనకు హద్దు ఉండదు, పెద్ద పండుగ ఆనందానికి అవధులు ఉండవు… ఆ ఆనందములు మీకు మీ కుటుంబసభ్యులకు కలకాలం కలగాలని మనసావాచా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.
సంక్రాంతిలో కాంతి ఉంది.. నీమనసులో కాంతి అనేకమందికి మార్గదర్శకమైంది… మిత్రమా నీవున్నచోట నిత్యమూ సంక్రాంతే… నీకు నీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
వచ్చే… వచ్చే… వాన ఆగితే ఆనందం… మండే… మండే… ఎండ చల్లబడితే సంతోషం… వచ్చే వచ్చే సంక్రాంతి సంతోషం… సంక్రాంతి వచ్చి వెళ్ళాక కూడా కొనసాగాలని కోరుకుంటూ… మీకు మీ బంధు మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ప్రతి పండుగలో మనకు సంతోషంతో సాగుతుంది… పెద్ద పండుగకు పెద్దలను సంతోష పెట్టామనే తృప్తితో సాగుతుంది… అంత గొప్పదైన సంక్రాంతి.. మీకు మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలను అందించాలని ఆశిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరిన్ని కోట్స్
పంచితే పెరిగేది ప్రేమ అయితే, పంచుకునేవారందరూ కలిసేది పెద్ద పండుగకే, సంక్రాంతి వస్తుంది… బంధువులను కలుపుతుంది… మీకు మీ బంధుమిత్రుల బంధుమిత్రులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు…
రైతుకు పండుగే, రైతు పండించే పంటను తినే మనకు పండుగే అందరికీ ఆనందాలను అందించే సంక్రాంతి నుండి మీ ఇల్లు నిత్య సంక్రాంతి వలె వెలగాలని కోరుకుంటూ…. మీకు మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు…
గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. దేశంలో స్వాతంత్ర్యం గురించి జరుగుతున్న సమరంలో అందరి భారతీయులను ఒకతాటిపైకి తీసుకువచ్చి, భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయత్వం వహించారు. సత్యము, అహింస, సహాయ నిరాకరణ వంటి ఆయుధాలతో స్వాతంత్ర్య పోరాటం జరిపించిన దేశ నాయకుడు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో కృషి చేసినవారిలో అగ్రగణ్యుడు…
మోహన్ దాస్ కరంచంద్ 1869సంవత్సరంలో ఆక్టోబర్ నెలలో 2వతేదీన గుజరాత్ రాష్ట్రంలో ఫోర్ బందర్లో జన్మించారు. తండ్రి పేరు కరంచంద్ గాంధీ, పుతలీభాయి… వారిది ఆచారాలు పాటించే సభ్యకుటుంబము.
గాంధీ బాల్యం నుండి అబద్దాలకు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు. అప్పటి ఆచారము ప్రకారము 13ఏండ్ల వయస్సులోనే గాంధీకి కస్తూరిబాయితో పెండ్లి జరిగింది. వీరికి నలుగురు కుమారులు. గాంధీ నలుగురు కుమారుల పేర్లు హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ..
పోర్ బందర్, రాజ్ కోట్ లలో విద్యాభ్యాసం చేసిన గాంధీ 1888సంవత్సరంలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించడానికి ఇంగ్లాండ్ వెళ్లారు. విదేశాలకు వెళ్ళినా, వ్యసనాలకు దూరంగా ఉండడం గాంధీకే చెల్లింది. ఇంకా అనేక మతగ్రంధాలను అయన పఠించారు. న్యాయవాద పట్టభద్రుడైన గాంధీజి 1891సంవత్సరములో తిరగి స్వదేశానికి వచ్చారు.
1893సంవత్సరంలో మరలా విదేశానికి వెళ్లారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఒక లా కంపెనీలో జాయిన్ అవ్వడానికి సౌతాఫ్రికా వెళ్లారు. ఇక్కడే ఈకాలంలోనే గాంధీజి మార్పుకు బలమైన పునాదులు పడ్డాయని అంటారు. నల్లవాడు అని రైలు నుండి గెంటివేయబడిన సంఘటన గాంధీజి జీవితంలో జరిగింది. ఇంకా హోటళ్ళలోకి కూడా రానివ్వకపోవడం. అక్కడి సామాజిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడం, సమస్యలను ఎదుర్కొనే పోరాటపటిమను పెంచుకోవడం ఈకాలంనే వృద్ది చేసుకున్నట్టుగా చెబుతారు.
గాంధీజి ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంధం భగవద్గీత అంటారు.
స్వాతంత్ర్య సమరంలోకి గాంధీ
1914సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజి భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో పొల్గొనడం ప్రారంభించారు. ఆనాటి ప్రధాన నాయకులలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే, గాంధీకి భారత సమస్యలు, ఇక్కడి రాజకీయాలను పరిచయం చేశారు.
అహింసయే పరమధర్మంగా భావించిన గాంధీ, తను నమ్మిన సిద్దాంతముననుసరించే స్వాతంత్ర్య ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా సత్యాగ్రహం చేయడం వంటివి ఉన్నాయి. సహాయనిరాకరణోధ్యమం, ఉప్పుసత్యాగ్రహం, స్వరాజ్యము, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలు కీలకంగా మారాయి. దేశప్రజలనుండి విశేషమైన స్పందన కూడా లభించింది. అలాగే సమాజంలో ఉన్న దురాచారాలను ఖండించడం కూడా చేసేవారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో బాగంగా గాంధీజి జైలు జీవితం కూడా అనుభవించారు. 1922 సంవత్సరంలో రెండేళ్ళు జైలులోనే గాంధీజి జీవితం సాగింది. ఈకాలంలోనే భారతీయ కాంగ్రెసులో అతివాద, మిత్రవాద వర్గాలు మద్య భేదబావం మరింత పెరిగింది. ఆ తర్వాత గాంధీజి మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో పాల్గొన్నారు.
1927వ సంవత్సరంలో గాంధజీ సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ, స్వరాజ్య ఉద్యమంలోనూ తనదైన పాత్రను నిర్వహించారు. దేశప్రజలను ఉద్యమాల బాట పట్టించిన నాయకులలో గాంధీ ప్రముఖ పాత్ర ఉంది. అందుకు తగ్గట్టుగా మార్గద్శకంగానే గాంధీజి నడుచుకునేవారు.
జాతి పిత గాంధీ గురించి ఉద్యమాలే బాగా వివరిస్తాయి.
ఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ దేశం చేపట్టిన ఉప్పుసత్యాగ్రహోద్యమం సమయంలో గాంధీజి దాదపు 400 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు. అహ్మదాబాద్ నుండి దండివరకు ఆయన పాదయాత్ర కొనసాగింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రతరం కావడంతో గాంధీతో సహా కాంగ్రెస్ కార్యవర్గం అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన సహదర్మచారిని కస్తూరిబాయి పరమపదించారు. 1944లో గాంధీజి జైలు నుండి విడుదలయ్యారు.
చివరకు బ్రిటిష్ వారు శాంతియుత స్వాతంత్ర్య సమరానికి తలొంచి స్వాతంత్ర్యం ఇవ్వడానికి అంగీకరించారు. అయితే స్వాతంత్ర్యం ఇచ్చేముందు హిందూ, ముస్లింలకు వేరు వేరు ప్రాంతాలుగా స్వాతంత్ర్యం ఇవ్వడానికి చూడడం గాంధీజికి నచ్చలేదు… కానీ చివరకు హిందూ, ముస్లింల ప్రాతిపదికనే రెండు దేశాలుగా భారతదేశం స్వాతంత్ర్యం గాంధీ నాయకత్వంలో వచ్చింది.
స్వాతంత్ర్యం వచ్చాకా గాంధీజిని గాడ్సే కాల్చి చంపడంతో ఆయన పరమపదించారు. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం మన ముందు తరాలవారీ జీవితాల త్యాగ ఫలితం అని గాంధీజి జీవితాన్ని చూస్తే అర్ధం అవుతుంది.
డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన శైలితో అమెరికన్లను ఆకట్టుకున్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా పదవి చేపట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ వ్యాపారవేత్త…. వ్యాపారవేత్తగా ఎదిగాకా రాజకీయాలలోకి వచ్చి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు…
డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటనలు చేయడం వార్తలలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకీ, డొనాల్డ్ కు మద్య స్నేహపూర్వక సంబంధం పత్రికల ద్వారా తెలియబడుతుంది.
ప్రపంచంలో అగ్రరాజ్యం అయిన అమెరికా అధ్యక్షులు ఎవరూ కూడా గతంలో ఇంత స్థాయిలో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్టగా లేదు..
తాజాగా డొనాల్డ్ ట్రంప్ 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్ చేతిలో పరాజయం పాలైనారు. తత్ఫలితంగా ఈయన అమెరికా పదవి నుండి తప్పుకోనున్నారు… అయితే ఈయన ఈ పదవి నుండి తప్పుకోవడంలో కూడా అమెరికాలో కొన్ని ఘటనలు వార్తలోకెక్కడం విశేషం.
ట్రంప్ జీవితం
డొనాల్డ్ ట్రంప్ 1946వ సంవత్సరంలో జున్ నెలలో 14వ తేదీన, ఫ్రెడ్ ట్రంప్- మేరీ అన్నా మెక్లాయిడ్ దంపతులకు జన్మించారు. డోనాల్డ్ ట్రంప్ జన్మించిన నగరం న్యూయార్క్ నగరం. ట్రంప్ తండ్రి జర్మనీవాసి అయితే.. తల్లి స్కాట్లాండ్ వాసి…
డొనాల్డ్ ట్రంప్ బాల్యం, విద్యాభ్యాసం న్యూయార్క్లోనే పూర్తయ్యాయి. ఆ తరువాత ఆయన అమెరికాలోనే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు చదివారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్లూన్ స్కూల్ నుండి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
ట్రంప్ మొదట్లో తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుటుంబ సంస్థ ఎలిజబెత్ అండ్ సన్స్లోనే ప్రారంభించారు. ట్రంప్ తొలి ప్రాజెక్టును తన తండ్రితో కలిసి పూర్తి చేశారు.
ఆయన వ్యాపార పగ్గాలను స్వీకరించగానే 1971లో కంపెనీ పేరును ది ట్రంప్ ఆర్గనైజేషన్గా మార్చేశారు. ఇంకా ఆ ఆఫీసును కూడా మాన్హట్టన్కు మార్చారు. ట్రంప్ 1978సంవత్సరంలో అక్కడ గ్రాండ్ హయత్ హోటల్ను నిర్మించారు.
ఇంకా అమెరికాలోనే ఆయన పలు ప్రముఖ భవనాలు నిర్మించారు. అందులో బాగంగా ట్రంప్ ఓషన్ క్లబ్, ట్రంప్ టవర్, సెంట్రల్ పార్క్లోని వూల్మాన్ రింక్ హోటల్ ఉన్నాయి. ఆపై ట్రంప్ ప్లాజా హోటల్, అట్లాంటిక్ సిటీలోని తాజ్మహల్ కేసినోలను కొనుగోలు చేశారు.
క్రీడాలు అందాల పోటీలు ప్రమోషన్ చేసిన డొనాల్డ్ ట్రంప్
ఈయన కేవలం కేవలం వ్యాపరమే కాకుండా క్రీడలు, అందాల పోటీలను కూడా అద్భుతంగా ప్రమోట్ చేశారు. 1996 నుంచి 2015 వరకు జరిగిన అందాల పోటీలలో మిస్ యూనివర్స్, మిస్ యూఎస్ఏ, మిస్టీన్ యూఎస్ఏ పోటీలను ట్రంప్ ప్రమోట్ చేశారు. ఆ క్రమంలోనే ఎక్కువ సార్లు మిస్వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలను ప్రమోట్ చేసినవారిగా ట్రంప్ ఉన్నారు.
వ్యాపారం, క్రీడల ప్రచారం, అందాల పోటీల ప్రమోషన్ చేయడమే కాకుండా ఈయన రాజకీయాలలో కూడా ప్రవేశించారు. ఈయన రాజకీయ ప్రస్థానంలో పలు పార్టీలు మారడం జరిగింది. మొదట్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలిచారు.
ఆ తర్వాత ఆయన రిఫార్మ్ పార్టీ వైపు మొగ్గు చూపారు. మరలా మూడేళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ పార్టీలో చేరారు. 2001సం|| నుండి 2008సం`|| వరకు ఆయన డెమొక్రాట్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత ఆయన జాన్ మెక్కెయిన్ను అధ్యక్ష అభ్యర్థిగా బలపరుస్తూ రిపబ్లికన్ పార్టీలోకి వచ్చారు. అప్పటి నుండి రిపబ్లికన్ పార్టీలోనే కొనసాగారు.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్ ప్రయత్నాలు కొనసాగించారు. 1988, 2004, 2012, అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించగా.. ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు. కొన్నాళ్ల తర్వాత ఆయన ప్రయత్నాలు ఫలించాయి.
డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి
2015 జూన్ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నారు. మళ్లీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాను అనే నినాదంతో ట్రంప్ ప్రచారం ప్రారంభించారు. ఈ ఎన్నకలలో ట్రంప్విభిన్నమైనప్రచారానికి తెరతీశారు. మూడు సార్లు నిర్వహించిన జనరల్ ఎలక్షన్ డిబేట్స్లోను హిల్లరీ క్లింటన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అయినా ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రచారం కొనసాగించారు. ట్రంప్ విభిన్నమైన ప్రచారంతో, అంతిమంగా ఆయన అనుకున్నది సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా అవతరించారు.
ఆ విధంగా 2016 నుండి 2021 జనవరి వరకు 45వ అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ కొనసాగారు… డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోయే జోబైడెన్ కు పగ్గాలు అప్పజెప్పి, అధ్యక్ష పదవి నుండి వైదొలగనున్నారు…
మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు ఏనాడో మనకు తెలుగు సాహిత్యంలో తెలియజేశారు. అటువంటి తెలుగు పుస్తకాలు చదివితే, తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. మాతృభాష ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది.
మాతృభాష అయిన తెలుగు భాష గొప్పతనం గురించి మరింతగా
మన మాతృభాష అయిన తెలుగు భాషలో అనేక పద్యాలు, కవితలు, గద్యములు, తెలుగు సామెతలు, సూక్తులు, పురాణాలు ఇంకా అనేక రచనలు లభిస్తాయి.
తెలుగు భాషలో గల పద్యములందు ఉండు అర్ధములు విశేషమైన విషయమును తెలియజేస్తూ ఉంటాయి. చిన్న చిన్న పదాలతో నాలుగు లైన్లలో ఉండే ఈ పద్యాలలో ప్రతిపదార్ధము వచనంలో ఎక్కువగా ఉంటుంది. వీటి భావాలు విశేషమైన అర్ధమును తెలియజేస్తాయి.
అలాగే సామెతలు ఒక్క లైనులోనే ఉంటాయి…కానీ చాలా అర్ధవంతమైన భావమును వ్యంగ్యంగానూ, హాస్యంగానూ తెలియజేస్తాయి…
ఇంకా సూక్తులు కూడా కేవలం ఒక వ్యాక్యములోనే ఉంటాయి… కానీ భావము మాత్రము బలమైన అంతరార్ధమును కలిగి ఉంటాయి. మంచిగా ఆలోచించే శక్తి ఉండాలే కానీ ఒక సూక్తి చాలు మనసులో మార్పు రావడానికి… అంటారు.
అంటే ఇలా పద్యాలు, సూక్తులు, సామెతలు గమనిస్తే, చాలా తక్కువ పదాలతో ఎక్కువ భావమును ఇముడ్చుకోవడంలో తెలుగు భాష గొప్పదనం కనబడుతుందని అంటారు.
దైవచింతన, తత్వచింతన, సామాజిక పోకడలు ఇలా అన్నింటపైనా తెలుగు భాషలో తెలుగు పద్యాలు విశేషమైన భావాలను వ్యక్తపరుస్తాయి. ఇంకా ఇవి చాలా తక్కువ నిడివి గలిగిన వ్యాక్యాలతో ఉంటాయి… అవి కూడా మూడు వ్యాక్యాలు ఇంకా ఒక మకుట వ్యాక్యం కలిగి ఉంటాయి.
తెలుగు భాష గొప్పతనం అంతా భావప్రకటనలో, చాలా చిన్న చిన్న తేలికపాటి పదాలతో ఇమిడి ఉంటాయి. చిన్న చిన్న వ్యాక్యాలలోనే జీవిత పరమార్ధమును తెలియజేసే విధంగా ఉంటుంది.
స్వచ్ఛమైన మన తెలుగు భాష ఈనాటిది కాదు… మన మాతృభాష గొప్పతనం ఏనాడో పెద్దలు పుస్తకాల ద్వారా తెలియజేశారు…
మాతృభాష తెలుగు భాషలో పుస్తకం చదవడం
పురాణాలు మాతృభాషలో చదవగలిగితేనే, అవి అర్ధం అవ్వడం సులభం
మనకు తెలుగు ప్రాంతాలలోనే అనేక సంప్రదాయాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. కొన్ని చోట్ల ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. కొన్ని చోట్ల గతంలోని సంప్రదాయం చరిత్రలో కలిసి పోయి ఉంటుంది. కానీ రచయితల వలన మనకు మన పూర్వపు సంప్రదాయల గొప్పతనం తెలియబడుతుంది. వారు తమ రచనల ద్వారా సంప్రదాయం గురించి వ్రాసిన విషయాలు గతం గురించి వివరిస్తాయి.
వాడుక భాషలో కొన్ని మాటలు వ్యాకరణార్ధములు చూస్తే, మన తెలుగు భాష విశిష్టత ఏమిటో తెలియబడుతుంది. వ్యాకరణం తెలిసినవారికి తెలుగు భాష గొప్పతనం ఏమిటో బాగా తెలిసి వస్తుంది. అందుకేనేమో… శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలలో తెలుగు లెస్స అనుంటారు.
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం లో కొద్ది పాటి వివరణ ఇవ్వడం జరిగింది…. తెలుగు భాష గొప్పతనం అంటే తెలుగు సాహిత్యం చదివితే, తెలుగు వెలుగు రుచి తెలుస్తుంది… అది స్వయంగా చదివితేనే దాని గొప్పతనం మనకు అనుభవంలోకి వస్తుంది… అంతవరకు విన్నట్టుగానూ, చదివినట్టుగానూ మాత్రమే తెలుగు భాష గొప్పతనం గురించి తెలియబడుతుంది.
పురాణాలు, ఇతిహాసాలు తెలుగు భాషలో
తెలుగు భాష గొప్పతనం గురించి మనకు మరింత అవగాహన పురాణాలు చదువుతుంటే, బాగా తెలుస్తుందని అంటారు. పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ ఉండే సన్నివేశాలు వివరిస్తూ ఉండే పద్యాలలోని పదాలలో విశేషమైన అర్ధం కలిగి ఉంటాయి. ఆయా పదాలకు గల భావం అర్ధం అవుతుంటే, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది.
కవులు మనకు పురాణాలను, ఇతిహాసాలను తెలుగులోకి అనువదించారు. వారి కారణంగా మనం మన మాతృభాష తెలుగు భాషలోనే వాటిని చదువుకోగలుగుతున్నాము. మన తెలుగులో ఎందరో కవులు, ఎంతో సాహిత్యమును తెలుగు భాషలలో గ్రంధములుగా అందించారు. ఆయా గ్రంధములను చదవగలిగితే జీవితం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. అటువంటి జీవన ప్రాధాన్యత మనకు బాగా తెలిసిన మాతృభాష తెలుగు భాషలోనే చదివితే, త్వరగా వాటి సారం మనసుకు చేరుతుందని అంటారు.
మన పురాణేతిహాసాలు వివిధ పాత్రలు, ఆయా పాత్రల గొప్పదనం మనకు అర్ధం అయ్యేవిధంగా తెలుగు భాషలో గొప్పగా వివరించబడి ఉంటాయి. వాడుక భాషకు బాగా దగ్గరగా ఉండే పుస్తకాల వలన మనకు రామాయణ, భారత, భాగవత గ్రంధములలో వివిధ రకాల స్వభావాలు ఎలా ఉంటాయో తెలియబడుతుంది.
తెలుగు భాష చరిత్ర గురించి
తెలుగు భాష సంస్కృతం నుండి పుట్టిందని, తెలుగు భాష ద్రావిడ భాష నుండి విడివడిందని… భిన్నాభిప్రాయాలు కనబడతాయి. భాషా పండితుల అభిప్రాయం ప్రకారం తెలుగు భాష 2400 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. సాదారణంగా మనం వాడుతున్న పేపరు, దానిపై రచించిన రచనలు వ్రాయడానికి బాల్ పెన్ పుట్టింది 150 సంవత్సరాలకు లేదా అంతకన్నా ఎక్కువగా కావచ్చును. కానీ మన ప్రాచీన గ్రంధాలు సాదారణ పేపరుపై వ్రాసినవి కావు. కాబట్టి రచనలు ప్రకారం వాస్తవికతను అంచనా వేయడం కష్టమే అవుతుంది.
వాస్తవిక విషయాలు మూల గ్రంధాలు చదివితే తెలియబడుతుందని అంటారు. అవి గ్రాంధిక తెలుగు భాషలో ఉంటాయి. రచన చేసినవారి మక్కువను బట్టి కొన్ని విషయాలు రూపాంతరం చెంది గ్రంధస్తం చేయబడతాయి కాబట్టి మూల గ్రంధాలు చదివినవారికి వాస్తవ విషయాలు తెలియబడతాయని అంటారు. కావునా తెలుగు భాష ఎప్పుడు పుట్టింది అనే దాని కన్నా భాష మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఏవిధంగా మన మాతృభాషను వృద్ది చేసుకోవాలనే ఆలోచన మెరుగు.
ఎందుకు తెలుగు భాషను నేర్చుకోవాలి?
ఎందుకంటే, తెలుగు భాషలో పుట్టి పెరిగాము. మన మనోభావాలు తెలుగు పదాలలో మనకు పరిచయమే. అలాంటి పదాలతో కూడిన తెలుగు భాష వలన మనకు మనోవిజ్ఙానం బాగా అర్ధం అవుతుంది. మన సంప్రదాయంలో మనోవిజ్ఙానమే అన్నింటిలోనూ నియంత్రణతో ఉండే శక్తిని అందిస్తుందని అంటారు. అంటే మనోవిజ్ఙాన గ్రంధాలు మన మనసుపై పరిశీలన చేసినవి. అవి విలువలతో కూడిన మనోవిజ్ఙానాన్ని మనకు అందిస్తాయి. విలువలతో కూడిన వైజ్ఙానిక శాస్త్రం విషయ పరిజ్ఙానంతో బాటు, మన మనసు గురించి తెలియజేస్తాయి. తెలుగు భాషలో మనో విజ్ఙాన గ్రంధాలు చదివితే, మనసు యొక్క విశిష్ఠత, మనసు యొక్క చాంచల్యం…. వంటివి తెలుస్తాయి. ముందుగా మనసు ఒక అద్భుతమైనది… దానిని నియంత్రిస్తే చాలు, జీవితం గాడిన పడుతుందనే విషయం తెలుగు భాషలో రచించిన గొప్ప రచనలు చదవడం వలన తెలియబడుతుంది. అందుకని తెలుగు భాషను నేర్చుకోవాలి అంటారు.
తెలుగు భాష మన మనసులో వెలుగు వెదజల్లుతుంది.
జీవితానికి మార్గదర్శకత్వం వహించేవారు గురువు అయితే, ఆ గురువులుగా మొదటి తల్లిదండ్రులు తర్వాత పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు. ఇంకా వైవాహిక జీవితం ప్రారంభం అయ్యాక కూడా గురువు అవసరం అయితే, మొదటి స్థానంలో పుస్తకమే మెదులుతుంది. అప్పటికి విద్యాభ్యాసం పూర్తయి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార పనులలో బిజిగా ఉంటాము. కావునా అప్పుడు కూడా మనసుకు మార్గదర్శకత్వం అవసరం అయితే, గొప్ప గొప్ప పుస్తకాలు మనకు మంచి మిత్రుడులాగా ఉపయోగపడతాయి. అలాగే రామాయణ, భారత, భాగవత పుస్తకాలు గురువు వలె బోధన చేయగలవు. అవి తెలుగు భాషలో రచించిన పుస్తకాలు చదివితే, తెలుగు భాష మన మనసులో వాటి వెలుగును వెదజల్లుతుంది.
మనకు మాతృభాష అయిన తెలుగులో మనకు మార్గదర్శకత్వం వహించగలిగే పుస్తకాలు ఉంటాయి. అవి వ్యక్తిగత జీవితంలో ఒక మిత్రుని వలె ఉపయోగపడతాయని అంటారు. అలాంటి పుస్తకాలు చదవడానికి తెలుగు భాషలో కొంతమేరకు ప్రావీణ్యత ఉంటే, అద్భుతమైన తెలుగు సాహిత్యం మన మనసులోకి చేరే అవకాశం ఉంటుంది. వాటిని చదవడం కోసం తెలుగు చదువుకోవలసని అవసరం ఉంది.
తెలుగు భాష గొప్పతనం గురించి తెలియడానికి మనకు తెలుగు భాషా పండితుల రచనలు చదవాలి. అప్పుడే తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది.
హృతిక్ రోషన్ పాపులర్ హీరో , బాలీవుడ్ ఫిల్మ్ యాక్టర్. ఈయన ఇప్పటివరకు 6 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇండియా మీడియాలో మోస్ట్ పాపులర్ పర్సనాలిటిగా ఈయనను చెబుతారు.
1974వ సంవత్సరంలో జనవరి 10వ తేదీన హృతిక్ రోషన్ పింకి – రాకేష్ రోషన్ దంపతులకు జన్మించారు.
1980వ దశాబ్దంలో బాలనటుడిగా కొన్న బాలీవుడ్ మూవీలలో నటించారు. 2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన కహో నా.. ప్యార్ హై సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.
కహో నా.. ప్యార్ హై సినిమాలోని హృతిక్ రోషన్ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు డెబ్యూ అవార్డులు అందుకున్నారు ఆయన. ఆపై ఫిజా, మిషన్ కాశ్మీర్ వంటి హిందీ సినిమాల్లో నటించారు. హృతిక్ రోషన్ 2001లో కభీ ఖుషీ కభీ గమ్ హిందీ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు .
కోయీ.. మిల్ గయా మరొక విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలోనూ హృతిక్ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు.
2006సంవత్సరంలో కోయీ.. మిల్ గయా మూవీకి సీక్వెల్ గా క్రిష్ సినిమాలో నటించారు. ఇది కూడా బాలీవుడ్ లో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆయన ధూమ్2 సినిమాలో నటించడం ద్వారా మూడవ ఫిలింఫేర్ అవార్డు 2006 లో అందుకున్నారు. ఇండియన్ హిస్టరీ ఆధారంగా వచ్చిన జోధా అక్బర్ సినిమాలో నటించారు. ఈ సినిమా వలన కూడా హృతిక్ రోషన్ నాలుగో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
2010 సంవత్సరంలో హృతిక్ నటించిన గుజారిష్ సినిమాలో వికలాంగుడిగా, ఆయన నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. జిందగీ నా మిలేగీ దుబారా, అగ్నిపథ్, క్రిష్ 3 వంటి పలు విజయవంతమైన హిందీ సినిమాలలో హృతిక్ రోషన్ నటించారు. అగ్నిపథ్, క్రిష్ 3 మూవీస్ బాలీవుడ్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాల లిస్టులో నిలిచాయి.
నటనకు అవార్డులు ప్రతీకగా నిలుస్తాయి. అవార్డులు అందుకునే సినిమాలకు కలెక్షన్ తక్కువ అంటారు… కానీ హృతిక్ రోషన్ సినిమాలకు మాత్రం కలెక్షన్ వర్షం కూడా కురుస్తుంది.
కమర్షియల్ సినిమా అయినా క్లాసికల్ గా నటించడం హృతిక్ రోషన్ స్పెషాలిటి… అదే ఆయనను అంత ఎత్తుకు ఎదిగేలాగా చేసింది.
కహోనా ప్యార్ హై, క్రిష్2, క్రిష్ 3 సినిమాలు కమర్షియల్ గానూ మంచి విజయం సాధించాయి. ఈయన నటన కూడా చాలా క్లాసిక్ గా ఉంటుంది.
హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం
ఈయన సినిమాలు అవార్డులు అందుకుంటాయి… రికార్డుల సృష్టిస్తాయి… అందువలన ఈయన బాలీవుడ్లో పాపులర్ హీరోగా నిలిచారు.
రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు. ఈయన భారత జట్టు కు ప్రాతినిద్యం వహించారు.
ఈయన 1973సంవత్సరంలో జనవరి 11వ తేదీన ఇండోర్ లో జన్మించారు. ఇండోర్ మధ్యప్రదేశ్ లో గలదు. ఈయన మాతృభాష మరాఠీ. రాహుల్ ద్రవిడ్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
ఈయన అసలు పేరు రాహుల్ శరద్ ద్రవిడ్ (Rahul Sharad Dravid)… క్రికెట్ లో ఈయనను ఆటను ఒక గోడతో పోల్చుతారు. వికెట్లు టపా టపా రాలిపోతున్నప్పుడు రాహుల్ ద్రవిడ్ క్రిజులోకి వచ్చి, వికెట్ల దగ్గర పాతుకుపోయి బ్యాటింగ్ చేయడం ఈయన గొప్పతనం.
అందుకే ఈయనను గ్రేట్ వాల్ గా క్రికెట్ ఆటలో చెబుతూ ఉంటారు.
రాహుల్ ద్రవిడ్ 1991లో రంజీట్రోఫి ద్వారా క్రికెట్లోకి ప్రవేశించారు. రంజీట్రోఫిలో రాణించిన రాహుల్ ద్రవిడ్ 1996లో రంజీ డబుల్ సెంచరీ సాధించారు. అదే సంవత్సరం టెస్ట్ క్రికెట్ జట్టులో స్థానం పొందారు.
1996 సంవత్సరంలో ఇంగ్లాండుపై లార్డ్స్ మైదానంలో ఆటతో టెస్టు క్రికెట్ జట్టులోకి వచ్చిన రాహుల్ ద్రవిడ్, 1997 సంవత్సరంలో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్బెర్గ్లో తొలి టెస్ట్ సెంచరీ సాధించారు.
వన్డే క్రికెట్ ఫార్మట్లో రాహుల్ ద్రవిడ్ 1996 సంవత్సరంలో ఇండియా-శ్రీలంకల మద్య జరిగిన మ్యాచు ద్వారా తొలి వన్డే ఆడారు…
రాహుల్ ద్రవిడ్ రికార్డులు – అవార్డులు
2001 టీమిండియా సాధించిన చిరస్మరణీయమైన టెస్ట్ విజయంలో వివిఎస్ లక్ష్మణ్ కలిసి రాహుల్ ద్రవిడ్ ఆట కూడా ప్రధానమైనది. ఆ టెస్ట్ మ్యాచులో వీరిద్దరూ ఐదవ వికెట్ కు 376 పరుగుల బాగస్వామ్యం నమోదు చేశారు. పాలో ఆన్ ఆడి అద్భుతమైన విజయం అందుకున్న ఆనాటి టీమిండియా ఆట ఆదర్శప్రాయంగా చెబుతారు.
రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్
పాకిస్తాన్ పై 2004 సంవత్సరంలో 270 టెస్ట్ క్రికెట్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరును మరింత మెరుగు పరుచుకున్నారు. 2005 సంవత్సరంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించారు.
టెస్ట్ మరియు వన్డే ఫార్మట్లలో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించారు. రాహుల్ ద్రవిడ్ 2008 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని దాటారు.
క్రికెట్లో ఈయన 164 టెస్ట్ మ్యాచులలో 286 టెస్ట్ ఇన్నింగ్సులలో ఆడారు. టెస్ట్ క్రికెట్ ఫార్మట్లో రాహుల్ ద్రవిడ్ 13288 పరుగులు సాధించారు. వన్డే క్రికెట్ ఫార్మట్లో రాహుల్ ద్రవిడ్ 344 వన్డేలలో జట్టులో ఉంటే, 318 వన్డే ఇన్నింగ్సులలో ఆడారు. వన్డే క్రికెట్ ఫార్మట్లో రాహుల్ ద్రవిడ్ 10889 పరుగులు సాధించారు.
రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్రికెట్లోనూ, వన్డే క్రికెట్లోనూ భారత తరపున అరుదైన రికార్డు ఉంది. టెస్టు క్రికెట్లో అత్యధికంగా 5 డబుల్ సెంచరీలు చేసిన భారతీయుడుగా ఉన్నారు. ఇంకా వన్డే క్రికెట్లో వరుసగా 120 వన్డేలలో డకౌట్ కాకుండా రికార్డు సాధించారు.
టెస్టు క్రికెట్ ఫార్మట్లో అసలు సిసలైన టెస్ట్ క్రికెట్ ప్లేయరుగా రాహుల్ ద్రవిడ్ కీర్తి గడించారు. క్లాసికల్ క్రికెట్ ప్లేయర్ పలువురిచేత ప్రశంసలు అందుకున్నారు. ఇలా రాహుల్ ద్రవిడ్ భారతీయ క్రికెట్లో ఒక అగ్ర దిగ్గజంగా ఉన్నారు.
భారత ప్రభుత్వం నుండి 2004సంవత్సరంలో రాహుల్ ద్రవిడ్ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా అదే సంవత్సరం ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు.
ఇంకా పలు అవార్డులు రాహుల్ ద్రవిడ్ అందుకున్నారు. భారత క్రికెట్లో మిస్టర్ డిపెండబుల్ ప్లేయరుగా రాహుల్ ద్రవిడ్ సేవలు మరవలేనివి.
రాహుల్ ద్రవిడ్ 2003 మార్చి 4వ తేదిన విజేత పెండార్కర్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు సంతానం. వారి పేర్లు సమిత్ ద్రవిడ్, అన్వయ్ ద్రవిడ్…
చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర అంటే జరిగినది, జరగబోయే రోజులలో వర్తమానంగా వర్తింపబడుతుంది. అంటే గతంలోని విషయాలు ఈరోజు తెలుసుకోవడం… జరుగుతుంది.
ఏదైనా ఒక సంఘటన జరిగినది. దానిని కొంతకాలం జరిగాక, గుర్తుకు చేసుకుంటే అది గతం అవుతుంది. అలాంటి గత సంఘటనలు సమాజంపై చూపిన ప్రభావాన్ని బట్టి చరిత్రగా మనకు మరలా గుర్తుకు వస్తుంది.
ఎవరైనా ఒక వ్యక్తి జీవితం ముగిసింది. ఆయన జీవితం గతించిన జీవితంగా పరిగణింపబడుతుంది. ఎవరైతే సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేస్తారో, వారు అనేకమందికి గుర్తుకు వస్తారు.
అలాంటి వారి గతంగా జీవిత చరిత్రలుగా సమాజం గుర్తిస్తుంది. అది పుస్తకం రూపంలో ఉంటాయి… ఈరోజులలో వెబ్ పేజిలుగా మారుతున్నాయి.
ఇంకా ఒక వస్తువు సమాజంలో పొందిన పాపులారిటీని కోల్పోయినా, అది ఒక చారిత్రాత్మక వస్తువుగానే పరిగణింపబడుతుంది. ఇక అది సమాజంలో ఒక గుర్తుంచుకోదగిని గతకాలపు వస్తువుగా మారిపోతుంది. ఇలాంటి వస్తువులు కూడా ఒక పుస్తకాలలో గానీ వెబ్ పేజిలలో గానీ చరిత్రగా మారతాయి.
చరిత్ర అంటే ఏమిటి?
అసలు చరిత్ర అంటే గతంలోని సమాజంపై ప్రభావం చూపిన విషయాలు వర్తమానంలో తెలుసుకోవడం చరిత్ర అంటారు.
అది ఒక విశిష్టమైన వ్యక్తి గురించి అయి ఉండవచ్చును. ఒక విశేషమైన ప్రభావం చూపిన సంఘటన కావచ్చును. ఒక విశేషమైన ప్రజాధరణ పొందిన పాపులర్ ఐటమ్ కావచ్చును.
ఇంకా ప్రకృతి వైపరిత్యాలు, ప్రకృతిలో విశిష్టమైన మార్పులు, సామాజిక మార్పులు, సామాజిక సమస్యలు, సామాజిక ఉద్యమాలు ఇలా విశిష్టమైన ప్రభావం సమాజంపై చూపాకా కాలంలో చరిత్రగా పరిగణించబడతాయి.
ఈ విధంగా మనకు అనేక రంగాలలో అనేక విషయాలలో సామాజికపరమైన చరిత్రలు, వ్యక్తిగతమైన చరిత్రలు, పౌరాణిక చరిత్రలు, టెక్నాలజీ చరిత్రలు, వ్యవస్థల చరిత్రలు, నాయకుల చరిత్రలు, జీవిత చరిత్రలు ఏర్పడు ఉంటాయి.
అలా ఏర్పడిన చరిత్ర మనకు పుస్తకం రూపంలో లభిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే డిజిటల్ బుక్స్ రూపంలో కూడా లభిస్తాయి.
గతం గురించి గుర్తు చేసే చరిత్ర గురించి ఎందుకు తెలుసుకోవాలి?
చరిత్ర ఒక పాఠం వంటిది… చరిత్ర చెప్పిన పాఠాలు వలన వర్తమానంలో అనుసరించవలసిన విధానం బోధపడుతుంది.
గతకాలంలోని అనుభవాలు ఒక చరిత్రగా మారతాయి. అలా అనుభవాలు పొందినవారు తమ తమ అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలలోని సారం గురించి విశ్లేషిస్తూ ఒక జ్ఙాపకంగా మారుస్తారు.
అటువంటి జ్ఙాపకాలే చరిత్రగా మారి పుస్తకాలలో వస్తాయి… కాబట్టి చరిత్ర వలన విషయముల యందు అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.
సామాజిక చరిత్ర చదవడం వలన గత వందల సంవత్సరాలుగా సామాజిక పరిస్థితలు ఎలా ఉండేవో తెలియబడుతుంది.
అలాగే సామాజిక చరిత్ర బుక్స్ రీడ్ చేయడం వలన గతకాలపు మంచి చెడుల ప్రవర్తన వ్యక్తుల మద్య ఏవిధంగా ఉండేది అవగతం అవుతుంది.
గతకాలంలో జరిగిన సామాజిక ఉద్యమాలు, ఆ ఉద్యమాలు ఎందుకు పుట్టాయి? నాటి సమాజంలో గల పరిస్థితులు, సామాజిక సమస్యలు, వాటిపై పోరాటం జరిపిన నాయకుల గురించి చరిత్ర బుక్స్ చదివినవారికి తెలుస్తుంది.
తద్వారా వర్తమానంలో సామాజిక పరిస్థితిలు, వర్తమానంలో సామాజిక పోకడలు, వర్తమానంలో సామాజిక సమస్యలపై పరిశీలనకు చారిత్రక పుస్తకాలు ఉపయోగపడతాయి. సామాజిక భవిష్యత్తుపై ఊహ ఏర్పడే అవకాశం ఉంటుంది.
సామాజిక చరిత్రను తెలియజేసే తెలుగు బుక్స్ రీడ్ చేయడం, ఇప్పటి తెలుగు వ్యాసాలు చదువుతూ ఉండడం వలన మంచి సామాజిక పరిజ్ఙానం పెరుగుతుందని అంటారు.
ఎటువంటి రంగం గురించి చరిత్రను తెలుసుకుంటే ఆ రంగంలో విషయవిజ్ఙానం
సమాజంలో అనేకమంది అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది.
అందరి స్వభావాలు వేరు అయినా కొన్ని విషయాలలో అందరి భావన ఒక్కటిగానే ఉంటుంది. అటువంటి కొన్ని రంగాలుగా ఉంటాయి. విద్య అంటే నేర్చుకోవడం ఇది అందరిలోనూ ఒకే భావన ఉంటుంది… ఇది విద్యారంగం.
అయితే విద్యారంగంలో విద్యను గ్రహించడంలో ఒక్కొక్కరిది ఒక్కో విధానంగా ఉంటుంది. కానీ అందరిపై ఒకే రకమైన భావనలు కలిగి ఉండే రంగాలలో అనేక చరిత్రలు కూడా ఉంటాయి.
విద్యారంగంలో విశిష్టమైన కృషి జరిపిన వారి గురించి చరిత్రలు ఉంటాయి. విద్యారంగంలో జరిగిన మార్పులు గురించి చరిత్రలు ఉంటాయి. ఇలా రంగానికి కొన్ని చారిత్రక ఘటనలు, చారిత్రక వ్యక్తులు చరిత్రగా ఉంటారు.
ఇక ఒక వ్యక్తి ఎటువంటి రంగం గురించిన చరిత్రను తెలుసుకుంటూ ఉంటే, ఆయా రంగాలలో విషయ విజ్ఙానం తెలియబడుతుందని అంటారు.
తెలుగులో వ్యాసాలు రచించనవారు గురించి తెలుసుకోవడం. తెలుగులో వ్యాసాలు రచించడం ఎలా? అనే ప్రశ్న గురించి శోధించడం
వ్యాస రచన విధానం గురించి తెలుసుకోవడం… ఇలా వ్యాసాలు – ప్రయోజనాలు, వ్యాసాలు – ప్రాముఖ్యత అంటూ శోధించి, ఆలోచించడం మొదలు పెడితే, వ్యాసరచనపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆపై సరైన శిక్షణ తీసుకుంటే, ఆసక్తికి తగ్గట్టుగా వ్యాసరచన చేయగలుతారు.
ఆ విధంగా ఎవరైన ఏఏ రంగాలలో ఆసక్తి కలదో గమనించి, ఆయా రంగాలలో ఉన్న విశిష్ట సంఘటనల చరిత్రలు, ఆయా రంగాలలో ప్రభావం చూపిన వారి చరిత్రలు, ఆయా రంగాలలో ప్రాముఖ్యత వంటి చరిత్రను తెలుసుకుంటే, ఆయా రంగాలలో పరిజ్ఙానం పెరుగుతుందని అంటారు.
దైవభక్తి మెండుగా ఉన్నవారు దైవం గురించి చింతనతో ఉంటారు. దైవచింతనతో ఉండేవారు పౌరాణిక చరిత్రను తెలుసుకుంటూ ఉంటే, తాత్విక చింతనకు దారితీయవచ్చును… తాత్విక చింతన ద్వారా జ్ఙానమార్గంలోకి వెళ్ళవచ్చని అంటారు…. జ్ఙానం మార్గం మనిషికి విశిష్టమైన మార్గంగా చెబుతారు.
ఇలా వ్యక్తి ఆసక్తిని బట్టి చరిత్ర తెలుసుకోవడం వర్తమానంలో తన విధానమును వృద్ది చేసుకోవడానికి భవిష్యత్తులో లక్ష్యాన్ని చేరడానికి చరిత్ర ఉపయోగపడుతుందని అంటారు.
చరిత్ర గురించి తెలుగు వ్యాసం ఎందుకంటే? గతం గురించి తెలిపే చరిత్ర వలన విద్యావిషయాలలోనూ, అనేక విషయాలలో మనిషికి మేలు జరిగే అవకాశాలు ఉంటాయిన అంటారు.
పెద్దల అనుభవాలు, పండితులు మాటలు, గురువుల బోధ అన్ని పుస్తకాలుగా మారతాయి. కాలం గడిచే కొద్ది అవి చరిత్రగానే మారతాయి. ఏవి అయితే సమాజానికి ఎప్పటికీ మేలును చేస్తాయో, వాటిని చరిత్రకారులు చరిత్రగా మలుస్తారు… అటువంటి చరిత్రను తెలుసుకోవడం సామాజికంగా ప్రయోజనం అంటారు.
నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది? ఈ శీర్శికతో తెలుగు వ్యాసాలులో ఒక తెలుగు వ్యాసం.
ఒకప్పుడు ఏదైనా వార్త దూర ప్రాంతంలో ఉండేవారికి చేరాలంటే, రోజలతరబడి సమయం పట్టేది… నేటి సోషల్ మీడియా వలన క్షణాలలో వార్త ప్రపంచం మొత్తం పాకుతుంది. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి కుదించేసింది.. అరచేతిలోనే ప్రపంచంలో ఏమూలా ఏం జరిగినా తెలుసుకోవచ్చును.
తెలుగులో సామాజిక మాధ్యమం అదే ఇంగ్లీషులో సోషల్ మీడియా గా అభివర్ణిస్తారు. నేటి సోషల్ మీడియా చాలా వేగం కలిగి ఉంది. ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే వెబ్ సైట్స్ మొబైల్ యాప్స్ కీలకమైనవి. వాటిలో యాక్టివ్ యూజర్లు ప్రముఖంగా న్యూస్ వ్యాప్తి చెందడంలో కీలక పాత్రను కలిగి ఉంటారు.
అలాంటి సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా యువతపైనే ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర యువతదే ఉంటుంది.
సమాజంలో యువత ఎక్కువగా సోషల్ మీడియాపై ఆధారపడడం అలవాటుగా కూడా మారింది. సోషల్ మీడియా వెబ్ సైట్ లేక యాప్ రోజుకొక్కసారి అయినా విజిట్ చేస్తూ ఉంటారు.
ఈ సోషల్ మీడియా ప్రభావం యువతతో బాటు ఇంకా మిగిలిన వారిపై కూడా ప్రభావం చూపుతుంది. కారణం మొబైల్ ఫోన్ వాడుక ఎక్కువగా పెరగడం. అన్ని వయస్సులవారు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. తద్వారా చాలావరకు సోషల్ మీడియా ప్రభావం అందరిపై కనబడే అవకాశం కూడా ఉంది.
ఏదైనా సంఘటన లేక విశేషమైన ప్రకటన లేక పాపులర్ పర్సనాలిటీస్ పర్సనల్ యాక్టివిటీస్ వెంటనే సోషల్ మీడియా ద్వారా సమాజంలో వ్యాపిస్తున్నాయి.
సాదారణంగా టివి అయితే అన్ని వేళలా అందరూ వీక్షించడం కష్టం కానీ సోషల్ మీడియా అలా కాదు… అందరిచేతులలో ఉండే ఒక స్మార్ట్ ఫోను ఆధారంగా సమాజం మొత్త ఆక్రమించుకుని ఉంది.
దీని ద్వారా విషయం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మంచి విషయం అయినా, చెడు విషయం అయినా వ్యాప్తి చెందడం నేటి టెక్ యుగంలో నిమిషాల మీద పని. ఇంకా యువత ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉంటారు… తద్వారా సోషల్ మీడియా ద్వారా విషయాలు యువత మైండులోకి జొప్పించబడతాయి. అవి ఎలాంటివి అయినా ఆసక్తిగా ఉంటే, వెంటనే వచ్చి యువత మైండులోకి తిష్ట వేసే అవకాశం సోషల్ మీడియా వలన జరుగుతుంటాయి.
సామాజిక మాధ్యమాల ప్రభావం అంటే ఆంగ్లంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువగా యువతపైనే పడుతుంది.
ఇలా సోషల్ మీడియా ద్వారా విషయాల వ్యాప్తికి కూడా యువతే కారణం అయ్యే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే అంతగా టెక్ నాలెడ్జ్ లేకపోయినా సోషల్ మీడియా చూడడం వరకు ఎవరైనా చేయవచ్చును… కానీ సోషల్ మీడియా ద్వారా విషయాలను ప్రధాన్యతను కల్పించడం. వాటిని ప్రచారం చేయడంలో నైపుణ్యతను చూపించడం సోషల్ మీడియాలో యువతకే సాధ్యం అవుతుంది.
ముఖ్యం ఎప్పటికప్పుడు మారే టెక్నాలజీని అర్ధం చేసుకోవడంలో యువత ముందుంటారు. అలా సమాజంలో యువతపై విశేషంగా ప్రభావం చూపగలిగే సోషల్ మీడియా, అది పెరగడానికి కూడా యువతే కారణం కావడం విశేషం.
ఆవిధంగా సోషల్ మీడియా యువత ద్వారా సమాజంలో పెరిగి, యువతనే లక్ష్యంగా సాగుతూ ఉంటుంది.
స్మార్ట్ ఫోను మొబైల్ ద్వారా ఉపయోగించే ఈ సోషల్ మీడియా వలన ప్రధాన ప్రయోజనం… వేగంగా వేలమందికి, లక్షలమందికి విషయం చేరుతూ ఉంటుంది. అలాగే ప్రధాన సమస్య పుకార్లు పుట్టడం.
పుకార్లు షికారు చేయడానికి సోషల్ మీడియా వేదికగా మారుతుంటుంది. ఇంకా చాలా వేగంగా పుకార్లు సమాజంలో వ్యాపింపజేయడానికి సోషల్ మీడియా వేదిక అవుతుంది.
యువత ప్రధానంగా మేల్కొన్నప్పుడు చేసే మొదటి పని ఏమిటి? అంటే తల్లిదండ్రులు విచారిస్తూ చెప్పే విషయం వారు ఫోనుతోనే వారికి తెల్లవారుతుందని.
అంటే యువత నిద్రకు ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నిద్రనుండి మేల్కోవడం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ కావడం కోసం అన్నట్టు కొందరి ప్రవర్తన ఉంటుంది. ఈ విధంగా సోషల్ మీడియా యువతపై పెద్ద ప్రభావం చూపుతుందని అంటారు.
సోషల్ మీడియా యువతపై తీవ్ర ప్రభావం చూపగలదు.
ఈ సోషల్ మీడియా వలన ఏర్పడిన మరొక అంశం… అతి స్వేచ్చ… అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. కానీ నేడు అతిగా ఉండడమే సాదారణంగా పరిగణించబడుతుంది. ఫోనులో చూసే వ్యక్తి ఏంచూస్తున్నాడో.. చూసేవారికే తెలియాలి.
ఒకప్పుడు ఎదుగుతున్న పిల్లల మనసులోకి చెడు విషయాలు చేరకుండా తల్లిదండ్రులు, ఆ కుటుంబ శ్రేయోభిలాషులు ప్రయత్నించేవారు… ఇప్పుడు చెడు విషయాలు చేతికి చేరువగా ఉంటున్నాయి… ఒక్క టచ్ ద్వారా ప్రపంచంలోని మంచి చెడులను ఇట్టే వీక్షించవచ్చును. అటువంటి సౌలభ్యం సోషల్ మీడియా ద్వారా నేటి యువతకు అందుబాటులో ఉంది.
అందులో వారు మనసును పాడు చేసే విషయాలను ఫాలో అవుతున్నారా? మనసుకు మేలు చేసే విషయాలను అనుసరిస్తున్నారా? అది మొబైల్ ఫోనులో సోషల్ మీడియా ఖాతను పరిశీలిస్తేనే అవగతమవుతుంది.
నేటి రోజులలో వేగం చాలా కీలకమైనది కాబట్టి వేగంగా నేర్చుకోవడానికి, వేగంగా తెలుసుకోవడానికి సోషల్ మీడియా చాలా ఉపయోగం కానీ వ్యక్తి దారి తప్పితే, వేగంగా చెడుదారిలో ప్రయాణించే అవకాశం కూడా సోషల్ మీడియా వలన కలగవచ్చు.
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ కరోనాకు కోవిడ్-19 అనే పేరు పెట్టారు. ఇది చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో లక్షలమంది ప్రాణాలను బలిగొన్న వైరస్ ఇంకా వివిధ రకాలు రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. ఇప్పటికే బ్రిటన్లో కొత్త రకం కరోనా వ్యాధి పుట్టింది.
ఈ కరోనా ఎప్పటి వైరస్
1960 సంవత్సరంలో తొలిసారిగా దీనిని కనుగొన్నారు. ఇది పక్షులు, క్షీరదాలపై దీని ప్రభావం ఉంటుంది. ఈ కరోనా వైరస్ ఆరు రకాలుగా ఉంటుందని కనుగొన్నారు. పక్షులు క్షీరదాలపై ప్రభావం చూపే ఈ కరోనా వైరస్ సాదారణ ఫ్లూ కన్నా పదింతలు ప్రమాదకరమైనది. ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.
2019 లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది
కరోనా వైరస్ వుహాన్లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ నుండి వ్యాప్తి చెందినట్టుగా గుర్తించారు. చైనా దేశంలో వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ఇద్దరిని బలితీసుకుంది…. ఆ శాంపిల్స్ లండప్ పంపగా అక్కడి పరిశోధనలలో దానిని కరోనా వైరస్ గా గుర్తించారు.
చైనాలో దీనిని 2019 డిసెంబర్ 1న గుర్తించగా మార్చి 5వ తేదికి 95 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడి నుండి దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ పలు దేశాలలో త్వరితగతిన వ్యాప్తి చెందింది.
ఆపై అమెరికా, జపాన్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, టర్కి, యుకె, ఇండియా ఇలా అన్ని దేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.
కరోనా వైరస్ లక్షణాలు
కరోనా వ్యక్తిలో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి లక్షణాలు: జ్వరం పొడి దగ్గు అలసట వ్యక్తిలో తక్కువ సాధారణంగా కనిపించే వ్యాధి లక్షణాలు: నొప్పులు మరియు బాధలు గొంతు మంట విరేచనాలు కండ్లకలక తలనొప్పి రుచి లేదా వాసన శక్తి కోల్పోవడం చర్మంపై దద్దుర్లు లేదా వేళ్లు లేదా కాలి వేళ్లు రంగు కోల్పోవడం
కోవిడ్ -19 నివారణ చర్యలు ( కరోనా వైరస్ నివారణ చర్యలు )
కరోనా గురించి అపోహలు ఉంటే, ముందుగా దానికి గురించి నిజాలు తెలుసుకోండి… మందస్తు జాగ్రత్తగా మీతోబాటు మీ చుట్టుప్రక్కలవారి విషయంలోనూ జాగ్రత్తలు వహించండి. మీకు దగ్గరలో గల ఆరోగ్య సంస్థలో సంప్రదించి, తగిన సలహాని పాటించండి.
కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి: తరచూ మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. దగ్గుతున్న లేదా తుమ్ముతున్న వారి నుండి దూరంగా ఉండాలి. మాస్కుని ధరించండి. చేతులు శుభ్రం చేయకుండా చేతితో మీ కళ్లు, ముక్కు లేదా నోటిని తాకరాదు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ ముక్కు మరియు నోటిని మీ వంచిన మోచేయి లేదా టిష్యూతో అడ్డుపెట్టుకోవాలి. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవ్వాలి మీరు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నట్లయితే, మీ దగ్గరలోని ఆరోగ్య సంస్థలో వైద్య పొందాలి. వ్యక్తి మందస్తు జాగ్రత్తలు పాటించడం వలన వ్యక్తికి కరోనా రాకుండా ఉండడమే కాకుండా అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నట్టవుతుంది… కావునా వీలైనంత సామాజిక దూరం పాటిస్తూ, చేతులు, కాళ్ళు శుభ్రం చేసుకుంటూ, మాస్క్ ధరించడం శ్రేయస్కరం.
కరోనా వైరస్ ఎక్కువగా ఏఏ దేశాలపై ప్రభావం చూపింది..
కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి
ముందుగా చైనాను కరోనా వైరస్ ఒక్క ఊపి వదిలిపెట్టింది… ఆపై ఇటలీలో విజృంభించింది…. ఎంతగా ఇటలీని చూసి ప్రపంచం పాఠం నేర్చుకోవాలి… అనే స్థాయిలో ఇటలీని గజగజలాడించింది
ఇటలీని చూసి ప్రపంచం భయపడుతున్న వేళలోనే అమెరికాను కూడా కరోనా వైరస్ అతలాకుతలం చేసింది… కొన్నాళ్ళకు కరోనా కేసులలో అమెరికాలోనే అత్యధికంగా నమోదు కావడం మొదలైంది… అది మొదలు ఇప్పటి అమెరికానే కరోనా పాజిటివ్ కేసులలో అగ్రస్థానంలో ఉంది. సుమారు 21 కోట్లకు పైగా కరోనా కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి. మూడు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.
అమెరికాను అతలాకుతం చేసిన కరోనా వైరస్, భారతదేశంలో పడగ విప్పింది… చైనాలో బాగా తగ్గాయి… ఇండియాలో పెరగడం మొదలయ్యాయి… మార్చి నుండి కరోనా కేసులు పెరుగుతుండంతో ఇండియాలో లాక్ డౌన్ అయిదు విడతలుగా భారతప్రభుత్వం అమలు చేసింది.
అయినప్పటికీ భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య పదికోట్లను దాటింది. ఒక లక్షా నలభైవేలకు పైగా కరోనా కాటుకు బలైనారు. భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు వలన రికార్డు స్థాయిలో కరోనా కేసులు రికవరి రేటు పెరిగింది.
అమెరికా, బ్రెజిల్, రష్యా, యుకె, ఫ్రాన్స్, టర్కి, స్పెయిన్, జర్మనీ, కొలంబియా, అర్జెంటీనా, మెక్సికో, పొలాండ్, ఇరాన్, సౌతాఫ్రికా, యుక్రైన్, పెరు, నెదర్లాండ్స్, బెల్జియం, రొమానియా, చీలె, కెనడా మొదలైన దేశాలలో కరోనా తీవ్ర ప్రభావమే చూపింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇది తగ్గుముఖం పడుతున్నట్టు ఉంటూ, మరలా కొత్త వైరస్ పరిణామం చెందగలదు. ఇప్పటికే బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందింది…
కరోనా పై పోరాటం చేయాలంటే, వ్యక్తిగత ఆరోగ్యకరమైన చర్యలతోనే సాద్యం. వైద్యుల సూచనలు మేరకు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, సామాజిక దూరం, మాస్క్ ధరించడం వలన వైరస్ వ్యాప్తి నివారించవచ్చును… ఇది అందరీ సామాజిక బాద్యత…
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో వ్యాసం చదవండి.
దేవాయలం అంటే దైవ నిలయం… దేవుడిని ప్రతిష్టించి, పూజించడం, లేక వెలసిన దేవుడికి ఆలయనిర్మాణం జరిగి పూజించడం దేవాలయాలలో జరుగుతంది.
ప్రతి దేవాయమును అర్చకస్వామి ఉంటారు. ఈ దేవాలయం కొందరు దేవస్థానం అంటారు, మరికొందరు మందిరం అంటారు. కొన్ని చోట్ల గుడి అని వాడుక భాషలో అంటారు.
మన దేశం చాలా విశిష్టమైన దేశం సంప్రదాయబద్దమైన కుటుంబ జీవనం భారతదేశంలో ఆనాదిగా వస్తుంది. అనేక కుటుంబాలలో పూర్వుల నుండి వస్తున్న ఆచారాలను ఆచరిస్తూ ఉండే కుటుంబాలు అనేకంగా మన దేశంలో ఉంటాయి.
అలాంటి మన భారతదేశంలో దేవాలయాల దర్శనం ఒక ఆచారం. ఒక సంప్రదాయం మరియు భక్తిపూర్వకమైనది.
ఆలయంలో ఉన్న దేవుడికి మొక్కడం, మొక్కులు తీర్చడం… పూలు, పళ్ళు, ధనం, బంగారం వంటి కానుకలు భక్తులు సమర్పించడం జరుగుతుంది.
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి మరియు నిత్యం భక్తుల కోలాహాలంతో దేవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి.
భారతీయ సంప్రదాయంలో దేవాలయం అంటే దేవుని ఆలయం
దేవాలయం అంటే దేవుని నిలయం అని అర్ధం. ఏ దేవుడిని ఆలయం ఆదేవుని పేరుతో పిలవబడుతుంది. విఘ్నేశ్వరాలయం, సుబ్రహ్మణ్యాలయం, వైష్ణవాలయం, శివాలయం ఆలయానికి ముందు దైవనామం ఉంటుంది.
హిందూ దేవాలయాల చరిత్ర అంటే తెలుగు పురాణా పుస్తకాలు చదవాల్సిందే… ఏనాటి నుండే ఉండే ప్రముఖ ప్రసిద్ద దేవాలయాలు అనేకంగా భారతదేశంలో గలవు.
పురాణ పుస్తకాలలో కూడా దేవాలయాల గురించి ప్రస్తుతిస్తారు… అలాగే ఆయా ఆలయాలలో ఉండే దైవమును గురించి ఆయా దైవనామములతో పురాణ పుస్తకాలు కలవు.
శివాలయం అంటే ఆ ఆలయంలో శివుడు మూలవిరాట్టు… ఆయన పేరుపై శివమహాపురాణం గ్రంధం కలదు.
రామాలయంలో దేవుడు శ్రీరాముడు, ఆయనకు ఇతిహాసమే ఉంది… అదే శ్రీరామాయణం.
ఇంకా విష్ణువు మూలవిరాట్టుగా దేవాలయాలు ఉన్నాయి… విష్ణువు గురించి తెలిపే విష్ణు పురాణం కలదు.
ఒక్కో దేవాలయానికి ఒక్కో చారిత్రక, ఇతిహాస గాధలు ప్రసిద్ది చెంది ఉంటాయి… వేల కొలది సంవత్సరాల క్రితం ఆలయాలు కూడా భారతదేశంలో ఉంటాయి.
అయితే పేపర్ పుట్టాక చరిత్రగా చదువుకుంటున్న మనం, పేపర్ పుట్టకముందే, తాళపత్ర గ్రంధాలు మీద వ్రాయబడిన చరిత్ర మనదేశంలో ఉంది… అంటే తాళపత్రములను అందించే చెట్టు పుట్టినప్పుడు నుండే దైవ చరిత్రలను ఋషులు తాళపత్రగ్రంధాలపై లిఖించారని అంటారు.
పురాణాలలో చరిత్రను కల్పములు, యుగములు, యుగభాగములు మొదలైన విధంగా చెబుతారు… అలా చూసుకుంటే, భారతదేశంలోని దేవాలయాల చరిత్ర ఏనాటిదో… అవుతుంది.
కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన దేవాలయం, స్వామి వారు రాకముందునుండే ఆదివరాహస్వామి వారు దైవంగా ఉన్నారని అంటారు… అంటే తిరుమల తిరుపతి ఎంత పురాతనమైనదో అర్ధం అవుతుంది.
ప్రసిద్ది చెందిన దేవాలయాలు భారతదేశంలో ఎక్కువగానే ఉంటాయి. వాటిలో కాశీ చాల ప్రధానమైన దేవాలయం. పళని, జలకంటేశ్వరాలయం, శ్రీ రంగ క్షేత్రం, ప్రయాగ, గయా, రామేశ్వరం, అరుణాచలం, మధుర మీనాక్షి, కంచి ఇలా చాల ప్రసిద్ది చెందిన ప్రముఖ దేవాలయాలు భారతదేశంలో భాగమై ఉన్నాయి.
అనంతపద్మనాభా స్వామి ఆలయం, గురువాయుర్ శ్రీకృష్ణమందిరం, అయ్యప్ప దేవాలయం, త్రయంబకేశ్వరం, సిద్దివినాయకమందిరం, విరుపాక్ష ఆలయం, మహాబలిపురం, తిరువణ్ణామలై, చిదంబరాలయం, పావుగడ కాళిమాత ఆలయం, వైష్ణోదేవీ ఆలయం, పూరీ జగన్నాధ ఆలయం, స్వర్ణ దేవాలయం, పండరీ పురం, హరిద్వార్, వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాస్థానం, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం తదితర దేవాయాలు కలవు.
తిరుమల తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, అంతర్వేది, మహానంది, మంత్రాలయం, ద్వారకా తిరుమల, సింహాచలం, కోరుకొండ, మందపల్లి, అమరావతి, అరసవల్లి, అన్నవరం, ద్రాక్షారామం తదితర దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమై ఉన్నాయి.
దేవాలయ నిర్మాణం
దేవాలయ నిర్మాణం ఎవరు చేపట్టారు అంటే సమాధానం కూడా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని దేవాయాలు స్వయంభూ దేవాలయలుగా చెబుతారు. అంటే స్వయంగా దేవాలయాలు వెలిసినవి.
కాశీ విశ్వేశ్వరాయలం స్వయంభూ దేవాలయల అంటారు. ఇలా కాశీ వంటి దేవాలయాలు భారతదేశంలో చాలా ఉన్నట్టు పెద్దలు చెబుతూ ఉంటారు.
కొన్ని దేవాలయాల నిర్మాణంభారతదేశపు రాజులు నిర్మించినట్టుగా చరిత్రకారులు చెబుతారు. కొందరు రాజులు దేవాలయాలను పునర్మించడం, మరమ్మత్తులు చేయించడం చేసినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది.
దేవతలే స్వయంగా ఆలయ నిర్మాణం చేసినట్టుగా కొన్ని చోట్ల చెప్పడుతూ ఉంటుంది… దేవాయలస్థలపురాణంలో వీటి గురించి చెబుతూ ఉంటారు.
దేవాలయాలు రహస్యాలు
స్థలపురాణం బట్టి ఆయా దేవాలయాలలో రహస్యములు ఉంటాయి. అవి ఆయా దేవాయల అర్చక స్వాముల వారి ద్వారానే తెలుసుకోవాలి…
ఎందుకు దేవాలయానికి వెళతారు?
ఇది మంచి ప్రశ్నగా పండితులు పరిగణిస్తారు. ఎందుకుదేవాలయానికివెళుతున్నాను? అనే ప్రశ్న పలుమార్లు దేవాలయాలలో దైవదర్శనం జరిగాక వస్తే, అది మంచి మార్గమునకు దారితీస్తుంది… తత్వశోధనకు మనసులో బీజం పడుతుందని అంటారు. అయితే తాత్వికమైన దేవాలయ రహస్యంగా చెబుతారు.
సహజంగా భక్తులు దేవాలయానికి వెళ్లేది… మొక్కులు మొక్కడానికి లేదా మొక్కులు చెల్లించడానికి…
కష్టం వచ్చినప్పుడు ఇష్టదైవమును లేక కులదైవమును తలచుకుని, ఆకష్టం తీరిస్తే, తిరిగినేను నీకు చెల్లింపులు చెల్తిస్తాను అని మొక్కుకుంటారు… అలా మొక్కుకుని మొక్కులు తీర్చే భక్తులు ఎక్కువగా దేవునికి ఇచ్చేది… తమ అందానికి కారణమైన కేశములను మొక్కులుగా దేవదేవునికి చెల్లిస్తారు.
ఇలా కష్టం వచ్చినప్పుడు కొందరు ఇంట్లోనే దైవానికి మొక్కుకుంటే, కొందరు దేవాలయానికి వెళ్ళి మొక్కుతారు… ఆపై కోరిక తీరాక దైవానికి మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి దేవాలయమునకు వెళతారు. ఆవిధంగా భక్తులు తమ దైవమను దర్శించుకోవడానికి దేవాలయములకు వెళుతుండడంతో, దేవాలయాలు నిత్యం భక్తులతో కళకళలాడుతుంటాయి.
దైవభక్తి మనసుకు అంతర్లీనంగా ధైర్యాన్నిస్తుందని అంటారు. భరించలేని కష్టం కలిగినా మనిషి తట్టుకున్నాడంటే, నన్ను భరించవాడు ఒక్కడు నాపై ఉన్నాడనే నమ్మకమేనని అంటారు.
దేవుని నిలయమైన దేవాలయంలో చాలా నియమాలు చెబుతారు… అందుకు కారణం కదిలే మనసు ఏకాగ్రతతో ఉండాలంటే, నియమాలే సాధన అంటారు. అలా సాధనకు మనసు త్వరగా అంగీకరించదు కాబట్టి నియమాల రూపంలో ఒక సాధనగా చేసి, దైవదర్శనం చేసుకుంటే మనసుకు మేలు అంటారు.
మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా సమస్య పుట్టగానే వ్యక్తిలో నుండి బయడపడతాయి. మాటపై వేలమందిని నడిపించగలిగే శక్తి నాయకుడుకి సొంతం. అటువంటి మార్గదర్శకుడిగా నిలిచే నాయకుడి గురించి వ్యాసంలో వివరించడానికి తెలుగువ్యాసాలులో ఒక పోస్టు.
లోకంలో అనేకమంది ప్రజలకు, ఎన్నో సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చును… అలా అవగాహన ఉన్నా, ప్రతి సమస్యకు పరిష్కారం తోచకపోవచ్చును… పరిష్కారం లభించినా, పరిష్కరించే తీరిక ఉండకపోవచ్చును… కానీ ఒక నాయకుడుకి ఇటువంటి సమస్యలపై అవగాహన ఉంటుంది. పరిష్కరించే ఆలోచనా శక్తి ఉంటుంది. తన నోటిమాటతో ఆచరింపచేసే కార్యవర్గం కూడా ఉంటుంది. అటువంటి వ్యక్తిని నాయకుడుగా గుర్తింపు పొందుతారు. ప్రజా సమస్యల కోసం తీరిక చేసుకుని మరీ సమస్యల పరిష్కారానికి తపించే గుణం నాయకుడులో ఉంటుందని అంటారు.
మంచి నాయకుడు అంటే ఓ ప్రాంతంలో ప్రజలు మెచ్చిన నాయకుడుగా ఉంటాడు… అక్కడి ప్రాంతంలో అందరూ కొన్ని విషయాలలో అతనిని ఆదర్శప్రాయంగా తీసుకుంటారు. కొందరు యువత అయితే, కుటుంబపెద్దను అనుసరించడం కన్నా తమ ప్రాంత నాయకుడిని అనుసరించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అలా ఒక ప్రాంత నాయకుడు తమ ప్రాంతంలోని యువతపై ప్రభావం చూపగలుగుతారు. అలాంటి నాయకత్వం లక్షణాలు ఎలా ఉంటాయి?
నాయకుడు ముందుగా తనపై తాను పూర్తి నమ్మకంతో ఉంటారు…
తన అనుచరులకు కూడా అంతే నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు.
తన మాటచేత తన అనుచరులు కార్యరంగంలో దిగేవిధంగా, ఒక కార్యచరణను రూపొందించుకోగలుగుతారు.
నాయకుడు నడిచిన దారిలో నడిస్తే, మనకు మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయనే భావన బలంగా సమాజంలో వ్యాపింపజేయగలుగుతారు… వారే నాయకులుగా నిలుస్తారని అంటారు.
వ్యక్తిగత అభిప్రాయం కన్నా సామాజిక ప్రయోజనాలు మిన్న అని భావించడం ప్రధానంగా నాయకుడి లక్షణంగా భాసిస్తుంది. ఆకోణంలో ఉపన్యాసం ఇవ్వగలిగే గొప్ప ప్రతిభ వారియందు ఉంటుంది.
అలా ఒక సిద్దాంతమును ప్రకటిస్తూ, దానిపై ఉపన్యాసాలు ఇస్తూ, పదిమందిని ప్రభావితం చేసేవిధంగా నాయకత్వ లక్షణాలు నాయకుడిలో ప్రస్ఫుటంగా ఉంటాయని అంటారు. తను నమ్మిన సిద్దాంతంపై ఖచ్చితమైన అభిప్రాయం నాయకుడు యందు ఉంటుంది.
తను నమ్మిన సిద్దాంతమునకు చివరి వరకు కట్టుబడి ఉండి, ఆసిద్దాంతంలోకి ఇతరులను ఆకట్టుకోగలుగుతారు.
ప్రధానంగా నాయకుడిలో ప్రకాశించే మరో గుణం విషయమును పూర్తిగా వినడం… విన్న విషయములో వాస్తవితను అంచనా వేయగలగడం…
ఇంకా అనాలోచితంగా మాట్లాడకుండా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉండడం..
ఇలాంటి మరిన్ని లక్షణాలు వలన ఒక నాయకుడు ఒక వర్గమును కానీ, ఒక సంఘమును కానీ, ఒక ప్రాంతమును కానీ, ఒక వ్యవస్థను కానీ సమర్ధవంతంగా ముందకు నడిపించగలుగుతారు.
సమాజంలో నాయకుడు ఎలా పుట్టుకొస్తాడు?
కొందరు నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నట్టుగానే, ఆటలలోనూ నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. కొందరు విద్యావిషయాలలో నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.
మరి కొందరు చిన్న నాటి నుండి తాము ఉన్న అన్ని రంగాలలో నాయకత్వపు లక్షణాలతో ఒక నాయకుడుగానే పనిచేస్తూ ఉంటారు.
జీవితంలో ఎదగాలనే తపనతో ఉంటూ, నాయకత్వ లక్షణాలు కలిగినవారు తమ చుట్టూ పరిస్థితులపై పూర్తి అవగాహనను పెంచుకుంటూ ఉంటారు.
సమాజాన్ని సునిశితమైన పరిశీలన చేస్తూ, సమాజంలో సమస్యలపై దృష్టి సారిస్తూ, వాటిపై అవగాహన తెచ్చుకుంటూ ఉంటారు.
విశిష్టమైన లక్షణాలు కలిగిన వ్యక్తి ఒక వ్యవస్థలో చేరితే, అచిర కాలంలోనే ఒక పదిమందిని శాషించే అధికారిగా మారతారు. అలాగే ఒక విశ్వాసం వైపు మళ్ళితే, ఆ విశ్వాసంలోకి పదిమందిని తీసుకుని రాగలుగుతారు. ఒక సామాజిక అంశంవైపు దృష్టిసారిస్తే, ఆసమస్య పరిష్కారం కోసం పాటుపడతారు… పదిమందిని ప్రభావితం చేసేవిధంగా మాట్లాడగలుగుతారు.
ఇలా తమ ప్రతిభను తాము ఎరుగుతూ, సమస్యలపై పోకస్ చేస్తూ ఉంటారు… సమాజంలో అలాంటి సమస్య రాగానే స్పందిస్తారు… పదిమందికి మార్గదర్శకంగా నిలుస్తారు.
సమాజంలో సమస్య పుట్టిననాడే, ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక నాయకుడు సమాజంలో ఉంటూనే ఉంటాడు…
జనం మెచ్చిన నాయకుడు నిజమైన నాయకుడు
ఆ సమస్య ప్రజలను పట్టుకున్నప్పుడు, ఆ ప్రజల నుండే నాయకుడు పుట్టుకొస్తాడు… ఆ ప్రజలకు నాయకత్వం వహిస్తాడు…
జనాలు మెచ్చిన నాయకుడు జనుల కోసం పాటు పడతాడు.. ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించడం నాయకుడి గొప్పలక్షణంగా చెబుతారు.
వ్యవస్థలో కొందరికి నాయకత్వం వహించే నాయకుడు, తన ఎదుగుదల కన్నా తనను నమ్మినవారి బాగోగులు, తను పనిచేస్తున్న సంస్థ యొక్క బాగోగులను మాత్రమే చూస్తూ ఉంటాడు. ఆపై తనపై తను శ్రద్దతో ఉంటాడు.
సామాజిక శ్రేయస్సును కాంక్షించే నాయకుడు వ్యక్తిగత ఇష్టాఇష్టాలు కన్నా సామాజిక భద్రతనే కోరుకుంటూ ఉంటారు… సమాజం కోసం త్యాగం చేయడానికైనా నాయకుడు సిద్దపడతాడు.. అలాంటి నాయకుడినే ప్రజలు మెచ్చుకుంటారు.
జనం మెచ్చిన నాయకుడు విశేష అభిమానులను కలిగి ఉంటాడు. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా సమాజంలో మెసులుతూ ఉంటాడు..
తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట అంటారు.
ఇలా వ్యాసం విషయమును సహేతుకంగా వివరిస్తుంది. సమస్య తీవ్రతను సమగ్రంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి గొప్పతనం కీర్తిస్తుంది. ఒక సంఘటన యొక్క తీరు దాని ఫలితం, సామాజిక ప్రభావం గురించి తెలియజేస్తుంది. వ్యాసం ఒక అవగాహన కల్పించడంలో టీచర్ వలె ఉంటుంది.
తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ వ్యాసం వ్రాయమంటారు. అంటే వ్యాసం ఒక వస్తువు లేదా విషయం లేదా ప్రాంతం లేదా ఒక విధానం లేదా చరిత్ర ఏదైనా గొప్పతనం గురించి చక్కగా వివరించగలదు.
వ్యాసం వలన వ్యక్తికి విషయంలోని సారం తెలియబడుతుంది. సారాంశం కూడి అర్ధవంతమైన సమాచారం అందించే వ్యాసం ఏదో ఒక సామాజిక ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని వ్రాయబడతాయి. అటువంటే వ్యాసాల వలన సామాజిక అవగాహన పెరుగుతుంది.
ఆ ఒక విషయమును విపులంగా వివరణతో విశ్లేషించబడి ఉంటుంది. వ్యాసం నందు మొదటిగా విషయము శీర్షిక ఉంటుంది. ఆపై ఉపోద్గాతము ఉంటుంది.
వ్యాసం గురించి
ఉపోద్గాతము తర్వాత వ్యాసంలో విషయమును గురించి వివరాలతో వివరిస్తూ సాగుతుంది. విషయము యొక్క విశిష్టత, విషయము యొక్క ఆవశ్యకత, విషయము యొక్క ప్రభావం, విషయము యొక్క లాభ నష్టాలు తదితర అంశముల వారీ విషయ విశ్లేషణ వ్యాసంలో వ్రాయబడి ఉంటుంది.
ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ గురించి వ్యాసం వ్రాయాలంటే… ముందుగా స్మార్ట్ ఫోన్ ఎవరు కనిపెట్టారు. ? ఎప్పుడు కనిపెట్టారు? ఎవరు డవలప్ చేశారు? అందులో పనిచేసే సాఫ్ట్ వేర్? వంటివి వ్రాయాలి.
విషయము యొక్క విశిష్టత: అంటే మొబైల్ ఉంది. దాని ప్రధాన ప్రయోజనం దానియందు విశిష్టమైనదిగా ఉంటుంది. ఒక సాదారణ కంప్యూటర్ ద్వారా నిర్వహించే పనులు స్మార్ట్ ఫోను ద్వారా కూడా చేయవచ్చును. ఈరోజులలో స్మార్ట్ ఫోనులు మల్టి టాస్కింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అలా ఏదైనా వస్తువు యొక్క విశిష్టతను వివరించడం వ్యాసంలో ఉంటుంది.
ఆవశ్యకత: అంటే ఒక విషయము యొక్క ఆవశ్యకత ప్రస్తుత సమాజంలో ఎంతవరకు ఉంది? అనే విషయం చెప్పడాన్ని ఆవశ్యకత అంటారు. అలా ఒక మొబైల్ ఫోన్ ఆవశ్యకత గురించి తెలియజేయాలంటే… స్మార్ట్ ఫోను ద్వారా ఆన్ లైన్ చెల్లింపు చేసేయవచ్చును. స్మార్ట్ ఫోను ద్వారా షాపింగ్ చేయవచ్చును. స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యనభ్యసించవచ్చును… నేడు స్మార్ట్ ఫోను మనిషి జీవితంలో ఒక బాగమై ఉంది. కావునా మొబైల్ ఫోన్ నేటి రోజులలో అందరికీ అవసరమే అవుతుంది.
వ్యాసం ప్రభావం
ప్రభావం: ఒక విషయము ప్రస్తుత పరిస్థితలలో ఎలాంటి ప్రభావం సమాజం మీద చూపుతుంది? ఆ విషయము వలన సమాజంపై భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రభావం చూపవచ్చును..? ఇలాంటి ప్రశ్నలతో విషయ ప్రభావం ఎలా ఉంటుందో వివరించడం… ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటే, అది వ్యక్తి జీవితంలో భాగమై ఉంది. ఎక్కడికి వెళ్ళినా వెంట స్మార్ట్ ఫోన్ ఉండాలి.
స్మార్ట్ ఫోను వలన అనే ఆన్ లైన్ లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చును. అయితే స్మార్ట్ ఫోనులో అంతర్జాలం ద్వారా వచ్చే అనేక మంచి చెడు విషయాలను చూపుతుంది. కాబట్టి యువత చెడువైపు ఆకర్షితమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. భవిష్యత్తులో అనేక మార్పులు సమాజంలో మొబైల్ ఫోను ద్వారా జరగవచ్చును… ఇలా ప్రభావం గురించి వివరించడం.. ఇంకా వివరంగా వ్యాసంలో వివరించవచ్చును.
లాభనష్టాలు: ఒక విషయముల వలన సమాజానికి ఒనగూరే పూర్తి ప్రయోజనాలు, పూర్తి నష్టాలు పాయింట్ల వారీ తెలియజేయడం.
మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు చెల్లించవచ్చును
స్మార్ట్ ఫోను ద్వారా ఎవరైనా ఎక్కడినుండైనా ఎక్కడివారితోనైనా కమ్యూనికేట్ చేయవచ్చును.
ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు అన్నట్లుగా అనిపిస్తుంటుంది.
ఒక రోజంతా కరెంటు లేకపోతే చాలా పనులకు ఆటంకం ఏర్పడేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఆగినా అదే పరిస్థితి.
ఇంటర్నెట్ అంతగా మనలో బాగస్వామి అయ్యింది. ప్రతివారి చేతిలోనూ ఇంటర్ నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కనబడుతుంది. నెట్టింట్లో కాసేపయినా కాలక్షేపం చేయకుండా ఉండనివారుండరు.
అలా మనిషి ఇంటర్నెట్ మరొక వర్చువల్ లోకాన్ని క్రియేట్ చేసింది. ఇలా ఇంటర్నెట్ వ్యక్తిగతంగా ప్రతీ వ్యక్తికి దగ్గర అయ్యింది. అలాగే ప్రతి కంపెనీలో ఇంటర్నెట్ తప్పనిసరి అయ్యింది. టివిలేని ఇల్లు, ఇంటర్నెట్ లేని వ్యవస్థ ఉండదు.
ప్రతి మనిషి జీవితంలోనూ ఇంటర్నెట్ వాడుక బాగమైంది. ప్రత కంపెనీకి అవసరం అయ్యింది. ఇంటర్నెట్ సేవలు అందించే వ్యవస్థలు పుట్టాయి.
తెలుగులో ఇంటర్నెట్ అంటే అంతర్జాలం అంటారు. అంటే కంప్యూటర్ – కంప్యూటర్స్ – ఆల్ కంప్యూటర్స్…
ఒక కంప్యూటర్ ప్రపంచంలో ఏ కంప్యూటర్ కు అయిన అనుసంధానం చేయడానికి లభించే ఆకాశ మార్గాలు అంతర్జాలం అంటారు. ఒక కంప్యూటర్ ఒక చోటనే ఉంటుంది… కానీ అందులో నుండి ప్రపంచంలో ఎక్కడి కంప్యూటర్ తో అయినా సంభాషించేకునే విధానం ఇంటర్నెట్ కల్పిస్తుంది.
ఒక వీధి నుండి మరొక వీధికి అనుసంధానం ఉంటుంది. అలాగే అన్ని వీధులు కలిపి ఒక ఊరితో అనుసంధానంగా ఉంటాయి. అలా ఊళ్ళన్ని ప్రపంచంతో రోడ్డు మార్గంలో, రైలు మార్గంలో అనుసంధానం అయి ఉంటాయి. అలాగే కంప్యూటర్స్ కూడా నెట్ వర్క్ ద్వారా అనేక కంప్యూటర్లకు అనుసంధానం అయే మార్గములను ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్ ఒక నెట్ వలె ఉంటుంది. అంటే ఒక వలలాగా ఉంటుంది.
ఇంటర్నెట్ అంటే ఏమిటి?
ఇలా కంప్యూటర్లు అంతర్జాలంతో అనుసంధానం అయి ఉండడం వలన కమ్యూనికేషన్ వేగం పెరిగింది. ఒకరు ఒకచోటే ఉంటూ మరొక వ్యక్తితో సంభాషించడానికి అంతర్జాలం బాగా ఉపయగపడుతుంది.
ఒక ఆఫీసులో కూర్చుని ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్న వ్యక్తితోనైనా సంభాషించవచ్చును. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వలన ఎక్కడ ఉన్న వ్యక్తి అక్కడి నుండే ప్రపంచంలో మరొక వ్యక్తితో సంభాషణ చేయవచ్చును.
ఒకరోజు కరెంటు సరఫరా ఆగిపోతే కొన్ని కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒకరోజు ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోతే కొన్ని కోట్ల నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ముఖ్యంగా ఎవరు ప్రపంచలోని ఎక్కడి నుండైన మరొక వ్యక్తితో మాట్లాడవచ్చును. దీనివలన సందేశం చేరవేయడానికి ఒక వ్యక్తి ప్రయాణం చేయవలసిన పని లేదు.
ఒకప్పుడు పోస్టు కార్డ్ ద్వారా సందేశాలు కొన్ని రోజులకు చేరేవి… ఇప్పుడు ఒక సెకనులో కాలంలోనే సందేశం ఒకరి నుండి మరొకరి చేరిపోతుంది. తద్వార విలువైన కాలం వృధా కాదు.
వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యంతో ఎక్కడెక్కడో దూరంగా ఉండే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చును. దీని వలన వ్యక్తిగత ప్రయాణపు అవసరాలు తగ్గాయి.
ఇంటర్నెట్ ఆధారిత పరికరాలతో పనులు చాలా వేగంగా సాగుతాయి. అన్నింటికి మనిషిపై ఆధారపడవలసిన పనిలేదు.
వ్యాపార విస్తరణకు ఇంటర్నెట్ చాలా ఉపయోగపడుతుంది. అనేక సేవలలో కూడా ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉంటుంది.
ఎక్కౌంటింగ్, స్టాటిక్స్, బ్యాంకింగ్, మీడియా వంటి రంగాలలో ఇంటర్నెట్ చాలా ఉపయోగకరంగా ఉంది.
వ్యక్తిగతంగానూ స్మార్ట్ ఫోను రూపంలో ఇంటర్నెట్ ప్రతిమనిషిని ఆన్ లైన్ ప్రపంచంతో అనుసంధానం ఏర్పడుతుంది. తద్వార వ్యక్తిగత పనులు కూడా ఫోన్ నుండే నిర్వహించుకోవచ్చును.
మొబైల్ ద్వారా ఒకరి నుండి ఒకరికి మనీ ట్రాన్సఫర్ చేయవచ్చును.
స్మార్ట్ ఫోను ద్వారా వివిధ నెలవారీ బిల్లుల చెల్లింపులు చేయవచ్చును.
ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు
ఇంటర్నెట్ అన్నింటిలోనూ వేగం పెంచింది. వ్యక్తిగతంగానూ, వ్యవస్థాగతంగానూ పనివేగం పెరగడానికి ఇంటర్నెట్ సాయపడుతుంది.
వ్యక్తి జీవనంలో ఒక భాగంగా మారిన ఇంటర్నెట్ వలన ఉపయోగాలు అనేకంగా ఉన్నాయి. అలాగే నష్టం కూడా కొంత ఉందనే వాదన ఉంది.
ఇంటర్నెట్ వలన వ్యక్తికి నష్టం కలిగే అవకాశాలు
వ్యక్తిగత డేటా అందరికీ అందుబాటులో ఉంటుంది. దీని వలప వ్యక్తిగత డేటా భద్రత విషయంలో గ్యారంటీ లేకపోవచ్చును.
ఒక వ్యక్తి వ్యక్తిగత విషయాలు, ఆ వ్యక్తి అనుమతి లేకుండానే మరొకరికి తెలిసే అవకాశం ఉంది.
వర్చువల్ మీటింగులకు అలవాటుపడితే, పర్సనల్ మీటింగులు తగ్గుతాయి… ఆప్యాయతలు కూడా కృత్రిమమైనవిగా మారే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన స్మార్ట్ ఫోన్ వ్యక్తిని తనచుట్టూ ఉండే ప్రపంచం నుండి మరొక ప్రపంచంలోకి వెళుతూ ఉంటుంది. ఇది అతి అయితే మనో రుగ్మతలు కలిగే అవకాశం ఉంటుంది.
మానవ సంబంధాలు కృత్రిమమైనవిగా మారే అవకాశాలు ఇంటర్నెట్ పరికరాలు సృష్టించే అవకాశం ఎక్కువ.
సమాజానికి వనరులు ఎంత అవసరమో, విలువలు అంతే అవసరం. సహజమైన బంధాలు మద్య సహజమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో కాఠిన్యత ఉండదు.
కానీ కృత్రిమమైన బంధాలలో అప్యాయత కన్నా అవసరానికి ప్రధాన్యత పెరిగి కాఠిన్యతకు దారి తీస్తుంది.
ఈరోజులో నెట్ అవసరం రోజు రోజుకు పెరుగుతుంది. అవసరాలు అలాగే ఏర్పడుతున్నాయి. ఇంటర్నెట్ లేకుండా రోజు గడవని స్థితికి కూడా సమాజం వెళ్ళే అవకాశాలు ఎక్కువ. ఎంత నెట్ అవసరం పెరుగుతుందో అంత ఒంటరితనం పెరిగే అవకాశం కూడా ఉంది.
ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు ఇంటర్నెట్ ఉపయోగించుకుంటూ సంతోషించే వ్యక్తి, తనపై ఇంటర్నెట్ ప్రభావంఏవిధంగా ఉందో పరిశీలించుకోవడం వలప ఇంటర్నెట్ ఉపయోగించుకుంటూ, ఇంటర్నెట్ మాయలో పడకుండా ఉండవచ్చును.
వేడుక వలె జరుపుకనే పండుగ అనగానే ముందుగా మనసులో సంతోషం కలుగుతుంది. పండుగ అనగానే గుడికి వెళ్ళడం, ఇంట్లో దైవమునకు ప్రత్యేక పూజలు చేయడం, బంధువులను ఆహ్వానించడం మొదలైనవి ఉంటాయి.
సామూహికంగా జరిగే పండుగలు జాతరలుగా ఉంటాయి. కుటుంబపరంగా కుటుంబ పెద్ద ఆధ్వర్యంలో జరిగేవి కొన్ని పండుగలు ఉంటాయి.
అయితే కొన్ని పండుగలకు సామూహికంగానూ, కుటుంబంలోనూ కూడా కార్యక్రమములు నిర్వహిస్తారు. కొన్ని పండుగలు కేవలం కుటుంబం వరకే పరిమితం అవుతాయి. కుటుంబంలో బంధువులతో కలిసి పండుగ నిర్వహించుకుంటూ ఉంటారు.
ఈ పండుగలు వచ్చినప్పుడు పండుగ ప్రాముఖ్యతను బట్టి, ప్రధానంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కుటుంబ పెద్ద తన ధర్మపత్ని సమేతంగా కుటుంబ క్షేమం కోసం పూజలు జరుపుకుంటారు. కుటుంబంతో కలసి దైవ దర్శనాలు చేసుకుంటారు.
కాలగమనంలో సంవత్సరంలో కొన్ని మాసాలలో వచ్చే కొన్ని తిధులు విశిష్టమైనవిగా ఉంటాయి. అటువంటి తిధులలో దైవమునకు పూజలు చేయడం వలన దైవకృప, ఆకుటుంబంపై ఉంటుందనే సంప్రదాయం ఆనాదిగా భారతదేశంలో ఉంది.
ఆ ప్రకారంగా పూర్వకాలంలో ఋషులు నిర్ధేశించిన తిధుల ప్రకారం మనకు ఒక సంవత్సరంలో పలు పండుగలు వస్తూ ఉంటాయి. తిధి ప్రాధన్యతను బట్టి పండుగు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రముఖమైన పండుగలలో ఉగాది, శ్రీరామనవమి, వరలక్ష్మీవ్రతం, వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి తదితర పండుగలు ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
ఋషులు నిర్ధేశించిన కొన్ని తిధులు పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం
వినాయక చవితి బాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి తిధిని వినాయక చతుర్ధిగా జరుపుకుంటారు. అలాగే ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి తిధిని విజయదశమిగా జరుపుకుంటారు.
కార్తీకమాసం ప్రారంభానికి ముందు అమావాస్య దీపావళి అమావాస్య.. ఆరోజు దీపాలన్నింటిని కొన్ని వరుసలుగా పెట్టి దీపాలను వెలిగించడం చేస్తూ జరుపుకునే దీపావళి పండుగ ప్రాముఖ్యత గురించి పురాణ కధలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఇలా కొన్ని ముఖ్య తిధులలో పండుగలు సనాతన సంప్రదాయంలో ఋషుల ద్వారా భారతదేశంలో ఆచారంగా జరుగుతూ ఉంటాయి.
భోగి, సంక్రాంతి, కనుమ, రధసప్తమి, మహాశివరాత్రి, శ్రీరామనవమి, వరలక్ష్మీ వ్రతం, కృష్ణ జన్మాష్టమి, వినాయక చతుర్ధి, విజయదశమి, అట్లతద్ది, దీపావళి, లక్ష్మీపూజ, సుబ్రహ్మణ్య షష్ఠి పండుగలు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు.
ఇవే కాకుండా ప్రత్యేక తిధులలో వ్యక్తి స్థితిని బట్టి వ్రతాలు చేయడం కూడా ఉంటుంది. ఇవి వ్యక్తిగత ఇష్టి ప్రకారం బ్రాహ్మణుల ద్వారా నిర్వహించుకుంటారు.
ఏకాదశి, శనిత్రయోదశి, ప్రదోష వ్రతం, సంకష్టహర చతుర్ధి, స్కంద షష్టి వంటి తిధులు మరియు నక్షత్రమును బట్టి బ్రాహ్మణుల సూచన మేరకు వ్యక్తిగతంగా నియమాలతో పూజలు నిర్వహిస్తారు.
సహజంగా అందరూ నిర్వహించుకునే పండుగలంటే సంక్రాంతి, మహాశివరాత్రి, వినాయక చవితి, శ్రీరామనవమి, దీపావళి వంటి మొదైలైన పండుగలు
పండుగల ప్రాముఖ్యత, పండుగలలో నియమాలు
పండుగల ప్రాముఖ్యత చాలా బాగా వ్యక్తి మనసుపై ప్రభావం చూపుతాయి. కారణం అందులో నియమాలు మనిషికి మేలు చేసేవిగా ఉంటాయని పెద్దలు అంటారు.
ముఖ్యంగా ప్రాత:కాలంలో అంటే సూర్యోదయమునకు ముందే నిద్రలేవడం.
తలస్నానం చేయడం
దృఢసంకల్పంతో శ్రేయస్సుకొరకు సంకల్పం చేయడం
పూజ కొరకు పత్రులు తీసుకురావడం
కొత్త దుస్తులు ధరించడం
ఓపిక మేరకు బ్రాహ్మణులతో పూజలు చేయించడం లేకపోతే స్వయంగా పూజ చేసుకోవడం
అందరి క్షేమం కోరుతూ ప్రకృతిలో లభించే వివిధ పత్రులతో దైవాన్ని పూజించడం
పిండివంటలు
బంధువులను ఆహ్వానించడం
గుడికి వెళ్ళి దైవదర్శనం చేయడం మొదలైనవి ఉంటాయి.
ఇవి ఒక మనిషికి కొత్త ఉత్సాహం తెచ్చేవిగాను, శరీరానికి బలాన్ని అందించేవిగానూ ఉంటాయని అంటారు.
కొత్త బట్టలు కట్టుకోవడం మనసుకు సంతోషం. బంధు మిత్రులతో కలిసి పిండివంటలు తిని ఆరగించడం శరీరమునకు, మనసుకు కూడా ఆరోగ్యం. ప్రాత:కాల సమయంలో స్నానం మరీ మంచిది. పత్రితో దైవాన్ని పూజించడం వలన కూడా అందులోని ఔషధ గుణాలు మేలు చేస్తాయని అంటారు.
ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు , ఏకాదశి తిధులు, వరలక్ష్మీవ్రతం, వినాయక చవితి, దసరా దీపావళి తదితర పం ఏఏ తేదీలలో ఏఏ రోజులలో ఏఏ పండుగలు వచ్చాయో..
జనవరి మాసంలో పండుగలు తెలుగులో
2వ తేదీ జనవరి 2021 అనగా శనివారము – సంకష్టరహర చతుర్ధి 9వ తేదీ జనవరి 2021 అనగా శనివారము– సఫల ఏకాదశి 10వ తేదీ జనవరి 2021 అనగా ఆదివారము- ప్రదోష వ్రతం 11వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము- మాస శివరాత్రి 13వ తేదీ జనవరి 2021 అనగా బుధవారము- భోగి 14వ తేదీ జనవరి 2021 అనగా గురువారము- సంక్రాంతి 14వ తేదీ జనవరి 2021 అనగా గురువారము- అమావాస్య 15వ తేదీ జనవరి 2021 అనగా శుక్రవారము- కనుమ 16వ తేదీ జనవరి 2021 అనగా శనివారము- ముక్కనుమ 18వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము- స్కందషష్ఠి 24వ తేదీ జనవరి 2021 అనగా ఆదివారము – పుత్రాద ఏకాదశి 25వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము – కూర్మ ద్వాదశి 26వ తేదీ జనవరి 2021 అనగా మంగళవారము – ప్రదోష వ్రతం
ఫిబ్రవరి మాసంలో పండుగలు తెలుగులో
6వతేదీ ఫిబ్రవరి 2021 అనగా శనివారము – ధనిష్ట కార్తె 7వతేదీ ఫిబ్రవరి 2021 అనగా ఆదివారము – షట్తిల ఏకాదశి 8వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా సోమవారము – షట్తిల ఏకాదశి 9వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా మంగళవారము – ప్రదోష వ్రతం 10వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా బుధవారము – మాసశివరాత్రి 11వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా గురువారము – అమావాస్య 16వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా మంగళవారము – వసంతపంచమి 17వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా బుధవారము – స్కందషష్ఠి 19వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా శుక్రవారము – రధసప్తమి 20వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా శనివారము – భీష్మాష్టమి 23వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా మంగళవారము – జయ ఏకాదశి 24వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా బుధవారము – భీష్మ ఏకాదశి 24వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా బుధవారము – ప్రదోశ వ్రతం 27వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా శనివారము – పౌర్ణమి
మార్చి మాసంలో పండుగలు తెలుగులో
2వతేదీ మార్చి 2021 అనగా మంగళవారము – సంకటహర చతుర్ధి 4వతేదీ మార్చి 2021 అనగా గురువారము – యశోద జయంతి 5వతేదీ మార్చి 2021 అనగా శుక్రవారము – శబరీ జయంతి 6వతేదీ మార్చి 2021 అనగా శనివారము – జానకి జయంతి 9వతేదీ మార్చి 2021 అనగా మంగళవారము – విజయ ఏకాదశి 10వతేదీ మార్చి 2021 అనగా బుధవారము – ప్రదోష వ్రతం 11వతేదీ మార్చి 2021 అనగా గురువారము – మహాశివరాత్రి 13వతేదీ మార్చి 2021 అనగా శనివారము – అమావాస్య 15వతేదీ మార్చి 2021 అనగా సోమవారము – రామకృష్ణ పరమహంస జయంతి 16వతేదీ మార్చి 2021 అనగా మంగళవారము – పొట్టి శ్రీరాములు జయంతి 19వతేదీ మార్చి 2021 అనగా శుక్రవారము – స్కందషష్ఠి 25వతేదీ మార్చి 2021 అనగా గురువారము అమల ఏకాదశి 25వతేదీ మార్చి 2021 అనగా గురువారము నరసింహ ద్వాదశి 26వతేదీ మార్చి 2021 అనగా శుక్రవారము ప్రదోష వ్రతం 28వతేదీ మార్చి 2021 అనగా ఆదివారము హోలీ, పౌర్ణమి 29వతేదీ మార్చి 2021 అనగా సోమవారము హోలీ 31వతేదీ మార్చి 2021 అనగా బుధవారము సంకటహర చతుర్ధి
ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు ఏప్రిల్ మాసంలో పండుగలు తెలుగులో
7వతేదీ ఏప్రిల్ 2021 అనగా బుధవారము – పాపవిమోచన ఏకాదశి 9వతేదీ ఏప్రిల్ 2021 అనగా శక్రవారము – ప్రదోష వ్రతం 10వతేదీ ఏప్రిల్ 2021 అనగా శనివారము – మాస శివరాత్రి 11వతేదీ ఏప్రిల్ 2021 అనగా ఆదివారము అమావాస్య 13వతేదీ ఏప్రిల్ 2021 అనగా మంగళవారము – ఉగాది 15వతేదీ ఏప్రిల్ 2021 అనగా గురువారము – గౌరీ పూజ 15వతేదీ ఏప్రిల్ 2021 అనగా గురువారము – డోల గౌరీ వ్రతం 17వతేదీ ఏప్రిల్ 2021 అనగా శనివారము – లక్ష్మీ పంచమి 18వతేదీ ఏప్రిల్ 2021 అనగా ఆదివారము – స్కందషష్ఠి 21వతేదీ ఏప్రిల్ 2021 అనగా బుధవారము – శ్రీరామనవమి 23వతేదీ ఏప్రిల్ 2021 అనగా శుక్రవారము – కామద ఏకాదశి 24వతేదీ ఏప్రిల్ 2021 అనగా శనివారము – వామన ద్వాదశి 24వతేదీ ఏప్రిల్ 2021 అనగా శనివారము – ప్రదోష వ్రతం 27వతేదీ ఏప్రిల్ 2021 అనగా మంగళవారము – చైత్ర పూర్ణిమ 30వతేదీ ఏప్రిల్ 2021 అనగా శుక్రవారము – సంకష్టహర చతుర్ది
మే మాసంలో పండుగలు తెలుగులో
7వతేదీ మే 2021 అనగా శుక్రవారము వరూధిని ఏకాదశి 8వతేదీ మే 2021 అనగా శనివారము ప్రదోష వ్రతం 8వతేదీ మే 2021 అనగా శనివారముశనిత్రయోదశి 11వతేదీ మే 2021 అనగా మంగళవారము అమావాస్య 14వతేదీ మే 2021 అనగా శుక్రవారము అక్షయతృతీయ 17వతేదీ మే 2021 అనగా సోమవారము శ్రీ ఆది శంకరాచార్య జయంతి, స్కందషష్ఠి 22వతేదీ మే 2021 అనగా శనివారము మోహినీ ఏకాదశి 23వతేదీ మే 2021 అనగా ఆదివారము మోహనీ ఏకాదశి 23వతేదీ మే 2021 అనగా ఆదివారము పరశురామ ద్వాదశి 24వతేదీ మే 2021 అనగా సోమవారము ప్రదోష వ్రతం 26వతేదీ మే 2021 అనగా బుధవారము పౌర్ణమి 27వతేదీ మే 2021 అనగా గురువారము నారద జయంతి 29వతేదీ మే 2021 అనగా శనివారము సంకష్టహర చతుర్ది
జూన్ మాసంలో పండుగలు తెలుగులో
4వతేదీ జూన్ 2021 అనగా శుక్రవారము హనుమాన్ జయంతి 6వతేదీ జూన్ 2021 అనగా ఆదివారము అపర ఏకాదశి 7వతేదీ జూన్ 2021 అనగా సోమవారము ప్రదోష వ్రతం 8వతేదీ జూన్ 2021 అనగా మంగళవారము మాస శివరాత్రి 10వతేదీ జూన్ 2021 అనగా గురువారము అమావాస్య 16వతేదీ జూన్ 2021 అనగా బుధవారము స్కందషష్ఠి 21వతేదీ జూన్ 2021 అనగా సోమవారము నిర్జల ఏకాదశి 21వతేదీ జూన్ 2021 అనగా సోమవారము రామలక్ష్మణ ద్వాదశి 22వతేదీ జూన్ 2021 అనగా మంగళవారము ప్రదోష వ్రతం 24వతేదీ జూన్ 2021 అనగా గురువారము పౌర్ణమి 27వతేదీ జూన్ 2021 అనగా ఆదివారము సంకష్టహర చతుర్ధి
జులై మాసంలో పండుగలు తెలుగులో
5వతేదీ జులై 2021 అనగా సోమవారము యోగిని ఏకాదశి 7వతేదీ జులై 2021 అనగా బుధవారము ప్రదోష వ్రతం 8వతేదీ జులై 2021 అనగా గురువారము మాస శివరాత్రి 9వతేదీ జులై 2021 అనగా శుక్రవారము అమావాస్య 12వతేదీ జులై 2021 అనగా సోమవారము పూరీ జగన్నాధస్వామి రధోత్సవం 14వతేదీ జులై 2021 అనగా గురువారము స్కందషష్ఠి 20వతేదీ జులై 2021 అనగా మంగళవారము దేవశయనీ ఏకాదశి 21వతేదీ జులై 2021 అనగా బుధవారము వాసుదేవ ద్వాదశి 21వతేదీ జులై 2021 అనగా బుధవారము ప్రదోష వ్రతం 24వతేదీ జులై 2021 అనగా శనివారము గురుపౌర్ణమి, వ్యాసపూజ 27వతేదీ జులై 2021 అనగా మంగళవారము సంకష్టహర చతుర్ధి
ఆగష్టు మాసంలో పండుగలు తెలుగులో
4వతేదీ ఆగష్టు 2021 అనగా బుధవారము కామిక ఏకాదశి 5వతేదీ ఆగష్టు 2021 అనగా గురువారము ప్రదోష వ్రతం 6వతేదీ ఆగష్టు 2021 అనగా శుక్రవారము మాస శివరాత్రి 7వతేదీ ఆగష్టు 2021 అనగా ఆదివారము అమావాస్య 13వతేదీ ఆగష్టు 2021 అనగా శుక్రవారము నాగపంచమి, స్కందషష్ఠి, కల్కి జయంతి 18వతేదీ ఆగష్టు 2021 అనగా బుధవారము పుత్రాద ఏకాదశి 19వతేదీ ఆగష్టు 2021 అనగా గురువారము దామోదర ద్వాదశి 20వతేదీ ఆగష్టు 2021 అనగా శుక్రవారము ప్రదోష వ్రతం 20వతేదీ ఆగష్టు 2021 అనగా శుక్రవారము వరలక్ష్మీ వ్రతం 22వతేదీ ఆగష్టు 2021 అనగా ఆదివారము రక్షాబంధన్, పౌర్ణమి 22వతేదీ ఆగష్టు 2021 అనగా ఆదివారము యజుర్వేద ఉపాకర్మ 25వతేదీ ఆగష్టు 2021 అనగా బుధవారము సంకష్టహర చతుర్ధి 27వతేదీ ఆగష్టు 2021 అనగా శుక్రవారము నాగపంచమి 28వతేదీ ఆగష్టు 2021 అనగా శనివారము బలరామ జయంతి 30వతేదీ ఆగష్టు 2021 అనగా సోమవారము కృష్ణ జన్మాష్టమి
ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు
సెప్టెంబర్ మాసంలో పండుగలు తెలుగులో
3వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శుక్రవారము అజ ఏకాదశి 4వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శనివారము ప్రదోష వ్రతం 4వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శనివారముశనిత్రయోదశి 05వతేదీ సెప్టెంబర్ 2021 అనగా ఆదివారము మాస శివరాత్రి 7వతేదీ సెప్టెంబర్ 2021 అనగా మంగళవారము అమావాస్య 9వతేదీ సెప్టెంబర్ 2021 అనగా గురువారము వరాహ జయంతి 10వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శుక్రవారము వినాయక చతుర్ధి 13వతేదీ సెప్టెంబర్ 2021 అనగా సోమవారము లలిత సప్తమి 14వతేదీ సెప్టెంబర్ 2021 అనగా మంగళవారము మహాలక్ష్మీవ్రతం ప్రారంభం 17వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శుక్రవారము పరివర్తినీ ఏకాదశి 17వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శుక్రవారము కల్కి ఏకాదశి 18వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శనివారము ప్రదోష వ్రతం 18వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శనివారము శనిత్రయోదశి 19వతేదీ సెప్టెంబర్ 2021 అనగా ఆదివారము అనంత పద్మనాభ వ్రతం 20వతేదీ సెప్టెంబర్ 2021 అనగా సోమవారము పౌర్ణమి 24వతేదీ సెప్టెంబర్ 2021 అనగా సంకష్టహర చతుర్ధి 28వతేదీ సెప్టెంబర్ 2021 అనగా మంగళవారము మహాలక్ష్మీ వ్రత సమాప్తం
ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు అక్టోబర్ మాసంలో పండుగలు తెలుగులో
2వతేదీ అక్టోబర్ 2021 అనగా శనివారము ఇందిరా ఏకాదశి 4వతేదీ అక్టోబర్ 2021 అనగా సోమవారము ప్రదోష వ్రతం, మాస శివరాత్రి 6వతేదీ అక్టోబర్ 2021 అనగా బుధవారము అమావాస్య 7వతేదీ అక్టోబర్ 2021 అనగా గురువారము దసరా నవరాత్రులు ప్రారంభం 13వతేదీ అక్టోబర్ 2021 అనగా బుధవారము దుర్గాష్టమి 14వతేదీ అక్టోబర్ 2021 అనగా గురువారము మహానవమి 15వతేదీ అక్టోబర్ 2021 అనగా శుక్రవారము విజయదశమి 16వతేదీ అక్టోబర్ 2021 అనగా శనివారము పాశాంకుశ ఏకాదశి 17వతేదీ అక్టోబర్ 2021 అనగా ఆదివారము పద్మనాభ ద్వాదశి 17వతేదీ అక్టోబర్ 2021 అనగా ఆదివారము ప్రదోష వ్రతం 20వతేదీ అక్టోబర్ 2021 అనగా బుధవారము పౌర్ణమి 23వతేదీ అక్టోబర్ 2021 అనగా శనివారము అట్లతద్ది 24వతేదీ అక్టోబర్ 2021 అనగా ఆదివారము సంకష్టహర చతుర్ధి
నవంబర్ మాసంలో పండుగలు తెలుగులో
1వతేదీ నవంబర్ 2021 అనగా సోమవారము రమా ఏకాదశి 2వతేదీ నవంబర్ 2021 అనగా మంగళవారము ప్రదోష వ్రతం, ధనత్రయోదశి 3వతేదీ నవంబర్ 2021 అనగా బుధవారము మాస శివరాత్రి 4వతేదీ నవంబర్ 2021 అనగా గురువారము దీపావళి 4వతేదీ నవంబర్ 2021 అనగా గురువారము దీపావళి, లక్ష్మీపూజ 05వతేదీ నవంబర్ 2021 అనగా శుక్రవారము కార్తీకమాసం ప్రారంభం 8వతేదీ నవంబర్ 2021 అనగా సోమవారము నాగులచవితి 9వతేదీ నవంబర్ 2021 అనగా మంగళవారము స్కందషష్ఠి 14వతేదీ నవంబర్ 2021 అనగా ఆదివారము దేవుత్తన ఏకాదశి 15వతేదీ నవంబర్ 2021 అనగా సోమవారము దేవుత్తన ఏకాదశి 15వతేదీ నవంబర్ 2021 అనగా సోమవారము యోగేశ్వర ద్వాదశి 16వతేదీ నవంబర్ 2021 అనగా మంగళవారము ప్రదోష వ్రతం 19వతేదీ నవంబర్ 2021 అనగా శుక్రవారము కార్తీకపౌర్ణమి 23వతేదీ నవంబర్ 2021 అనగా మంగళవారము సంకష్టహర చతుర్ధి 27వతేదీ నవంబర్ 2021 అనగా బుధవారము కాలభైరవ జయంతి 30వతేదీ నవంబర్ 2021 అనగా మంగళవారము ఉత్పన్న ఏకాదశి
డిసెంబర్ మాసంలో పండుగలు తెలుగులో
2వతేదీ డిసెంబర్ 2021 అనగా గురువారము ప్రదోష వ్రతం, మాస శివరాత్రి 4వతేదీ డిసెంబర్ 2021 అనగా శనివారము అమావాస్య 8వతేదీ డిసెంబర్ 2021 అనగా బుధవారము నాగపంచమి 9వతేదీ డిసెంబర్ 2021 అనగా గురువారము సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి 14వతేదీ డిసెంబర్ 2021 అనగా మంగళవారము మొక్షద ఏకాదశి, గీతాజయంతి 15వతేదీ డిసెంబర్ 2021 అనగా బుధవారము మత్స్య ద్వాదశి 16వతేదీ డిసెంబర్ 2021 అనగా గురువారము ప్రదోష వ్రతం 19వతేదీ డిసెంబర్ 2021 అనగా ఆదివారము పౌర్ణమి 22వతేదీ డిసెంబర్ 2021 అనగా బుధవారము సంకష్టహర చతుర్ధి 30వతేదీ డిసెంబర్ 2021 అనగా గురువారము సఫల ఏకాదశి 31వతేదీ డిసెంబర్ 2021 అనగా శుక్రవారము ప్రదోష వ్రతం
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసంమీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ముందుగా మీకు బాగా తెలిసిన వ్యక్తులలో మంచి గుణములు ఎవరిలో ఉన్నాయో ఆలోచించాలి.
అలా ఆలోచించాకా బాగా మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న పుడుతుంది.
సింపుల్… మన చుట్టూ ఉండేవారిలో ఎక్కువమంది ఎవరిని పొగుడుతున్నారో… వారిలో సహజంగానే మంచి గుణాలు ఉంటాయి.
మంచి గుణాలు అంటే ఉపకారం చేయడం, దానం చేయడం, చెప్పిన మాట వినడం, సాయం చేసే గుణం కలిగి ఉండడం మొదలైనవి…
ఒక వ్యక్తి గురించి వ్యాసం వ్రాయాలంటే, ఆ వ్యక్తి గురించిన గుణగణములు తెలియాలి. ముఖ్యంగా ఆవ్యక్తిలో ప్రధానమైన మంచి గుణములు తెలియాలి.
అందరికీ నచ్చిన ఆ గుణములు గురించి మనకు తెలియాలి. సాధారణంగా వ్యాసరచన చేస్తున్నామంటే, అతని పాపులరిటి కలిగిన వ్యక్తి అయి ఉంటాడు.
కనుక అతని గుణగణాలు అందరికీ తెలిసినవే ఉంంటాయి. వాటిని మనం వార్తా పత్రికలు, టివిలు, ఆన్ లైన్ న్యూస్ చానల్స్ ద్వారా తెలుసుకోవచ్చును.
ఇంకా మన చుట్టుప్రక్కల ఉండే కొందరు పెద్ద మనుషుల గురించి కూడా మన చుట్టూ ఉండేవారు మాట్లాడుకుంటూ ఉంటారు. వారి గురించి మనకు మాములుగానే తెలిసి ఉంటుంది.
అప్పుడు ఆ వ్యక్తి పేరు, పుట్టిన ఊరు, పుట్టిన తేది, పెరిగిన నేపధ్యం, చదువు, వృత్తి ఉద్యోగాలు, బంధు మిత్రులను పరిచయం చేస్తూ క్లుప్తంగా వివరించాలి.
ఆ తర్వాత అతని పుట్టిన నాటి నుండి అతని జీవితంపై ప్రభావం చూపిన సంఘటనలు వ్రాయాలి.
అతని జీవితంపై ప్రభావం చూపిన వ్యక్తులు, అతని జీవితంలో మార్పుకు నాంది పలికిన మలుపులు… తెలుసుకుని వాటి గురించి వ్రాయాలి…
ఇవి పూర్తయ్యాక ప్రధానముగా వ్యక్తి సమాజంలో కీర్తిగడించిన అంశమును గురించి వ్యాసములో విపులంగా విస్తారంగా వివరించాలి.
మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, బాగంగా అందరికీ తెలిసిన నరేంద్ర మోదీ గారి గురించి వ్యాసం
క్లుప్తంగా వివరణ:నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధానమంత్రి. అంతకుముందు ఆయన గుజరాత్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రి. నరేంద్రమోదీ అసలు పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఈయన 1950 సెస్టెంబర్ 17న జన్మించారు. ఈయన తండ్రి దామోదర్ దాస్, తల్లి హీరాబెన్ మోదీ… రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఈయన శాకాహారి….
ఇప్పుడు నరేంద్ర మోదీ గారి బాల్యం గురించి
గుజరాత్లోని మెహ్సానా జిల్లాలోని వాద్నగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో నరేంద్ర మోదీ జన్మించారు. అక్కడి స్థానిక పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయంలో నరేంద్రమోదీగారు రాజనీతి శాస్త్రములో మాస్టర్స్ డిగ్రి పట్టభద్రులయ్యారు. ఈయన విద్యార్ధి దశలోనే అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ నాయకుడిగా పనిచేశారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో ఒక మారుమూల టీ అమ్మిన ఈయన జీవితం అనేక మలుపులు తిరిగింది.
భారతీయ జనతా పార్టీలో నరేంద్రమోదీ 1987 సంవత్సరంలో చేరారు. అచిర కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అందుకున్నారు. ఎల్.కె. అద్వానీ నేతృత్వంలో 1990లో జరిగిన అయోధ్య రధయాత్రలో ఇన్ చార్జ్ గా పనిచేశారు. అదేవిధంగా మురళీమనోహర్ జోషి తలపెట్టిన కన్యాకుమారి టు కాశ్మీర్ రధయాత్రకు కూడా ఇన్ చార్జ్ గా పనిచేశారు. అనతి కాలంలోనే కేశుభాయ్ పటేల్ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. 2001లో ముఖ్యమంత్రిగా మారిన మోదీగారు ప్రధాని అయ్యేవరకు గుజరాత్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రిగానే పనిచేస్తూ ఉన్నారు.
దేశప్రధానిగా నరేంద్ర మోదీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాని అభ్యర్దిగా పోటీ చేశారు. అంచనాలకు భిన్నంగా నరేంద్రమోదీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలలో విజయం సాధించింది. ఎంపిగా పోటీ చేసి, గెలిచిన తొలిసారే ప్రధాని పదవిని అధిష్టించారు.
ఈయన దేశప్రధానిగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పెద్ద నోట్ల రద్దు ప్రక్రియగా ఉంది. అర్ధరాత్రి అప్పటికప్పుడు పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ దేశ మొత్తం ఆశ్చర్యపోయింది. అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. జిఎస్టీ అమలు చేయడంలో కూడా కృషి జరిగింది. ఇంకా మూడు సార్లు తలాక్ రద్దు, పారసత్వం సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా(NRC) అమలు వంటివి ఉన్నాయి
2014 మే 26న భారతదేశ పదిహేనవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతున్నారు.
విశిష్ట లక్షణాలతో భారతదేశాన్ని ముందుండి ముందుకు నడిపిస్తున్నందుకు గాను మోడీకి అవార్డు అవార్డు దక్కింది జనవరి 14 2019 లో న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకున్నారు.
పాపులర్ ప్రధానమంత్రిగా, అశేష ప్రజాధరణ కలిగిన నాయకుడు
నరేంద్ర మోదీ ప్రత్యేకతలు
రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు.
గుజరాత్ రాష్ట్రమునకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.
అందరికీ తెలిసిన వ్యక్తి గురించి వ్రాస్తే, వ్రాయడం ఎలా అనే కాన్సెప్ట్ అర్ధం అవుతుందిన నరేంద్రమోదీ గారి గురించి ఒక వ్యాసంలోకి తీసుకురావడం జరిగింది.
ఈయన గురించి ఇంకా చాలా వివరాలు ఆన్ లైన్లో పబ్లిక్ డొమైన్లలో లభిస్తుంది.
వ్యాసం ప్రారంభం, వ్యాసం ముగింపు క్లుప్తంగా అర్ధవంతంగా ఉంటే బాగుంటుంది.
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం అంటే మనం ఎరిగినవారిలో మంచి గుణాలు కలిగిన వారిని ఎంచుకోవాలి.
మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ఆ వ్యక్తి గురించి తెలిసినవారు ఏమనుకుంటున్నారో చూడాలి. లేదా ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. అప్పుడే వాస్తవాలు వ్రాయగలుతాము.
భారతదేశంలోమన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు ఈ పోస్టులో చూద్దాం… ఇండియన్ గవర్నమెంట్ చైనా యాప్స్ బ్యాన్ చేశాకా… ఇండియన్ యాప్స్ ఏమిటి? అనే ప్రశ్న సాధారణం.
మన ఇండియాలో మన ఇండియన్ డవలప్ చేసిన మొబైల్ యాప్స్ మన ఇండియన్ ఫోన్లలో ఉండాలని…
లేదా మన ఇండియన్ కంపెనీస్ డవలప్ చేయించిన మొబైల్ యాప్స్ మన స్మార్ట్ ఫోన్లలో ఉండాలని… మన భావనగా ఉంది.
చైనా ఆగడాలకు చెక్ పెట్టే నేపధ్యంలో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా చైనా యాప్స్ ఉపయోగించకూడదని నిషేదం విధించింది.
కొన్ని రకాల చైనా యాప్స్ మనకు వాడుకలో అలవాటుగా మారాయి… అలాంటి వాటిలో షేర్ ఇట్, లైకీ, హలో, టిక్ టాక్ వంటి మొబైల్ యాప్స్…
మనదేశంలో టెక్ సంస్థలు అందించే కొన్ని ఇండియన్ మొబైల్ యాప్స్... ఇంకా తెలుగులో ఉండే మరికొన్ని మొబైల్ యాప్స్…
కొన్ని మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు
గానా మ్యూజిక్ మొబైల్ యాప్
గానా మొబైల్ యాప్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులను అందిస్తుంది. మూడు మిలియన్ సాంగ్స్ వివిధ ఇండియన్ లాంగ్వేజులలో లభిస్తాయి. లక్షల మంది విజిట్ చేసే మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…
వింక్ మ్యూజిక్ మొబైల్ యాప్
ఇది మరొక మన ఇండియన్ మ్యూజిక్ మొబైల్ యాప్… లక్షల మందిచేత డౌన్ లోడ్ చేయబడిన ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…
హాట్ స్టార్ స్ట్రీమింగ్ మొబైల్ యాప్
స్ట్రీమింగ్ మొబైల్ యాప్… ఈ యాప్ ద్వారా లైవ్ క్రికెట్ మ్యాచులు వాచ్ చేయవచ్చును. అయితే ఫ్రీగా వాచ్ చేయాలంటే, మొబైల్ నెట్ వర్క్ ఆఫర్ కలిగి ఉండాలి. ప్రీమియం చార్జెస్ చెల్లించి స్ట్రీమింగ్ వీడియోలు వీక్షించవచ్చును. ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…
ఫ్లిప్ కార్ట్ షాపింగ్ మొబైల్ యాప్
షాపింగ్ మొబైల్ యాప్… ఈ యాప్ నందు అనేక వస్తువులు అమ్మకాలకు ఉంటాయి. ఆన్ లైన్లో మీ మొబైల్ పరికరం నుండి వస్తువులను ఆర్డర్ చేయవచ్చును. బాగా ప్రసిద్ది చెందిన ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…
జొమాటో ఫుడ్ ఆర్డర్ మొబైల్ యాప్
ఫుడ్ ఆర్డర్ మీ మొబైల్ ఫోన్ చేయాలంటే, జొమాటో మొబైల్ యాప్ మీ ఫోనులో ఉండాల్సిందే… ఇది ఒక పాపులర్ దేశంలో వివిధ ప్రధాన నగరాలలో ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తుంది. ఇది మీకు అవసరమైతే గూగుల్ ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…
రెడ్ బస్ ఆన్ టికెట్ బుకింగ్ మొబైల్ యాప్
రెడ్ బస్ యాప్ ఉంటే, బస్ టిక్కెట్ చేతిలో ఉన్నట్టే అంటూ ప్రచారం కూడా ఉంది. అంతగా పాపులర్ చెందిన రెడ్ బస్ ఇండియన్ మొబైల్ యాప్ ద్వారా బస్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చును… గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు మరి కొన్ని యాప్స్
ఓలా క్యాబ్ ఆన్ లైన్ బుకింగ్ మొబైల్ యాప్
మీరు నించున్న చోట నుండే మీ మొబైల్ య నుండి క్యాబ్ బుక్ చేయవచ్చును. ట్రైన్, ఫ్లైట్ ద్వారా ట్రావెలింగ్ చేసేవారికి ఈ యాప్ ఉపయోగం… ఓలా యాప్ ద్వారా ప్రధాన పట్టణ, నగరాలలో క్యాబ్ బుకింగ్ చేయవచ్చును. ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
హైక్ మెసెజింగ్ మొబైల్ యాప్
ఇది ఇండియన్ మెసెజింగ్ మొబైల్ యాప్. దీనిలో చాటింగ్ చేయవచ్చును. లుడో గేమ్ ఆడవచ్చును. మరియు మెసెజింగ్ చేయవచ్చును. ఈ హైక్ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
కూపన్ దునియా మొబైల్ యాప్
మొబైల్ వాడకం పెరిగాకా ఆన్ లైన్ కూపన్లు కూడా బాగానే లభిస్తున్నాయి. ఇండియాలో వివిధ కంపెనీలు అందించే కూపన్స్ గురించి తెలుసుకోవడానికి ఈ కూపన్ దునియా మొబైల్ యాప్ ఉపయోగపడుతుందట… గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
న్యూస్ హంట్ మొబైల్ యాప్
మీ మొబైల్ ఫోనులో న్యూస్ ను హంటింగ్ చేయండి… న్యూస్ హంట్ మొబైల్ యాప్ డైలీ న్యూస్ హంట్ చేయండి… పాపులర్ చెందిని ఈ న్యూస్ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
అహా తెలుగు ఓటిటి మొబైల్ యాప్
తెలుగులో గల మూవీస్, వెబ్ సిరీస్, కొత్తగా రిలీజ్ మూవీస్ ఈ అహా తెలుగు మొబైల్ యాప్ ద్వారా వీక్షించవచ్చును. ప్రీమియం ప్లాన్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
షేర్ చాట్ మొబైల్ యాప్
తెలుగులో గల మరొక పాపులర్ యాప్ ఇండియన్ భాషలలో చాట్ చేయవచ్చును… పోస్టుల్ చేయవచ్చును. అపరిచిత వ్యక్తులతో చాట్ చేయవచ్చును. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
మరి కొన్ని ఇండియన్ మొబైల్ యాప్స్
లైక్లి షార్ట్ వీడియో స్టేటస్ మొబైల్ యాప్
మన ఇండియన్ పాపులర్ మొబైల్ యాప్స్ లిస్టులో ఇది ఒక్కటి. ఈ యాప్ ద్వారా 30సెకండ్స్ వీడియోలను ఆన్ లైన్లో షేర్ చేయవచ్చును. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
డ్రైవింగ్ అకాడమీ మొబైల్ గేమ్
మన ఇండియన్ పాపులర్ మొబైల్ గేమ్ ఈ 3డి గేమ్ ద్వారా కార్ రేసింగ్ విత్ డ్రైవింగ్ రూల్స్… 100 లెవల్స్ వరకు ఈ గేమ్ ఆడవచ్చును. ఈ మొబైల్ గేమ్ మీఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
ఇండియన్ ఆయిల్ ఎల్.పి.జి గ్యాస్ బుకింగ్ మొబైల్ యాప్
ఎల్.పి.జి. గ్యాస్ బుక్ చేయాలంటే, ఈ మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చును. ఇది ఇండియన్ ఆయిల్ వారి మొబైల్ యాప్. గ్యాస్ బుకింగ్ హిస్టరీ, ఎల్పిజీ గ్యాస్ బుకింగ్ డిటైల్స్ లభిస్తాయి. మీ ఫోనులో ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
ఇండియన్ రైల్ స్టేటస్ మొబైల్ యాప్
టిక్కెట్ బుక్ చేసుకున్న ట్రైన్ ఎక్కడుందో తెలియాలంటే, ఈ మొబైల్ యాప్ ద్వారా ట్రైన్ లోకేషన్ కనుగొనవచ్చును. ఇండియన్ రైల్ ట్రైన్ స్టేటస్ మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
తెలుగులో కొన్ని మొబైల్ యాప్స్
తెలుగు నీతి కధలు మొబైల్ యాప్
సంతోషం, స్నేహం, స్పూర్తి, దయ, అభిమానం, విద్య, మనీ వంటి విషయాలలో నీతిని తెలియజేసే నీతి కధలు కలిగిన మొబైల్ యాప్ తెలుగులో రీడ్ చేయాలంటే ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
తెలుగు సూక్తులు మొబైల్ యాప్
మాట సాధారణంగానే కనబడుతుంది… ఆలోచిస్తే భావం బలంగా మనసును తాకుతుంది… వాటినే సూక్తులు అంటారు. తెలుగులో సూక్తులు రీడ్ చేయడానికి మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
తెలుగు జోక్స్ మొబైల్ యాప్
తెలుగులో జోక్స్, పొడుపు కధలు, సామెతలు, కోటేషన్స్, కవితలు, ధర్మ సందేహాలు కలిగిన తెలుగు మొబైల్ యాప్… తెలుగులో ఇవి రీడ్ చేయడానికి మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
తెలుగు రాశిఫలాలు మొబైల్ యాప్
2021 తెలుగు క్యాలెండర్, దిన ఫలాలు, వార ఫలాలు, నక్షత్రం బట్టి రాశి వివరాలు మరియు పంచాంగం ఉంటుంది. డైలీ పంచాంగ చెక్ చేసుకోవచ్చును. ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
శివ మహా పురాణం మొబైల్ యాప్
పరమ శివుని గురించి తెలియజేసే శివ మహా పురాణంతో బాటు, కార్తీక పురాణం, మాఘపురాణం, శ్రీ గరుడ పురాణం, మరికొన్ని పురాణాలు తెలుగులో రీడ్ చేయడానికి ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.
పైన గల వరుస జాబితాలో గల ఇమేజులపై క్లిక్ చేయండి. తద్వారా గూగుల్ ప్లేస్టోర్ యాప్ మీ ఫోనులో ఓపెన్ అవుతంది.
గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఆయా మొబైల్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.
సూచనలు:
మీరు మీ ఆండ్రాయిడ్ ఫోనులో గల గూగుల్ ప్లేస్టోర్ నందు యాప్ ఇన్ స్టాల్ చేసుకునే ముందు, మీరు ఇన్ స్టాల్ చేయబోయే యాప్ యొక్క రివ్యూలు చదవడం మేలు.
ఏదైనా మొబైల్ యాప్ ఇన్ స్టాల్ ఫోనులో ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడు, ఆ యాప్ సైజ్ చెక్ చేసుకోవడం మంచిది…
ఇంకా ఒక మొబైల్ యాప్ ఫోనులో డౌన్ లోడ్ చేసుకునేముందు, ఆ యాప్ ప్రభావితం చేయబోయే ఫోను ఫీచర్లను కూడా సరిచూసుకోవడం మేలు.
ఎన్ని ఫీచర్లపై మొబైల్ యాప్ ప్రభావం చూపుతుందో, ఆ యాప్ వలన మీ ఫోన్ సామర్ధ్యంపైన కూడా అంతే ప్రభాం చూపే అవకాశం ఉంటుంది.
విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్….
ఆలోచనలు మనసు చేస్తూనే ఉంటుంది…. ఆలోచనలు చేయడం సహజ లక్షణం… ఆలోచించడమే అలవాటుగా ఉన్న మనసుకు, ఆలోచించడం మామూలు విషయంగానే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటిలాగానే ఆలోచిస్తుంది.
అటువంటి మనసుకు తన చుట్టూ ఉన్న సామాజిక స్థితి గతులలో వచ్చిన మార్పుల వలన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. ఎప్పుడూ ఆలోచించే మైండ్, పరిస్థితుల మార్పు వలన వచ్చిన ఆలోచనను కొత్త ఆలోచనగా మార్చుకుని సంతోషిస్తుంది… కానీ అదే ఆలోచించడం దాని సహజ లక్షణం…
అయితే మనసు సంతోషమే మనిషి సంతోషం కాబట్టి… దానికి నచ్చినట్టు ఒక్కసారి నడుచుకుంటే, అది వందసార్లు మనకు సలహాలు ఇస్తుంది… అందుకే మనసును సంతోష పెడుతూ, దానితో విజ్ఙానం పొందడం తెలివైన పని అంటారు.
మన మనసును సంతోష పెట్టే పరిస్థితులు కాలం తీసుకువస్తూ ఉంటుంది… అలాంటి వాటిలో ఆంగ్లసంవత్సరంలో మొదటిగా వచ్చేది… జనవరిఫస్ట్… అలాంటి జనవరిఫస్ట్2021 మీకు మీ కుటుంబ సభ్యులకు ఇంకా మీ స్నేహితులు బంధు మిత్రులకు సుఖ సంతోషాలను కలగజేయాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు….
విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి
ఈ 2021 సంవత్సరం కరోనా పోవాలి, సామాజిక పరిస్థితులు మరింతగా సామాన్య జీవనానికి సహకరించాలి. అందరికీ హ్యాపీ న్యూఇయర్ 2021 ఇయర్ మొత్తం సాగాలి. విష్ యు ఏ హ్యాపీ న్యూఇయర్ 2021….
హ్యాపీ హ్యాపీగా న్యూ ఇయర్ లోకి వెళుతున్నవారందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూఇయర్…. పాత సంవత్సరం2020 చేదు అనుభవాలనే మిగిల్చింది.
కానీ చేదు ఒంటికి మంచిది… అలాగే చేదు అనుభవాల వలన మనసుకు అవగాహన మరితంగా పెరుగుతుంది.
గడిచిన గతంలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, గడవాల్సిన ఈ కొత్త సంవత్సరం మనసు కొత్త ఉత్సాహంతో ఉండాలి.
ఈ2021 న్యూ ఇయర్ అందరికీ మేలైన విషయాలను అందించాలి. కాలగమనంలో మార్పులకు అనుగుణంగా మనసు ఉత్తేజభరితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ…. మరొక్కమారు హ్యాపీ న్యూఇయర్ టు ఆల్….
కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020సంవత్సరం గత సంవత్సరంగా మారుతుంది…
మిత్రులతో మీటింగులు షురు అవుతాయి. మాటలు మూటలతో మిని మీటింగ్స్ ఉంటాయి.
పాత సంవత్సరం – కొత్త సంవత్సరం సంధి కాలంలో స్నేహితులతో సంతోషంతో, గడిపేస్తూ, విషెస్ చెబుతూ గంటల కాలం కరిగిపోతుంది…
ఎవరూ ఎలా ఉన్నా కదిలే కాలంలో తేదీని మారుస్తుంది… ప్రతి న్యూఇయర్ కొందరికి కష్టంగా, కొందరికి నష్టంగా, కొందరికి అద్భుతంగానే గడిచి ఉంటుంది. కానీ ఈ2020 సంవత్సరం మాత్రం అందరికీ కష్టాలనే తీసుకువచ్చింది..
రోటీన్ కు భిన్నమైన పరిస్థితిని ప్రకృతి తీసుకువచ్చింది. 2020సం.లో అరుదైన స్థితిని ప్రపంచంలోని ప్రజలంతా ఎదుర్కొన్నారు. 2020ఆరంభమే ఆందోళనలనకు తావిస్తు ఇయర్ స్టార్ట్ అయ్యింది.
చైనాలో పుట్టిన వైరస్ ఎక్కడ ఎవరి ద్వారా ఏ ప్రాంతానికి, ఎవరెవరికి సోకి ప్రాకుతుందేమోననే ఆలోచన మాత్రం అందరిలోనూ వచ్చింది.
పదవతరగతి పాస్ కావాలనే తపనతో విద్యార్ధి సంవత్సరం ప్రారంభిస్తే, అది ఎలా గడిచిందో పదవ తరగతి పరీక్షా ఫలితాలొచ్చాకే ఆలోచిస్తాడు. అలా అందరికీ కరోనా రాకుండా, కరోనా సోకకుండా, కరోనా వ్యాప్తి చెందకుండా ఎలా గడుస్తుంది? ఇది ఆలోచన కావచ్చును. భయం కావచ్చును. ఆందోళన కావచ్చును..
సంవత్సరం ఆరంభంలో ఉన్న ఆలోచనలకు తగ్గట్టుగానే ఇయర్ మద్యలో కరోనా వ్యాప్తి చెందింది. కొన్ని చోట్ల ఆందోళనకరంగానూ కొన్ని చోట్ల భయావాహ పరిస్థితులలోనూ కాలం సాగింది. అయితే కొన్ని రోజుల పాటు ప్రజలనందరిని ఇంటికే పరిమతం చేసిందీ…కరోనా.
బిజికి భిన్నంగా కొద్దిరోజులు
మనిషి ఎప్పుడూ బిజి…బిజిగా ఉండే వ్యక్తులు ఖాళీగా ఇంటికే పరిమితం అయ్యారు. సేవలోనో, వ్యాపారంలోనో, సంస్థలోనో…. ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతూ లక్ష్యంవైపు బిజిగా సాగే కాలం కరోనా కారణంగా బిజికి భిన్నంగా కొద్దిరోజులు బ్రతకాల్సిన స్థితి ఈ 2020సంవత్సరం తీసుకువచ్చింది…
ఆర్ధికపరంగా తప్పించితే మరొక కోణంలో కూడా కరోనా వలన వచ్చిన లాక్ డౌన్ మరొక మేలును తీసుకువచ్చింది. అదే ప్రకృతిలో కాలుష్యం తగ్గడం… అంతా ఇంటికే పరిమితం కావడంతో వాహన వినియోగం తగ్గింది… వెహికల్స్ వాడకపోవడం వలన వాయుకాలుష్యం తగ్గింది. ఎక్కడా ట్రాఫిక్ లేకపోవడంతో ప్రకృతి సమతుల్యత పెరిగిందీ2020 సంవత్సరంలోనే….
ఇలా మనకీ2020 సంవత్సరంలో ఎక్కువగా ఆర్ధిక నష్టం జరిగింది. ప్రకృతి పరంగా కాలుష్య నివారణ జరిగింది. బిజి లైఫ్ నుండి కొంతకాలం తీరికగా బంధుమిత్రులతో మాట్లాడే అవకాశం అందరికీ వచ్చింది. జాగ్రత్త లేనివారికి 2020 జాగ్రత్తపై పరాకు చెప్పింది.
కరోనా ఆలోచనతోనే కొత్త సంవత్సరం ప్రారంభం…. కొత్త కరోనా ఆలోచనతో ఈ సంవత్సరం ముగింపు అయితే టీకా సిద్దమనే సంతోషకరమైన ఆలోచన మనకు బలం…
రివ్యూ2020 నుండి గుడ్ విజన్ తో 2021 కొత్త సంవత్సరంలోకి వెళ్లడమే మనకు మనోబలం. అనేక మార్పులకు 2020నాంది అయ్యింది. మార్పులు మొదలైనాయి… అవకాశాలు కొందరికి పోవచ్చును. కొందరికి రావచ్చును.
మనకు ఉన్న స్కిల్స్ ఉపయోగించి మంచి దృష్టికోణంతో ఆలోచన చేయగలిగితే 2021 సంవత్సరం అద్భుతాలకు నాంది కాగలదు…. పాఠం నేర్పిన 2020కు గుడ్ బై చెబుతూ…. 2021 వెల్కమ్ చెబుదాం….
మనకు కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో ప్రారంభం కావడానికి డిసెంబర్ 31 సెలబ్రేషన్ వస్తుంది… అన్ని మరిచి మిత్రులతో గడిపే కాలం మనకు మరింత బలాన్ని అందిస్తుంది.
ఆత్మీయుల మద్య ఆనందంగా గడిపే కాలంగా, డిసెంబర్ 31నైట్ సంతోషంతో 2020సంవత్సరానికి గుడ్ బై చెబుతూ… 2021 కొత్త సంవత్సరానికి… స్వాగతం పలుకుదాం…
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 కోట్స్ కొన్నింటిని తెలుగులో రీడ్ చేయండి
ఒక్కరోజులో జీవితం మారిపోదు
కానీ ఒక్క ఆలోచన జీవితాన్ని మలుపు తిప్పగలదు… అటువంటి ఆలోచనలు కలిగి ఉండే మనసుకు మిత్రుడు బలం… అలా నాకు బలమైన మిత్రమా నీకు నీ కుటుంబానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు….
కదిలిపోతూ కరిగిపోయే కాలంలో
పువ్వు ఒక్కపూటలో వాడిపోయిట్టుగా డిసెంబర్ 31 కాలం కరిగిపోతుంది… ఈ సమయంలో నీతోనే ఉంటే, నాకాలం వృధా కానట్టే… అటువంటి వ్యక్తిత్వం కలిగిన మిత్రమా నీకు నీకుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు.. హ్యాపీ 2022
మంచిమాట ఎప్పుడూ వినాలి అంటే..
డిసెంబర్31 న ఒక మంచిమాట వినడం కన్నా నీతో స్నేహమే నాకు మిన్న.. ఎందుకంటే నీలో ఉన్న మంచి నాకు ఎక్కడా కనబడలేదు… నీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు…
ప్రకృతికి ఇచ్చినవి తిరిగిస్తుంది…
డిసెంబర్31 మాట్లాడిన మాటలు మాత్రం తిరిగిరావు.. ఎందుకంటే అవి మాటలు కాదు…. మంచి భావనలు… నూతన సంవత్సరం శుభాకాంక్షలు..
మార్చి31 ఎక్కౌంట్స్ ఆడిట్ అయితే
డిసెంబర్ 31న మైండ్ ఆడిటింగ్ జరుగుతుంది… జనవరి ఫస్ట్ ఫ్రైస్ మైండుతో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ, హ్యాపీ న్యూ ఇయర్ 2022
31… డిసెంబర్ 2021 బై బై
ఎప్పుడూ మిత్రులతో మాటలు, సహచరులతో సన్నిహితంగా ఉంటూ…అందరిలో ఆనందం చూసే ఓ మిత్రమా డిసెంబర్ 31స్ట్ డిసెంబరుతో 2020 సంవత్సరంతో బాటు కరోనాకు బైబై చెబుతూ నీకు నీక కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు…
ఎలాంటి కరోనా అయినా నీ మనోనిబ్బరం ముందు…దిగదుడుపే… కరోనా నశించాలి.. సమాజం వర్ధిల్లాలి… అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు…
ఏడాదేడాదికి తేడా వయస్సులో ఉండవచ్చును కానీ మనసులో కాదు…
అలాగే సంవత్సరం సంవత్సరం డిసెంబర్31 కూడా వస్తుంది.. వెంటనే జనవరి ఫస్ట్ రోజుకు ఆనందంతో తీసుకుపోతుంది.. మీకు మీ కుటుంబ సభ్యులకు డిసెంబర్31త్ విషెష్…
ఇరవై ఇరవై వెళ్లింది… ఇరవైఇరవైఒక్కటి వచ్చింది…
తెచ్చింది నూతన సంవత్సరంలోని తొలిరోజుని ఆనందాల హరివిల్లుతో… మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు… హ్యాపీ 2022
డిసెంబర్31, జనవరి1 తేదీలు కాదు..
స్నేహితులతో కలిసిన అనుబంధంతో కూడిన అనుభవం… అలాంటి అందమైన అనుబంధాలు మరింతగా మీకు పెరగాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021 సంవత్సరం.
ఆనందానికి హద్దులేదు డిసెంబర్ 31న మంచి మిత్రులతో మైమరిస్తే..
మిత్రబంధం, కుటుంబ బంధం, ఇలా బంధం ఏదైన డిసెంబర్31 రోజులో అందరికీ ఆనందమే… జనవరి ఫస్ట్ సంతోషంతో సాగాలనే ఆకాంక్షల అందరిలోనూ అదే అదే భావన… హ్యాపీ2022
31డిసెంబర్2020
ఆనందమానందమాయే జనవరి ఫస్ట్ సంతోషంతో సాగాలి….
నిత్యనూతనంగా ఉండే మీ మంచి మనసుతో అందరికీ ఆనందం పంచుతూ మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకుంటూ…. సంవత్సరం సాగాలి 2022 సంతోషంతో నిండిపోవాలి…
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021 న్యూఇయర్ కోట్స్
నీకు నచ్చని రోజు నాకు నచ్చదు…
నీవు మెచ్చిన రోజు, నేను మెచ్చుతాను.. కానీ డిసెంబర్31 అందరం మెచ్చుతాం… మీకు మీ కుంటుంబ సభ్యులకు డిసెంబర్31 సంతోషంతో ముగిసి, 2022 జనవరి ఫస్ట్ ఆనందంతో ప్రారంభం కావాలి…
నాలో… నీలో… కలిగే ఒకే భావ
నూతన సంవత్సరం అందరి కోరికలు తీరాలి… అందరూ సంతోషంగా ఉండాలి… అందులో మనముండాలి… అందుకే మిత్రమా నీకు నీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు… హ్యాపీ2022
ఈ కరోనా కాలంలో కష్టాలు చూశావు… కానీ కరోనాను ధైర్యంగా ఎదుర్కొన్నావు.. కలకాలం కష్టాలు ఉండవనే నీ మనోభావనే మాకు ఆదర్శం… నీకు నీ కుటుంబ సభ్యులకు హ్యాపి 2021 విషెస్
నేస్తం నాతో లేవు కానీ నాలోనే ఉన్నావు…
గత ఏడాది ముగింపులో మన ఎడబాటు ప్రారంభం అయినా నీవు నాలోనే నిలిచావు.. నీ సర్వసమానత్వం నాలోనూ నిలిచింది… నేస్తమా… నీకు నీ కుటుంబ సభ్యులకు నూతనసంవత్సర శుభాకాంక్షలు… హ్యాపి 2021 టు యు అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్…
మరికొన్ని 2020 నుండి 2021 స్వాగతం పలుకుతూ హ్యాపీ 2021 విషెష్ కోట్స్
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 న్యూఇయర్ కోట్స్
కదిలే కాలంలో కలిగిన కరోనా వైరస్
కదిలే కాలంలో కష్టాలు వస్తాయి కానీ 2020లో కరోనా వచ్చింది. కరోనాను ఎదుర్కొని ధైర్యంగా నిలిచిన మిత్రులారా మీకు మీ బంధుమిత్రులకు కూడా 2022 సంతోషాలు నింపాలని ఆశిస్తూ… మీ మిత్రుడు.. హ్యాపీ 2022
చేయివదలని మిత్రమా నామనసులో నిన్ను వదలదు.
కష్టంలో నాచేయి వదలని ఓ మిత్రమనా నా మనసులో నీ సాయం ఎప్పటికీ ఓ పర్వతంలాగా పేరుకుపోయి ఉంటుంది… ఆ మనుసుతో మిత్రమనా నీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు… నీ కుటుంబ సభ్యులకు కూడా ఓ నేస్తమా… హ్యాపీ 2022
పాత మనిషిగా పేరు పొందినా టెక్ యుగంలో
పాత కాలంనాటి మనిషవని అలుసుగా ఆడిపోసుకున్నా, వయస్సు కాయమునకే కానీ మనసుకు కాదని, ఈ టెక్ యుగంలోనూ టెక్నాలజీతో కమ్యూనికేట్ అవుతున్న నేస్తమా…. నీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు… హ్యాపీ 2022
అదే నీవు అదే నేను కరోనా వచ్చింది… పోతుంది.
కాలంలో సంవత్సరాలు గడిచిపోయాయి… కానీ 2020లో వచ్చిన కరోన కోరలు చాచింది… అందులో చిక్కకుండా అదే నీవు అదే నేను అలాగే ఉన్నాము… కరోనా 2020లో వచ్చింది…ఎప్పుడో పోతుంది…కానీ 2021 హ్యాపీగా సాగాలి… జాగ్రత్తలతో మెలగాలి… హ్యాపీ 2021.
2020 నుండి 2021
పది పరిక్షలు వ్రాసే విద్యార్ధికి సంవత్సర కాలం ఎలా గడిచిందో తెలియదు..కానీ 2020 సంవత్సరం కాలం అందరికీ అదే విధంగా గడిచింది… భయంతో వేగంగా గడిచిన 2020, సంతోషంతో 2021 సంవత్సరం అంతా గడవాలని ఆశీస్తూ.. హ్యాపీ 2021
మార్పు మంచిదే కానీ అందరిలో మార్పు
మంచి మార్పు మనిషికి మంచినే చేస్తుంది… కరోనా 2020లో జాగ్రత్తను అందరికీ గుర్తు చేసింది… సంతోషంగానే ఉంటూ సంతోషంలో జాగ్రత్తను మరవకుండా, మెలకువతో మనతోబాటు మన సమాజాన్ని సంరక్షించుకుందాం.కరోనా బారిన పడకుండా… హ్యాపీ 2021.
వేగంగా వచ్చేవి వేగంగానే పోతాయి…
ఎంత వేగంగా వచ్చేవి అంతే వేగంతో పోతాయి… కరోనా కూడా వేగంగానే వచ్చింది… వేగంలోనూ పోతుంది… మాస్క్ కరోనా కట్టడికి సహకరించిన అందరికీ 2022 సంవత్సరం అంతా సంతోషమయం కావాలి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు
జనవరి మాసం మొదలు కానీ
ఆలోచనల దగ్గరే ఆగి ఆచరణలోకి రానీ మంచి విషయాలను ఈ2021లో ఆచరించి, మందిచే మెప్పు పొందాలని ఆశిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులకు 2021నూతన సంవత్సరం శుభాకాంక్షలు…
అందరి మేలును తలచి… తలచి…
అందరి మేలును ఆకాంక్షిస్తూ, నీమేలును మచిచే మిత్రమా నీకోసం నేను ఎప్పటికీ ఉంటాను… ఓ మంచి మిత్రమా నీకు నీకుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు… హ్యాపీ 2021…
కొత్త సంవత్సరం సంతోషంతో సాగాలని ఆకాంక్షించే తెలుగు కోట్స్ 2022
లక్షల్లో ఒక్కడిగా ఉన్నా… లక్షమందికి ఒక్కడిగా…
లక్షల మందిలో నేనూ ఒక్కడిని అనుకోకుండా లక్షమందికి ఆదర్శంగా నిలవాలనే నీ ఆశయం సిద్దించాలని కోరుకుంటూ… నీకు నీ బంధుమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు… విష్ యు హ్యాపీ న్యూఇయర్…2021
కన్నుమిన్ను కానక ప్రవర్తించేవారి వలన
కన్నుమిన్ను కానక ప్రవర్తించేవారి వలన వ్యాధి వ్యాపిస్తుంది… కానీ కరోనా కన్నుమిన్ను కానక కోరలు చాచింది… అయితేనేం మాస్స్ దెబ్బకు, సోషల్ డిస్టేన్స్ దూరానికి, సానిటైజేష్ శుభ్రతకు అది ఆమడ దూరం పారిపోవడానికి సిద్దమైంది… కాస్త జాగ్తత్తను పెంచు మిత్రమా.. హ్యాపీ 2022 ఇయర్.
నీ సహచర్యంలో నేనేర్చిన విషయాలు
నీతో కలిసి పనిచేసే అవకాశం అందించిన దైవమునకు కృతజ్ఙతలు తెలియజేస్తూ… నీకు నీ కుటుంబ సభ్యులకు సంతోషం నింపాలనీ దైవప్రార్ధన చేస్తూ… నూతన సంవత్సరం శుభాకాంక్షలు…హ్యాపీ న్యూ ఇయర్ 2021
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022
మెరుపులాంటి ఆలోచనలతో ఉపాయం చెప్పే
మెరుపులాగానే ఉపాయాలు కూడా ఉంటాయని, నీ ఆలోచనను గమనిస్తే అర్ధం అవుతుంది… మెరుగైన పనికి మెరుగైన ఆలోచనను కనబరిచే నేస్తమా… నీకు నీ బంధు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు….
అంది వచ్చిన అవకాశం అందుకోవడమే
అంది వచ్చిన అవకాశం జారవిడవడం అంటే అదృష్ఠ చేజార్చుకోవడమే… కానీ అలాంటి అవకాశం అందించిన నీకు నీ బంధు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…వెరీ వెరీ హ్యాపీ న్యూఇయర్
ఆశే అందరికీ అవకాశం కోసం
ఆశ అందరినీ ఆడిస్తుంది… ఆశలు తీరే కాలం కానీ కాలం కరోనా కాలం.. ఆశాభంగం 2020లో ఎదురైతే, 2021లో మాత్రం కొత్త ఆశలు కూడా నెరవేరాలని కోరుకుంటూ…. నూతన సంవత్సర శుభాకాంక్షలు..
తిరిగేవన్నీ తిరగని వస్తువు ఆధారంగా
తిరిగేవన్నీ తిరగని వస్తువు ఆధారంగా తిరుగుతున్నట్టు… ఆలోచన లేని చోటు చుట్టూ ఆలోచనలు కల్పించే మనసుకు శాంతి చేకూరాలనీ కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు… హ్యాపీ 2022
మంచి మాట మౌనం కన్నా
అలాంటి మంచి మాటలే మాట్లాడుతూ మౌనం వహించని మిత్రమా, నీకు నీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు… వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయన్ 2021
న్యూఇయర్ విషెష్ కోట్స్ 2022
అకారణంగా మాట్లాడకుండా
మాట మనసును తాకుతుందని, అకారణంగా మాట్లాడకుండా, ఎవ్వరినీ నొప్పించని నేస్తమా… నీకు నీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…
వచ్చే వచ్చే వాన ఆగుతుందేమో
కానీ నేస్తమా నీ స్నేహంతో నేను ఎప్పుడూ ఉంటాను… ప్రతి సంవత్సరం కలిసే సెలబ్రేట్ చేసుకుందాం… అలాగే ఈ 2021 కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2021
ఇరవైఇరవైలో అంతా గందరగోళమే
కానీ ఇరవైఇరవై ఒక్కటిలో మాత్రం మిత్రమా మంత్రం వేసినట్టుగా కష్టాలు కరిగిపోవాలి…సంవత్సరమంతా సంతోషంగా సాగాలని ఆశీస్తూ… హ్యాపీ న్యూఇయర్ 2022.
వేడుకలో వెలిగే కాంతి
వేడుకలో వెలుగు వెదజల్లే కాంతి కిరణాలు నీ మంచి మనసులోని మాటల ప్రభావాలే… మిత్రమా నీకు నీకుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు… హ్యాపీ2021
సాహసం నీ శ్వాస
సాహసే లక్ష్మీ అన్నట్టుగా నా సాహసానికి ధైర్యం నీవే మిత్రమా…. నీకు నీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు… హ్యాపీ 2021
విద్యలేనివాడు వింతపశువు
కానీ నాకు నీవుండగా విద్య అవసరంలేదు… నావిద్యే నీ స్నేహం… మిత్రమా నీకు నీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు... హ్యాపీ న్యూఇయర్ 2021
అటు అయినా ఇటు అయినా
ఎటు చూసినా నీవు చేసిన మంచే నిన్ను కాపాడుతుంది… అందరి మేలుకు ఆకాక్షించే మిత్రమా… నీకు నీ కుటుంబ సభ్యులకు నూతనసంవత్సర శుభాకాంక్షలు….
కాలంలో వచ్చాం కాలంలో కనుమరుగవుతాం
కానీ డిసెంబర్ 31 మాత్రం మిస్ కావద్దు… ఎందుకంటే మన స్నేహం మరింత బలపడేది ఆరోజే కదా…. అందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు…
ఆలోచనే మనసు బలం, ఆలోచనే మనసు బలహీనత
అయితే నీకు మాత్రము నీ మనసుకు బలం కలిగించే ఆలోచనలనే పుట్టించమని ఈశ్వరుని కోరుకుంటూ…. నీకు నీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ 2021
అందరినీ ఆలోచింపజేసిన సంవత్సరం 2020
అయితే అందరికీ జాగ్రత్తపై పరాకు చెప్పిన ఈ 2020 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ… 2021లో కరోనా రహిత సమాజంగా మారాలని కోరుకుంటూ మీకు మీ బంధు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…
శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ అందమైన ఫ్యామిలీ కధలో ప్రేమకధ కూడా ఉంటుంది.
శుభకాంక్షలు తెలుగు మూవీ 1997 లో రిలీజ్ అయ్యింది. ఈ తెలుగుమూవీలో జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తెలుగు సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ ప్రేక్షకులలను బాగా ఆకట్టుకున్న సినిమా ఇది. ఈ మూవీలో పాటలు బాగా పాపులర్ అయ్యాయి.
ఆనందమానంద మాయె అనే పాట బాగా పాపులర్ అయితే గుండె నిండా గుడి గంటలు, అద్దంకి చీర కట్టే ముద్దుగుమ్మా,పంచవన్నెల చిలక నిన్ను పాటలు కూడా ఆకట్టుకుంటాయి.
ఇక శుభాకాంక్షలు తెలుగు మూవీ కధలోకి వెళ్తే…
స్టీఫెన్ క్రైస్తవ మతానికి చెందినవాడు. సీతారామయ్య హిందూ మతానికి చెందినవాడు. ఒకేవీధిలో రెండు కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తుంటారు. ఇంకా ఈ రెండు కుటుంబాల సభ్యుల మధ్య మంచి స్నేహ సంబంధం ఉంటుంది.
ఆ కుటుంబాలలో అబ్బాయిలు మోసెస్, బలరామయ్యలు కూడా మంచి స్నేహంగా ఉంటూ ఉంటారు. ఈ క్రమంలో రాబర్ట్(మోసెస్ తమ్ముడు), జానకి(బలరామయ్య చెల్లెలు) ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే ఈ రెండు కుటుంబాలు వీళ్ళ ప్రేమను అంగీకరించరు.
దాంతో వీరిద్దరూ దూరంగా పారిపోయి పెళ్ళి చేసుకుంటారు. ఇక అప్పటినుండి ఆ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి నెలకొంటుంది.
25 సంవత్సరాల తర్వాత స్టీఫెన్, బలరామయ్యల కుటుంబాలను ఏకం చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. అతనే చందు. ఆక్రమంలో చందు గోపి అనే తన స్నేహితుడితో పాటు ఆ ఊరు వచ్చి తను రాబర్ట్, జానకిల కొడుకునని అందరితో చెబుతాడు.
వాళ్ళకి ఇల్లు దొరకని పరిస్థితులలో నాదబ్రహ్మం అనే వ్యక్తి మాత్రం వాళ్ళను పిలిచి తన ఇంట్లో ఉండమంటాడు. ఆ తర్వాత చందు నెమ్మదిగా విడిపోయిన ఆ ఇద్దరి కుటుంబాలతో పరిచయం పెంచుకుంటాడు. అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తుంటాడు.
ఒకసారి స్టీఫెన్, సీతారామయ్య భార్యలిద్దరూ చందుకు పెళ్ళి చేయాలని చూస్తారు. అయితే వారిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు చందు కోసం పెళ్ళి సంబంధం తెస్తారు. వాళ్ళిద్దరి బారినుంచి తప్పించుకోవడం కోసం చందు తనకి ఇదివరకే నిర్మలా మేరీ అనే అమ్మాయితో పెళ్ళి అయిందని అబద్ధం చెబుతాడు.
అయితే ఆ అబద్దం నిజం చేస్తూ ఒక సన్నివేశం కధ మలుపు తిప్పుతుంది. ఉన్నట్టుండి నిర్మలా మేరీ అనే పేరుతో ఒక అమ్మాయి ఇతని కోసం వచ్చి తానే అతని భార్య అని చెబుతుంది.
చందు చెప్పిన అబద్దం నిజం చేస్తూ, వచ్చిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? చందు నందిని ప్రేమకధ ఏమయ్యింది? ఈ ప్రశ్నవలకు సమాధానాలు చివరకి ఏమవుతుందో సినిమా చూడాల్సిందే…
శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ
ఫ్యామిలీ హీరో జగపతిబాబు ప్రేక్షకులను మెప్పిస్తే, పాటలు అందరినీ అలరిస్తాయి. అందాల తార రాశి, జగపతిబాబుల మద్య ప్రేమ, జగపతిబాబు, రవళిల మద్య జరిగే సన్నివేశాలు కధను కొనసాగిస్తాయి.
శుభాకాంక్షలు తెలుగు మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించినది.
తెలుగు భాష గురించి తెలుగు భాష విశిష్టత. తెలుగు భాష అనేది ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ప్రాంతములలోని వాడుక భాష. ఇంకా ఇతర పొరుగు రాష్ట్రాలలో మాట్లాడే వారు ఉంటారు. ఇతర దేశాలలో స్థిరపడినవారి కారణంగా అక్కడ కూడా తెలుగులో సంభాషించుకునేవారు ఉంటారు.
భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో మూడవ భాష తెలుగు భాష. ఇంకా తెలుగుభాష ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా అధికార భాష కూడా.
తెలుగు భాష యొక్క మూలాలు క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందినవి, దాని మాతృభాష సంస్కృతం నుండి ప్రత్యేక భాషగా అభివృద్ధి చెందిందని చెబుతారు. శతాబ్దాలుగా, తెలుగు దాని స్వంత ప్రత్యేక లిపి, వ్యాకరణం మరియు పదజాలం అభివృద్ధి చెందింది మరియు అభివృద్ధి చెందింది.
తెలుగుభాష వ్యాకరణం దృశ్య సౌందర్యాన్ని ఇస్తుంది మరియు ఇతర భారతీయ భాషలలో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. సాహిత్య పరంగా తెలుగుకు గొప్ప, ప్రాచీన సంప్రదాయం ఉంది. ప్రాచీన తెలుగు గ్రంథం “ఆంధ్ర మహాభారతం” తెలుగులోకి అనువదింపబడింది. ఇంకా రామాయణం, మహాభారతం వంటి సంసృత కావ్యాలు తెలుగులోకి తెలుగు కవులు అనువదించారు.
ఇటీవలి సంవత్సరాలలో, తెలుగు సినిమా లేదా టాలీవుడ్, భారతదేశంలోనూ మరియు అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందింది. కారణం దానికి మూలం తెలుగులో అనువదింపబడిన పురాణాలలో, పురాణాలలో పాత్రలే కీలకం… వాటిని అర్ధం చేసుకోవడానికి తెలుగు తెలిసి ఉండడం చాలా ప్రధానం. పూర్వుల ముందు చూపు వలన నిన్నటి తరం వారు తెలుగులో బాగా చదువుకుంటే, నేటి తరం తెలుగు నేర్చుకోవడానికి ఇబ్బందిపడుతుండడం విచారకరం అంటారు.
మనదేశంలో తెలుగు భాష సుదీర్ఘ చరిత్ర మరియు శక్తివంతమైన సాహిత్య మరియు సాంస్కృతిక సంప్రదాయంతో గొప్ప మరియు శక్తివంతమైన భాష.
తెలుగు అమ్మ వంటిది అమ్మ లేని జీవితం ఉండదు మాతృభాష మాట్లాడనివారు ఉండరు. తెలుగు చదవడం వలన తెలుగు గొప్పతనం మనకు తెలుస్తుంది…
మనకు తెలుగు భాష చిన్ననాటి నుండి అమ్మ దగ్గర నుండి పరిచయం
మాతృభాష అమ్మ దగ్గర నుండి మొదలై, నాన్న, బాబయ్, మావయ్య, అత్తయ్య, పిన్ని… ఇలా బంధుమిత్రుల ద్వారా మాతృభాషలో మాటలు ఒక పిల్లవానికి వస్తాయి.
అలాంటి మాతృభాష అంటే మానవునికి మిక్కిలి మక్కువ ఉంటుంది. అటువంటి మక్కువైన భాషపై గౌరవంతో అందరూ ఉంటారు.
అమ్మ తాత..తాత్త..తాత. అంటూ అత్త అని అమ్మా అని ఇలా వరుసలతో చిన్నారికి మాటలు తెలుగులోనే తెలుస్తాయి.
ఉహ తెలిసినప్పటి నుండి తెలుగు ప్రాంతాలలో పెరిగే పిల్లలకు తెలుగులో పట్టు పెరుగుతుంది. తెలుగు మాటలు మాట్లాడడం బాగా అలవాటు అవుతుంది. అదే అలవాటులో విద్య నేర్చుకుంటే, చక్కగా అర్ధం అవుతుంది.
మారాం చేస్తున్న పిల్లవానికి మాయచేసి, మురిపించి ముద్ద తినిపించినట్టు… తెలుగులోనే పాఠాలు ఉంటే, చదువు మీద శ్రద్దలేనివారు కూడా ఎప్పుడో ఒకప్పుడు చదువుకునే అవకాశం ఉంటుంది.
ఒక తెలుగు సభలో తెలుగు భాషలో మాట్లాడితే మన గొప్పతనం తెలుస్తుంది. ఒక స్కూలులో తెలుగు నేర్చుకుని ఉంటేనే కదా… తెలుగులో గొప్పగా మాట్లాడగలిగేది.
తెలుగు తెలుసుకుంటే తెలుగు భాష గురించి తెలుగు భాష విశిష్టత
తెలుగు తెలుసుకుంటే తెలుగు గొప్పతనం తెలుస్తుంది. వ్యక్తి పరిచయం పెరిగాక వ్యక్తి వ్యక్తిత్వం తెలిసినట్టుగా…
అలా తెలుగు తెలుసుకోవాలనే కుతూహలం పిల్లలో పెంచాలి. తింటే కదా గారె రుచి తెలిసేది… వింటే కదా భారతం గొప్పతనం తెలిసేది…
భారతం మన మాతృభాషలో ఉంటుంది. మన మాతృభాషలో విన్న భారతానికి, ఇతర భాషలలో విన్న భారతానికి తేడా ఉంటుంది కదా..
మన తెలుగులో మనం భారతం వింటే, భారతంలోని పాత్రలు మనలో మెదులుతాయి… ఇతర భాషలలో భారతం తెలుగువారు వింటే, భారతంలో పదాలకు అర్ధాలు వెతుక్కోవడంతో మనసు పని సరిపోతుంది. ఇక జీవితపరమార్ధం ఎక్కడ తెలియాలి?
అంతే కదా… సాదారణంగా తాత్విక చింతనతో చూసినా ఏవ్యక్తి ఎక్కడ పుట్టాలో ఆపైవాడు నిర్ణయం చేసేశాడు…
ఎందుకంటే, అనేక మంది పుట్టే ఆసుపత్రిల యందు ఒకరు పేద ఉంటాడు.. ఒకడు ధనికుడు ఉంటాడు. కాబట్టి పుట్టుక వ్యక్తి చేతిలో లేనిది… అది ఎవరి ఒకరి ద్వారా పైవాడి చేతిలో ఉండేది.
ఇక జీవిత పరమార్ధం అయితే ఏమిటి? అంటారు… జీవితం అనుభవించడానికే అని కొందరంటారు.
అనుభవించడానికి జీవితం అయితే తెలుగులో కవితలు, పద్యాలు, సాహిత్యం, కధలు.. ఇవన్నీ మనో వికాసానికే కదా… వికసించిన మనసే కదా… అనుభవించేది…
ఇంకొందరంటారు… జీవితం ఉన్న వ్యక్తి అనుభవించి, చివరికి పరమాత్మలో ఐక్యం కావాడానికే అంటారు. అటువంటి పరమాత్మను తెలియజేసే గ్రంధాలు ఉంటాయి. ఎవరి మాతృభాషలో వారికి తేలికగా అర్ధం అయ్యేలాగా పెద్దలు చేశారు.
మరి మన తెలుగువారికి అటువంటి పరమార్ధ రహస్యం తెలియాలంటే, తెలుగు బాగుగా తెలిసి ఉండాలి… లేదా తెలుగులో వినడానికి పండితులు కావాలి.
మనకు పరమార్ధ విడమర్చి చెప్పే పండితులు మనకు ఉన్నారు. మరి భవిష్యత్తులో అటువంటివారు ఉంటేకదా… చదవలేనివారికి పరమార్ధం గురించి తెలియజెప్పగలిగేది.
ఏదైనా ఎవరి మాతృభాషలో వారికి విద్య నేర్చుకోవడం సులభం. అయితే బ్రహ్మవిద్య నేర్చుకోవడం కష్టం.. అది అనుభేద్యకముగానే తెలియాలి అంటారు.
అటువంటి బ్రహ్మవిద్యను తెలియజేసే గ్రంధాలు మాతృభాషలో చదివితే బాగా అర్ధం కాగలవని అంటారు. మాతృభాష అమ్మ వంటిది అయితే మనకు తెలుగు భాష అమ్మవంటిది. అమ్మలేని జీవితం ఉండదు. తెలుగు మాతృభాష మాట్లాడనివారు ఉండరు.
తెలుగు భాష గురించి తెలుగు భాష విశిష్టత
ఒక వ్యాపారి కూడా అందరి దృష్టికోనం ఏ రంగంపై ఉందనేది? ఆలోచన చేసుకుని వ్యాపారం ప్రారంభిస్తాడు.
ఇలా ఒకవ్యాపారి, ఒక సేవాసంస్థ ఏదైనా అందరికీ ఆమోదయోగ్యమైన పనులను, సేవలను ఎంచుకుంటారు.
ఏదైనా కొత్త విషయం అందరికీ చెప్పాలంటే, అందరికీ తెలిసిన విషయంతో మొదలు పెట్టి చెప్పలసిన కొత్త విషయం చెబుతారు.
అలాంటప్పుడు మనకు కొత్త భాష నేర్చుకోవాలంటే, తెలుగులో మనకు ఉపోద్గాతం కొంత తెలిసి ఉండాలి… కదా.
తెలుగు మన బంధువులతో మాట్లాడే భాష… ఎక్కువమంది తెలుగులోనే సంబోదించుకుంటూ ఉంటాము… టెక్నాలజీ సంస్థలు భారతీయ భాషలలోకి అనువాదం చేసే అప్లికేషన్స్ అందిస్తున్నారంటే, మాతృభాషపై పట్టు ఉన్నవారు ఎంతమంది ఉంటారు?
అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు. బాబు పేర్లు, మగ పిల్లల పేర్లు, లిస్టు, అడ పిల్లల పేర్లు పుస్తకం, బేబీ పేర్లు, దేవుళ్ళు పేర్లు, నక్షత్రం ప్రకారం పేర్లు, చిన్నారి పేర్లు, తెలుగు బేబీ పేర్లు ఇలా ఏవైనా పేర్లు సెర్చ్ చేయడానికి తెలుగురీడ్స్ యాప్
నేటి పిల్లలే రేపటి పౌరులు అలాగే నేటి పేరు పెట్టిన పేరే రేపటి కీర్తికి నాంది. పేరు పిలుపు కూడా మనసుపై ప్రభావం చూపుతుంది.
ప్రతి శబ్దానికి అర్ధం ఉంటుంది. ప్రతి శబ్దం మనసుపై ప్రభావం చూపుతుంది. మెలోడీ మ్యూజిక్ మనసుని శాంతింపజేసినట్టుగా.
అలా ఆడ లేక మగ పిల్లల పేర్ల ఎంపికలో పాజిటివ్ వైబ్రేషన్ ఉండేలాగా చూసుకోవాలని పెద్దలంటారు. అందుకే పెద్దల పేర్లు చాలా వరకు దేవుళ్ళ పేర్లునే సూచిస్తారు. ఎందుకంటే దేవుళ్ళ పేర్లు పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటాయని అంటారు.
చిన్నారికి పేరు పెట్టేటప్పుడు తెలుగులో మంచి అర్ధం ఉండేవిధంగా పేర్లు పెట్టడం మేలని అంటారు. చిన్న పిల్లల పేర్లు సూచించే తెలుగు పుస్తకాలూ లభిస్తాయి. పిల్లల పేర్లకు ఎటువంటి అర్ధం తెలుగులో వస్తుంది చెక్ చేసుకొని పేరు పెట్టాలి.
వాటినే ముద్దు పేర్లుగా అనుకుంటాం… కానీ నక్షత్రం ప్రకారం పేరులో మొదటి అక్షరం చిన్న పిల్లల పేర్లలో ఉంటే, ఆ పేరునే పిలవడం వారికి శ్రేయస్కరం అంటారు. చిన్న పిల్లలను చిన్నప్పటి నుండి నక్షత్రం ప్రకారం పెట్టిన పేర్లతోనే పిలవడం ముఖ్యమని అంటారు.
తెలుగు పాపల పేర్లు దేవతల పేర్లతోనే ఉంటాయి… లక్ష్మీ, సరస్వతీ, దేవి, మాధవి, విజయలక్ష్మీ, వరలక్ష్మీ లలిత వంటి పేర్లు అటువంటి పేర్లలో కూడు మూడు అక్షరాల పేర్లు అమ్మాయి నేమ్స్ గా ఉంటే మేలు అంటారు. తెలుగు బేబీ పేర్లు
మగ పిల్లల పేర్లు తెలుగులో రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది అక్షరాలు వచ్చేలాగా ఉండడటం శ్రేయష్కరం అంటారు.
అంటే మగ పిల్లల పేర్లు లిస్టులో పేర్లు వెతికేటప్పుడు సరి సంఖ్యలో అక్షరాల సంఖ్య ఉండాలని అంటారు.
బేబీ పేర్లు తెలుగులోనే అచ్చంగా తెలుగు పేర్లు వినడానికి బాగుంటాయి. అవి నక్షత్రం ఆధారంగా పేరు పెట్టుకుంటే పిల్లలకు మేలు అంటారు.
తెలుగులో చిన్న పిల్లల పేర్లు మొదటి అక్షరం ఆధారం తెలుగు పేరు
సాధారణంగా పిల్లలు పుట్టిన సమయం బట్టి నక్షత్రం. పిల్లలు పుట్టిన నక్షత్రం బట్టి పేరులో మొదటి అక్షరం. చిన్నపిల్లల పేరులో మొదటి అక్షరం ఆధారం తెలుగు పేరు ఎంపిక ఉంటుంది.
పిల్లలు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం ఆధారంగా పిల్లల పేరులో మొదటి అక్షరం ఉండాలని అంటారు.
నక్షత్రం ప్రకారం బ్రాహ్మణస్వామి సూచించిన అక్షరాలలో మొదటి అక్షరం ఎంపిక చేయాలని అంటారు.
అలా మొదటి అక్షరం ఎంపిక నక్షత్రం ప్రకారం చూసుకుని, తర్వాత ఇష్ట దైవం కానీ తాత, ముతాత్తల పేర్లు కూడా కొందరు కలుపుకుంటారు. లేకా అమ్మమ్మ, నాయనమ్మల పేర్లను కలుపుకుంటారు.
తాతముత్తాతల పేర్లు, అమ్మమ్మ, నాయనమ్మల సాధారణంగా దేవుడి పేరుతోనే ఉంటాయి.
మల్లన్న, సుబ్బయ్య, లక్ష్మయ్య, రామస్వామి, చంద్రన్న ఇలా తాతల పేర్లు ఉంటే, లక్ష్మమ్మ, సీతమ్మ, పున్నమ్మ, శాంతమ్మ ఇలా ఉంటాయి.
ఇప్పుడు ఫ్యాషన్ కొద్ది చాలామంది సింపుల్ మహేష్, రమేష్, రాజేష్, విఘ్నేష్, విశ్వాస్ లాంటి పేర్లు ఎంపిక చేసుకుంటారు.
ష్యాషన్ కొద్ది పేరు స్టైల్ మార్చినా పేరులో మొదటి అక్షరం నక్షత్రం ఆధారంగా పెట్టడం మేలు అంటారు.
అలా నక్షత్రం ఆధారం మొదటి అక్షరం పెట్టిన పేరుతోనే బాలుడిని లేక బాలికను పిలవడం కూడా వారికి చాలా మేలు జరుగుతుందని అంటారు.
హిందూ బేబీ విషయంలో నేమ్ సెలక్షన్ చాలా ముఖ్యం. దేవుళ్ళ పేర్లను బట్టి కూడా పేరు పెట్టినా నక్షత్రం ఆధారంగానే దేవుని పేరు పుట్టిన బేబీకి పెట్టుకుంటారు.
తెలుగు బేబీ బేర్లు da(డా) అయితే పేర్లు తక్కువగా ఉంటాయి. డాకిని వంటి పేర్లు అరుదుగా ఉంటాయి.
అదే ఇంకొక అక్షరంతో తెలుగు బేబీ బేర్లు da(దా) అయితే పేర్లు సులభంగానే ఉంటాయి. దామిని, దాక్షాయిని, దామోదర్, దేవేందర్, దేవా, దేవానంద్, దేవిక, దేవీ, దైవాదీనం వంటి పేర్లు ఉంటాయి.
దేవుడి పేరు నచ్చినా, పెద్దవారి పేరు నచ్చినా, మోడ్రన్ పేరు నచ్చినా నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టుకోవడం ప్రధానం.
ఎవరైనా బేబీకి మ అక్షరం మీద పేర్లు పెట్టుకోవడానికి అనుకూలం. అయితే మ అక్షరంతో మహిత అని పెట్టుకోవచ్చును. మహాలక్ష్మీ అని కూడా పెట్టుకోవచ్చును.
ఇంకా మో అక్షరంతో పేరు అయితే మోహన్, మోహనరావు, మోహిత ఇలా పేర్లు ఉంటాయి.
నక్షత్రం ప్రకారం మొదటి అక్షరం బట్టి పేరు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ
మొదటి అక్షరం p అయితే తెలుగు బేబీ పేర్లు p అక్షరంతో బాలికలకు అయితే
పావని, ప్రతీక, పరిణీత, ప్రవల్లిక, ప్రమీల, పావకి, ప్రసన్న వంటి పేర్లు చాలానే ఉంటాయి. అయితే పేరులో అక్షరాలన్నీ కలిపి, మూడు కానీ అయిదు కానీ ఏడు కానీ బేసి సంఖ్యలో అమ్మాయి పేర్లు ఉండేలా చూసుకోవడం మేలు.
అచ్చ తెలుగులో గర్ల్ నేమ్స్
ఒకే పరిణీత పేరు మీకు నచ్చితే అందులో అక్షరాలన్నీ కలిపి నాలుగే ఉంటున్నాయి. కాబట్టి పరిణీతకు మరొక మూడు అక్షరాలు కలిగిన పేరు జత చేస్తే సరిపోతుంది.
లేదా పేరులో ఒత్తులు కూడా కలుపుకోవచ్చా లేదా అనేదా బ్రాహ్మణస్వామిని అడిగి తెలుసుకోవడం శ్రేయస్కరం.
అబ్బాయి పేర్లు p అక్షరంతో అయితే ప్రకాశ్, ప్రదీప్, ప్రశాంత్, ప్రసాద్, ప్రమోద్, ప్రవీణ్ చాలా పేర్లు ఉంటాయి. ఇవి మూడు అక్షరాలు ఉన్నాయి. అయితే అక్షరం క్రింద అక్షరం ఉండడం వలన నాలుగు అక్షరాలుగా పరిగణించవచ్చో లేదో పెద్దవారిని అడిగి తెలుసుకోవడం శ్రేయస్కరం.
ఇలా బేబీకి పెట్టవలసిన తెలుగు పేర్లలో అచ్చ తెలుగులోనే పలకడానికి బాగుండేలాగా పెట్టుకుంటారు.
కొందరు భగవంతుడు పేరు తప్పనిసరిగా ఉండేలాగా పెట్టుకుంటారు. అవి చాలా పాత పేర్లుగా అనిపిస్తాయి కూడా…
సుబ్బారావు, రంగారావు, మల్లన్న, సుబ్బయ్య వంటి పేర్లు… అయితే ఈ పేర్లలో దైవంతోనే ఉంటాయి.
అచ్చ తెలుగు పిల్లల పేర్లు బాయ్ నేమ్స్ తెలుగులో
సుబ్రహ్మణ్యం పేరుకు వాడుక పేరే సుబ్బారావు… సుబ్రహ్మణ్యం స్వామి హిందూ దైవం…
అలాగే రంగారావు… పాండురంగడులో రంగకు రావుని జోడించి రంగారావు పేర్లు పూర్వంలో పెట్టుకునేవారు. ఇంకా మల్లన్న అంటే శ్రీశైలం మల్లన్న స్వామే. సుబ్బయ్య అన్నా సుబ్రహ్మణ్యం స్వామే…
ఇలా దేవుళ్ళ పేర్లతో కూడిన బేబీ పేర్లను చాలా మందికి ఉంటాయి. రావుతో కలిసిన పేర్లు చాల ఉంటాయి.
శ్రీనివాసరావు, రాజారావు, శ్రీహరిరావు, శివరావు, వేంకటేశ్వరరావు, రామారావు, కృష్ణారావు, కేశవరావు, ప్రసాదరావు ఇలా రావు చివరగా వస్తూ చాలా తెలుగు పేర్లు ఉంటాయి.
మోడ్రన్ గా అయితే పేర్లు ఇలా మారుతూ వచ్చాయి. రాజారావు రాజేష్, రామారావు రమేష్, శ్రీనివాసరావు శ్రీనివాస్, వేంకటేశ్వరరావు వెంకట్, రామారావు రామ్ మార్చుకోవడం కామన్ అయిపోయింది.
పూర్వకాలంలో భగవంతుడి పేర్లు పిల్లలకు ఎందుకు పెట్టుకునేవారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఒక్కసారి వినండి… పేరులో భగవన్నామం ఉండడం వలన కలిగే మేలు చెబుతారు. ఈ క్రింది వీడియో చూడండి.
శ్రీహరి అనే పేరు ఒక బాలుడికి పెట్టి, పదే పదే ప్రేమతో శ్రీహరి..శ్రీహరి…శ్రీహరి అని పిలుచుకునే పెద్దలు ధన్యులే అంటారు… మన ప్రవచన పెద్దలు.
అలాగే శ్రీదుర్గ అనే పేరు అమ్మాయికి పెట్టుకుని… దుర్గమ్మ… దుర్గ… దుర్గమ్మ అంటూ మురిసిపోతు పిలుచుకునే పెద్దలు అదృష్టవంతులంటారు… ప్రవచన పెద్దలు…
అలా ఎందుకు ధన్యులు..? ఎందుకు అదృష్టవంతులు ప్రవచనకారుల మాటలలోనే వింటే, మనసుకు బాగా పడుతుంది.
2020 అంతా స్టాప్ దేర్ 2021? గత ఏడాది పురుడు పోసుకున్న కరోనా ఈ ఏడాది రూపాంతరం చెందుతుంది… కొత్త ఏడాదిలోకి జర జాగ్రత్తతో అడుగు పెట్టడంతో బాటు జర జాగ్రత్త అవసరం.
గతేడాదిలోకి కరోనా జాగ్రత్తలతో ఆరంభం చేయడం జరిగింది. సంవత్సరమంతా జాగ్రత్తగా ఉన్నవారు కరోనా బారిన పడలేదు. జాగ్రత్తలేనివారికి వైరస్ సోకింది.
అందరికీ 2020సంవత్సరం ఇంత తొందరగా గడిచిందా? అనే ఆశ్చర్యంగానే 2020 ముగుస్తుంది. 2019 ఎండింగులో కరోనా వస్తుందేమో ఆలోచన…
2020అంతా కరోనా జాగ్రత్తలతో సాగింది. అయితే 2020ఎండింగ్ కూడా పాత కరోనా తగ్గుముఖం పట్టడంతో బాటు, టీకా అందుబాటులోకి రానుంది.
అంతలోనే కరోనా మరొక రూపం దాల్చింది… ఇక 2021 కూడా కరోనా నివారణ జాగ్రత్తలతోనే మెసులుకోవాలి.
ఆ ఆలోచనలే నిజమయ్యాయి… 2020లో కరోనా వైరస్ కోవిడ్-19 అను పేరు పొంది, ప్రపంచంపై పడింది.
కోవిడ్-19 విజృంభణ చాలామందిని బలిగొంది… చాలామందిని ఆసుపత్రిపాలు చేసింది… అనడం కన్నా చాలా దేశాలను ప్రభావితం చేసిందని అంటారు.
మనకు మార్చిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలియగానే, అందరం జనతా కర్ఫ్యూలోకి వెళ్లాం… ప్రధాని పిలుపు మేరకు.
నరేంద్రమోదిగారి పిలుపుకు దేశం మొత్తం స్వాగతించి, అంతా ఇంటికే పరిమితం అయ్యాం. ఆ విధంగా 2019లో పుట్టిన కరోనా వైరస్ అదే కోవిడ్-19 ఒక్కరోజు అందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టింది.
అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుండడంతో లాక్ డౌన్ కేంద్రం విధించింది. లాక్ డౌన్ కాలంలో కొందరు అనేక ఇబ్బందులు పడ్డారు. కొందరు కష్టాలు అధికంగా అనుభవించారు.
కొందరు ఇంటికి తిరుగు ముఖ పట్టారు. అందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఎక్కడివారు అక్కడే అంటూ 2020 స్టాప్ దేర్…
అందరినీ కదలకుండా కొన్నిరోజులపాటు ఒకే చోట కట్టిపడేసింది.
2020 అంతా స్టాప్ దేర్ 2021 లో కూడా స్టాప్…
2019 లో చైనాలో పురుడు పోసుకున్న కోవిడ్-19 కోరలు ప్రపంచమంతా పాకాయి. స్టాప్ దేర్.. స్టాప్ వర్క్, స్టాప్ ట్రావెల్, స్టాప్ స్టడీ ఇలా అన్నింటిలోనూ, అందరిని స్టాప్ చేసేసిందీ2020.
అనుమానం పెనుభూతం అన్నారు. అలా అనుమానం పొంది ఆందోళన చెందకుండా ఉండేందుకు… దేశవ్యాప్తంగా కరోనా గురించిన ప్రచారమే జరిగింది.
కరోనా గురించినా జాగ్రత్తలే ప్రచారం జరిగింది. అన్నింటిని ఆపింది… అంతటా పుల్ స్టాప్ పెట్టింది.
మీడియా, అత్యవసరాలు తప్పించి కొన్నిరోజులపాటు చాలా చోట్ల స్టాప్ వర్క్ నడిచింది… అలా అందరికీ ఆర్ధిక నష్టాన్ని తీసుకువచ్చింది.
స్టాప్ స్టడీ చాలాకాలం నడిచింది… కేవలం ఆన్ లైన్ క్లాసెస్ మాత్రమే నడుస్తున్నాయి… ఇప్పుడిప్పుడే కొన్ని విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి…
సినిమా ధియేటర్లలో స్టాప్ షో… షోలు లేవు.. ధియేటర్లు ఓపెన్ కాలేదు..
2019సంవత్సరంలోనికోవిడ్ సంవత్సరమంతా అందరిపై ప్రభావం ఏదోవిధంగా చూపింది. మరి 2020 ముగింపుకు వచ్చింది…
ఇప్పుడు 2020 చివరి రోజులలో కొత్త వైరస్ గా మారిన కరోనా వైరస్ వార్తలు వచ్చాయి. ఏడాది క్రిందట వచ్చిన కోవిడ్-19 వైరస్ 2020ని ఒక ఊపు ఊపింది… స్టాప్ వర్క్ చెప్పింది.
మరి ఇప్పుడు 2020లో కొత్తగా వస్తున్న వైరస్ బ్రిటన్ లో వ్యాప్తి చెందిందంటున్నారు.. ఇప్పుడు ఇది కోవిడ్-2020 గా రూపాంతరం చెందినట్టయితే, అది వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలే ముక్యం.
ఇది ప్రపంచవ్యాప్తంగా వృద్ది చెందకుండా ఉండాలంటే సోషల్ డిస్టేన్స్, సానిటైజేషన్, మాస్క్ వంటి జాగ్రత్తలే ప్రధానమని అంటున్నారు.
https://www.youtube.com/watch?v=KJri61TS5oQ
2020 స్టాప్ దేర్ 2021?
తగు జాగ్రత్తలు ఉంటే 2021 సజావుగా సాగుతుంది. లేకపోతే 2021 కూడా స్టాప్ వర్క్ అయితే….?
ఇప్పటికే మన దేశ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే యుకె నుండి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేశారు.
వైరస్ కంటికి కనబడదు… ఏవిధంగా వస్తుందో తెలియదు… కనుక జాగ్రత్త… అనేది మనకు ముఖ్యం… ఆందోళన చెందకుండా ఉండడం ఎంత ముఖ్యమో… జాగ్రత్త చాలా ముఖ్యం.
కోవిడ్-19 వలన ఏర్పడిన అనుభవం, కోవిడ్-20 ను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చును. అందుకు ముఖ్యమైన పని తగు జాగ్రత్తలు పాటించడమే…
మనకు ఇప్పటికే వ్యాక్సిన్ రాబోతుంది… కాబట్టి అంతగా ఆందోళన ఉండదు… కానీ జాగ్రత్త మాత్రం చాలా ముఖ్యం…
ఈసంవత్సరం 2020 స్టాప్ దేర్ 2021 సంవత్సరం కూడా స్టాప్ వర్క్ కాకుడదంటే, మన జాగ్రత్తలే మనకు రక్ష…
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ క్రియేట్ చేయడం. ఒక అన్ లిమిటెడ్ లిస్టును ఒక స్క్రీనులో చూపించాలంటే రిసైక్లర్ వ్యూ ఉపయోగించాలి. ఈ రిసైక్లర్ వ్యూతో ఎంత పెద్ద లిస్టును అయినా ఒక స్క్రీనుపై చూపించవచ్చును.
అన్ లిమిటెడ్ గా ఏదైనా బిగ్ డేటా లిస్టులు వంటివి డిస్ల్పే చేయడానికి రిసైక్లర్ వ్యూ విడ్జెట్ నే ఉపయోగిస్తారు.
ప్లేస్టోర్ నందు యాప్స్ అన్ లిమిటెడ్ గా వస్తూనే ఉంటాయి… అటువంటి యాప్స్ నందు రిసైక్లర్ వ్యూ విడ్జెట్ నే ఉపయోగిస్తారు. లిస్టువ్యూను సింపిల్ లిస్టులు డిస్ల్పే చేయడానికే ఉపయోగిస్తారు.
అయితే రిసైక్లర్ వ్యూ విడ్జెట్ ను ఒక ఏక్టివిటిలో లేదా ఒక ఫ్రాగ్మెంట్ లో ఉపయోగించవచ్చును.
ఏక్టివిటి కానీ ఫాగ్రెంట్ కానీ కొత్తది తీసుకుంటే, వాటికి ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ మరియు జావా ఫైల్ రెండూ క్రియేట్ అవుతాయి.
ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ప్రొజెక్టులో ఎన్ని ఏక్టివిటిస్ అయినా, ఎన్ని ఫ్రాగ్మెంట్స్ అయినా కొత్తవి క్రియేట్ చేయవచ్చును.
ఈ ప్రొజెక్టులో ప్రొజెక్టులో ఓపెన్ చేస్తున్నప్పుడే క్రియట్ అయిన, డిఫాల్ట్ మెయిన్ ఏక్టివిటిలో రిసైక్లర్ వ్యూ విడ్జెట్ ఉపయోగిద్దాం.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ రిసైక్లర్ వ్యూ కు అవసరం అయ్యే ఫైల్స్
ఏక్టివిటి (ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ అండ్ జావా ఫైల్)
మోడల్ (జావా ఫైల్)
ఏడాప్టర్ (జావా ఫైల్)
ఐటెమ్ లేఅవుట్ (ఎక్స్.ఎం.ఎల్ ఫైల్)
ఏక్టివిటి (ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ అండ్ జావా ఫైల్)
రిసైక్లర్ వ్యూ విడ్జెట్ డిస్ప్లే చేసే ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ (ఇది డిఫాల్ట్ మెయిన్ ఏక్టివిటిలో ఉపయోగించవచ్చును. లేదా కొత్త ఏక్టివిటి లేదా కొత్త ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేయవచ్చును.)
ఏక్టివిటి.మెయిన్.ఎక్స్.ఎం.ఎల్ ఫైలుకు అనుసంధానించబడిని జావా ఫైల్. ఈ జావా ఫైల్ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్లో తీసుకున్న రిసైక్లర్ వ్యూ విడ్జెట్ ను శాసించే కోడ్ వ్రాస్తాము.
మోడల్ (జావా ఫైల్)
మోడల్ అంటే రిసైక్లర్ వ్యూలో కనిపించే లిస్టు ఏవిధంగా ఉండాలో, అందులో ఉండే ఐటమ్స్ ముందుగానే సూచన చేయడం.
రిసైక్లర్ వ్యూలో పేరు, ఇంటి పేరు రెండింటిని చూపించాలి. అప్పుడు మోడల్ జావా క్లాసులో రెండు డేటా టైప్స్ డిక్టేర్ చేస్తాము.
ఆ తర్వాత మోడల్ క్లాస్ నందు డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కు కన్సట్రక్టర్ క్రియేట్ చేయాలి.
కన్సట్రక్టర్ క్రియేట్ చేశాకా, అవే వేరియబుల్స్ కు గెట్టర్ అండ్ సెట్టర్ సెట్ చేస్తాం… దాంతో మోడల్ క్లాసు పని పూర్తవుతుంది. ఇది ఈ ప్రొజెక్టు వరకు. సాదారణంగా రిసైక్లర్ వ్యూ ఐటమ్స్ డిస్ల్పే చేయడం వరకు అయితే… ఇంతే…
మీరు ఇంకా ప్రొజెక్టులో ఐడి, యాక్షన్స్ వంటివి యాడ్ చేస్తే, మోడల్ క్లాస్ నందు మరింత కోడ్ వ్రాయాలి.
ఎడాప్టర్ జావా ఫైల్ పేరులోనే ఉంది… ఏడాప్ట్ అంటే డేటాను కలపడం… ఒక మోడల్ విధానం ఏవిధంగా ఉందో, ఆవిధానం ప్రకారం అదనంగా తీసుకోబడిన లేఅవుట్ ఫైలు ద్వారా రిసైక్లర్ వ్యూలో డేటాను ఎడాప్ట్ చేస్తుంది.
ఇది చాలా కీలకమైన జావా ఫైల్. దీని ద్వారానే రిసైక్లర్ వ్యూని శాసిస్తాం… ప్రస్తుతం మన పేర్లు, ఇంటి పేర్లు డిస్ల్పే చేయడానికి సింపుల్ ఎడాప్టర్ ఉపయోగిస్తాం…
పెద్ద పెద్ద ప్రొజెక్టులకు అయినా ఎడాప్టర్ లో ఆటో క్రియేట్ చేయబడేవి కామన్ గానే ఉంటాయి. మీరు ఎంచుకున్న మోడల్ ను బట్టి ఎడాప్టర్ క్లాసులో జావా కోడ్ పెరుగుతుంది.
సింపుల్ మోడల్ కు ఎడాప్టర్ లో సింపుల్ కోడ్ ఉంటుంది.
ఐటెమ్ లేఅవుట్ (ఎక్స్.ఎం.ఎల్ ఫైల్)
ఐటెమ్ లేఅవుట్ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్. ఇది రిసైక్లర్ వ్యూ లో చూపించ లిస్టుకు సంబంధించిన సింగిలో రో ఐటమ్ డిజైన్.
అంటే మీరు ఐడి, ఇమేజ్, పేరు, అడ్రస్, వివరం ఇలా అయిదు రకాలు రిసైక్లర్ వ్యూలో చూపించాలి.
ఐడికి ఒక టెక్ట్స్ వ్యూ, ఇమేజ్ కు ఒక ఇమేజ్ వ్యూ, పేరుకు ఒక టెక్ట్స్ వ్యూ, అడ్రస్ కు ఒక టెక్ట్స్ వ్యూ, వివరం ఒక టెక్ట్స్ వ్యూ అలా అయిదు విడ్జెట్లను ఏవిధంగా ఒక రోలో కనబడాలో డిజైన్ చేయాలి.
అయితే ఈ ప్రొజెక్టులో చూపించేది కేవలం పేరు, ఇంటిపేరు రెండు మాత్రమే. కాబట్టి ఇందులో రెండు టెక్ట్స్ వ్యూలు ఉపయోగిస్తాము. అవి ఒకదాని ప్రక్కన కనబడాలా? ఒక దాని క్రింద ఒకటి కనబడాలా? దానిని బట్టి ఈ లేఅవుట్ డిజైన్ చేసుకోవాలి.
ఈఐటమ్ లేఅవుట్ ఫైల్ ఏవిధంగా డిజైన్ చేస్తే, అదేవిధంగా రిసైక్లర్ వ్యూలో రోస్ కనబడతాయి.
ఈవిధంగా ఐటమ్ లేఅవుట్ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ను ఎడాప్టర్ ద్వారా అనుసంధానం చేస్తూ, అదే ఎడాప్టర్ ద్వారా మోడల్ లిస్టును అనుసంధానం చేస్తూ, ఎడాప్టర్ ను ఏక్టివిటిలో రిసైక్లర్ వ్యూకు ఎటాచ్ చేయడంతో… రిసైక్లర్ వ్యూ డిజైన్ కోడింగ్ పూర్తవుతుంది.
ఇంకా డిజైన్ చేసిన రిసైక్లర్ వ్యూలో డేటా ఇన్ పుట్ ఇవ్వాలి. ఇది ఆన్ లైన్ వెబ్ సైట్ డేటా అయితే ఎడాప్టర్ కోడ్ మారుతుంది.
అదే ఇన్ పుట్ డేటా మాన్యువల్ గా ఆండ్రాయిడ్ స్టూడియోలో ఒక ఫైల్లో స్టోర్ చేసి, రిసైక్లర్ వ్యూలో చూపించవచ్చును. అప్పుడు ఏక్టివిటిలో కోడ్ పెరుగుతుంది.
ఇన్ పుట్ డేటా కేవలం రిసైక్లర్ వ్యూ విడ్జెట్ ఉపయోగిస్తున్న ఏక్టివిటిలోనే ఉన్న జావా ఫైల్ లోనే వ్రాస్తే, కోడ్ సింపుల్ గా ఉంటుంది.
ఈ ప్రొజెక్టులో రిసైక్లర్ వ్యూ లోనే ఇన్ పుట్ డేటా తీసుకుంటాము.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియో యాప్ ప్రొజెక్టు ఇమేజులతో
ఈక్రింది ఇమేజులో రిసైక్లర్ వ్యూ విడ్జెట్ కోడ్ వ్రాయబడి ఉంది. ఇది మెయిన్ ఏక్టివిటి ఎక్స్.ఎం.ఎల్ ఫైల్… ఇప్పుడు దీనికి మోడల్ కావాలి… అంటే మోడల్.క్లాస్ అనే జావా ఫైల్ కావాలి.
ఇది ఆండ్రాయిడ్ స్టూడియో ప్రొజెక్టులో ఏక్టివిటిమెయిన్.ఎక్స్.ఎం.ఎల్ ఫైల్. ఇందులో రిసైక్లర్ వ్యూ విడ్జెట్ కోడ్ వ్రాయబడి ఉంది.
మోడల్.క్లాస్ జావా ఫైల్ క్రియేట్ చేయాలి. ఈ క్రింది ఇమేజులో add to list అనే ఇంగ్లీషు అక్షరాలు బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ చేయబడి ఉన్నాయి. అక్కడ మౌజ్ పాయింటర్ పెట్టి, రైట్ క్లిక్ చేస్తే, సైడుగా ఒక మెను వస్తుంది.
అందులో మీరు మరలా New అనే ఇంగ్లీషు అక్షరాలను క్లిక్ చేస్తే, ఆ సైడుగా మరొక సబ్ మెను వస్తుంది. అందులో మరలా Java Class అనే ఇంగ్లీషు అక్షరాలను క్లిక్ చేస్తే, ఈ క్రింది ఇమేజులో చూపిన విధంగా పోప్ అప్ విండో వస్తుంది.
ఆ పోప్ అప్ విండోలో Name అనే ఇంగ్లీషు అక్షరాల దగ్గర మౌస్ కర్సర్ బ్లింక్ అవుతుంది. అక్కడ మీ మోడల్ జావాఫైల్ పేరు టైపు చేసి ఎంటర్ చేయాలి.
గమనించండి… ఆ పోప్ అప్ విండోలోనే Class అనే ఆంగ్ల అక్షరాలు బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ కాబడి ఉంది. అంటే మీరు పేరు టైపు చేసి ఎంటర్ చేస్తే, అది క్లాస్ ఫైల్ గా తీసుకుంటుంది.
అలా ఇంటర్ పేస్ ఎంపిక చేసుకంటే, ఇంటర్ పేస్ ఫైల్ క్రియేట్ అవుతుంది…
తెలుగులో ఆండ్రాయిడ్ స్టూడియో ట్యుటోరియల్
పై ఇమేజులో పోప్ అప్ విండోలో మోడల్ క్లాస్ ఫైల్ పేరు ModelName అని తీసుకోవడం జరిగింది.
ఈ క్రింది ఇమేజ్ చూడండి. అందులో publick class ModelName అని ఫ్లవర్ బ్రాకెట్స్ తో క్లాస్ ఫైల్ క్రియేట్ అయ్యింది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
రెండ్ స్ట్రింగ్ వేరియబుల్స్
ఫ్లవర్ బ్రాకెట్ల మద్యలో రెండు స్ట్రింగ్ వేరియబుల్స్ తీసుకోవాలి. ఒకటి ఫస్ట్ నేమ్, రెండు లాస్ట్ నేమ్ కానీ సర్ నేమ్ కానీ… ఏవైనా రెండ్ స్ట్రింగ్ వేరియబుల్స్ డిక్లేక్ చేయండి.
క్రింది ఇమేజులో String name, String sir_name రెండు స్ట్రింగ్ వేరియబుల్స్ డిక్లేర్ అయ్యాయి… వీటికి కన్సట్రక్టర్ క్రియేట్ చేయాలి.
రీసైక్లర్ వ్యూ యాప్ ఇన్ తెలుగు
దానికి ఫ్లవర్ బ్రాకెట్స్ మద్యలో కర్సర్ ఉండగా… మీ కీబోర్డులో Alt+Insert రెండు బటన్స్ ఒకే సారి ప్రెస్ చేయాలి.
ఈ క్రింది ఇమేజులో మాదిరిగా పోప్ అప్ మెను వస్తుంది…
తెలుగులో మొబైల్ యాప్ డవలప్ మెంట్
పై ఇమేజ్ చూడండి. అందులో కన్సట్రక్టర్ (constructor) బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ కాబడి ఉంది. దానిపై క్లిక్ చేస్తే, మీకు మరొక పోప్ అప్ విండో వస్తుంది. ఈ క్రింది ఇమేజ్ మాదిరిగా ఉంటుంది.
ఆండ్రాయిడ్ స్టూడియో గురించి తెలుగులో
పైచిత్రంలో చూపినట్టుగా మీరు మోడల్ తీసుకున్న రెండు వేరియబల్స్ కు కన్సట్రక్టర్ క్రియేట్ చేయాలి. కాబట్టి కనబడుతున్న రెండింటిని కూడా బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ అయ్యేలా చూసుకుని ఒకె బటన్ క్లిక్ చేయాలి.
అప్పుడు మీకు క్రింది ఇమేజులో మాదిరిగా కన్సట్రక్టర్ క్రియేట్ అవుతుంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
కన్ట్స్రక్టర్ క్రియేట్ అయ్యాక, అవే వేరియబుల్స్ కు గెట్టర్ అండ్ సెట్టర్ సెట్ చేయాలి.
Alt+Insert బటన్స్ మరలా ప్రెస్ చేస్తే, క్రింది ఇమేజులో చూపిన విధంగా Getter and Setter అనే ఇంగ్లీషు అక్షరాలు బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ చేయబడి ఉన్నాయి.
తెలుగు ఆండ్రాయిడ్ స్టూడియో గురించి తెలుగుసుకుందాం.
పైన ఉన్న ఇమేజులో చూపినట్టుగా Getter and Setter ఇంగ్లీషు అక్షరాలపై క్లిక్ చేస్తే క్రిందివిధంగా మరొక పోప్ అప్ విండో వస్తుంది.
రీసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ యాప్ తెలుగులో
కన్సట్రక్టర్ మాదిరిగానే గెట్టర్ అండ్ సెట్టర్స్ కూడా రెండు స్ట్రింగులకు జనరేట్ చేయాలి.
ఆ తర్వాత మోడల్ క్లాస్ జావా ఫైల్ క్రియేట్ చేసిన విధంగానే మరలా లెఫ్ట్ సైడులో ఉన్న ప్యాకేజి నేమ్ పై రైట్ క్లిక్ చేసి, ఎడాప్టర్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేయాలి….
ఎడాప్టర్ జావా క్లాస్ ఫైల్
అలా క్రియేట్ చేసిన ఎడాప్టర్ ఫైల్ ఈ క్రింది ఇమేజులో మాదిరిగా ఉంటుంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
పై ఎడాప్టర్ క్లాసు ఫైలులో ఉన్న కోడ్ గమనించండి….
ఆ కోడ్ ఈ విధంగా ఉంది. ముందుగా ఉన్న లైన్ ప్యాకెజి నేమ్… తర్వాత క్లాస్ క్రింది విధంగా ఉంది.
public class MyAdapter{
}
పై ఉన్న కోడ్ నందు ఉన్న మొదటి ఫ్లవర్ బ్రాకెట్ కు ముందు MyAdapter ఇంగ్లీషు అక్షరాల తర్వాత ఆ రెండింటి మద్యలో ఈ క్రింది ఇంగ్లీషు పదాలు వ్రాయాలి.
extends RecyclerView.Adapter<MyAdapter.MyViewHolder> అలా ఈ అక్షరాలు వ్రాసిన తర్వాత క్లాసు ఫైల్ ఎర్రర్ లైనుతోనూ, ఎర్రర్ టెక్ట్సుతోనూ కనబడుతుంది. ఈ క్రింది ఇమేజులో ఉన్నట్టుగా…
పైన ఉన్న ఇమేజులో ఎర్రర్ వర్డ్ MyViewHolder అనే పదంపై మౌజ్ పెడితే, రెడ్ బల్బ్ సింబల్ ఒక్కటి స్కీనుపై కనబడుతుంది.
ఆ రెడ్ బల్బ్ నందు గల ఏరో మార్కును క్లిక్ చేయగానే పోప్ అప్ మెను వస్తుంది.
దానిలో Create class ‘MyViewHolder’ అని బ్లూకలర్ బ్యాక్ గ్రౌండులో హైలెట్ చేయబడిన ఇంగ్లీషు అక్షరాలపై క్లిక్ చేయాలి.
పబ్లిక్ క్లాస్ క్రియేట్ అవుతుంది. మరలా ఎర్రర్ లైన్ అలానే కనబడుతుంది. మరలా ఎర్రర్ లైనుపై మౌస్ మూవ్ చేస్తే, రెడ్ బల్బ్ కనబడుతుంది.
ఈసారి రెడ్ బల్బ్ మెనులో క్రింది ఇమేజులో కనబడుతున్నట్టు Implement methods అను ఇంగ్లీషు అక్షరాలు బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ అయ్యి కనబడుతున్న అక్షరాలను క్లిక్ చేయాలి.
ఈ క్రిందిఇమేజులో మాదిరి ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ పోపప్ విండోలో కనబడతాయి.
ఇంప్లిమెంట్ మెధడ్స్ యాడ్ అయ్యాక ఎడాప్టర్ ఫైల్ ఈ క్రింది ఇమేజులో ఉన్న విధంగా ఇంకా ఎర్రర్ లైన్ కనబడుతూ ఉంటుంది.
ఆ ఎర్రర్ లైను మరలా మౌస్ తీసుకువెళితే, మరలా రెడ్ బల్బ్ మెనులో ఉన్న బ్లూకర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ చేయబడిన లైను చూడండి.
ఆ పై క్లిక్ చేయగానే, మైవ్యూహోల్డర్ క్లాస్ ఎక్ట్సెంట్ అవుతుంది. అలా ఎక్ట్సెండ్ అయిన వ్యూక్లాస్ ఫైల్ ఎర్రర్ లైన్ కలిగి ఉంటుంది.
దానిపై మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే, వచ్చే మెనులో Create constructor matching super అను ఇంగ్లీషు అక్షరాలపై క్లిక్ చేయాలి.
రిసైక్లర్ వ్యూ హోల్డర్ క్లాసుకు కూడా కన్సట్రక్టర్ క్రియేట్ చేశాక ఎడాప్టర్ క్లాస్ ఫైల్ ఈ క్రింది ఇమేజులో విధంగా ఉంటుంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
ఇక్కడతో ఎడాప్లర్ క్లాసులో ఆటోమెటిక్ జనరేషన్ కోడ్ పూర్తవుతుంది.
ఈ ఎడాప్టర్ క్లాసులో కోడ్ మాన్యువల్ గా వ్రాయడం…
పైచిత్రంలో onCreateViewHolder మెథడ్ ఉంది. అందులో రిసైక్లర్ వ్యూలో చూపించవలసిన రో ఐటమ్ ను ఇన్ ఫ్లేట్ చేయాలి. అందుకు ముందుగా లేఅవుట్ ఫైల్ క్రియేట్ చేయాలి.
అందుకు పైఇమేజులో చూస్తే లెఫ్ట్ సైడులో ఉన్న res అని మూడు అక్షరాలు కలిగిన ఫోల్డర్ పై క్లిక్ చేస్తే, layout అనే ఆంగ్ల అక్షరాలతో మరొక ఫోల్డర్ వస్తుంది.
ఆ ఫోల్డర్ పై మౌస్ పాయింటర్ ఉంచి, రైట్ క్లిక్ చేస్తే, సైడుగా మెను వస్తుంది. అందులో New ఇంగ్లీషు అక్షరాలపై క్లిక్ చేయగానే ప్రక్కగా మరొక సబ్ మెను వస్తుంది. అందులో లేఅవుట్ రిసోర్స్ ఫైల్ పై క్లిక్ చేయాలి.
పై చిత్రంలో మీకు వచ్చిన లేవుట్ ఫైల్ డిజైనింగ్ కోడ్ వ్రాయాలి. ఈ క్రింది ఇమేజులో మాదిరిగా ఉంటంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
ఈపైనగల ఇమేజులో లైనర్ లేఅవుట్ ఓరియంటేషన్ వెర్టికల్ తీసుకోవడం జరిగింది. అందువలన ఆ లేవుట్లో ఎన్ని విడ్జెట్స్ తీసుకున్నా ఒకదాని తర్వాత ఒక్కటిగా నిలువుగా సెట్ అవుతాయి.
రెండు టెక్ట్సు వ్యూస్ పైన ఉన్న ఇమేజులో చూపించడం జరిగింది. ఒకటి ఫస్ట్ నేమ్, రెండవది లాస్ట్ నేమ్…
ఎడాప్టర్ క్లాసులో మొదటిగా రెండు వేరియబుల్స్ ఈక్రింది విధంగా డిక్లేర్ చేయాలి.
Context context;
List<ModelName> nameList;
ఈపై రెండు వేరియబుల్స్ కు కనస్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. ఆ కోడ్ ఈ క్రింది విధంగా వస్తుంది.
ఇప్పుడు లేఅవుట్ ఫైలును ఎడాప్టర్ యాడ్ చేయాలి. అందుకు ఆన్ క్రియేట్ కోడ్ ను ఈ క్రింది విధంగా మార్చాలి.
@NonNull
@Override
public MyViewHolder onCreateViewHolder(@NonNull ViewGroup parent, int viewType) {
View view = LayoutInflater.from(context).inflate(R.layout.recycle_item_layout,parent,false);
return new MyViewHolder(view);
}
ఐటమ్ లేఅవుట్ ఫైల్ యాడ్ చేశాకా, getItemcount మెథడ్ ఈక్రింది విధంగా మార్చాలి.
@Override
public int getItemCount() {
return nameList.size();
}
ఇప్పుడు MyViewHolder పబ్లిక్ క్లాసులో ఇందాక క్రియేట్ చేసిన లేవుట్ ఫైల్లోని ఐటమ్స్ ని అనుసంధానం చేయాలి. ఆ కోడ్ ఈ క్రిందివిధంగా ఉంటుంది.
public class MyViewHolder extends RecyclerView.ViewHolder {
TextView first_name, last_name;
public MyViewHolder(@NonNull View itemView) {
super(itemView);
first_name = itemView.findViewById(R.id.first_name);
last_name = itemView.findViewById(R.id.last_name);
}
తర్వాత onBindViewHolder మెథడులో ఐటమ్స్ కు ఇన్ పుట్ డేటా బైండ్ చేయాలి. ఆ కోడ్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
@NonNull
@Override
public MyViewHolder onCreateViewHolder(@NonNull ViewGroup parent, int viewType) {
View view = LayoutInflater.from(context).inflate(R.layout.recycle_item_layout,parent,false);
return new MyViewHolder(view);
}
దీంతో ఐటమ్ లేఅవుట్ ఫైలు, మోడల్ క్లాసు ఎడాప్టర్ కు అనుసంధానం చేయడం జరిగింది. ఏదైనా ఫైల్ కాపీ పేస్ట్ చేయవచ్చును… కానీ ఎడాప్టర్ క్లాసులో మెథడ్స్ వారీగా జనరేట్ చేసుకుంటూ, కాపీ పేస్ట్ చేయాలి కానీ ఒకేసారి ఫైల్ కోడంతా కాపీ పేస్ట్ చేస్తే మాత్రం ఒక్కోసారి ఎర్రర్ షో అవుతుంది.
మైఎడాప్టర్ క్లాసు ఈ ప్రొజెక్టువరకు మాత్రం ఫైనల్ గా ఈ క్రింది ఇమేజులో మాదిరిగా ఉంటుంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
ఎడాప్టర్, మోడల్ క్లాసులను ఏక్టివిటిలోకి అనుసంధానం చేయడం
ఏక్టివిటిలో మెయిన్ఏక్టివిటి జావా ఫైల్ లో లిస్ట్, రిసైక్లర్ వ్యూ, లేఅవుట్ మేనేజర్, మైడాప్టర్ నాలుగు ముందుగా వేరియబుల్స్ గా డిక్లేర్ చేయాలి.
ఈక్రింది కోడ్ చూడండి… రిసైక్లర్ వ్యూ విడ్జెట్ ఐడితో కాల్ చేస్తున్నాం.
recyclerView = findViewById(R.id.myRecyclerView);
రిసైక్లర్ వ్యూ విడ్జెట్ కాల్ చేశాక… ఆ రిసైక్లర్ వ్యూకి లేఅవుట్ మేనేజర్ ను అనుసంధానం చేయడం… ఈ క్రింది కోడ్ చూడండి.
layoutManager = new LinearLayoutManager(this);
recyclerView.setLayoutManager(layoutManager);
ఇప్పుడు రిసైక్లర్ వ్యూకు మైఎడాప్టర్ ను అనుసంధానం చేయాలి. ఈ క్రింది కోడ్ చూడండి.
adapter = new MyAdapter(this,nameList);
recyclerView.setAdapter(adapter);
దీంతో ఏక్టివిటికి అంటే రిసైక్లర్ వ్యూ యూజరు కనబడే విధంగా తీసుకున్న స్క్రీనులోకి ఎడాప్టర్ ద్వారా మోడల్, లేఅవుట్ ఐటమ్, లేఅవుట్ మేనేజర్, ఎర్రేలిస్టు అనుసంధానం చేశాము.
ఇక ఇప్పుడు ఆ లిస్టులోకి ఇన్ పుట్ డేటా ఇవ్వాలి. అందుకు ఏదైనా ఒక పేరుతో మెథడ్ కాల్ చేయాలి. addNames(); అనే పేరుతో ఒక మెథడ్ కాల్ చేశాను. ఆ మెథడులో కోడ్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
private void addNames() {
ModelName name = new ModelName("చిరంజీవి","కొణెదల");
nameList.add(name);
name = new ModelName("బాలకృష్ణ","నందమూరి");
nameList.add(name);
name = new ModelName("నాగార్జున","అక్కినేని");
nameList.add(name);
name = new ModelName("వెంకటేష్","దగ్గుబాటి");
nameList.add(name);
name = new ModelName("మహేశ్","ఘట్టమనేని");
nameList.add(name);
name = new ModelName("మహేశ్","ఉప్పలపాటి");
nameList.add(name);
name = new ModelName("పవన్ కళ్యాణ్","కొణెదల");
nameList.add(name);
name = new ModelName("రామ్","పోతినేని");
nameList.add(name);
name = new ModelName("నాని","ఘంటా");
nameList.add(name);
name = new ModelName("గోపిచంద్","తొట్టెంపూడి");
nameList.add(name);
}
ఇన్ పుట్ డేటా కోడ్ యాడ్ చేయడంతో ఒక రిసైక్లర్ వ్యూ కోడింగ్ వ్రాయడం పూర్తయింది. మెయిన్ఏక్టివిటి.జావా ఫైల్ ఈ క్రింది ఇమేజులో..
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
చివరగా అవుట్ పుట్ ఈ క్రింది ఇమేజులో మాదిరిగా ఉంటుంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
ఇదే రెండు పేర్లను ఒకదాని ప్రక్కగా ఒక్కటిగా కనిపించే అనేక వరుసలను ఒకే స్క్రీనులో చూపే రీసైక్లర్ వ్యూ…
పూర్తిగా ఒక ఫస్ట్ నేమ్, సర్ నేమ్ లతో కూడిన రీసైక్లర్ వ్యూ యొక్క పుల్ కోడ్ ఫైల్స్ ఈ క్రిందగా చూడండి…
ModelName.java
package add.to.list;
public class ModelName {
String name;
String sir_name;
//press at a time Alt+Insert buttons on your keyboard
public ModelName(String name, String sir_name) {
this.name = name;
this.sir_name = sir_name;
}
//press again Alt+Insert buttons on your keyboard
public String getName() {
return name;
}
public void setName(String name) {
this.name = name;
}
public String getSir_name() {
return sir_name;
}
public void setSir_name(String sir_name) {
this.sir_name = sir_name;
}
}
MyAdapter.java
package add.to.list;
import android.content.Context;
import android.view.LayoutInflater;
import android.view.View;
import android.view.ViewGroup;
import android.widget.TextView;
import androidx.annotation.NonNull;
import androidx.recyclerview.widget.RecyclerView;
import java.util.List;
public class MyAdapter extends RecyclerView.Adapter<MyAdapter.MyViewHolder> {
Context context;
List<ModelName> nameList;
public MyAdapter(Context context, List<ModelName> nameList) {
this.context = context;
this.nameList = nameList;
}
@NonNull
@Override
public MyViewHolder onCreateViewHolder(@NonNull ViewGroup parent, int viewType) {
View view = LayoutInflater.from(context).inflate(R.layout.recycle_item_layout,parent,false);
return new MyViewHolder(view);
}
@Override
public void onBindViewHolder(@NonNull MyViewHolder holder, int position) {
holder.first_name.setText(nameList.get(position).getName());
holder.last_name.setText(nameList.get(position).getSir_name());
}
@Override
public int getItemCount() {
return nameList.size();
}
public class MyViewHolder extends RecyclerView.ViewHolder {
TextView first_name, last_name;
public MyViewHolder(@NonNull View itemView) {
super(itemView);
first_name = itemView.findViewById(R.id.first_name);
last_name = itemView.findViewById(R.id.last_name);
}
}
}
package add.to.list;
import androidx.appcompat.app.AppCompatActivity;
import androidx.recyclerview.widget.LinearLayoutManager;
import androidx.recyclerview.widget.RecyclerView;
import android.os.Bundle;
import android.widget.ArrayAdapter;
import android.widget.ListView;
import java.util.ArrayList;
import java.util.List;
public class MainActivity extends AppCompatActivity {
List<ModelName> nameList = new ArrayList<>();
RecyclerView recyclerView;
RecyclerView.LayoutManager layoutManager;
MyAdapter adapter;
@Override
protected void onCreate(Bundle savedInstanceState) {
super.onCreate(savedInstanceState);
setContentView(R.layout.activity_main);
recyclerView = findViewById(R.id.myRecyclerView);
layoutManager = new LinearLayoutManager(this);
recyclerView.setLayoutManager(layoutManager);
adapter = new MyAdapter(this,nameList);
recyclerView.setAdapter(adapter);
addNames();
}
private void addNames() {
ModelName name = new ModelName("చిరంజీవి","కొణెదల");
nameList.add(name);
name = new ModelName("బాలకృష్ణ","నందమూరి");
nameList.add(name);
name = new ModelName("నాగార్జున","అక్కినేని");
nameList.add(name);
name = new ModelName("వెంకటేష్","దగ్గుబాటి");
nameList.add(name);
name = new ModelName("మహేశ్","ఘట్టమనేని");
nameList.add(name);
name = new ModelName("మహేశ్","ఉప్పలపాటి");
nameList.add(name);
name = new ModelName("పవన్ కళ్యాణ్","కొణెదల");
nameList.add(name);
name = new ModelName("రామ్","పోతినేని");
nameList.add(name);
name = new ModelName("నాని","ఘంటా");
nameList.add(name);
name = new ModelName("గోపిచంద్","తొట్టెంపూడి");
nameList.add(name);
name = new ModelName("శ్రీకాంత్","మేకా");
nameList.add(name);
name = new ModelName("వేణు","తొట్టెంపూడి");
nameList.add(name);
name = new ModelName("అర్జున్","అల్లు");
nameList.add(name);
name = new ModelName("రానా","దగ్గుబాటి");
nameList.add(name);
name = new ModelName("తారకరామారావు","నందమూరి");
nameList.add(name);
name = new ModelName("విజయ్","దేవరకొండ");
nameList.add(name);
name = new ModelName("రామ్ చరణ్","కొణెదల");
nameList.add(name);
name = new ModelName("మోహన్ బాబు","మంచు");
nameList.add(name);
name = new ModelName("నరేష్","ఇవివి");
nameList.add(name);
name = new ModelName("కళ్యాణ్ రామ్","నందమూరి");
nameList.add(name);
}
}
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్ ఇప్పుడు ట్రెండింగులో ఉన్న సాఫ్ట్ వేర్ డవలప్ మెంటు.
ఒకనాడు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రొగ్రామింగులో ఒక ఊపు ఊపిన జావా, ఇప్పుడు మొబైల్ రంగంలో యాప్ డవలప్ మెంటులో కూడా అదే చేసింది.
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే మొబైల్ యాప్స్ కూడా పెరిగాయి.
మొబైల్ యాప్ డవలపర్స్ పెరిగారు. మొబైల్ యాప్స్, గేమ్స్ అనేకంగా వస్తున్నాయి. గేమ్ డవలప్ మెంట్ అయితే యానిమేషన్ కూడా తెలిసి ఉండాలి.
యాప్ డవలప్ మెంటుకు లాజికల్ థింకింగుకు జావా లాంగ్వేజ్ తోడైతే, ఆలోచనకు రూపకల్పన చేయవచ్చును.
ఆండ్రాయిడ్ ఫోన్లలో మొబైల్ యాప్స్ అనేకంగా ఉన్నాయి. అయినా అందరీ ఆలోచన ఒకలాగా ఉండదు. కొందరి ఆలోచన కొందరికే నచ్చవచ్చును. కానీ కొందరి ఆలోచన అందరికీ నచ్చవచ్చును.
అలా అందరికీ నచ్చేవిధంగా మీరు ఆలోచన విధానం ఉంటే, మాత్రం టెక్నాలజీని వాడుకునే అవకాశం వదులుకోకూడదు. ఒకే అంశంపై రక రకాల మొబైల్ యాప్స్ ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నా అందరికీ నచ్చేలా ఉందే, విజయవంతం అవుతంది.
ఆవిధంగా అందరికీ నచ్చేవిధంగా మన ఆలోచనా విధానం ఉందో లేదో తెలియాలంటే, మనకు ఆలోచనను ఒక రూపం ఇచ్చి, దానిని అందరికీ పరిచయం చేయడమే…
అందరికీ పరిచయం చేసిన విషయం పాపులర్ అయితే, మన ఆలోచనా విధానం చాలామందికి నచ్చింది. ఎంత ఎక్కువమందికి నచ్చితే…. అంత పాపులారిటీ….
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్
పొందిన పాపులారిటీ వృధా అవ్వదు. చాలా ఉపయోగపడుతుంది. వెంటనే ఆలోచనను మరింత వృద్ది చేసి, మరింత ప్రయోజనకారిగా యాప్ డవలప్ చేస్తే, అది ఇంకా ఎక్కువమందికి చేరుతుంది.
ఐడియా ఉండాలి. ఐడియా డవలప్ చేయాలి. అందరికీ ఉపయోగపడేలాగా…
అలా పొందిన పాపులారిటిని మరింతగా డవలప్ చేసుకోవచ్చును. అసలు ఐడియా ఉండాలి. ఉన్న ఐడియా ఎక్కువమందికి ఉపయోగపడాలి. ఐడియా డవలప్ చేయాలి. అందరికీ ఉపయోగపడేలాగా…
ఎలాంటి ఐడియా అయినా దాని వలన భవిష్యత్తు సమజ మనుగడకు అడ్డు రాకుండా ఉండాలి. ఏదో ఒక ఆలోచన పట్టుకుని గొప్ప ఐడియాగా భావిస్తే, అది భవిష్యత్తును దెబ్బతీయవచ్చును.
అలాంటి వాటిలోకి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు అందరూ బాగా వాడారు. అంటే అప్పట్లో అది గొప్ప ఆలోచన కావచ్చును… కానీ ఇప్పుడ ప్లాస్టిక్ భూతం మానవ మనుగడకు ముప్పు అనే కధనాలు అనేకంగా చదువతున్నాం… అటువంటి ఐడియాలు… వేస్ట్…
కరెంట్ సిట్యుయేషన్లో యూజ్ అవ్వడమే కాదు… ఫ్యూచర్లో కూడా ఉపయోగంగానే ఉంటే, దాని ఉపయోగం ఉన్నన్నాళ్ళు మన ఆలోచన గొప్పదే… దాని ఫలితం పదిమందికి ప్రయోజనంగా ఉంటుంది.
గుడ్ ఐడియా ఉండాలి. మంచి ఆలోచనను యూజుపుల్ గా మార్చాలి. ఎలా డవలప్ చేస్తే మన ఐడియా అందరికీ ఉపయోగపడుతుందో… సరిగా ఆలోచన చేసి, దానిని అభివృద్ది చేయాలి.
అందరికీ ఉపయోగపడే ఐడియా మన దగ్గర ఉంటే, దానిని టెక్నాలజీతో ఒక రూపకల్పన చేసి, నలుగురికీ ఉపయోగపడేలా చేయవచ్చును.
ఇప్పుడు టెక్నాలజిలో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువమంది వాడుతున్నారు.
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్… ఏదైనా విషయం ఎక్కువ మందికి చేరేలా ఉంటే, అదే సమాజాన్ని శాసిస్తుంది.
చాలా చాలా మందే ఆండ్రాయిడ్ ఓస్ ఉన్న స్మార్ట్ ఫోనులో సమాజంలో వాడుతున్నారు. ఏదైనా విషయం ఎక్కువ మందికి చేరేలా ఉంటే, అదే సమాజాన్ని శాసిస్తుంది.
ఇప్పుడు సమాజంలోకి స్మార్ట్ ఫోను మంచి మీడియాగా ఉంది. మీరు ఏదైనా ఐడియాతో ఒక యూట్యూబ్ చానల్ డవలప్ చేస్తే, చాలామందికి ఆండ్రాయిడ్ ఫోనుద్వారా మీ వీడియోలు చేరతాయి.
మీరు ఒక బ్లాగును క్రియేట్ చేస్తే, మీరు చెప్పే విషయాల విశ్లేషణ చాలామందికి ఆండ్రాయిడ్స్మార్ట్ ఫోన్ల ద్వారానే చేరుతుంది.
మీరు ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేస్తే ఎక్కువమందికి చేరేది… ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతోనే…
మనం మాట్లాడిన ఒకరికి నచ్చితే, అతని దగ్గర గుర్తింపుకు పరిమితం. అలాగే మనం మాట్లాడిన విషయం ఒక ఊరి ప్రజలందరికీ నచ్చితే, అది ఊరివరకే పరిమితం… పోటీ చేస్తే సర్పంచ్ గా గెలవవచ్చును.
కానీ మనం మాట్లాడిన విషయం ఒకటికి పదిసార్లు ఒక స్టేట్ ప్రజలందరికీ నచ్చితే, ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది… కదా…
అలాగే ఏదైనా ఒక ఐడియాను డవలప్ చేశారు. అది ఎక్కువమందికి నచ్చింది. ఇంకా ఎక్కువసేపు ఆ ఐడియాను ఫాలో అవుతున్నారు. అది ఆర్ధికప్రయోజం పెందచుతుంది.
మొబైల్ యాప్ డవలప్ చేయాలంటే, ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి. ఎక్కువమంది యూజర్లకు నచ్చడం. ఎక్కువమంది యాక్టివ్ యూజర్లను కలిగి ఉండడం… చాలా ప్రధానం.
ఇంతకముందు అనుకున్నట్టు ఒక విషయంలో ఎంతమంది ఎన్ని మొబైల్ యాప్స్ డవలప్ చేసినా… అందరికీ నచ్చింది… ఎక్కువమంది ఏక్టివ్ యూజర్లను కలిగి ఉన్న యాప్… సక్సెస్ పుల్ యాప్…
పాపులర్ ఐడియా ఉండదు…. మంచి ఐడియాపాపులర్ అవతుంది. అందరికీ తెలిసిన విషయమే… అది కానీ అందులో అందరూ గమనించని విషయం ఉంది.
చాలామంది గమనించని విషయమును హైలెట్ చేసిన ఐడియా సక్సెస్ అవుతుంది.
అంటే అందరూ ఫోను వాడుతుంటారు… ఆ ఫోను గురించిన పూర్తి అవగాహన ఎక్కువమందికి ఉండకపోవచ్చును.
కొందరికి కేవలం ఫోను కాల్ చేయడం కొరకు మాత్రమే వాడుతారు. వీరు ఖరీదు అయిన ఫోను అయినా, దానిని కేవలం కాల్ చేయడం కొరకు మాత్రమే వాడుతారు.
సోషల్ మీడియా యాప్స్ కొందరు వాడుతూ ఉంటారు. కేవలం ఫ్రెండ్ రిక్వెస్టులు చూడడం, వారికి తిరిగి రిప్లై ఇవ్వడం… చాలామంది ఇక్కడికే పరిమితం అవ్వవచ్చును.
బ్రౌజింగ్ ద్వారానే చాలా వరకు యాప్స్ ఇన్ స్టాల్ చేయవసరంలేదు… బ్రౌజింగుపై పూర్తి అవగాహన అన్ని ప్రాంతీయ భాషలలోనూ అందిస్తే, ఆ యాప్ విజవంతం కాగలదు.
ఎందుకంటే సోషల్ మీడియా యాప్స్ అంటే, వెబ్ సైటుల కూడా ఉంటాయి. వెబ్ సైటులను ఏదైనా ఒక బ్రౌజరులో ఓపెన్ చేసి చూసుకోవచ్చును…. కాబట్టి మొబైల్ బ్రౌజింగ్ ట్యుటోరియల్ బాగా వృద్ది చేస్తే, ఉపయోపడుతుంది.
ఒక గుడ్ ఐడియా అందరికీ ఉపయోగడపడేలా మొబైల్ యాప్ డవలప్ చేయాలి. దానిని ఎక్కువమందికి తెలిసేలాగా చేయాలి. అప్పుడు ఆయాప్ సక్సెస్ అవుతుంది.
ఇంకా చాలామంది డవలప్ చేసిన మొబైల్ యాప్స్ ఉన్నా… అందులో ఏదో ఒక విషయంలో మరింత డవలప్ మెంట్ అవసరం ఉంటుంది. ఆ విషయం కనిపెడితే, ఆరకమైన యాప్ మరొకటి చేసినా విజయవంతం అవుతుంది.
ప్లేస్టోర్లో అనేక రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయి. ప్రతి ఆండ్రాయిడ్ ఫోను యూజర్ అన్నింటిని డౌన్ లోడ్ చేసుకోరు. కావాల్సిన మాత్రమే డౌన్ లోడ్ చేసుకుంటారు.
అలా అందరూ డౌన్ లోడ్ చేసుకుని ఉండే యాప్స్ ఏమిటో చూసుకుని… అటువంటి యాప్స్ బాగా గమనించి, వాటిలో బెటర్ మెంట్ తీసుకురాగలిగితే, గ్రేట్ రిజల్ట్స్ పొందవచ్చును.
వాట్సప్, యూట్యూబ్, మ్యూజిక్ ప్లేయర్, మెసేజింగ్ వంటి మొబైల్ యాప్స్
చాలా మంది ఫోన్లలో వాట్సప్, యూట్యూబ్, మ్యూజిక్ ప్లేయర్, మెసేజింగ్ వంటి మొబైల్ యాప్స్ ఉంటాయి. యూట్యూబ్ అయితే ప్రతీ ఆండ్రాయిడ్ ఫోనులోనూ డిఫాల్ట్ గా ఉంటుంది.
మ్యూజిక్ ప్లేయర్, మెసేజింగ్, కాలింగ్, కాంటాక్ట్స్, వీడియో ప్లేయర్ వంటివి ఎటువంటి స్మార్ట్ ఫోను అయినా డిఫాల్ట్ గానే కొన్ని ఉంటాయి.
అలాంటి వాటిలో ఏవైనా సమస్యలు ఉంటే, అవి అందరికీ ఉండవచ్చనే ఊహను పట్టుకుంటే, ఆ ఊహను మరింతగా డవలప్ చేసి, కొత్త యాప్ క్రియేట్ చేయడమే….
ఇప్పుడున్న పాపులర్ యాప్స్, స్మార్ట్ ఫోను వచ్చిన కొత్తల్లో ఉండి ఉండవు… కదా.
స్మార్ట్ ఫోను వినియోగదారులు పెరిగాక పలు మొబైల్ యాప్స్ వృద్ది చెందాయి. హాట్ స్టార్ మొబైల్ యాప్ 2015లో లాంచ్ అయ్యింది…. అంతకుముందు స్మార్ట్ ఫోనులు ఉన్నాయి… వాటిలో సినిమాలు చూసేవారు…
మొబైల్ వాడుక ఎంతకాలం? యాప్స్ వాడుక ఎంతకాలం? ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్
మొబైల్ వాడకం ఎప్పుడూ ఉంటుంది… అందులో యాప్స్ వస్తూ ఉంటాయి… పోతూ ఉంటాయి.
ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ కొన్న వ్యక్తి మరికొంత కాలానికి మరొక ఫోన్ కొంటాడు… కానీ ఫోన్ వాడుకను మానడు… అయితే ఫోన్ వాడుతున్న యూజర్ ఖాతా చరిత్రలో నిలిచి ఉంటున్న యాప్స్ ఎన్ని?
అలా ఒక యూజర్ మొబైల్ ఖాతా చరిత్రలో ఎల్లకాలం, ఎంత ఎక్కువమంది చరిత్రంలో ఉంటే, అంత విజయవంత అయినట్టు….
యూట్యూబ్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ వంటి కొన్ని సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ ఉంటాయి.
అయితే ఇప్పుడు మొబైల్ యాప్ ప్రారంభంలో అంత పెద్ద విజయం సాధ్యం కాకపోవచ్చును. కానీ మన ఐడియా అందరికీ నచ్చితే, అది సాధ్యమే అవుతుంది.
ఎందుకంటే అవసరాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలాగా నడవదు. 2019లో రెగ్యులర్ జీవన విధానం 2020లో అందరిలోనూ మార్పుకు గురైంది… అప్పుడప్పుడు కాలం తెచ్చే మార్పులు వ్యవస్థలపై కూడా భారీగానే పడతాయి.
అలాంటి సమయాలలో కొత్త ఆలోచను పుంతలు తొక్కుతాయి. యూజుపుల్ ఐడియాస్ వర్కవుట్ అవుతాయి.
మొబైల్ యూజర్ ఖాతాలో మన మొబైల్ యాప్ పర్మెనెంటుగా ఉండాలంటే, ఎక్కువమంది మొబైల్ యూజర్స్ ఉపయోగించే ఉపయోగాన్ని మనం అందరికన్నా సమర్ధవంతంగా అందించాలి.
వీడియో బ్లాగింగ్ ఇప్పుడు పెద్ద ట్రెండు… అందరూ ఆన్ లైన్లో ఫోనుతో కనెక్ట్ అయ్యి ఉంటున్నారు. ఔత్సాహికులు వీడియో ద్వారా ఇచ్చే ప్రదర్శనల వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.
అలాంటి వీడియో బ్లాగింగులో మరింత డవలప్మెంట్ ఎక్కువ సక్సెస్ రేట్ సాధించగలదు… ఇప్పటికే ఉన్న వీడియో బ్లాగింగ్ యాప్స్ గమనిస్తే, వాటిలో ఏదైనా అసౌకర్యం ఉండి, దానిని మరింత డవలప్ చేయడంతో సక్సెస్ పుల్ వీడియో యాప్ చేయవచ్చును.
ఒకప్పుడు ఒక రైటర్ ఎనలైజింగ్ ఆర్టికల్స్ ఒక పుస్తకంగా ఉండేవి. కానీ ఆన్ లైన్ అందుబాటులోకి వచ్చాకా… అవి పిడిఎఫ్ బుక్స్ రూపంలోకి మారుతున్నాయి.
మొబైల్ యాప్స్ రూపంలో కూడా బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి. బ్లాగులు మొబైల్ బ్లాగులుగా మారుతున్నాయి.
నేటి టెక్నాలజీ యుగంలో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ కీలక పాత్రను పోషిస్తాయి. వాటిలో మీ ఐడియా ఉంటే, భవిష్యత్తు మీదేనంటారు…
ఏవైనా కొన్ని వస్తువులు, ప్రదేశాలు, వ్యక్తులు, సర్వీసులు…. ఇలా ఏవైనా ఒకే చోట చూపడానికి జాబితా తయారు చేస్తాము. అలాగే మొబైల్ యాప్ ఒకే స్క్రీనులో కొన్ని విషయాలను చూపడానికి లిస్ట్ చేయాలి. అలా లిస్ట్ చేయడానికి లిస్టువ్యూ విడ్జెట్ ఉపయోగపడుతుంది. సింపుల్ లిస్టువ్యూ ద్వారా ఏవైనా కొన్ని వస్తువుల లేదా వ్యక్తుల లేదా సర్వీసు వివరాలను ఒక స్క్రీనులో చూపవచ్చును.
లిస్టువ్యూ ఉపయోగించి, ఒక బేసిక్ ఆండ్రాయిడ్ యాప్ ఎలా చేయాలో ఈ పోస్టులో చూద్దాం. కొత్త ఆండ్రాయిడ్ ప్రొజెక్టు ఆండ్రాయిడ్ స్టూడియో స్టార్ట్ చేయగానే ముందుగా మెయిన్ ఏక్టివిటి ఎక్స్.ఎం.ఎల్ ఫైల్, దానికి సంబంధించిన జావా ఫైల్ ఓపెన్ అవుతాయి.
ఈ క్రింది ఇమేజ్ చూడండి… మీరు కొత్త ప్రాజెక్టు ఓపెన్ చేస్తే, ఈ విధంగా మెయిన్ లేఅవుట్ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ఓపెన్ అవుతంది.
టాప్ రైటులో మూడు వర్డ్స్ ఉన్నాయి. కోడ్(Code), స్ల్పిట్(Split),డిజైన్(Design). వీటిలో మీరు కోడ్(Code) పైక్లిక్ చేస్తే, కేవలం కోడ్ మాత్రమే స్క్రీనుపై కనబడుతుంది.
లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?
స్ల్పిట్(Split)పై క్లిక్ చేస్తే కోడ్ మరియు డిజైనింగ్ పార్ట్ రెండూ కనబడతాయి. ఎక్కువమంది ఈ Split పద్దతిలోనే వర్కు స్పేస్ ఉండేలా చూసుకుంటారు.
డిజైన్(Design)పై క్లిక్ చేస్తే, కేవలం డిజైన్ మోడ్ మాత్రమే కనబడుతుంది. ఇది డ్రాప్ అండ్ డ్రాగ్ పద్దతిలో యాప్ డిజైన్ చేసేవారికి సులువుగా ఉంటుంది.
ఏ కొత్త ఏక్టివిటీ తీసుకున్న, దానికి ఒక ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ మరియు జావా ఫైల్… రెండూ క్రియేట్ అవుతాయి.
ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ లేఅవుట్ డిజైన్ చేయడానికి ఉపయోగిస్తాం. జావా ఫైల్ బ్యాక్ గ్రౌండులో జరిగే కోడింగ్ వ్రాయడానికి ఉపయోగిస్తాం.
ఇప్పుడు మెయిన్ ఏక్టివిటీ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్లో లిస్టువ్యూ విడ్జెట్ ఉపయోగించడానికి ఈ క్రింది కోడ్ గమనించండి.
ఈక్రింది ఇమేజ్ చూడండి. ఇది జావా ఫైల్. మెయిన్ లేఅవుట్ కు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో కోడ్ వ్రాస్తే, ఎక్స్.ఎం.ఎల్ లేఅవుట్లో యాక్షన్ చేయగలుగుతాం.
లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ మెయిన్ ఏక్టివిటీలో లిస్టువ్యూ
దిగువ చిత్రంలో చూడండి…. స్ప్లిట్ మోడ్లో ఉన్న ఏక్టివిటీ మెయిన్.ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ఒక్కటి ఉంది. అందులో రైట్ సైడులో లిస్టువ్యూ కనబడుతుంటే, మిడిల్ నందు కోడ్ కనబడుతుంది.
ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ లిస్టువ్యూ
పై ఇమేజ్ లో ఒక లైనర్ లేఅవుట్ ఫైల్ నందు ఒక టెక్ట్స్ వ్యూ తీసుకోబడింది. అందులో లిస్టువ్యూ అనే టైటిల్ టెక్ట్స్ వ్రాయబడింది. అలాగే ఆ టైటిల్ టెక్ట్స్ క్రిందగా ఒక లిస్టువ్యూ కోడ్ వ్రాయబడి ఉంది.
ఎగువన గల చిత్రంలో మూడు విడ్జెట్లు కోడ్ రూపంలో వ్రాయబడి ఉన్నాయి. మూడింటికి ప్రొపర్టీస్ ఆయా ట్యాగులనుందు వ్రాయబడి ఉన్నాయి. ఈ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ద్వారా లిస్టువ్యూ డిజైన్ పూర్తి అయ్యింది.
ఇక ఈ లిస్టువ్యూకు బ్యాక్ గ్రౌండ్ జావా కోడ్ ఫైల్ ఈ క్రింది చిత్రంలో చూడండి.
మీకు మెయిన్ ఏక్టివిటి.జావా ఫైల్ ముందుగా ఈక్రిందివిధంగా డిఫాల్ట్ కోడ్ కలిగి ఉంటుంది.
పై కోడ్ నందు onCreate మెధడ్ ద్వారా ఎక్స్.ఎం.ఎల్ కోడ్ లింక్ చేయబడి ఉంది. ఇప్పుడు ఆ మెధడ్ లోనే లిస్టువ్యూకు సంబంధించిన జావా కోడ్ పై ఇమేజులో చూపిన విధంగా వ్రాయాలి.
క్రింది బ్లాకులో గల కోడ్ ను మెయిన్ ఏక్టివిటీ.జావా ఫైల్లో ఆన్ క్రియేట్ మెధడులో పేస్ట్ చేస్తే సరిపోతుంది.
మెయిన్ ఏక్టివిటి.ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ పుల్ కోడ్… ఈ క్రింది కోడులో పేకేజ్ పేరు మాత్రం కాఫీ చేయకండి. మీ ప్రాజెక్టులో ప్యాకేజి నేమ్… ఇది తేడా ఉంటుంది… కాబట్టి.
ఈ సంవత్సరం టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020… లో ఎలా ఉన్నాయో ఈ తెలుగు పోస్టులో రీడ్ చేయండి.
గత ఏడాది 2020 సంవత్సరమునకు గాను, గూగుల్లో బాగా సెర్చింగ్టాపిక్స్ ఇవే. గూగుల్ ట్రెండ్స్ వెబ్ సైటులో చూపిస్తున్న ఓవరాల్ టాప్10 సెర్చింగ్ వర్డ్స్ …
ఇండియాలో శోధించిన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ తెలుగులోనూ అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరోనా వైరస్ ప్రధానంగా 2020లో కనబడతాయి.
టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020
Overall (మొత్తం మీద గూగుల్ సెర్చ్ ఇంజన్లో శోధించిన అంశాలు ) 1) Indian Premier League (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2) Coronavirus (కరోనా వైరస్) 3) US election results (యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్) 4) PM Kisan Yojana (పిఎం కిసాన్ యోజన) 5) Bihar election results (బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్) 6) Delhi election results (ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్) 7) Dil Bechara (దిల్ బెచారా) 8) Joe Biden (జోయ్ బైడెన్) 9) Leap day (లీప్ డే) 10) Arnab Goswami (అర్నబ్ గోసామి)
గూగుల్ సెర్చ్ ద్వారా నిత్యం అనేక వస్తువులు, సేవలు, వ్యక్తులు, ప్లేసులు గురించి సెర్చింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ 2020 సంవత్సరమునకు గానూ, గూగుల్లో బాగా సెర్చ్ చేసిన విషయాలలో (Near me) నాదగ్గరలో ఉన్న షాప్స్ గానీ, స్టోర్స్ గానీ, షెల్టర్స్ గానీ, సర్వీసుల గానీ ఇలాంటి వాటిలో టాప్ గూగుల్ సెర్చింగ్ వర్డ్స్ ఈ క్రింది పదాలు.
Near me (నియర్ మి అను పదంతో కూడిన గూగుల్ శోధనలు)
1) Food shelters near me (పుడ్ షెల్టర్స్ నియర్ మి) 2) COVID test near me (కోవిడ్ టెస్ట్ నియర్ మి) 3) Crackers shop near me (క్రాకర్ షాప్ నియర్ మి) 4) Liquor shops near me (లిక్కర్ షాప్స్ నియర్ మి) 5) Night shelter near me (నైట్ షెల్టర్స్ నియర్ మి) 6) Grocery stores near me (గ్రాసరీ స్టోర్స్ నియర్ మి) 7) Gym equipment near me (జిమ్ ఎక్విప్ మెంట్ నియర్ మి) 8) Broadband connection near me (బ్రాడ్ బాండ్ కనెక్షన్ నియర్ మి) 9) Laptop shop near me (ల్యాప్ టాప్ షాప్ నియర్ మి) 10) Furniture store near me (ఫర్నిచర్ నియర్ మి)
ఇంకా గూగుల్ బాగా వెతికే విషయాలో ఎలా చేయాలి? ఎలా? (How to) ఈ పదాలను బట్టి ఎక్కువగా గూగుల్ సెర్చింగ్ ఉంటుంది.
అంటే హౌటు లింక్ పాన్ కార్డ్, హౌటు రిచార్జ్, హౌటు క్రియేట్ బ్లాగ్, హౌటు అప్లై … ఇలా ఉంటాయి. అల హౌటు (How to) ఉపయోగిస్తూ సెర్చ్ చేసిన టాప్10 గూగుల్ వర్డ్స్ ఈ క్రిందలో చూడండి.
How to హౌటు పదం కలుపుతూ గూగుల్ శోధనలు 2020
1) How to make paneer (హౌటు మేక్ పన్నీర్) 2) How to increase immunity (హౌటు ఇంక్రీజ్ ఇమ్యూనిటీ) 3) How to make dalgona coffee (హౌటు మేక్ డాల్గోన కాఫీ) 4) How to link PAN card with aadhaar card (హౌటు లింక్ పాన్ కార్డ్ విత్ ఆధార్ కార్డ్) 5) How to make sanitizer at home (హౌటు మేక్ సానిటైజ్ ఎట్ హోమ్) 6) How to recharge fastag (హౌటు రిచార్జ్ ఫాస్టాగ్) 7) How to prevent coronavirus (హౌటు ప్రివెంట్ కరోనా వైరస్) 8) How to apply e-pass (హౌటు అప్లై ఇపాస్) 9) How to make jalebi (హౌటు మేక్ జలేబి) 10) How to make cake at home (హౌటు మేక్ కేక్ ఎట్ హోమ్)
నెక్ట్స్ నాల్గవ టాప్ వర్గంలో మూవీస్. గూగుల్ సెర్చ్ చేసే విషయాలలో మూవీస్ కూడా ఎక్కువగానే వెతుకుతారు. మూవీస్ గురించి లేదా మూవీ ఫీల్డులో వ్యక్తుల గురించి… అలా గూగుల్లో వెతికిన మూవీస్ లో టాప్ ఇండియన్ మూవీస్ ఈ క్రిందగా చూడండి.
గూగుల్ నందు గత ఏడాది బాగా వెతికిన బాలీవుడ్ మూవీస్ Movies 2020
ఈవెంట్స్ కూడా బాగా వెతికారు. ఈ 2020 సంవత్సరమునకు గానూ గూగుల్ శోధన వెబ్ సైటు నందు బాగుగా శోధించిన విషయములలో ఈవెంట్స్(ఘటన లేక సంఘటనలు ). అలా సెర్చ్ చేసిన టాప్ ఈవెంట్స్ ఈ క్రిందగా చూడండి.
News Events (న్యూస్ ఈవెంట్స్ 2020 సంవత్సరములో)
1) Indian Premier League (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2) Coronavirus (కరోనా వైరస్) 3) US Presidential Election (యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్) 4) Nirbhaya case (నిర్భయ కేస్) 5) Beirut explosion (బైరట్ ఎక్స్ ప్లోషన్) 6) Lockdown (లాక్ డౌన్) 7) China-India skirmishes (చైనా ఇండియా స్కిర్మిషెస్) 8) Bushfires in Australia (బుష్ ఫైర్స్ ఇన్ ఆస్ట్రేలియా) 9) Locust swarm attack (లోకస్ట్ స్వార్మ్ ఎటాక్) 10) Ram Mandir (రామ్ మందిర్)
ప్రసిద్ద వ్యక్తులు… ప్రసిద్ది చెందిన వ్యక్తుల గురించి గూగుల్ శోధనలో 2020 సంవత్సరములో జరిగిన టాప్ 10 పెర్సనాలీటిస్.
ఎక్కువమందిని ఆకర్షించేవి ఆటలు. ప్రసిద్ద ఆటలు గురించి, ఆటగాళ్ల గురించి గూగుల్ శోధనలు ఉంటాయి. అలా గూగుల్ సెర్చింగ్ లో స్పోర్ట్స్ ఈవెంట్స్ 2020 సంవత్సరములో టాప్ 10 ఈవెంట్స్.
Sports Events (స్పోర్ట్స్ ఈవెంట్స్ టాప్10 ఇన్ 2020)
1) Indian Premier League (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2) UEFA Champions League (UEFA చాంపియన్స్ లీగ్) 3) English Premier League (ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్) 4) French Open (ఫ్రెంచ్ ఓపెన్) 5) La Liga (లా లిగ) 6) Serie A (సిరీస్ ఏ) 7) Australian Open (ఆస్ట్రేలియా ఓపెన్) 8) NBA Basketball League (NBA బాస్కెట్ బాల్ లీగ్) 9) UEFA Europa League (UEFA యూరప్ లీగ్) 10) UEFA Nations League (UEFA నేషన్స్ లీగ్)
టివి / వెబ్ సిరీస్ విబాగంలో టాప్ గూగుల్ శోధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
TV/Web Series (టివి / వెబ్ సిరీస్ టాప్10 ఇన్ 2020)
1) Money Heist (మనీ హీస్ట్) 2) Scam 1992: The Harshad Mehta Story (స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ) 3) Bigg Boss 14 (బిగ్ బాస్ 14) 4) Mirzapur 2 (మిర్జాపూర్ 2) 5) Paatal Lok (పాటల్ లోక్) 6) Sex Education (సెక్స్ ఎడ్యుకేషన్) 7) Breathe: Into the Shadows (బ్రేథ్: ఇన్ టూ ద షాడోస్) 8) Dark (డార్క్) 9) Bandish Bandits (బందీష్ బండిట్స్) 10) Special Ops (స్పెషల్ ఓప్స్)
నియర్ మి, హౌటు, ఇలాంటి గూగుల్ శోధనలతో బాటు వాట్ ఇజ్ అనే పదం కూడా ఉంటుంది. ఈ వాట్ ఇజ్ అంటే ఏమిటి? అని అడగడం… ఈ పదం ఉపయోగించి 2020లో గూగుల్ సెర్చ్ వర్డ్స్…
What is… (వాట్ ఇజ్… గూగుల్ సెర్చ్ టాప్10 ఇన్ 2020)
1) What is coronavirus (వాటిజ్ కరోనా వైరస్) 2) What is binod (వాటిజ్ బైనోడ్) 3) What is plasma therapy (వాటిజ్ ప్లాజ్మా థెరఫీ) 4) What is COVID-19 (వాటిజ్ కోవిడ్ – 19) 5) What is CAA (వాటిజ్ సిఏఏ) 6) What is colon infection (వాటిజ్ కోలన్ ఇన్పెక్షన్) 7) What is solar eclipse (వాటిజ్ సోలార్ ఎక్లిప్స్) 8) What is NRC (వాటిజ్ ఎన్ఆర్సి) 9) What is hantavirus (వాటిజ్ హంటా వైరస్) 10) What is nepotism (వాటిజ్ నెపోటిజమ్)
ఈ గూగులో శోధనలు గురించి మరింతగా తెలుసుకోవచ్చును.
టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020
ప్రపంచ వ్యాప్తంగా ఏవిధమైన గూగుల్ సెర్చ్ సాగింది? ఎవరి గురించి బాగా సెర్చ్ చేశారు. ఏవిషయం గురించి బాగా వెతికారు?
ఎటువంటి విషయాలపై ఆసక్తి చూపించారు? ఎలాంటి వస్తువులను గురించి శోధించారు? ఎలాంటి సంఘటనలకు ప్రధాన్యత ఇచ్చారు?
ఏం తెలుసుకోవాలని చూశారు? ఇలాంటి పలు రకాలుగా గూగుల్ సెర్చ్ గురించి పరిశీలించవచ్చును.
గూగుల్ ట్రెండ్స్ వెబ్ సైట్ ద్వారా మీరు మరింతగా తెలుసుకోవచ్చును.
బ్లాగును నిర్వహించేవారికి ఈ గూగుల్ ట్రెండ్స్ ఉపయోగపడతాయి. ఇంకా యూట్యూబ్ చానల్ నిర్వహించేవారికి కూడా ఈ గూగుల్ ట్రెండ్స్ ఉపయోగడవచ్చును.
శోధించిన విషయాలు, ఆన్ లైన్ విజిటర్స్ యొక్క తీరును తెలియజేస్తుంది. తద్వారా ఎటువంటి పోస్టులు ద్వారా ఆన్ లైన్లో వెబ్ సైటు ట్రాఫిక్ పెంచుకోవచ్చునో… ఈ గూగుల్ ట్రెండ్స్ సూచిస్తాయి.
ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా ఆరంభం అయ్యింది. సాదారణంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఐపిఎల్20 కప్ సెప్టెంబర్2020లో ప్రారంభం అయ్యింది.
ఇన్ని మాసాలు లేటు అవ్వడానికి కారణం కరోనా… అందరినీ వణికించిన కరోనా, కరెక్టుగా ఐపిఎల్ ప్రారంభానికి ముందుగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది.
కరోనా రాకముందే మార్చి29న ప్రారంభం మ్యాచుతో కూడిన ఐపిఎల్ షెడ్యూల్ కూడా విడుదలైంది.
అయితే కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభం కావడంతో, అప్పుడే లాక్ డౌన్ కూడా అమలలోకి వచ్చింది. లాక్ డౌన్ సడలిస్తారు.. ఐపిఎల్ సాగుతుందనే అంచనా కూడా ఉంది.
స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా కేవలం టివిల ద్వారా వీక్షించేందుకు అవకాశం కల్పించి ఐపిఎల్ నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు.
నిర్వాహకులు కూడా ఐపిఎల్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేసినా, కరోనా వైరస్ వ్యాప్తి బాగా పెరగడంతో… ఐపిఎల్ మ్యాచులు వాయిదా వేశారు.
క్రికెట్టే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా కరోనా అడ్డుకుంది. సాదరణ జీవనాన్ని కూడా కరోనా ఇంటికే పరిమితం చేసింది.
కరోనా కారణంగా వాతావరణ కాలుష్యంలో కూడా తేడాలు వచ్చాయి. మోటారు వాహనాల వినియోగం తగ్గడంతో కాలుష్యం కొంచెం తగ్గిందనే వార్తలు కూడా వచ్చాయి.
అలాంటి సమయంలో క్రికెట్ మ్యాచులు అసాధ్యమని కేంద్రం భావించడంతో, ఐపిఎల్ నిర్వహణ వాయిదా పడింది.
మనదేశంలో క్రికెట్ కు ఆదరణ ఎక్కువ… అందులోనూ ఐపిఎల్ అంటే మరింత క్రేజ్…
నెలరోజుల పాటు అభిమానులను అలరించే ఐపిఎల్ అయిదు నెలల ఆలస్యంగా సెప్టెంబరులో దుబాయ్ లో ప్రారంభం అయ్యింది.
ప్రేక్షకులు లేకుండా కేవలం టివి ప్రసారాల ద్వారానే మ్యాచులు జరిగాయి. అయినా ఐపిఎల్ లాభాల బాటలోనే నడవడం విశేషం….
ఢిల్లికి – ముంబైకి మధ్య ఐపిఎల్T20 ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా
10నవంబర్ 2020న ఢిల్లికి – ముంబైకి మధ్య ఐపిఎల్T20 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఢిల్లి గెలుస్తుందనే అంచనా కూడా ఎక్కువగానే వచ్చింది…
కానీ డిఫెండింగ్ చాంపియన్ అయిన ముంబై జట్టు ఐపిఎల్ కప్ అయిదోసారి అందుకుంది. అయిదు నెలల లేటుగా ప్రారంభం అయిన ఐపిఎల్ టి20 కప్పు ముంబైపరమైంది. రోహిత్ శర్మ 68 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
ఇంకా టి20 ఐపిఎల్ టోర్నిలో ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ పై పలు ప్రశంసలు కురిశాయి. అయిదు సార్లు కప్పు కొట్టిన ఘనత రోహిత్ శర్మదే… అయ్యింది.
ముంబై ఇండియన్స్ టీమ్ కు కెప్టెన్ గా అద్భుతమైన పనితీరు రోహిత్ శర్మ కనబరిచారు. ఆటగాడిగా రాణిస్తూ, కెప్టెన్ గా కూడా జట్టుకు మేలునే చేశాడు.
ఈ విధంగా ఐపిఎల్2020 కరోనా కారణంగా ఆలస్యమైనా మంచి మజానే ప్రేక్షకులకు అందించి.
చిన్న పిల్లల పేర్లు అచ్చతెలుగులో గల యాప్. బేబి నేమ్స్ బాయ్స్, గర్ల్స్ విడి విడిగా సెర్చ్ చేయవచ్చును. ఇంకా ఎంచుకున్న పేరుతో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ చూడవచ్చును.
బ్లాగుల మేటర్లో టిప్స్ ట్రిక్స్ బ్లాగులలో ఉండే మేటరులో ఎక్కువగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. విషయాలను వివరించే ఆర్టికల్స్ కలిగి ఉండి, తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్ మాదిరిగా ఉంటాయి.
ఒక్కబ్లాగు ఒక టాపిక్ తీసుకుని దానిని వివరిస్తూ ఆర్టికల్ పోస్టును కలిగి ఉంటుంది. అనేక టాపిక్స్ కలిగి అనేక ఆర్టికల్స్ ను బ్లాగు కలిగి ఉంటుంది.
ఆయా టాపిక్స్ బట్టి బ్లాగులలో మేటర్ వివరంగా వ్రాయబడి ఉంటుంది. ఇంకా ఈ వివరం విపులంగా ఉంటుంది.
అనేకానేక అంశాలతో ప్రపంచం ఉంటుంది. అందులో అందరికీ తెలిసినవి కొన్నే ఉంటే, తెలియాల్సినవి చాలానే ఉంటాయి.
అందరికీ విషయం విపులంగా, సమగ్రంగా చేరవేయడంలో బ్లాగులు చాలా ప్రధాన పాత్రను పోషిస్తాయి. వంట అందరికీ తెలియదు. కానీ ఒక్కరికి అవసరం. ఇలా వంట గురించి విషయాలు ఒక బ్లాగు ప్రచురిస్తూ ఉంటుది.
వంట చేయడం ఎలా? వెబ్ సైట్ చేయడం ఎలా? వ్యాపారం ఎలా? సంపాదించడం ఎలా? ఇలా రక రకాల ప్రశ్నలు లేవనెత్తి, వాటికి సమాధానములు వివరంగా బ్లాగులు తెలియజేస్తాయి.
టిప్స్, ట్రిక్స్ ఇవి ప్రధానంగా బ్లాగు ఆర్టికల్స్ ఉంటాయి.
బ్లాగులు మేటరులో టిప్స్, ట్రిక్స్ ఇవి ప్రధానంగా బ్లాగు ఆర్టికల్స్ ఉంటాయి. యోగాసనాలు – ఉపయోగాలు, వాకింగ్ టిప్స్, సైక్లింగ్ టిప్స్, ఫైనాన్సియల్ టిప్స్ ఇలా రక రకాల విషయాలలో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా బ్లాగుల ద్వారా పోస్ట్ చేయబడతాయి.
ఏబ్లాగు చూసినా ఏదో ఒక అంశము లేక అనేక అంశములను తెలియజేస్తూ ఆర్టికల్స్ కలిగి ఉంటాయి. ఆయా అంశములలో టిప్స్, ట్రిక్స్ ప్రధానంగా తెలియజేస్తూ వివరం వ్రాయబడుతుంటుంది.
ఏదో ఒక అంశము గురించిన టిప్స్ ట్రిక్స్ అందించే వివిధ తెలుగు బ్లాగులను ఈ పోస్టులో చూద్దాం.
మీరు మీసాల మన్మధుడు నవలా రచయిత బ్లాగును, ఆ నవలను చదవాలనుకంటే ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి. ఈ నవల స్వాతి వారపత్రికలో ప్రచురితం అయ్యిందట.
ఒక పుస్తకం చదివి…చదివి… ఆపుస్తకంలోని ప్రతి విషయం వర్ణించినట్టు. పుస్తకాలు చదివి…చదివి ఓ పుస్తకం వ్రాయగలిగినట్టు… బ్లాగులు విజిట్ చేసి, విజిట్ చేసి… బ్లాగు విజన్ పై విజన్ వస్తుంది. బ్లాగు టాపిక్ పై అవగాహన వస్తుంది.
పాత పాటలు మధురమైన పాటలే. వింటుంటే వినసొంపుగా ఉంటాయి. చదవడానికి ఆసక్తిని రేపుతాయి. ఆనాటి తెలుగు మేటి పాటలు. అలాంటి పాటలలో ”మాటరానిమౌనమిది” లాంటి పాటలు. అలాగే నేటి కాలంలోని మెలోడి పాటలు కూడా అంతే. ఈనాటి పాటలలో ”కాటుక కనులే…” వంటి పాటలు… బాగు ఇలాంటి బ్లాగు ఉంటే, వెంటనే దర్శించాల్సిందే… ఆ తెలుగు పాటలు రీడ్ చేసేయాలి. ఈ పాటల బ్లాగ్ విజిట్ చేయడానికి, పాటలను రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ టచ్ చేసి బ్లాగును విజిట్ చేయండి.